Precautions
-
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. మామిడివీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్ లాగ చేసి పూయాలి.రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్ సల్ఫేట్ 0.5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్ నీటికి కెఎన్03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి బోరాన్ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్ సల్ఫేట్, కెఎన్03, బొరాన్.. ఈ నాలుగింటిని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.నివారణకు మిథైల్ యూజీనాల్ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుటమాటకాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్ ఒక లీటర్ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి పోలానోఫిక్స్ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒకలీటర్ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.పసుపువర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ షీట్స్ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:శ్రీమతి కృష్ణవేణి – 9110726430పసుపు : శ్రీ మహేందర్ : 94415 32072మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 -
చంటి పిల్లలతో జాగ్రత్త : నాటు వైద్యంతో ప్రమాదం!
వేసవి కాలం ప్రారంభమైతే చాలు చికెన్ ఫాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటి సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఈ సమస్యలతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. చాలా మంది తమ పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకువస్తుంటే.. కొంతమంది పూర్వకాలం పద్ధతుల్లో నాటు వైద్యం చేయిస్తున్నారు. అన్ని వయసుల వారికి ఈ వ్యాధులు సోకే అవకాశం ఉన్నా చిన్నారులకు త్వరగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా బిళ్లలు, నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముందు జాగ్రత్తతోనే ఈ ప్రమాదకర అంటువ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, 15 ఏళ్లలోపు బాలబాలికలపై మరింత శ్రద్ధ వహించాలంటున్నారు. జాగ్రత్త వహించాలి రామచంద్రపురం నియోజకవర్గంలోని ఐదేళ్లలోపు చిన్నారులు కాజులూరు మండలంలో 3887 మంది, కె.గంగవరం మండలంలో 4922 మంది, రామచంద్రపురం మండలంలో 3890 మంది మొత్తం 12,699 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వేసవిలో వారిపట్ల మరింత శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా వ్యాధి సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడంతో ఆహారం సరిగ్గా తీసుకోలేక బాగా నీరసించిపోతారు. చర్మంపై నీటి పొక్కులు, దురదలు వంటి లక్షణాలు వారం నుంచి పదిహేను రోజులకు పైగా బాధిస్తాయి. తొలుత జలుబుతో ప్రారంభమయ్యే ఈ వ్యాధులు క్రమంగా వాటి ప్రభావం చూపుతాయి. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదించాలి. నాటు వైద్యం వైపు వెళ్లరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా, వేగంగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఆటలమ్మ... జాగ్రత్తలు సాధారణంగా ఈ వ్యాధి వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆటలమ్మ అంటువ్యాధి కావడం వల్ల వ్యాధి సోకిన వారిని మిగిలిన వారికి దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన పిల్లలను పాఠశాలకు పంపకూడదు. ప్రతి రోజూ స్నానం చేయవచ్చు. జ్వరం ఉంటే వేడి నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. దురద రాకుండా పరిశుభ్రత పాటించాలి. చిన్నారులకు చేతి గోళ్లు తీసివేయడం మంచిది. మంచి పౌష్టికాహారం అందించాలి. ఆటలమ్మ వచ్చిన వారు కోరినవన్నీ ఇవ్వాలన్న అపోహతో అన్ని రకాల తినుబండారాలను ఇవ్వడం మంచిది కాదు. తేలికగా జీర్ణమయ్యే మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. గవదబిళ్లలు... జాగ్రత్తలు గవదబిళ్లల వ్యాధిలో తీవ్రంగా గొంతునొప్పి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో ద్రవాల శాతం తగ్గుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం మంచిది. నాటువైద్యం ప్రమాదకరంచికెన్పాక్స్, గవద బిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వైద్యులను సంప్రదించాలి. చాలామంది మూఢనమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్యుని సలహా తీసుకుని అవసరమైన మందులకు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గర్భిణులపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. నాటువైద్యాన్ని ఆశ్రయిస్తే ప్రమాదానికి దారి తీస్తుంది. వైద్యులను సంప్రదించాలి అటలమ్మ, గవద బిళ్లలు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చిన్న పిల్లలు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడాలి. – ఎన్.ప్రశాంతి, డివిజనల్ వైద్యాధికారి, రామచంద్రపురం -
సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..) -
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. జీబీ సిండ్రోమ్ లక్షణాలు» ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించేదే జీబీఎస్. »మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. యాంటీబాడీస్ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్ అందక అవయవాలు అచేతనమవుతాయి.» మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతన మైతే కళ్లు కూడా మూయలేడు. »ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. » గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం వస్తుంది. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. »శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గినా జీబీఎస్ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్ రావటానికి ప్రధాన కారణమని గుర్తించారు.తక్కువ ఖర్చుతో చికిత్స ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం మేలు. –డాక్టర్ బి. చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
ఇలా చేస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు!
వర్షాకాలంలో తరచూ పిడుగులు పడి మనుషులూ, పశువులూ చనిపోవడం తెలిసిందే. నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు. వర్షం రాగానే చెట్ల కిందికి పరుగెత్తకూడదు. ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం. చెట్లు, స్తంభాల కిందకు వెళ్లకుండా ఇళ్లకు, సురక్షిత భవనాలకు చేరుకోవాలి. కారులో ఉంటే అందులో కూర్చొని, కిటికీ అద్దాలు మూసివేయాలి. చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి. లోహపు తలుపులను తాకరాదు. ఇంటిలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అవసరం. విద్యుత్ పరికరాలను ఆపేయాలి. ఛార్జింగ్ చేస్తున్న ఫోన్ తాకకూడదు. కాంక్రీటు గోడలను, నేలను తాకకూడదు. బాల్కనీ, కిటికీలకు దగ్గరగా ఉండకూడదు. నల్లా నీటిని తాకరాదు. తాము నిలబడిన భూమి పొడిగా ఉండాలి. తడిగా ఉంటే దగ్గరలో పిడుగు పడితే విద్యుత్ఘాతానికి గురి కావచ్చు.చర్మంపై గుచ్చినట్లున్నా, వెంట్రుకలు నిక్క బొడిచినా వెంటనే పిడుగు పడబోతోందని అర్థం (ఈ సూచికలు గుర్తించే అవకాశం ప్రతిసారీ ఉండక పోవచ్చు). పొలాల్లో ఉన్నప్పుడు కాలి మునివేళ్ళ పైన తల వంచి, చెవులు మూసుకొని కూర్చోవడం ఒక మార్గం. ఇందువల్ల నేరుగా పిడుగు పడే అవకాశాలు తగ్గుతాయి. రెండు కాలి మడమలు ‘V’ ఆకారంలో వెనక తాకి ఉండాలి. ఇందువల్ల భూమిపై పిడుగు పడితే ఒక కాలిలోకి ప్రవేశించిన విద్యుత్ మరో కాలిలోంచి భూమిలోకి త్వరగా వెళ్ళిపోతుంది. అడవిలో ఉంటే గుంపుగా ఉన్న చిన్న చెట్ల కింద ఉండవచ్చు. అప్పటికే కొండపై ఉంటే ఏదేని గుహ కనిపిస్తే వెళ్ళవచ్చు. తాటి చెట్లు ఎత్తుగా, తడిగా ఉండటం వల్ల సహజంగా పిడుగులను ఆకర్షించి భూమిలోకి విద్యుత్తును ప్రవహింపచేస్తాయి. ఇంటిలో ఉండడం క్షేమమే, అయినా పక్కనే పెద్ద చెట్టు ఉంటే ఏమి జరుగుతుందో సూర్యారావుపాలెం పిడుగుపాటు చెబుతోంది. చెట్టుకు దగ్గరలో ఎండు కర్రలు, దహనశీల పదార్థాలు ఉంటే అగ్ని తీవ్రత పెరుగుతుంది. కానీ అసలు చెట్లే లేకపోతే మైదాన ప్రాంతంలో కూడా పిడుగు పడుతుంది. కనుక గ్రామాల్లో చెట్లు అన్నీ ఒకే ఎత్తులో ఉండేట్లు పై కొమ్మలు తొలగిస్తే ప్రమాదావకాశాలు కొంత తగ్గుతాయి. మైదాన ప్రాంతంలో ఉండే పాన్ డబ్బాల దగ్గర మరీ ప్రమాదకరం. చదవండి: చలికాలంలో పొంచివున్న వ్యాధులు.. జాగ్రత్తలు ఇవే‘పిడుగు వాహకాలు’ (లైట్నింగ్ కండక్టర్) గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇవి 20 ఏళ్ళకు పైగా పని చేస్తాయి. పిడుగు వాహకాలు కొద్ది మీటర్ల మేరకే రక్షణ కల్పిస్తాయి గనుక అన్ని ఎత్తైన ఇళ్ళపై ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర భూవిజ్ఞాన శాఖ ‘దామిని’ అనే యాప్ను తీసుకొచ్చింది. రానున్న 40 నిమిషాల్లో చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నెట్ వర్క్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
ఫార్మ్ హౌస్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
Guidance for parents: మా అమ్మాయి సేఫ్గా ఉందా?
