Top Stories
ప్రధాన వార్తలు
![nirmala sitharaman presents union budget 2024-25 live updates telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/niramala.jpg.webp?itok=wl_sZXp-)
Budget 2024-25: బడ్జెట్ ముఖ్యాంశాలు
Parliament Budget Session 2024 Highlights: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, అప్డేట్లు.ఆదాయ సమీకరణ కేవలం పన్ను ఆధారితమైంది కాదు: నిర్మలా సీతారామన్మనీలాండరింగ్ను నిరోధించడంలో ఏంజెల్ ట్యాక్స్ రద్దు అంశం కీలక ప్రభావం చూపుతుంది. ఇన్ని రోజులు ఇది భారతదేశంలో పెట్టుబడులకు ఆటంకంగా మారింది.యూపీఏ 2లో ఏంజెల్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై తీసుకొచ్చిన 12.5% ట్యాక్స్ను నిజానికి సరాసరి పన్నురేటుతో పోలిస్తే చాలా తగ్గించాం.పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం.ఎప్ అండ్ ఓల్లో ఎస్టీటీ ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి .కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్: మోదీమహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్.ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.భారత్ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్గా మారుస్తాం.పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.#WATCH | Post Budget 2024: Prime Minister Narendra Modi says "For MSMEs, a new scheme to increase ease of credit has been announced in the budget. Announcements have been made to take export and manufacturing ecosystem to every district in this budget...This budget will bring new… pic.twitter.com/C0615OJjdt— ANI (@ANI) July 23, 2024స్టాంప్ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.ట్యాక్స్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.జమ్మూ కశ్మీర్కు బడ్జెట్లో రూ.42,277 కోట్లు.అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.చండీగఢ్కు రూ.5,862 కోట్లు.లద్దాఖ్కు రూ.5,958 కోట్లు.ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.క్యాపిటల్ గెయిన్లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్ల అభివృద్ధి.30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు రూ.1,200 కోట్లు.న్యూ క్లియర్ ప్రాజెక్ట్లకు రూ.2,228 కోట్లు.ఫార్మాసూటికల్స్ రంగంలో పీఎల్ఐ పథకానికి రూ.2,143 కోట్లు.సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.సోలార్ పవర్(గ్రిడ్) రూ.10 వేలకోట్లు.ఎల్పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 19 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 27 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 19 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుసబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 21 పైసలుఫైనాన్స్ కమిషన్కు చెల్లింపులు 9 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర ఖర్చులు 9 పైసలుకొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.ట్రేడింగ్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై ఎస్టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.స్టార్టప్ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.మొబైల్, యాక్ససరీస్పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి.ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.నేపాల్లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు.ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.సులభంగా నిధులు అందేలా చర్యలు.గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం.ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్ల ఏర్పాటు.బీహార్లో ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం.బీహార్, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.ఏపీకి అండగా ఉంటాం..ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.వాటర్, పవర్, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.పోలవరం ప్రాజెక్ట్కు పూర్తి సాయం అందించేలా చర్యలు.అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.ఈ ఏడాదిలోనే ఆర్థిక సాయం.అవసరమైతే మరిన్ని నిధులు.విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం.ఈపీఎఫ్ఓ ద్వారా నగదు బదిలీ.వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు.నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ.ఈ బడ్జెట్లో వికసిత్ భారత్కు రోడ్మ్యాప్.సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్లో నిర్ణయాలు.కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్పార్లమెంట్లో బడ్జెట్ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్సభకు చేరుకున్నారు.#WATCH | PM Modi in Parliament, ahead of the presentation of Union budget by Finance Minister Nirmala Sitharaman(Video source: DD News) pic.twitter.com/T0RD4hBO2z— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ చేరుకున్నారు.#WATCH | Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi reaches Parliament ahead of Union Budget presentation by Finance Minister Nirmala Sitharaman in Lok Sabha. pic.twitter.com/zNcijSYS4e— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్-మే వరకు అమలు అవుతుంది.ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.మోడీ 3.0 మొదటి బడ్జెట్కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్మరో గంటలో పార్లమెంట్లో బడ్జెట్స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీబడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉంటుదన్న ప్రధాని మోదీఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్ ట్యాబ్ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament, to present the first Budget in the third term of Modi Government. pic.twitter.com/0tWut8mhEu— ANI (@ANI) July 23, 2024 పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్కు వెళ్లారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.(Source: DD News) pic.twitter.com/VdsKg5bSLG— ANI (@ANI) July 23, 2024జమ్మూకశ్మీర్ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.#WATCH | Delhi | J&K budget copies arrive in Parliament; Union Finance Minister Nirmala Sitharaman will present the estimated receipts and expenditure (2024-25) of the Union Territory of Jammu and Kashmir (with legislature) in Parliament today. pic.twitter.com/gMIf8y31bU— ANI (@ANI) July 23, 2024నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్తోనే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.కొవిడ్ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈరోజు స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.లోక్సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి పార్లమెంట్ను చేరుకుంటారు.బడ్జెట్ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్ టాబ్ను ఆవిష్కరించారు. #WATCH | Finance Minister Nirmala Sitharaman heads to Rashtrapati Bhavan to call on President Murmu, ahead of Budget presentation at 11am in Parliament pic.twitter.com/V4premP8lL— ANI (@ANI) July 23, 2024ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం. నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.Finance Minister Nirmala Sitharaman reaches Ministry ahead of Union Budget presentationRead @ANI Story | https://t.co/2pLE5R08Yh#Budget2024 #BudgetDay #NirmalaSitharaman pic.twitter.com/Vu9E7tqsio— ANI Digital (@ani_digital) July 23, 2024ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్.#WATCH | Chief Economic Advisor V Anantha Nageswaran arrives at Ministry of Finance, ahead of Union Budget presentation pic.twitter.com/vWrU3LbcLz— ANI (@ANI) July 23, 2024ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ..‘గత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంది. ఈసారి కూడా ఆర్థిక సర్వే 7% వృద్ధి రేటును సూచిస్తుంది. పర్యాటక రంగంలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రజల సంప్రదాయాల విస్తరణకు ఈ రంగం వారధిగా ఉంటుంది. బడ్జెట్ 2024-25లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలుంటాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.#WATCH | Union Budget 2024 | Rikant Pitti, co-founder of EaseMy Trip says, "... Last year our GDP growth rate was around 6.5%, and this time as well, the economic survey suggests around 7% growth rate... In the coming time, our GDP growth rate will become even better... Tourism… pic.twitter.com/vZgPne4vyd— ANI (@ANI) July 23, 2024ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో జమ్ము కశ్వీర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెడుతారు.వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రకటన2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన ఎకనామిక్సర్వేలో ‘వికసిత్ భారత్’ కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తే జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో నిర్మల ఎలాంటి కీలక నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఈసారి నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి.పాత పన్ను విధానానికే చాలామంది మొగ్గు చూపుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులు వస్తాయని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి.