కోల్కతాలో హత్యాచార ఘటన జరిగాక స్కూలుకెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు... ఉద్యోగం కోసం, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల క్షేమం గురించి ఆందోళన పెంచుకున్నారు. గంట గంటకూ ఫోన్ చేసి ‘ఎక్కడున్నావ్’ అంటున్నారు. సాయంత్రం ట్యూషన్లు మాన్పిస్తున్నారు. కాని అంత భయపడాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తే చాలు.ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గాయపడుతుంది. గాయం తీవ్రంగా ఉన్నప్పుడు అయోమయం, ఆందోళన, భయం, అభద్రత అన్నీ చుట్టుముడతాయి. ఇవన్నీ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అయినప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. ఇప్పుడు కోల్కతాలోని స్కూళ్లు చైల్డ్ సైకాలజిస్ట్లు, కౌన్సెలర్లతో కిటకిటలాడుతున్నాయి.అక్కడ ఏం జరిగింది?పిల్లలకు సహజంగానే కుతూహలం అధికం. కోల్కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై దారుణకాండ జరిగిన సంగతి దేశాన్ని కుదిపేస్తే కోల్కతా హోరెత్తింది. ఇంటా బయట ఆ సంఘటన గురించే చర్చలు. పిల్లల చెవుల్లో ఆ మాటలు పడనే పడతాయి. అదొక్కటే కాదు... వారికి ఆ సంఘటన గురించి దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూళ్లు కొన్ని తన విద్యార్థులతో స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొని ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాయి కూడా. వీటన్నింటి దరిమిలా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ప్రశ్నలతో ముంచెత్తసాగారు టీచర్లని, తల్లిదండ్రులను. డాక్టర్కు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? చేసిన వారిని పట్టుకున్నారా? అలాంటివి మాక్కూడా జరుగుతాయా?... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీచర్లు అవస్థ పడి కౌన్సెలర్లను స్కూళ్లకు పిలుస్తున్నారు.రెండు విధాలా...ఇప్పుడు స్కూలు పిల్లలు, ఇంటర్ స్థాయి పిల్లలకు బయట దారుణమైన మనుషులు ఉంటారనే భయంతో వేగడం ఒక సమస్య అయితే అంత వరకూ కొద్దో గొ΄్పో స్వేచ్ఛ ఇస్తూ వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ నుంచి లేట్గా వచ్చినా, ట్యూషన్కు వెళ్లినా, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లినా పదే పదే ఫోన్లు చేసి వెంటపడటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు తల్లిదండ్రులు పెప్పర్ స్ప్రేలు కొనిస్తుండటంతో పిల్లలు మరింత బెంబేలు పడుతున్నారు.పిల్లలకు ధైర్యం చెప్పాలిఇప్పుడు జరగాల్సినది... పిల్లలకు ధైర్యం చెప్పడమే కాకుండా రక్షణ గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నిర్లక్ష్యం అసలు పనికిరాదని కోల్కతా ఘటన తెలియచేస్తోంది. ఎవరూ లేని హాల్లో ఒంటరిగా నిద్రపోవడం ఎంత సురక్షితమో ఆ డాక్టర్ అంచనా వేసుకోలేకపోయింది. తల్లిదండ్రులు కూడా నైట్ డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ చేసి ఆమె తిరుగాడక తప్పని పరిసరాలను గమనించి ఉంటే తగిన సూచనలు చేసి ఉండేవారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.⇒ పిల్లల రాకపోకల సమయాలను నిర్దిష్టంగా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి ⇒ స్కూల్కు వెళ్లే సమయం వచ్చే సమయం వారు వచ్చి వెళ్లే దారి, రవాణ వ్యవస్థ, ఎవరైనా కొత్త మనుషులు కలుస్తున్నారా... వంటివి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ⇒ ర్యాపిడో వంటి వాహనాలు ఎక్కి రావాల్సి ఉంటే ఎక్కే ముందు ఆ డ్రైవర్తో మాట కలిపించి, అతని నంబర్ తీసుకోవాలి లేదా తల్లిదండ్రులే ఫోన్పే చేస్తే అతని నంబర్ వచ్చేసినట్టే. ⇒ కొత్త ్రపాంతాలకు వెళ్లేటప్పుడు అవి ఏ మేరకు సురక్షితమో తెలుసుకుని పంపాలి. ⇒ పిల్లలు బయట ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉండేలా చూసుకోవాలి. అది సైలెంట్ మోడ్లో లేకుండా పెట్టమని చెప్పాలి. ⇒ పిల్లలను ఊరికే కాల్ చేసి విసిగించకుండా ప్రతి గంటకూ ఒకసారి మెసేజ్ పెడితే చాలని చెప్పాలి. ⇒ పోలీసులకు కాల్ చేయడానికి భయపడకూడదని తెలియజేయాలి. ⇒ ఇంటి బయట, స్కూల్ దగ్గర, బంధువులుగాని, స్కూలు సిబ్బందిగాని ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తమకు చెప్పాలని భయపడకూడదని తెలియజేయాలి. ⇒ చట్టం చాలా శక్తిమంతమైనా, ఆపదలో చిక్కుకున్నప్పుడు దూసుకొచ్చే సాటి మనుషులు ఉంటారని, గట్టిగా సాయం కోరితే అందరూ కాపాడతారని పిల్లలకు చెబుతుండాలి. ⇒ అపరిచిత కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని ఊరికే భయపెట్టే విషయాలను ఆలోచిస్తూ కూచోవద్దని చెప్పాలి. ⇒ ధ్యాస మళ్లించే మంచి స్నేహాలలో ఉండేలా చూసుకోవాలి. -
ప్రెగ్నెన్సీ సమయంలో.. ఈ లక్షణాలు కనిపెట్టడమెలా?
నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్కి పంపి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంటప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్ని స్ట్రెయిట్గా ఉంచి కూర్చోవడం చేయాలి.మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజ్ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్ను కలవాలి.హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.న్యూయార్క్లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్నెస్ çసమిట్లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి! -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
Health: వైట్.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.మేలు చేసే తెల్లటి ఆహారాలివి..ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ్రపోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్ అని పిలిచే పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు! -
Health: క్రానిక్... పానిక్.. వేడివేడిగా బాడీ రిపేర్!
దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్ఫ్లమేషన్ను ‘అక్యూట్ ఇన్ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.ఒక ఇన్ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్గా ఉన్నాయని అర్థం.ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్గా ఉంచుతాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్ఫ్లమేషన్స్తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం. -
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు -
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
Health: స్ట్రెస్.. హెల్త్ మిస్! టీచర్లపై ఒత్తిడి బెత్తం..
టీచర్స్ డే రోజు పూజించుకుంటున్నాం సరే. వారి మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి, ఇంటికి శ్రద్ధ ఉందా? చెప్పాల్సిన క్లాసుల సంఖ్య, సిలబస్ల వత్తిడి, విద్యార్థులు నిత్యం తెచ్చే సమస్యలు, స్కూల్లో అరాకొరా వసతులు, స్కూలుకు రానూ పోనూ ప్రయాణ సౌలభ్యం లేని ఆందోళన... ఇవన్నీ టీచర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తీస్తున్నాయి. ఆ అసహనం విద్యార్థుల మీదకు మళ్లితే వారు గాయపడటమే కాక పాఠాలు నడవవు. శాంతంగా, నవ్వుతూ ఉండే టీచర్లు ఎందరు?2023లో బిహార్లో టీచర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 75 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 4 లక్షల మంది టీచర్లకు 12 రకాల ప్రశ్నలున్న ప్రశ్నాపత్రాన్ని పంపి వాటికి సమాధానాలు రాయించారు. ఈ సర్వే చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు...– టీచర్లు తరచూ తిడుతూ ఉండటం, కొడుతూ ఉండటం– స్కూలుకు సరిగ్గా రాకపోవడం– సిలబస్ సమయానికి పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వం జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమంటే పిల్లలతో వారు వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు తేడా వస్తున్నదో తెలియడానికి ఈ సర్వే చేశారు. కాని సర్వే ఫలితాలను మాత్రం బయట పెట్టలేదు. సర్వేలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.– మీ ఇంట్లోని ఒత్తిడి స్కూల్లో మీ ఉద్యోగం మీద పడుతున్నదా?– పిల్లల్ని ఎంత తరచుగా తిడుతున్నారు?– సిలబస్ టైమ్కి పూర్తి చేయగలుగుతున్నారా?– మీరు ఇంట్లో ఎక్కువ ఒత్తిడి ఫీలవుతారా స్కూల్లోనా?– ఇప్పటి విద్యా వ్యవస్థ మీద సంతృప్తిగా ఉన్నారా?ఈ సర్వేతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు పాఠాలు చెప్పే పని కంటే వేరే పనులు ఎక్కువ చెబుతున్నారు అని. వాటిలో ఎలక్షన్ డ్యూటీలు, సర్వేలు, మిడ్ డే మీల్స్ ఉన్నాయి. సర్వేల పనిలో టీచర్లను పెడితే ఆ సమయంలో టీచర్ల అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. కొందరైతే ‘మిడ్ డే మీల్స్ను బయటి ఏజెన్సీకి అప్పగించాలి. చీటికి మాటికి దాని గురించి ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒత్తిడిగా ఉంది’ అన్నారు.వ్యక్తిగత శ్రద్ధకు సమయం లేదు..స్కూల్లో పాఠాలు, హోమ్వర్క్లు, పరీక్షలు పెట్టి పేపర్లు దిద్దటాలు, స్కూల్ మేనేజ్మెంట్తో మీటింగ్లు, పేరెంట్స్తో మీటింగ్లు, సిలబస్ను పూర్తి చేయడం, వృత్తిపరమైన పోటీ (మంచి పేరు రావడం), స్టూడెంట్ల వ్యవహారశైలితో సమస్యలు... ఇవన్నీ ఒత్తిడి కలిగించేవే. ఇక కుటుంబ పరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇంటి వొత్తిడి స్కూల్లో స్కూలు ఒత్తిడి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రెండు చోట్లా టీచర్లకు స్థిమితం ఉండదు. స్థిమితంగా లేని స్వభావంతో పాఠం చెప్పడం కష్టం. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్లు తమ మానసిక స్థితి గురించి శ్రద్ధ పెట్టే ఆలోచన చేయలేకపోతున్నారు.పిల్లలకు ఒత్తిడి..క్లాసురూమ్లో కూచోగానే పిల్లలు తలెత్తి చూసేది టీచర్నే. టీచర్ ముఖం ప్రసన్నంగా ఉంటే వారు ప్రసన్నంగా పాఠం వింటారు. చిర్రుబుర్రులాడే టీచర్ ఉండే క్లాసులోని పిల్లల్ని పరీక్షిస్తే వారిలో ‘కార్టిసల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నదని తేలింది. పిల్లల మానసిక ఆరోగ్యం పై స్కూల్ వాతావరణం నెగెటివ్ ప్రభావం ఏర్పరిస్తే వారిలో సమస్యలు వస్తాయి. వీళ్లు మళ్లీ టీచర్కు స్ట్రెస్ ఇస్తారు. అంటే ఇదొక సైకిల్గా మారుతుంది.వ్యక్తిగత ఒత్తిడి..టీచర్ ఉద్యోగంలో ఉన్నవారికి కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇంటి పని తగ్గించగలగాలి. ఆర్థిక, భావోద్వేగ సమస్యలు తెలుసుకొని మిత్రులు, బంధువులు సపోర్ట్గా నిలవాలి. సక్సెస్ఫుల్ విద్యార్థులను తయారు చేయించడంలో ఆమె సక్సెస్ అయ్యేలా తోడు నిలవాలి.చర్యలు తీసుకోవాలి..టీచర్లు, పిల్లలు మంచి మానసిక స్థితిలో ఉంటూ స్కూల్ జీవనం కొనసాగించాలంటే టీచర్ల గురించి ఆలోచించాలి. టీచర్ల కోసం ప్రభుత్వంగాని, ప్రయివేటు యాజమాన్యాలుగాని కింది చర్యలు తీసుకోవాలి.– తరచూ నిపుణులచే కౌన్సిలింగ్ చేయించడం– మెంటల్ హెల్త్ వర్క్షాప్లు నిర్వహించడం– సాటి టీచర్ల నుంచి మద్దతు లభించే పని వాతావరణం.– వసతులు, బోధనా సామాగ్రి ఏర్పాటు– ఇంటి పని, ఉద్యోగ బాధ్యత సమతుల్యత గురించిన అవగాహన – యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలకు టీచర్లు అనుసంధానకర్తలుగా ఉండేలా చేసి ఆ టీచర్లు చెప్పే సూచనలను పాజిటివ్గా చూడటం. -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్లైన్లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్స్ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్నేమ్, యువర్ పాస్పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్లోడ్స్కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్లాక్ సింబల్ ఉన్న సైట్నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్మీడియా పోస్టింగ్లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Health: బీ‘పీక్స్’ పోకముందే చెక్స్!