![Union Budget 2024: Jagan Behind Koparthy Orvakal Node AP Allocations](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Node-AP-Allocations.jpg.webp?itok=NMQjlxD7)
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్ప్లాఫ్ అయ్యారు. మరోవైపు.. జగన్ చొరవతోనే.. కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి నోడ్.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కర్నూల్ జిల్లా ఓర్వకల్లు నోడ్ హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఈ కారిడార్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జగన్ పాలనలో పారిశ్రామిక దూకుడు!
![KSR Comments On YS Jagan Mohan Reddy's Responds To Stop TDP Violence](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Jagan_AP_Politics.jpg.webp?itok=m_-qMLkA)
రంగంలోకి వైఎస్ జగన్.. ఇక బాబు అండ్ కోకు చుక్కలే!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభం అయితే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక తప్పలేదు. తెలుగుదేశంవారు హింసకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఏమి వ్యాఖ్యానించేవారంటే.. వైఎస్సార్సీపీవారు దాడులు చేసినా ప్రతిదాఢులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీవారు హింసాకాండకు దిగవద్దని బాబు ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు నోరే విప్పలేదు. హోం మంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న పాలనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారని అనుకోవాలి.వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా అక్కడకు వెళ్లడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలనర్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా, వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాలపాలవుతున్నా, పార్టీపరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్మోహన్రెడ్డి వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునే వారు. కానీ జగన్మోహన్రెడ్డి తొందరపడకుండా ఉండాలని భావించినట్లు ఉన్నారు. అవసరమైనప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు.ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ పరిస్థితి రోజు, రోజుకు దిగజారి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురి అయ్యారు. 36 మంది హత్యలకు గురి అయ్యారు. వందల మందిపై హత్యాయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. రెండువేలమందికి పైగా ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటివద్ద కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారిద్దరి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయంగా ఉంది.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రోజులలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుంది. దానికి తగ్గట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటివారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో వ్రజలకు రక్షణలేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టరమ్లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైఎస్సార్సీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ యువ నేత రషీద్ జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకుని మరుసటి రోజు వినుకొండకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పదిహేను చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయిని పోలీసులు నిలువరించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీ ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతది, సరిగా పనిచేయనిది అని వైఎస్సార్సీపీ వర్గాలు చెప్పాయి. తత్పలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది.సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయా చోట్ల గుమికూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో కాన్వాయి బాగా ఆలస్యం అయింది. వినుకొండ జనసంద్రమే అయింది. వంద కిలోమీటర్ల దూరం కూడా లేని వినుకొండకు చేరుకోవడానికి ఏడుగంటలకుపైగా పట్టింది. దీనితో వైఎస్సార్సీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండదండగా ఉంటుందన్న ధీమా వచ్చింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందినవారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది.రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందలమందిపై హత్యాయత్నం చేయడం, వందల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ తెగబడడంలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి ఈ డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. డిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసివచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం.ఇంతకాలం వైఎస్సార్సీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి సహకరించినా, అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్డీఏని వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. బీజేపీనేమో తమ సొంత రాజకీయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఏవైనా ఈ ధర్నాకు వస్తే విశేషమే అవుతుంది.అలాగే వైఎస్సార్సీపీని దగ్గర చేసుకుంటే ఉపయోగం ఉంటుందని భావించి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఏవైనా డిల్లీలో జరిగే దర్నాకు హాజరైతే ప్రధాన వార్తే అవుతుంది. ఈ రెండు కూటమిలలో లేని పార్టీలవారు ఎందరు వస్తారో చూడాలి. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ధర్నా జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక సూచన అవుతుంది. ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనుసరించవలసిన ప్రక్రియలే. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రజలకు, రాజకీయవర్గాలకు తెలుస్తుంది. ఎంత మిత్రపక్షమైనా బీజేపీ కూడా టీడీపీకి హెచ్చరికలు పంపించే అవకాశం ఉంటుంది.శాసనసభలో సైతం గవర్నర్ ప్రసంగ టైమ్లో కానీ, ఇతర సంధర్భాలలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలలోకి ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్త అయినా జంకు వస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డుమీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఎన్ని విమర్శించినా, రషీద్ హత్య గురించి ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతిభద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను మాటవరసకైనా కోరక తప్పలేదు. అది వైఎస్ జగన్మోహన్రెడ్డి పవర్! గెలిచినా, ఓడినా.. సింహం, సింహమే!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులుఇదీ చదవండి: అరాచక పాలనపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా.. ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్
![Gold And Silver Price Today After 2024 25 Budget](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/gold-price-down.jpg.webp?itok=PGyqkiNS)
ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25 ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్, సిల్వర్ వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకం 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది.బంగారం, వెండి ధరలుకేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం ధర రూ. 2750 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ మీద రూ. 2999 తగ్గింది. ధరల తగ్గుదలతో పసిడి ధరలు వరుసగా రూ. 64950 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 70860 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచాయి.ఇక చైన్నె, ఢిల్లీలలో కూడా 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 2750, రూ. 2990 తగ్గింది. దీంతో అక్కడ రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. వెండి ధర కూడా గరిష్టంగా రూ. 3500 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ. 88000లకు చేరింది.
![Union budget 2024 What will be come cheaper and costlier](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/UnionBudget-costly%20and%20cheaper.jpg.webp?itok=foSM_Pm9)
Union budget 2024 : తగ్గేవి, పెరిగేవి ఇవే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. అయితే మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు కేన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు నిచ్చారు. దీంతో కేన్సర్ బాధితులకు భారీ ఊరట లభించనుంది. బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్ను గణనీయంగా పెంచు తుందన్నారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు, చేపల మేతతో కూడిన సీఫుడ్పై 5 శాతం తగ్గింపును ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తరిగేవి జాబితాను ఒకసారి చూద్దాం!ధరలు పెరిగేవి:ప్లాటినం వస్తువులుబంగారు కడ్డీలుకృత్రిమ ఆభరణాలుసిగరెట్వంటగది చిమ్నీలుకాంపౌండ్ రబ్బరుకాపర్ స్క్రాప్దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలుధరలు తగ్గేవి:కొన్ని రకాల కేన్సర్ మందులుమెడికల్ ఎక్స్-రే యంత్రాలుమొబైల్ ఫోన్లు, ఛార్జర్లుచేపలు, రొయ్యల మేతతోలు వస్తువులుపాదరక్షలువస్త్రాలుబంగారం, వెండి, ప్లాటినం తయారీ ఛార్జీలు
![Siberian tiger becomes unlikely friends with a goat it was given to eat](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Siberian%20tiger-goat.jpg.webp?itok=dLrypEo7)
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్క్లోజర్లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు.