రక్తపోటు లేదా హైపర్టెన్షన్ అంటే అందరికీ తెలిసిందే. కానీ... వాస్తవానికి రక్తపోటు వచ్చేందుకు ముందు కొన్ని సూచనల ద్వారా శరీరం హెచ్చరికలు పంపుతుంటుంది. అవేమిటో జాగ్రత్తగా గ్రహిస్తే అసలు రక్తపోటు రాకుండానే చాలాకాలం పాటు ఆలస్యం చేయడమో, అదే క్రమశిక్షణ పాటిస్తే దాదాపుగా నివారించడమో సాధ్యమవుతుంది. దేహం అలా హెచ్చరికలు పంపే దశను ‘ప్రీ–హైపర్టెన్షన్’ దశగా పేర్కొంటారు. నిజానికి ప్రీ హైపర్టెన్షన్ దశలోనే జాగరూకతతో వ్యవహరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలూ, మూత్రపిండాలు, మెదడు లాంటి కీలకమైన ఎండ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా నివారించుకుకోవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్టెన్షన్’ ఏమిటో చూద్దాం.రక్తనాళాల్లో రక్తం నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి తాలూకు రక్తపోటు 120/80 ఉంటే అది పూర్తిగా నార్మల్ కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిలో ఈ నార్మల్ కొలత ఖచ్చితంగా ఉండక కొంత అటు ఇటుగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉండవచ్చు. అలాగే డయాస్టోలిక్ విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉండవచ్చు. 120 /80 కి బదులుగా పైన పేర్కొన్న ఆ కొలతలు ఉంటే ఆ దశను రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అలాగని అది నార్మల్ విలువ కూడా కాదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్టెన్షన్’ దశను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు ‘హైబీపీ’ రావచ్చు. అయితే హైబీపీ నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలనూ, అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకుని, కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.ప్రీ–హైపర్టెన్షన్లో బాధితులు వెంటనే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలి. ప్రీ–హైపర్టెన్షన్ దశలోనే తమ తమ వ్యక్తిగత జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్...అధిక రక్తపోటును (హైబీపీని) సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలు, నష్టాలు వెంటనే బయటకు కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం బాధితుడికి మొదట్లో తెలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల నష్టం జరుగుతూపోతూ... దీర్ఘకాలంలో ఏవైనా అవయవాలు దెబ్బతినప్పుడు, వాటికి సంబంధించిన లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం తెలియరాదు. కొన్నిసార్లు నష్టం జరిగిపోయాక మాత్రమే అప్పుడది హైబీపీ వల్ల జరిగిన అనర్థమని తెలుస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.హైబీపీకి కారణాలు.. హైబీపీకి నివారించలేనివీ, నివారించదగినవనే రెండు రకాల కారణాలుంటాయి.నివారించలేని కారణాలు:పెరుగుతున్న వయసు, కుటుంబంలో వంశపారంపర్యంగా హైబీపీ ఉన్న మెడికల్ హిస్టరీ వంటివి నివారించలేని కారణాలని చెప్పవచ్చు.నివారించదగిన కారణాలు:ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం (స్థూలకాయం), ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, పొగాకు నమలడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు నివారించదగిన కారణాలు. ఈ సూచనలు పాటించండి... – కేవలం ప్రీహైపర్టెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు నివారించదగిన కారణాలను తెలుసుకుని అవి ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలు పాటించాలి.– జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే సోడియమ్ మోతాదులు పెరగకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం.– ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం కంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం.– మాంసాహారంలో వేట మాంసం కంటే వైట్ మీట్ అయిన చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవడం.– అదనపు బరువును ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం.– ఎప్పుడూ కూర్చుని ఉండే పనుల్లో ఉండేవారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీ–హైపర్టెన్షన్ దశలోనే జాగ్రత్తవహిస్తే అధిక రక్తపోటును చాలాకాలం పాటు నివారించుకోవచ్చు. దాంతో గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చు. -
Health: నెక్ పెయిన్కు.. కొన్ని లైఫ్స్టైల్ అలవాట్లే కారణాలని తెలుసా!
సాధారణంగా మధ్యవయస్కుల్లో కనిపించే మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు టీనేజర్లలో అంతగా కనిపించకపోవచ్చు. కానీ వాళ్లలోనూ అవి కనిపించేందుకు అవకాశం లేకపోలేదు. ఇటీవల మాత్రం టీనేజర్లలో మెడనొప్పి కేసులు చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ ఒంచి మొబైల్ చూస్తూ ఉండటం, అదే కాకుండా ఆ వయసులోని పోష్చర్కు సంబంధించిన లైఫ్స్టైల్ అలవాట్లూ ఇందుకు కారణం. ఉదాహరణకు... స్కూళ్లూ / కాలేజీలలో చాలాసేపు మెడవంటి రాసుకుంటూ, చదువుకుంటూ కూర్చునే ఉండటం, సరైన భంగిమ(పోష్చర్)లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు వాళ్లలో మెడనొప్పికి కారణమవుతుంటాయి. ఆ సమస్యలనుంచి విముక్తి ఎలాగో తెలుసుకుందాం.కేవలం కూర్చునే పోష్చర్ లాంటి అలవాట్లే కాకుండా... కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెడనొప్పి రావచ్చు. ఉదాహరణకు చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వచ్చే అవకాశముంది.నివారణ కోసం...– స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో / తమ ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.కంప్యూటర్ల వాడకం లేదా వీడియో గేమ్స్లో పోష్చర్ సరిగా లేకుండా కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాలపై ఒత్తిడి సరిగా పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి.ఒకప్పుడు టీనేజీ పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసిపోయేలా ఆటలాడేవారు. కానీ ఇటీవల ఆటలాడటం తగ్గిపోయింది. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు తమ వర్కవుట్స్తో సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. తగినంత వ్యాయామం చేయడం లేదా బాగా ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... దాంతో వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలకు లేత ఎండ తగిలేందుకు ఆరుబయట ఆటలాడేలా తల్లిదండ్రులు చూడాలి. పోష్చర్ సరిచేసుకోవడం, ఆటలాడటం / వ్యాయామం తర్వాత కూడా మెడనొప్పి వస్తుంటే ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం మంచిది. -
Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి?
నా వయసు 41. ఎటువంటి మందులు వాడకుండానే గర్భం వచ్చింది. అనారోగ్య సమస్యలేమీ లేవు. కానీ అందరూ బాగా భయపెడుతున్నారు. ఇంటి దగ్గర్లోని చిన్నాచితకా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుకన్య, కరీంనగర్ఈ రోజుల్లో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో గర్భం దాల్చేవారు పదిమందిలో ఒకరుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. వందలో పదిమందికి హై బీపీ రావచ్చు. బీపీ అదుపు కాకపోతే‘ప్రీఎక్లాంప్సియా’ అనే సమస్య ప్రతి వందమందిలో ఇద్దరికి ఎదురవుతుంది. ఇది తల్లికి, బిడ్డకి ప్రమాదం.ఇలా బీపీ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం, ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ మూడవ నెల నుంచి తీసుకోవడం లాంటివి సహాయపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో డయాబెటిస్ రిస్క్ కూడా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువ ఉండొచ్చు. ఈ సమస్యను తొందరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే తల్లికి, బిడ్డకి ప్రమాదం. డయాబెటిస్ గుర్తించకుండా, దానికి చికిత్స తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో ఉండే లోపాలు 5వ నెల స్కాన్ తీసినప్పుడు బయటపడతాయి. నలభైల్లో వచ్చే గర్భంలో బీపీ, సుగర్, బరువు చూసి తగిన జాగ్రత్తలు అనుసరించాలి.రక్తసంబంధీకుల్లో సుగర్, బీపీ ఉన్న చరిత్ర గలవారు నలభైల్లో గర్భం దాల్చాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగానే అన్ని చెకప్లు చేయించుకుని ప్లాన్ చేసుకోవాలి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రెగ్నెన్సీలో ప్రమాదానికి దారి తీస్తుంది. గడ్డకట్టిన రక్తం బ్రేక్ అయితే అది రక్తప్రసరణలో కలసి ఊపిరితిత్తులు, గుండెలో అడ్డంకి ఏర్పడి ప్రాణానికి ప్రమాదం కలుగజేస్తుంది. దీనిని పల్మనరీ ఎంబ్రాలిజమ్ అంటారు. అయితే నలభైలో గర్భం దాల్చిన వారికి ఇది పదింతలు ప్రమాదం. అందుకే దీనిని అరికట్టడానికి ముందుగానే మందులు మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా ఒక నివారణే.కంప్రెషన్ స్టాకింగ్స్ తొడుక్కోవాలని సూచిస్తారు. ప్రమాద అంచనా అనేది గర్భధారణ సమయంలోనూ, ఆ తరువాత కూడా చేస్తారు. రోజుకి 6–8 గ్లాసుల నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. గుండె పట్టేసినట్టు, రక్తపు వాంతులు అవుతున్నా, ఆయాసం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల నలభైల్లో వచ్చే గర్భంలో బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. 6వ నెల నుంచి ప్రతి రెండు వారాలకి పొత్తికడుపు కొలతలను చూస్తారు. నెలకోసారి స్కాన్ చేసి, బిడ్డ ఎదుగుదలను అతి దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు.ఇంక ప్రసవ సమయం కూడా బిడ్డ ఎదుగుదలను బట్టి నిర్ణయిస్తారు. చాలాసార్లు 37 వారాలకే డెలివరీ చెయ్యాల్సి వస్తుంది. 37 వారాల తర్వాత బిడ్డ కడుపులోనే ఉంటే వెయ్యిలో ఇద్దరికి మనకు తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి. అందుకే డాక్టర్ సలహా మేరకు అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసులో నార్మల్ డెలివరీ చెయ్యాలా లేక సిజేరియన్కి వెళ్లాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. డెలివరీ సమయంలో ఎనస్థీషియా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం మంచిది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన డాక్టర్లు ఉన్న చోట డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి వాళ్లే చూసుకుంటారు.నియోనాటాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి. చాలాసార్లు ముందస్తుగా డెలివరీ అవ్వడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండే అవకాశాలుంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉండే ఆసుపత్రులను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేస్తారు. ఈ రోజుల్లో నలభై పైబడిన వారిలో కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు.హెల్త్ ట్రీట్: సీఫుడ్ రసాయనాలతో వంధ్యత్వం!సీఫుడ్లోని రసాయనాలతో వంధ్యత్వం సహా నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ‘పెర్ అండ్ పోలీఫ్లూరోఆల్కైల్ సబ్స్టన్సెస్ (పీఎఫ్ఏఎస్) అనే రకానికి చెందిన ఈ వందలాది రసాయనాలు ఎక్కువగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్ ద్వారా శరీరంలోకి చేరి, శాశ్వతంగా తిష్ట వేసుకుంటున్నాయని, వీటి కారణంగా మహిళల్లో వంధ్యత్వం, రకరకాల క్యాన్సర్లు, నవజాత శిశువుల్లో శారీరక లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని న్యూహాంప్షైర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.సీఫుడ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల పరిసరాల్లో కొళాయిల ద్వారా సరఫరా అయ్యే మంచినీటిలోను, వాటి పరిసరాల్లో పండే తిండిగింజల్లోను కూడా పీఎఫ్ఏఎస్ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఈ రసాయనాల మోతాదు మిగిలిన పదార్థాల కంటే సీఫుడ్లో మరింత ఎక్కువగా ఉంటున్నట్లు రుజువైంది. ముఖ్యంగా కాడ్, సాల్మన్, స్కాలప్, ట్యూనా వంటి చేపల్లోను, సముద్రపు రొయ్యల్లోను, పీతల్లోను పీఎఫ్ఏఎస్ రసాయనాలు ప్రమాదకరమైన పరిమాణంలో ఉంటున్నాయని, ఇకపై వీటిని తినే ముందు జనాలు కాస్త ఆలోచించుకోవాలని న్యూహాంప్షైర్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన మేగన్ రోమానో హెచ్చరిస్తున్నారు.పీఎఫ్ఏఎస్ పదార్థాలు మట్టిలో కలసిపోవాలంటేనే వేలాది సంవత్సరాలు పడుతుందని, అలాంటిది ఇవి శరీరంలోకి చేరితే, వాటి వల్ల తలెత్తే అనర్థాలను ఊహించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రపు రొయ్యలు, పీతల్లో అత్యధికంగా ప్రతి గ్రాములోను 1.74–3.30 నానోగ్రాముల మేరకు పీఎఫ్ఏఎస్ పదార్థాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు లాబొరేటరీ పరీక్షల్లో గుర్తించారు. ప్లాస్టిక్లోను, అగ్నిమాపక రసాయనాల్లోను ఎక్కువగా ఉండే పీఎఫ్ఏఎస్ రసాయన పదార్థాలు మానవ శరీరంలోకి మోతాదుకు మించి చేరుకుంటే, వంధ్యత్వం సహా నానా అనర్థాలు తప్పవని వారు చెబుతున్నారు.– డా. భావనా కాసుఇవి చదవండి: అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!? -
Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్ ఆలోచనలతో నిండి, మైండ్ మొద్దుబారి, బ్లాంక్గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురంమీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.డిప్రెషన్ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండటీనేజ్లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్ డిజార్డర్ లేదా అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్! -
Health: ఇది సాధారణమే! చలికాలంలో తరచుగా జలుబు..
నాకు 5వ నెల. చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ మందులు వేసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? – మాధురి, జగ్గంపేటజలుబు అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సాధారణం. జలుబు, ఫ్లూ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మాములుగా జలుబుకి ఆవిరి తీసుకోవడం, పై పూతగా ఏమైనా రాసుకోవడం, పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ జలుబుతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఫ్లూ లక్షణాలు అని అర్థం. అప్పుడు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమంది గర్భిణీలకు వాతావరణంలోని మార్పులతో ఇబ్బందులు ఎదురవుతాయి. యాంటీ వైరల్ మాత్రలు కుడా వాడాల్సి వస్తుంది. త్వరగా చికిత్స అందకపోతే కొందరిలో అది న్యూమోనియాగా మారుతుంది. దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ మార్పుల వల్ల, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు.హై యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి వస్తుంది. ఫ్లూ కారణంగా ముందస్తు డెలివరీ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో మీరు ఉన్న పరిసరాల్లో ఎవరో ఒకరికి జలుబు, ఫ్లూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు నిరోధించడం చాలా కష్టం. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏ నెలలోనైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వారిలో ఫ్లూ తాలూకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిరూపణ అయ్యింది. సరైన పోషకాహారం, నిద్ర, రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ముక్కులో వేసుకునే ్రడాప్స్ మంచివి కావు. డీకంజెస్టంట్ (కఫం పోయేలా చేసే) ఉన్న మందులు కూడా వాడకూడదు.ఫ్లూ వచ్చినప్పుడు చేసే చికిత్సతో కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మీకు 5వ నెలలో చేసే టిఫా స్కాన్లో బిడ్డ ఎదుగుదల తెలుస్తుంది. ఒక వేళ ఫ్లూ ఎక్కువ ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే వెల్ బీయింగ్ స్కాన్ అదనంగా చేస్తారు. మీకు జలుబు మాత్రమే ఉంటే ఒకటి రెండువారాల్లో తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడినీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ముక్కు మూసుకుపోయి, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం లాంటివి ఉండి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి.మీకు షుగర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులున్నా, వాటి తాలూకు ఇబ్బందులు ఎదురైనా డాక్టర్ని కలసి, వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఒకటి రెండు వారాల వరకూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు. చేతులను ముక్కు, కళ్ల వద్ద పెట్టుకోకూడదు. చేతులను శు్రభంగా కడుక్కోవాలి. మాస్క్ వాడటం కూడా మంచిది. ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గదు. అందుకే రాకముందే ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫీవర్ ఉంటే డాక్టర్ని కలసి మందులు వాడాలి.హెల్త్ ట్రీట్.. పీసీఓఎస్తో తిండి సమస్యలు..?మహిళల్లో రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తిండి సమస్యలకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. పీసీఓఎస్తో బాధపడే మహిళలు బులీమియా (తిన్న తర్వాత బరువు పెరిగిపోతామన్న ఆందోళనతో బలవంతంగా వాంతి చేసుకోవడం), బింజ్ ఈటింగ్ (నియంత్రణ లేకుండా నిరంతరం తినడం) వంటి సమస్యలకు కూడా లోనవుతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. తొమ్మిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పీసీఓఎస్తో బాధపడే 28,922 మంది మహిళలపైన, ఈ సమస్య లేని 2,58,619 మంది మహిళలపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ అంశమై శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.ఈ పరిశోధన సారాంశాన్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ సంచికలో ప్రచురించారు. ఆహారం తినడంలో సమస్యలకు లోనయ్యే పీసీఓఎస్ మహిళలపై జరిపిన పరిశోధనల్లో మరికొన్ని అంశాలూ బయటపడ్డాయి. వీరిలో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి అసలే రాకపోవడం, అండాశయం పైపొరపై పూర్తిగా పరిపక్వం కాని అండాలు ఏర్పడటం, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే, పీసీఓఎస్తో బాధపడే మహిళల్లోనే ఆహారం తినే అంశంలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లోని కేలీ గయోర్ఫీ, అవా సానెత్ల ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. – డా. భావన కాసు -
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య! ప్రశాంతమైన నిద్రపట్టాలంటే..?