![Telangana Deputy Cm Bhatti Responds On Smita Sabarwal Controversy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/bhatti-vikramarka.jpg.webp?itok=gxnLINCz)
స్మితాసబర్వాల్ వివాదం.. భట్టి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, దివ్యాంగులకు మధ్య తలెత్తిన వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడారు. స్మితా సబర్వాల్ కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశారన్నారు.సోషల్ మీడియా వేదికగా స్మితాసబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భట్టి తెలిపారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని,ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు.
![South African Legend Dale Steyn Picks Pacer With The 'Best Yorker In History'](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/dale.jpg.webp?itok=GVXsB60x)
'బుమ్రా, బ్రెట్లీ కాదు.. క్రికెట్ చరిత్రలో అతడిదే బెస్ట్ యార్కర్'
ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో యార్కర్ల కింగ్ ఎవరంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రానే. రెప్పపాటులో తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బుమ్రా స్పెషల్. చాలా మంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఇప్పటివరకు బుమ్రాలా యార్కర్ల వేసే బౌలర్ను చూడలేదని కితాబు ఇచ్చారు. కానీ దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టేయిన్ దృష్టిలో బెస్ట్ యార్కర్ల వేసే బౌలర్ బుమ్రా కాదట. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ వేసిన బౌలర్ ఎవరు? అన్న ప్రశ్నను ఎక్స్లో పోస్ట్ చేసింది. అందుకు బదులుగా డేల్ స్టేయిన్.. 1999 వరల్డ్కప్లో షోయబ్ అక్తర్ వేసిన యార్కర్ తన బెస్ట్ అంటూ సమధానమిచ్చాడు. అయితే స్టేయిన్ బుమ్రాను గానీ, ఆసీస్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్లీని గానీ ఎంచుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఇక స్టెయిన్ విషయానికి వస్తే.. తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన ఈ సఫారీ పేస్గన్ మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది.అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1 బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. 2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్గా, కామెంటేటర్గా కొనసాగతున్నాడు.
![AP High Court Hearing On Anticipatory Bail Petition Of YSRCP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Ap-High-Court-Hearing-On-An.jpg.webp?itok=bKXWI7ZF)
వైఎస్సార్సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
![Dubbing Other For NTR Ram Charan Prabhas In Rajamouli Documentary](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Dubbing-Other-For-NTR-Ram.jpg.webp?itok=yuIVDSlF)
పాపం టాలీవుడ్ స్టార్ హీరోలు.. కలలో కూడా ఊహించి ఉండరు
కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయే అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా! ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరిట ఆగస్టు 2 న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?)ఇక్కడివరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.తెలుగు ట్రైలర్ విషయానికొచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లకు వేరే వాళ్లు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి, తెలుగు వరకైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది! పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానెల్లోని డబ్బింగ్లా అనిపించింది.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')
Budget 2024: బడ్జెట్ స్పీచ్ గంటన్నరలోపే..!
'ఇంటిమేట్ సీన్స్'.. అందరినీ పంపించాకే తీశారు: అంజలి
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హెల్త్కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Budget 2024-25: ‘అది ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు’
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.. కానీ ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయాడు
IPL 2025: రోహిత్ శర్మ కోసం ఆ జట్ల మధ్య పోటీ!
Budget 2024-25: బడ్జెట్ ముఖ్యాంశాలు
TG: ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్
Union budget 2024 : తగ్గేవి, పెరిగేవి ఇవే..
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.. కానీ ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయాడు
చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్ రికార్డు
కేంద్ర బడ్జెట్ 2024-25: ఎవరేమన్నారంటే..
Budget 2024-25: కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు!
తెలంగాణ భవన్కు గులాబీ బాస్
వైఎస్సార్సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
Budget 2024: బడ్జెట్ స్పీచ్ గంటన్నరలోపే..!
'ఇంటిమేట్ సీన్స్'.. అందరినీ పంపించాకే తీశారు: అంజలి
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హెల్త్కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Budget 2024-25: ‘అది ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు’
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.. కానీ ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయాడు
IPL 2025: రోహిత్ శర్మ కోసం ఆ జట్ల మధ్య పోటీ!
Budget 2024-25: బడ్జెట్ ముఖ్యాంశాలు
TG: ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్
Union budget 2024 : తగ్గేవి, పెరిగేవి ఇవే..
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.. కానీ ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయాడు
చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్ రికార్డు
కేంద్ర బడ్జెట్ 2024-25: ఎవరేమన్నారంటే..
Budget 2024-25: కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు!
తెలంగాణ భవన్కు గులాబీ బాస్
వైఎస్సార్సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
సినిమా
![Kamal Haasan to have a cameo in Thalapathy Vijay next movie](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/958.jpg.webp?itok=pSDgLdHt)
విజయ్ చిత్రంలో కమలహాసన్?
లోకనాయకుడు కమలహాసన్ దళపతి విజయ్ కథానాయకుడు నటించనున్న చిత్రంలో అతిథి పాత్రలో మెరువనున్నారనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం గోట్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకొని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అనే ప్రచారం చాలా రోజుల నుంచే జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. ఇకపోతే ఆయన 69వ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని కూడా ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రను కథను దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేశారని సమాచారం. నిజం చెప్పాలంటే కమలహాసన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ చిత్ర కథా చర్చల్లోనూ ఆయన దర్శకుడు హెచ్ వినోద్తో కలిసి పాల్గొన్నారు. అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం తెరకెక్కలేదు. ఆ తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే కమలహాసన్ నటించాల్సిన కథనే ఆయన విజయ్తో చేస్తున్నారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించే చిత్రంలో నటుడు కమలహాసన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరలవుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది కూడా తెలియాల్సి ఉంది.
![sai pallavi saree bollywood movie](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/sai-pallavi-saree.jpg.webp?itok=lZ1XfpSB)
చీరతోనే అందం అంటున్న సాయి పల్లవి!
చీరలో ఉన్న స్త్రీల అందం మరే దుస్తుల్లోనూ కనిపించదంటారు. అందుకే స్త్రీలకు చీరే అందం అనే నానుడి కూడా ఉంది. నటి సాయి పల్లవి కూడా ఈ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడలు శృతిమించుతున్న ఈ రోజుల్లో కూడా తనకు చీరలు ధరించడంలోనే సౌకర్యం అంటున్నారీ భామ. సాయి పల్లవి నటించే కథా పాత్రలు కూడా సంప్రదాయ రీతిలోనే ఉంటాయన్నది గమనార్హం. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన తమిళ అమ్మాయి సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నటించి పాపులర్ అయిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సాయి పల్లవి గ్లామర్కు దూరం అన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ముఖానికి మేకప్ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక చిత్రాల్లో అయినా బయట ప్రపంచంలో నైనా ఈమె కనిపించేది చీరలో లేదా చుడిదార్లోనే. ముఖ్యంగా సినీ వేడుకల్లో పాల్గొనేటప్పుడు సాయి పల్లవి సంప్రదాయబద్ధంగా చీరలే ధరిస్తారు. వేడుకల్లో కూడా చీరలే ధరించి రావడం గురించి ప్రశ్నిస్తే తనకు చీరలే సౌకర్యంగా ఉంటాయని బదులిచ్చారు. పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొన్నప్పుడు ఒక రకమైన తెలియని ఒత్తిడి కలుగుతుందన్నారు. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమి మాట్లాడాలన్న విషయంపైనే మనసు లగ్నమై ఉంటుందని, దుస్తులపై దృష్టి పెట్టడం కుదరదని అన్నారు. అలాంటప్పుడు చీర ధరించడమే సౌకర్యంగా ఉంటుందని భావిస్తానన్నారు. అలా ఒత్తిడి అనిపించే వేడుకల్లో తాను చీర ధరించి పాల్గొనడానికి ఇష్టపడతానని నటి సాయి పల్లవి పేర్కొన్నారు. కాగా మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటించిన అమరన్ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అలాగే నాగచైతన్యకు జంటగా నటిస్తున్న తెలుగు చిత్రం తండేల్ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హిందీ చిత్రం రామాయణంలో నటిస్తున్నారు. ఇందులో ఈమె సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే.
![First Single 'Fire Song' Out From Kanguva Movie](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/kanguva_0.jpg.webp?itok=kFFv5RvS)
Kanguva : అదిరిపోయిన 'ఫైర్ సాంగ్'
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు(జులై 23) సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ 'ఫైర్ సాంగ్' కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. 'ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ' అంటూ ఈ పాట సాగుతుంది. 'పైర్ సాంగ్' "కంగువ"కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది.
![Gulshan Devaiah Clarify His Comments On Janhvi Kapoor](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/janhvi-kapoor-ulajh-gulshan.jpg.webp?itok=M7s3kgRJ)
జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: సహ నటుడు
సాధారణంగా సినిమా యాక్టర్స్ చాలావరకు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొన్నిసార్లు చాలా సాధారణంగా మాట్లాడినా సరే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య.. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అవి కాస్త వైరల్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సదరు నటుడు మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?)జాన్వీ కపూర్తో కలిసి నటించాను గానీ తనకు వైబ్ రాలేదని గుల్షన్ దేవయ్య అన్నాడు. దీనిపై జాన్వీ కూడా స్పందిస్తూ.. అవును అతడు చెప్పింది నిజమేనని, షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక్కసారి కూడా కలిసి కూర్చోలేదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో గుల్షన్ ఏదో తప్పు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో తన మాటలపై క్లారిటీ ఇచ్చాడు.'జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదని చెప్పానంతే. అది మా తప్పు కాదు. జాన్వీ మంచి యాక్టర్. చాలా ప్రొఫెషనల్. సినిమాలో మా సీన్స్ బాగా వచ్చాయ్. ప్రతి సినిమా సెట్లోనూ టీమ్ అంతా కలిసిపోవాలనేం లేదు కదా! నేను ఎవరినీ తక్కువ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడలేదు. మూవీ కోసం 100 శాతం పనిచేశాం. గతంలో నేను చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాను. వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి యాక్ట్ చేయడం మర్చిపోలేను. మేం ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించే డిస్కషన్ జరిగింది. అదే రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పా' అని గుల్షన్ దేవయ్య క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')
క్రీడలు
![India To Take On Nepal In Womens Asia Cup 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/jk_0.jpg.webp?itok=iD-wcvFd)
నేడు (జులై 23) టీమిండియాతో నేపాల్ 'ఢీ'
మహిళల ఆసియా కప్ 2024లో ఇవాళ (జులై 23) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పాకిస్తాన్, యూఏఈ పోటీపడనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో నేపాల్ టీమిండియాను ఢీకొంటుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ప్రస్తుత ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన నేపాల్తో ఇవాళ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-ఏ నుంచి టాపర్గా ఉంది. నేటి మ్యాచ్లో భారత్ నేపాల్పై గెలుస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.గ్రూప్-ఏ నుంచి ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. యూఏఈ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్ భారత్ చేతిలో ఓడి యూఏఈపై గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్ నుంచి మూడో స్థానంలో ఉన్న నేపాల్.. యూఏఈపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్రేట్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేపాల్ భారత్పై గెలిచినా సెమీస్కు అర్హత సాధించలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ సెమీస్కు చేరడం దాదాపుగా ఖరారైనట్లే.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో శ్రీలంక టాపర్గా కొనసాగుతుంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. థాయ్లాండ్, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్లో విజయం సాధించి రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన మలేసియా చివరి స్థానంలో నిలిచింది.
![Ashwin Opens Up On Kohli-Dravid Moment That Nearly Moved Him To Tears](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/aswin.jpg.webp?itok=r9hBH_L6)
'T20 వరల్డ్కప్లో అదే నా ఫేవరేట్ మూమెంట్.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'
టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ముగించాడు. గతేడాది వన్డే వరల్డ్కప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్లో తన ఫేవరేట్ మూమెంట్ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు.