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు పది శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ముప్పయి నుంచి అరవై శాతం మంది ప్రజలు తరచు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ఇవే కాకుండా, కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడేవారు, కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా నిద్రలేమితో బాధపడేవారిలో ఉన్నారు.సాధారణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతున్నారంటే, రకరకాల బయటి ఒత్తిళ్లు అందుకు కారణమవుతాయి. అంతేకాకుండా, ఆహారపు అలవాట్లు కూడా నిద్రను దూరం చేస్తాయి. ప్రశాంతమైన నిద్రపట్టాలంటే, నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటమే క్షేమమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి దారితీసే ఇతరేతర కారణాలను విడిచిపెడితే, ఆరోగ్యవంతుల్లో నిద్రలేమికి సర్వసాధారణంగా ఆహార పానీయాలే కారణమవుతుంటాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెరీ మాహ్ నిద్రలేమికి దారితీసే ఆహార, పానీయాల గురించి పలు అంశాలను విపులంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...నిద్రను దూరం చేసేవి ఇవే!మద్యం, కెఫీన్తో కూడిన కాఫీ, టీ, సాఫ్ట్డ్రింక్స్ వంటి పానీయాలు, వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటోలు, టమాటోలతో తయారు చేసిన పదార్థాలు నిద్రను చెడగొడతాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, నిద్రపట్టడం కష్టమవుతుంది. వీటి వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి, కడుపు మంట, ఉబ్బరం ఇబ్బంది పెడతాయి. ఫలితంగా కునుకు పట్టని పరిస్థితి ఎదురవుతుంది. చాలామందికి రాత్రి భోజనం తర్వాత మిఠాయిలు తినడం, ఐస్క్రీమ్ తినడం అలవాటు. నిద్ర పట్టకుండా ఉంటే, కొందరు అదే పనిగా పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తింటూ ఉంటారు. ఇలాంటివి నిద్రను మరింతగా చెడగొడతాయి. రాత్రిపూట ఏం తింటే కడుపు తేలికగా ఉంటుందో, ఎలాంటి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయో జాగ్రత్తగా గమనిస్తూ తినడం అలవాటు చేసుకోవాలి. కడుపులో గడబిడకు దారితీసే పదార్థాలను పడుకునే ముందు తినడం ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల నిద్రలేమితో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి. – నిద్రలేమికి దారితీసే పదార్థాల్లో కెఫీన్కు మొదటి స్థానం దక్కుతుంది. రాత్రివేళ కాఫీ, టీ, కెఫీన్ ఉండే సాఫ్ట్డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు.– రాత్రి భోజనంలో మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు, బాగా పుల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కలిగి, నిద్రలేమి తలెత్తుతుంది.– రాత్రిపూట నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, కీరదోసకాయలు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల త్వరగా బ్లాడర్ నిండి, మూత్రవిసర్జన అవసరం వల్ల నిద్రాభంగం అవుతుంది.– రాత్రిపూట తీపిపదార్థాలు తినడం మంచిది కాదు. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రను చెడగొడుతుంది. రాత్రిభోజనంలో బఠాణీలు, డ్రైఫ్రూట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఫలితంగా సరిగా నిద్రపట్టదు.ఆలోచనలకు కళ్లెం వేయాలి..శరీరం ఎంతగా అలసిపోయినా, మనసులో ఆలోచనల పరంపర కొనసాగుతున్నప్పుడు నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఆలోచనలకు కళ్లెం వేయాలంటారు డాక్టర్ షెరీ మాహ్. ఆలోచనల వేగానికి కళ్లెం వేయడానికి ఆమె ఏం చెబుతున్నారంటే– నిద్రపోవడానికి పక్క మీదకు చేరినప్పుడు పడక గదిలో మసక వెలుతురుతో వెలిగే బెడ్లైట్ తప్ప మరేమీ వెలగకూడదు. పక్క మీదకు చేరిన తర్వాత పది నిమిషాల సేపు మనసులో రేగే ఆలోచనల వేగానికి కళ్లెం వేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కాళ్లు, చేతులను సాగదీయాలి. గాఢంగా ఊపిరి తీసుకుని, నెమ్మదిగా విడిచిపెడుతుండాలి. ఈ చర్యల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం మొదలై చక్కగా నిద్ర పడుతుంది. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే, మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం, చేయవలసిన పనులను జాబితాలా రాయడం వంటి పనులు మనసుకు కొంత ఊరటనిచ్చి, నెమ్మదిగా నిద్రపట్టేలా చేస్తాయి.దీర్ఘకాలిక నిద్రలేమితో అనర్థాలు..ఆధునిక జీవన శైలిలోని ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అభద్రత, దీర్ఘకాలిక వ్యాధులు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నిద్రలేమికి దారితీస్తాయి. తరచు విమానయానాలు చేసేవారిలో జెట్లాగ్ వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారితేనే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.– నిద్రలేమి వల్ల చురుకుదనం లోపించి, పనితీరు మందగిస్తుంది.– వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.– మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కుంగుబాటు, ఆందోళన పెరుగుతాయి.– దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.– రాత్రిపూట నిద్రపట్టక అదేపనిగా చిరుతిళ్లు తినే అలవాటు వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.నిద్రలేమిని అరికట్టాలంటే!కొద్దిపాటి జాగ్రత్తలతొ నిద్రలేమిని తేలికగానే అధిగమించవచ్చు. నిద్రపోయే పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే, నిద్రలేమిని జయించవచ్చు. · రాత్రి తేలికపాటి భోజనం మాత్రమే చేయాలి. · ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి – పడకగదిలో విపరీతమైన వెలుగు, రణగొణ శబ్దాలు లేకుండా చూసుకోవాలి.– పడకగది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.– ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది.– అలాగని నిద్రపోయే ముందు అతిగా వ్యాయామం చేయడం తగదు.– ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రపట్టకుంటే, పక్క మీద నుంచి లేచి కాసేపు కూర్చుని మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది. తిరిగి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించినప్పుడు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.మంచి నిద్రకు దోహదపడే పదార్థాలు..– నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనల్లో రుజువైంది.– చక్కని నిద్ర కోసం అరటిపండ్లు తీసుకోవడం కూడా మంచిదే! అరటిపండ్లలో నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.– ద్రాక్షలు ‘మెలటోనిన్’ను సహజంగా కలిగి ఉంటాయి. నిద్రపోయే ముందు ద్రాక్షలను తినడం వల్ల కూడా చక్కని నిద్రపడుతుంది.కొన్ని రకాల ఆహార పానీయాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు వీటిని రోజువారీగా తీసుకుంటున్నట్లయితే, నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైన నిద్రకు దోహదపడే పదార్థాలు ఇవి:– నిద్రపోయే ముందు వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజలు తీసుకోవడం మంచిది. వీటిలో ‘ట్రిప్టోఫాన్’, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.