![Aakash Chopra comments on Suryakumar yadav place in Indias squad for 2025 Champions Trophy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/surya.jpg.webp?itok=_MLw01A3)
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్తో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్కప్ రన్నరప్గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్కప్ ఫైనల్కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్ను అద్భుతంగా అందుకుని భారత్ను ఛాంపియన్స్గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
![Charith Asalanka To Lead Sri Lanka In T20I Series Against India](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/sl.jpg.webp?itok=nlxCc_rc)
భారత్తో టీ20 సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన.. కొత్త కెప్టెన్ ఎంపిక
త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జులై 23) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్కప్ 2024లో ఘోర ప్రదర్శన (తొలి రౌండ్లోనే నిష్క్రమణ) అనంతరం వనిందు హసరంగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.సీనియర్లు ధనంజయ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. మరో ఇద్దరు సీనియర్లు దినేశ్ చండీమల్, కుశాల్ జనిత్ పెరీరా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ముగిసిన లంక ప్రీమియర్ లీగ్లో సత్తా చాటిన అవిష్క ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. సదీర సమరవిక్రమ, దిల్షన్ మధుషంకలను పక్కకు పెట్టారు సెలెక్టర్లు.కాగా, శ్రీలంకతో టీ20 సిరీస్ ఈనెల 27 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక గడ్డపై అడుగుపెట్టింది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు ఇదే మొదటి పరీక్ష. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్తో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో
బిజినెస్
![Income Tax: Budget 2024 FM proposes new income tax slabs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/tax_0.jpg.webp?itok=aoxjIFcm)
ట్యాక్స్పేయర్లకు ఊరట కాస్తే..
ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి ఆమె బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ముందుకు తెచ్చారు.ఈ బడ్జెట్లో పన్ను విధానాల్లో మార్పులు చేసి వేతన జీవులకు ఊరట కల్పిస్తారని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయోజనాలేమీ మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కల్పించలేదు. కొత్త పన్ను విధానంలో పన్ను పరిమితిని రూ.4లక్షలకు పెంచుతారని భావించారు. కానీ అందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. మిగతా శ్లాబుల్లో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. ఇక స్టాండర్ట్ డిడక్షన్ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచి స్వల్ప ఊరట కల్పించింది.ఆదాయపు పన్ను కొత్త స్లాబులు ఇవేరూ. 3లక్షల వరకు నో ట్యాక్స్రూ.3 - 7 లక్షలు 5% పన్నురూ.7-10 లక్షలు 10%రూ.10-12 లక్షలు 15%రూ.12-15 లక్షలు 20%రూ.15 లక్షలు దాటితే 30% పన్ను
![Union Budget2024-25 Stock markets crash as govt increases tax on capital gains](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Market-budget-2024.jpg.webp?itok=OLQRUhk2)
స్టాక్ మార్కెట్కు బడ్జెట్ షాక్
భారతీయ స్టాక్మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ సెగ తగిలింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై కోటి ఆశలతో ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఆరంభంలో సానుకూలంగా ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంతో నిరాశ పడ్డారు. క్యాపిటల్ గెయిన్స్పై టాక్స్ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలను దిగారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ కూడా అదే బాటలోనడిచింది.ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టానికి పరిమితమే 80వేలకు ఎగువనకొనసాగుతుంది. అటు నిష్టీ 117 పాయింట్ల నష్టంతో 24, 392 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగ షేర్లు 10 శాతం వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఓఎన్జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్ , రిలయన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి.ఎస్టీటీ దెబ్బఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) వ్యాపారులకు షాకిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రేటును 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచేశారు. ఫలితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనను అమలు తరువాత ఈక్విటీ , ఇండెక్స్ ట్రేడర్లు వమ వ్యాపారంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.రూపాయి ఢమాల్ క్యాపిటల్ గెయిన్స్పై పన్ను రేటును పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.69కి క్షీణించింది. గత జీవితకాలపు కనిష్ట స్థాయి 83.67. కాగా కేంద్ర బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10-12.5శాతానికి పెంచారు. అలాగే , దిగువ, మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.
![Budget 2024-25: 3 Employment-Linked Incentive Schemes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/budget-2024.jpg.webp?itok=xZgK83KL)
Budget 2024-25: కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు!
కేంద్ర బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించారు.మోదీ మూడో విడత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త పథకాలను ప్రకటించింది కేంద్రం. ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మూడు స్కీములను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మూడు స్కీములు ఇవే..స్కీమ్-ఎ: ఈపీఎఫ్వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు రూ.15000 వరకు ఒక నెల జీతం. మూడు విడతల్లో చెల్లింపుస్కీమ్-బి: మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్వో కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపుస్కీమ్-సి: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3000 వరకు ఈపీఎఫ్వో కాంట్రిబ్యూషన్ రీయింబర్స్మెంట్Prime Minister’s Package for employment and skilling: 3 schemes announced for ‘Employment Linked Incentive’🔆Scheme A: First Timers🔆Scheme B: Job Creation in manufacturing🔆Scheme C: Support to employers pic.twitter.com/NYDLNjEaea— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024
![Gold and Silver Price Today 23 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/gold_1.jpg.webp?itok=cgqecv6J)
ఈ వారం బంగారానిదే!! వరుస శుభవార్తలు
బంగారం ధరల్లో వరుస తగ్గింపులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం (జూలై 23) పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వారం రోజులుగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. దాదాపు రూ.1,400 మేర దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.270 తగ్గి రూ. 73,580 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం సైతం రూ.170 తరిగి రూ.67,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.67,600 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,730 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.150 తగ్గి రూ.68,100 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.74,290 వద్దకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరల్లో కూడా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో నేడు వెండి రేటు కేజీకి రూ.400 తగ్గింది. దీంతో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.95,600 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఫ్యామిలీ
![Union Budget: FM Nirmala Sitharaman Choice Of Sarees Through Out The Years](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Nirmala-Sitharaman.jpg.webp?itok=nsdBqboI)
ఏడు బడ్జెట్లతో రికార్డు: నిర్మలమ్మ మనసు దోచుకున్నచీరలివే! (ఫోటోలు)
![Union Budget 2024 Hostels skilling among initiatives for women in workforce](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/NIrmala%20sitharaman_womenandchild.jpg.webp?itok=FCajHhYw)
కేంద్ర బడ్జెట్ 2024-25 : మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్
కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్ విమెన్ హాస్ట్సల్ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్ల స్థాపన ద్వారా వర్క్ఫోర్స్లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్హెచ్జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
![Monkey Spit Coffee: The Unusual Coffee Bean Trend](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/coffee.jpg.webp?itok=QzRX4UYJ)
మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!
కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.భారతదేశంలోని చిక్మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట. ఎలా తయారు చేస్తారంటే..ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట. కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట. చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!)
![FM Nirmala Sitharaman elegant white and magenta saree for historic 7th Budget](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/Nirmala%20sitharaman_budget_0.jpg.webp?itok=3YCVCbu6)
చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్ రికార్డు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వరుసగా ఏడవ బడ్జెట్ను సమర్పిస్తున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. గతంలో 68 ఏళ్ల క్రితం సీడీ దేశ్ముఖ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాదు గత ఏడాది లాగానే బ్రీఫ్ కేసుకు బదులుగా టాబ్లెట్తోనే బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.మరో విశేషం ఏమిటంటే పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంగళవారం తొలి బడ్జెట్ను సమర్పించేందుకు సీతారామన్ ఈసారి కూడా చేనేత చీరనే ఎంచుకున్నారు. తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారం, శక్తికి ప్రతీకతోపాటు, భారతీయ హస్తకళాకారులపట్ల గౌరవంతో కాంట్రాస్టింగ్ పర్పుల్, పింక్ కలర్ బ్లౌజ్తో కూడిన తెల్లని గీతల హ్యాండ్లూమ్ చీరను ఎంచుకోవడం విశేషం.. ముఖ్యంగా సామరస్యం, భారతీయ సంస్కృతిలో కొత్త ప్రారంబానికి, స్వచ్ఛతకు సూచికగా వైట్ ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే ఈ చీరకు పర్పుల్ కలర్, చేనేత చీర లుక్ను మరింత ఎలివేట్ చేసింది. పూర్తికాలపు తొలి మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 5, 2019న తొలి బడ్జెట్ను సమర్పించారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కాలంలో 2021లో నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్ను పరిచయం చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'టాబ్లెట్ని ఉపయోగించి, పేపర్లెస్ ఫార్మాట్లో బడ్జెట్ను సమర్పించారు. ఇక 2024-25 బ్రీఫ్కేస్కు బదులుగా రెడ్ క్లాత్ ఫోల్డర్ను ఉపయోగించారు. బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె భేటీ అయ్యారు. మంత్రి వర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతిని కలవడానికి ముందు, నిర్మలా సీతారామన్ తన కార్యాలయం వెలుపల తన అధికారుల బృందంతో సంప్రదాయ ‘బ్రీఫ్కేస్’ ఫోటోకు పోజులిచ్చారు. ఈసారి బడ్జెట్కు బహి-ఖాతా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఫొటోలు
![Indian Youngest And Oldest Players Qualified For Paris Olympics 2024](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Paris-Olympics-2024_India.jpg.webp?itok=_fv98DEf)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Paris-Olympics-2024_India.jpg.webp?itok=_fv98DEf)
ప్యారిస్ ఒలింపిక్స్: 117 మంది.. ఓల్డెస్ట్, యంగెస్ట్ ఎవరంటే? (ఫోటోలు)
![Union Budget: FM Nirmala Sitharaman Choice Of Sarees Through Out The Years](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Nirmala-Sitharaman.jpg.webp?itok=nsdBqboI)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Nirmala-Sitharaman.jpg.webp?itok=nsdBqboI)
ఏడు బడ్జెట్లతో రికార్డు: నిర్మలమ్మ మనసు దోచుకున్నచీరలివే! (ఫోటోలు)
![Finance Minister Nirmala Sitharaman Union Budget 2024-25 Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Finance%20Minister%20Nirmala%20Sitharaman%20Union%20Budget%202024-25%20Photos_1%20%281%29.jpg.webp?itok=i-VEh-PQ)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Finance%20Minister%20Nirmala%20Sitharaman%20Union%20Budget%202024-25%20Photos_1%20%281%29.jpg.webp?itok=i-VEh-PQ)
వేతనజీవికి ఊరట.. కేంద్ర బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు (ఫొటోలు)
![Actress Sneha Latest Saree Pics From London Vacation](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Sneha.jpg.webp?itok=s0Zef5Uh)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Sneha.jpg.webp?itok=s0Zef5Uh)
కట్టుకున్న చీరకే అందాన్ని తెచ్చిన స్నేహ (ఫోటోలు)
![90s Kids Favorite Singer Himesh Reshammiya Birthday Special Gallery](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Himesh-Reshammiya.jpg.webp?itok=9qpG7bPA)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/23/Himesh-Reshammiya.jpg.webp?itok=9qpG7bPA)
ఒక్క రొమాంటిక్ పాటతో ఫేమస్.. 90స్ కిడ్స్ ఫేవరెట్ సింగర్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
National View all
![title](/sites/default/files/article_images/2024/07/23/nirmalasitaraman.jpg)
Budget 2024: బడ్జెట్ స్పీచ్ గంటన్నరలోపే..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్
![title](/sites/default/files/article_images/2024/07/23/niramala0101.jpg)
Budget 2024-25: ‘అది ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు’
కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్లో సమర్పించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
![title](/sites/default/files/article_images/2024/07/23/jobs.jpg)
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా స
![title](/sites/default/files/article_images/2024/07/23/Anjali%20Birla.jpg)
ఢిల్లీ హైకోర్టుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. అంజలి బిర్లా
ఢిల్లీ : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్
![title](/sites/default/files/article_images/2024/07/23/Nirmala-Sitharaman-1.jpg)
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
International View all
![title](/sites/default/files/article_images/2024/07/23/Siberian%20tiger-goat.jpg)
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా.
![title](/sites/default/files/article_images/2024/07/23/kamala.jpg)
కమలా దేవి హారిస్ గెలవాలని తమిళనాడులో పూజలు
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్
![title](/sites/default/files/article_images/2024/07/23/baps-big.jpg)
Canada: హిందూ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు
కెనడాలో మరోమారు హిందూ దేవాలయంపై దాడి జరిగింది.
![title](/sites/default/files/article_images/2024/07/23/Trump_Kamala_Harris_Donatio.jpg)
కమలా హారిస్కు మద్దతుగా ట్రంప్ విరాళం!.. జోరుగా సెటైర్లు
అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప
![title](/sites/default/files/article_images/2024/07/23/court.jpg)
UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆం
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/23/NRI_0_0.jpg)
TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వై
![title](/sites/default/files/article_images/2024/07/23/kamala.jpg)
కమలా దేవి హారిస్ గెలవాలని తమిళనాడులో పూజలు
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్
![title](/sites/default/files/article_images/2024/07/21/Jeeti-Harika.jpg)
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వెటర్నరీ డాక్
![title](/sites/default/files/article_images/2024/07/21/Gavin-Dasaur.jpg)
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య
వాషింగ్టన్: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వర
![title](/sites/default/files/article_images/2024/07/20/Texas_Austin_NRI.jpg)
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం
ఆస్టిన్: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
క్రైమ్
![Fire in Madanapalle Sub Collectorate](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/fire_0.jpg.webp?itok=8XDupbkf)
మదనపల్లె సబ్కలెక్టరేట్లో అగ్నిప్రమాదం
సాక్షి రాయచోటి/బి.కొత్తకోట/మదనపల్లె/సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం అర్థరాత్రి అగి్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఓ ఛాంబర్ కుడివైపు సెక్షన్లు పూర్తిగా.. ఎడమవైపు సెక్షన్లు కొంతమేర దగ్థమయ్యాయి. అలాగే, వీటికి ఎదురుగా ఉన్న విభాగాలూ మొత్తం కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు దగ్థమయ్యాయి. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్ను ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నపళంగా హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిపిన తనిఖీల్లో ఏపీఎస్పీడీసీఎల్, ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్రావు విద్యుత్ సరఫరా వైర్లు, మీటరు, ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా వైరింగ్ కొన్నిచోట్ల కాలిపోయినట్లు గుర్తించారు. అలాగే, సీఐడీ, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగం, పోలీసు అధికారులూ విచారణ జరిపారు. ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారులు, తహశీల్దార్లు, ఉద్యోగులనూ విచారించారు. అంతేకాక.. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటుచేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్పై దృష్టిపెట్టారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి డాగ్స్కా్వడ్లు.. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఫోరెన్సిక్ విభాగం నిపుణులను రప్పించారు.అధికారుల హడావుడితో హైటెన్షన్.. అంతకుముందు.. సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇక అగి్నప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవడం.. ఎక్కడలేని హడావుడి నెలకొనడంతో సబ్కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరితో ఏం మాటా్లడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.అవసరమైతే కేసు సీఐడీకి బదిలీ: డీజీపీ అనంతరం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. అగి్నప్రమాదంపై వీఆర్ఏ డీటీకి తెలపడం, ఆమె ఆర్డీఓకి చెప్పడం.. ఆయన ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపుచేశారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి సీఐడీకి కేసు బదిలీచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖలోని 25 అంశాలకు చెందిన రన్నింగ్ ఫైల్స్ దగ్థమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. అలాగే, దగ్థమైన రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
![Students from leading educational institutes caught consuming Ganja](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/narcotics.jpg.webp?itok=DKYabJiS)
ప్రముఖ కాలేజీల్లో గుట్టుగా గంజాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులతోపాటు కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు, సీబీఐటీలో ఒకరు, బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన కొందరు, జేఎన్టీయూ (జోగిపేట్)లో ముగ్గురు, సింబయోసిస్ కాలేజీకి చెందిన 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు గంజాయి తాగుతూ పట్టుబడ్డారని.. వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామన్నారు. ఇండస్ స్కూల్ విద్యార్థులకు కోడ్ పేర్లతో ఈ–సిగరెట్లు విక్రయిస్తున్న అహ్మద్, జాఫర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి వివరాలు వెల్లడించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. సాంకేతిక సహకారం, నిఘా వర్గాల నుంచి సేకరిస్తున్న సమచారంతో విజయవంతంగా మత్తుపదార్థాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.నిఘా పెంచాం..రాష్ట్రంలోని పబ్బుల్లో మత్తుపదార్థాల వాడకంపై నిఘా పెంచినట్లు టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇటీవలే హెచ్ఐసీసీ నోవాటెల్లోని ఆర్టిస్ట్రి పబ్లో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా కేవ్ పబ్లో ఫారెస్ట్ ఆల్కెమీ పేరిట నిర్వహించిన పార్టీలో పాల్గొన్న 52 మందికి పరీక్షలు నిర్వహించగా 33 మంది గంజాయి, కొకైన్, ఎండీఎంఏ వాడినట్లు నిర్ధారణ అయిందన్నారు. హైదరాబాద్లో తరచూ ఈవెంట్లు నిర్వహిస్తున్న డీజేల వివరాలను సేకరించినట్లు సందీప్ శాండిల్య తెలిపారు. పబ్బుల్లో 21 ఏళ్లలోపు యువతకు మద్యం సరఫరా చేస్తున్నారా లేదా అనే దానిపైనా నిఘా పెట్టాలని, ఆధార్ కార్డులను తనిఖీ చేసి వయసు నిర్ధారించాలని యూనిట్ అధికారులకు సూచిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వాడకాన్ని నిరోధించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ విద్యాసంస్థలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నామని తెలిపారు. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని అందులోంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.80 శాతం గంజాయి ఒడిశా నుంచే..!ఏపీ, తెలంగాణలోకి రవాణా అవుతున్న గంజాయిలో 80 శాతం వరకు ఒడిశా నుంచే వస్తోంది. ఒడిశాలో సాగుచేసి రవాణా చేస్తున్న గంజాయి ప్రధానంగా ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచే తెలంగాణలోకి వస్తున్నట్లు వెల్లడించాయి. డ్రగ్స్, గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర సరిహద్దులో మరింత నిఘా పెంచామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు.
![A person riding a bike was hit by a car](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/car_1.jpg.webp?itok=49ofJSHu)
కారుతో ఢీకొట్టి.. 4 కి.మీ.ఈడ్చుకెళ్లి..
మునిపల్లి (అందోల్): బైక్పై వెళుతు న్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాయపడి న వ్యక్తి కారు బంపర్ లో ఇరు క్కుపోయినా పట్టించుకోలేదు. నాలుగు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బుదేరా ఎస్ఐ రాజేశ్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వన పర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల కానపురం తండాకు చెందిన మెగావత్ వెంకటేశం (22) హైదరాబాద్ మియాపూర్లో ఉంటూ ఎల్ఎల్బీ చదువుతున్నాడు. జహీరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్పై మియాపూర్కు పయన య్యాడు. హైదరాబాద్కు చెందిన రాజ్కుమార్ కర్ణాటకలోని గానుగాపూర్ దైవదర్శ నానికి వెళ్లి కారులో తిరిగి వస్తూ.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పరిధిలో ముంబై జాతీయ రహదారిపై వెంకటేశాన్ని వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పక్కకు పడిపోగా వెంకటేశం కారు బంపర్లో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా రాజ్కుమార్.. కారుతో అలాగే నాలుగు కిలోమీటర్లు వెళ్లిపోయాడు. ఈ క్ర మంలో లింగంపల్లి టోల్గేట్ వద్ద ఆగిన కారు.. మృతదేహం ఇరుక్కుపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో టోల్గేట్ సిబ్బంది వచ్చి చూడగా.. మృతదే హం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశాన్ని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు.ఛిద్రమైన శరీరం..కారులో ఇరుక్కున్న వెంకటేశం మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. వీపుభాగం మొ త్తం కాలిపోయింది. కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయం కావడంతో రక్త స్రావమైంది. చేతులు నెంబర్ ప్లేట్లో, కొన్ని శరీర భాగాలు పొగగొట్టంలో ఇరు క్కుపోయాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో భయపడి తాను కారు అపకుండా వచ్చానని రాజ్కుమార్ అంగీకరించినట్టు బుదేరా ఎస్ఐ రాజేశ్నాయక్ తెలిపారు.
![first zero fir registration In Bengaluru](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/22/666.jpg.webp?itok=II3YFM9n)
సైబరాబాద్లో నేరం.. బెంగళూరులో కేసు
సాక్షి, హైదరాబాద్: భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమలులోకి వచి్చన 20 రోజులకు అందులోని నిబంధనల ఆధారంగా కర్ణాటక రాజధాని బెంగళూరు పోలీసులు తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడి కూబన్ పార్క్ పోలీసుస్టేషన్లో శనివారం నమోదైన ఈ కేసు సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరంపై కావడం గమనార్హం. ఈ కేసును ఇక్కడి పోలీసులకు బదిలీ చేయడానికి ఆ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరులోని వసంత్నగర్కు చెందిన అపూర్వ్ ప్రకాష్ అక్కడి విఠల్ మాల్యాలోని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఈ నెల 9న గచి్చ»ౌలిలోని హెచ్ఐసీసీలో జరిగిన ఓ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తన ల్యాప్టాప్, రూ.70 వేల నగదుతో కూడిన బ్యాగ్ తస్కరణకు గురైనట్లు సదస్సు పూర్తయిన తర్వాత గమనించారు. ఆ రోజు సాయంత్రమే బెంగళూరు తిరిగి వెళ్లాల్సి ఉండటం, విమాన టిక్కెట్లు సైతం బుక్ కావడంతో వెంటనే పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోయారు. దీంతో బెంగళూరు వెళ్లిన ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాలో కంప్లైంట్ ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ అమలులోకి రాకముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆరీ్పసీ) అమలులో ఉండేది. దీని ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. దీంతో బా«ధితులు నేరం జరిగిన ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తే అక్కడకే ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. అయితే బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలో బాధితుడిగా మారినా తమకు ఉన్న అవకాశాన్ని బట్టి ఏదైనా ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు. దీని ప్రకారం కేసు నమోదు చేయడం ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల బాధ్యత. దీంతో ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాకు వెళ్లి సైబరాబాద్లోని హెచ్ఐసీసీలో తస్కరణకు గురైన బ్యాగ్పై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కూబన్ పార్క్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 305 (ఎ) ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సైబరాబాద్కు పంపాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. అక్కడ నుంచి గచి్చ»ౌలి ఠాణాకు ఈ కేసు చేరిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్తో రీ–రిజిస్టర్ చేసే పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పాటు ఘటనాస్థలి సందర్శన, పంచనామా నిర్వహణ తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
వీడియోలు
![FM Nirmala Sitharaman QAndA On New Tax Slab Rates](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/nin.jpg.webp?itok=vGki6pgH)
![FM Nirmala Sitharaman QAndA On New Tax Slab Rates](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/nin.jpg.webp?itok=vGki6pgH)
కొత్త ట్యాక్స్ విధానంలో మార్పులపై నిర్మలా సీతారామన్ జవాబు
![YS Jagan and Other YSRCP Leaders Protest in Delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/st.jpg.webp?itok=MFsFW88e)
![YS Jagan and Other YSRCP Leaders Protest in Delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/st.jpg.webp?itok=MFsFW88e)
ఢిల్లీలో జగన్ ధర్నా..
![KCR Holds BRSLP Meeting with MLAs at Telangana Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/bs.jpg.webp?itok=hsimtRIP)
![KCR Holds BRSLP Meeting with MLAs at Telangana Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/bs.jpg.webp?itok=hsimtRIP)
తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక భేటీ
![Godavari Water Level at Rajahmundry](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/wa.jpg.webp?itok=Tdeltnsn)
![Godavari Water Level at Rajahmundry](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/wa.jpg.webp?itok=Tdeltnsn)
భారీగా పెరిగిన గోదావరి నీటిమట్టం
![KTR Slams Telangana BJP and Congress MPs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/tu.jpg.webp?itok=AGwozshd)
![KTR Slams Telangana BJP and Congress MPs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/tu.jpg.webp?itok=AGwozshd)
ఇద్దరు కేంద్ర మంత్రులున్నా.. తెలంగాణకు దక్కింది గుండు సున్నా
![Gudivada Amarnath About Jagan Protest in Delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/del.jpg.webp?itok=u6KNqmaB)
![Gudivada Amarnath About Jagan Protest in Delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/del.jpg.webp?itok=u6KNqmaB)
మేమేంటో రేపు ఢిల్లీలో చూపిస్తాం
![Minister Seethakka Slams IAS Smita Sabharwal Comments](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/bod.jpg.webp?itok=bdfckLsx)
![Minister Seethakka Slams IAS Smita Sabharwal Comments](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/bod.jpg.webp?itok=bdfckLsx)
ఐఏఎస్ అంటే బాడీతో కాదు బ్రెయిన్ తో పనిచేయాలి..
![Special Debate On Central Budget Allocation to AP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/to.jpg.webp?itok=Ce9kWYGp)
![Special Debate On Central Budget Allocation to AP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/to.jpg.webp?itok=Ce9kWYGp)
బాబు అట్టర్ ఫ్లాప్ ఏపీకి గుండు సున్నా!
![KS Prasad on Union Budget 2024 2025](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/th_3.jpg.webp?itok=9dzkeVsl)
![KS Prasad on Union Budget 2024 2025](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/th_3.jpg.webp?itok=9dzkeVsl)
ఎక్కడ ఈ నిధులు..? బడ్జెట్ పై KS ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
![AP Budget Allocations On Polavaram Project ](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/lt.jpg.webp?itok=98yujNSA)
![AP Budget Allocations On Polavaram Project ](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/23/lt.jpg.webp?itok=98yujNSA)
ఏపీకి మొండి చేయి.. చంద్రబాబు అట్టర్ ఫ్లాఫ్
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అసెంబ్లీ ఎదుట పోలీసుల అతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... రేపు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది... రాష్ట్రపతి పాలన విధించాలి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక విధానాలను వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్