– రాత్రిభోజనంలో పొట్టుతీయని బియ్యం, గోధుమలు, ఇతర చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా, నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్ను శరీరం పూర్తిగా శోషించుకునేలా చేస్తాయి.– రాత్రిభోజనం తర్వాత ఐస్క్రీమ్ల బదులు పెరుగు తినడం మంచిది. పెరుగు తిన్నట్లయితే, శరీరంలో నిద్రకు దోహదపడే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.– అలాగే, ‘ట్రిప్టోఫాన్’ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్ వంటివి రాత్రిభోజనంలో తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, వీటిని వండటంలో మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే, ప్రయోజనం దెబ్బతింటుంది.మంచి నిద్రకు... మంచి ఆహారం!నిద్రకీ ఆహారానికీ సంబంధం ఉంది. కొన్ని ఆహారాలు నిద్రలేమికి కారణం కావచ్చు. కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఆ మసాలాలలోని స్టిములెంట్స్ రక్తప్రసరణ వేగాన్ని పెంచడం నిద్రలేమికి దారితీయవచ్చు. అందుకే మంచి నిద్రపట్టాలంటే తక్కువ మసాలాలతో, పోషకాలతో కూడిన తేలికపాటి సమతులాహారాన్ని తీసుకోవడం మేలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాఫీ లేదా టీ తీసుకున్న తర్వాత అందులోని హుషారు కల్పించే కెíఫీన్, క్యాటెచిన్ వంటి ఉత్ప్రేరకాలు నిద్రను దూరం చేస్తాయి. గ్రీన్ టీ వంటి వాటిల్లోని ఎపిగ్యాలో క్యాటెచిన్, క్యాటెచిన్ ఎపిగ్యాలేట్ వంటివీ నిద్రకు శత్రువులే. కేవలం కాఫీ టీలలోనే కాకుండా ఎనర్జీ డ్రింక్స్, కోలా డ్రింక్స్లోనూ కెఫీన్ ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల తర్వాత కెఫీన్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్లోని హుషారును కలిగించే ప్రభావ సమయం చాలా ఎక్కువ. అందువల్ల అది నిద్రలేమిని కలిగించే అవకాశమూ ఎక్కువే! ఇక పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ స్వాభావికంగానే నిద్రపోయేలా చేస్తుంది. గుడ్లలోని తెల్లసొన, చేపలు, వేరుశనగలు, గుమ్మడి గింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అవీ కొంతవరకు సహజ నిద్రను అందిస్తాయి. – డాక్టర్ కిషన్ శ్రీకాంత్, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్ను సంప్రదించడం మంచిది. -
వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!
దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.దోమలు కలిగించే వ్యాధులు..దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్ ఎన్సెఫలిటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.మలేరియా..ఈ వ్యాధి అనాఫలిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.చికెన్ గున్యా..ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.డెంగీ..డెంగీకి కూడా ఎడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.డెంగీని నిరోధించే వొబాకియా..వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దోమల నివారణ మార్గాలు..దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.అపోహలు, వాస్తవాలు..అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టంవాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.వాస్తవం: దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.మరిన్ని మశక విశేషాలు..గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి. -
హెల్దీ డైట్: సగ్గుబియ్యం పొంగనాలు..
పోషకాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం వంటి విటమిన్స్ ఆరోగ్యానికి పుష్కలంగా దొరికే వంటకం ఇది. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం..కావలసినవి..సగ్గుబియ్యం – అర కప్పు (గంట సేపు నానబెట్టాలి);పనీర్ తురుము – 75 గ్రాములు;వేరుశనగపప్పుల పొడి– 3 టేబుల్ స్పూన్లు;క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు;బంగాళదుంప – 1 (ఉడికించి తొక్క తీసి చిదమాలి);జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి– టీ స్పూన్;మిప్రో్పడి– టీ స్పూన్;ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;క్యాబేజ్ తరుగు – ము΄్పావు కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు (రెడ్, గ్రీన్ క్యాప్సికమ్);చీజ్ తురుము – 50 గ్రాములు (12 భాగాలు చేసుకోవాలి);నూనె – టీ స్పూన్.తయారీ..– ఒక పాత్రలో క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.– ఆ తర్వాత ఇందులో నూనె, చీజ్ మినహా మిగిలినవన్నీ వేసి బాగా కలిపి పన్నెండు భాగాలుగా చేయాలి.– ఒక్కో భాగంలో చీజ్ స్టఫ్ చేస్తూ గోళీలాగా చేయాలి.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో ఒక్కో చుక్క నూనె రుద్ది పొంగనాన్ని పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.– ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు కాల్చాలి.పోషకాలు (ఒక్కో పొంగనంలో)..– కేలరీలు 63;– ప్రోటీన్ – 2.5 – 3 గ్రాములు;– కార్బోహైడ్రేట్లు – 8–9 గ్రాములు;– ఫ్యాట్ – 2–3 గ్రాములు;– ఫైబర్– గ్రాము;– క్యాల్షియం – 40–50 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్స్టా్రగామ్ ఫాలోవర్స్తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్ను లేదా ఫ్రిస్బీ ప్లేట్ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
health: ఒంట్లో వేడి ఆవిర్లు తగ్గాలంటే ఏం చేయాలి?
నాకు నెలసరి ఆగి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ మూడ్ స్వింగ్స్, ఒంట్లో వేడి ఆవిర్లతో సఫర్ అవుతున్నాను. వెజైనల్ ఇచ్చింగ్ కూడా సివియర్గా ఉంది. నేను వర్కింగ్ ఉమన్ని అవడం వల్ల వీటితో చాలా ఇబ్బంది పడుతున్నాను. పరిష్కారానికి డాక్టర్ని కలవడం తప్పనిసరి అంటారా? – రాజేశ్వరి, జగ్గంపేటశరీరంలో వచ్చే మెనోపాజ్ మార్పులను తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ మొదలుపెడితే ఇంత ఇబ్బంది ఉండదు. దీని మీద ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. ప్రీ మెనోపాజ్ వచ్చినవారు కూడా ఈ దశను దాటి హ్యాపీగా ఉంటున్నారు. మెనోపాజ్ టైమ్లో శారీరకంగా, మానసికంగా, సెక్సువల్గా మార్పులు చాలా ఉంటాయి. మీరు వర్కింగ్ ఉమన్ కాబట్టి ఆ మార్పులను ఎదుర్కొంటూ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం. మీరే కాదు చాలామంది ఇలాంటి సమస్యలను గుంభనంగా భరిస్తూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించడానికి ఇబ్బందిపడుతుంటారు.కానీ ఈ ప్రాబ్లమ్స్కి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెనోపాజ్ దశ దాటిన తరువాత ఓవరీస్ పనిచేయవు. అందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల వెజైనా ప్రాంతం పొడిబారిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడతారు. 50 శాతం మందిలో ఈ మార్పు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. యూరిన్, యూటరస్, వెజైనల్ స్వాబ్స్ తీసి ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. ఇప్పుడు ఇలాంటి వాటినే ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ‘మెనోపాజ్ క్లినిక్స్’ వచ్చాయి. ఇబ్బందిపడకుండా డాక్టర్ని సంప్రదిస్తే సమస్య త్వరగా నయమవుతుంది. -
Health: ఒత్తిడి, ఆందోళనను తగ్గించే.. 5–4–3–2–1 టెక్నిక్!
అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు.. అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది. -
హెయిర్.. కేర్..! బట్టతలను దాటి విస్తరించిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్!
సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల మాత్రమే కాదు.. ఇప్పుడు శరీరంలో పలు అవసరమైన చోట్ల కేశాలను కోల్పోవడం/లేకపోవడం కూడా సమస్యలుగానే భావిస్తున్నారు. ఆధునికుల్లో సౌందర్య పోషణ పట్ల పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో అవసరమైన చోట కేశాల లేమి సమస్యలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ను అనేకమంది పరిష్కారంగా ఎంచుకుంటున్నారు.ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవలను పొందుతున్న వినియోగదారుల్లో 25–45 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మార్కెట్ 25–30శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. బట్టతలకు మాత్రమే కాకుండా కను»ొమలు, మీసాలు, గెడ్డం కోసం కూడా మగవారు అలాగే నుదుటి భాగంలో జుట్టు పలచబడటం (ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్) వంటి కారణాలతో మహిళలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ను ఆశ్రయిస్తుండటంతో ఈ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది.యూనిట్ వారీగా వ్యయం..ఒకచోట నుంచి హెయిర్ స్ట్రిప్ కట్ చేసి చేసే ఎఫ్యుటి, స్ట్రిప్తో సంబంధం లేకుండా చేసేది ఎఫ్యుఇ పేరిట రెండు రకాల ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతులున్నాయి. కేశాలనేవి ఒకటిగా కాకుండా 3, 4 చొప్పున మొలుస్తాయి కాబట్టి వాటిని ఫాలిక్యులర్ యూనిట్గా పిలుస్తారు. ఒక్కో యూనిట్ను పర్మనెంట్ హెయిర్ ఉన్న చోట నుంచి తీసి అవసరమైన చోట అమర్చడానికి యూనిట్కు రూ.50 నుంచి రూ70 వరకూ వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బట్టతల సమస్య పరిష్కారానికి కనీసం రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుపెట్టాలి. కను»ొమలు తదితర చిన్నచిన్న ట్రాన్స్ప్లాంటేషన్ తక్కువ వ్యయంతో రూ.10, రూ.15వేల వ్యయంతో గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే తలభాగం మీద పూర్తిస్థాయిలో చేయాలంటే ఒక పూట నుంచి ఒక రోజు మొత్తం క్లినిక్లో ఉండాల్సి రావొచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ అనంతరం కొంత కాలం అధిక టెంపరేచర్కు గురికాకుండా జాగ్రత్తపడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేమితో అనర్థాలు...తక్కువ రెమ్యునరేషన్తో సరిపుచ్చడానికి.. పలు క్లినిక్లు అర్హత లేని వ్యక్తుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దీంతో శరీరంపై మచ్చలు పడటం, బేసి వెంట్రుకలు, జుట్టు అపసవ్యంగా పెరగడం దగ్గర నుంచీ తీవ్రమైన ఇన్ఫెక్షన్, జుట్టురాలడం వరకు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి రావొచ్చు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెర్మటాలజిస్ట్లకు సైతం అత్యవసరంగా శిక్షణ ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం సరైన నిపుణుల పర్యవేక్షణలో జరిగే చికిత్సలు ఖచి్చతంగా సురక్షితమే.అరకొర శిక్షణతో.. నో..హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన సౌందర్య ప్రక్రియలను నిర్వహించడానికి యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ ఫారమ్లలో శిక్షణ వీడియోలను చూస్తే సరిపోదని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తేల్చి చెప్పింది. సర్జికల్ అసిస్టెంట్/టెక్నీíÙయన్లు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) పర్యవేక్షణలో ఇవి చేయాలని సూచించింది. సౌందర్య ప్రక్రియలేవీ అత్యవసర శస్త్రచికిత్స కిందకురావు. శిక్షణ లేని వ్యక్తి చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.వైద్యంతో పరిష్కారం కాకపోతేనే..వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో ఎలా ఉన్నా మిగిలిన చోట్ల ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్లే ముందు తప్పకుండా వైద్య పరమైన పరిష్కారం అన్వేíÙంచాలి. ఉదాహరణకు కను»ొమ్మలు కోల్పోతే.. అల్ట్రా వయెలెంట్ లైట్ వినియోగించి మాగి్నఫైయింగ్ లెన్స్లను వినియోగించి దానికి కారణాన్ని గుర్తించాలి. చికిత్సకు అవకాశం ఉంటే చేయాలి. లేని పక్షంలోనే ట్రాన్స్ప్లాంటేషన్ ఎంచుకోవాలి. అవకాశం ఉంటే కొన్ని మందులు అప్లై చేసి చూస్తాం. స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా వినియోగిస్తాం.. ఎల్ఎల్ ఎల్టి, లో లెవల్ లోజర్ థెరపీతో కూడా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. సమస్యను సరైన విధంగా నిర్ధారించి అవసరం మేరకు చికిత్స చేసే అర్హత కలిగిన వైద్యుడి దగ్గరే చేయించుకోవాలి. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.– డా.జాన్ వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ -
కాలు బెణికితే RICE! చేయాల్సిన ప్రథమచికిత్స ఇదే!
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).– I అంటే ఐస్ప్యాక్ పెట్టడం. ఐస్క్యూబ్స్ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.బ్యూటిప్స్..ఫేషియల్ మసాజ్..– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. -
గుడ్ హ్యాబీ.. బీ హ్యాపీ!
క్రాస్ఫిట్లో టైర్లను విసరడం, సుడోకు పజిల్ను పూర్తిచేయడం లేదా కిచెన్లో వండటం.. ఇలా నచి్చన హాబీని ఎంజాయ్ చేయడం కాలక్షేపం మాత్రమే కాదు అవి ఆరోగ్య క్షేమం కూడా అని వైద్యులు చెబుతున్నారు. న్యూజిలాండ్లోని ఒక అధ్యయనంలో సృజనాత్మకత వెలికితీసే కార్యకలాపాల్లో దీర్ఘకాలం పాటు పాల్గొనడం వల్ల రోగనిరోధకత పెరుగుతుందని కనుగొన్నారు. తమ హాబీల కోసం క్రమం తప్పకుండా సమయం వెచ్చించే వ్యక్తులు నిరాశకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని మానవ ఒత్తిడి హార్మోన్ కారి్టసాల్ స్థాయి తగ్గుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోడిమెన్షియాతో ఢీ.. డ్యాన్స్శరీరానికీ.. ఇటు మనసుకు ఏకకాలంలో ఆరోగ్యాన్ని అందించే వాటిలో అత్యుత్తమమైంది డ్యాన్స్. అందుకే నగరంలో వయసులకు అతీతంగా దీనినే ఎంచుకుంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన కార్డియో వర్కవుట్గా ఎముకలు కండరాలను బలోపేతం చేయడానికి డ్యాన్స్ పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అనుకోకుండా తూలి పడిపోయే కొన్ని రకాల సమస్యలు నివారించడానికి డ్యాన్స్ ఉపకరిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లోని ఒక అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ డ్యాన్స్ రొటీన్ అనేది డిమెన్షియా వ్యాధి తీవ్రతను 76 శాతం తగ్గిస్తుంది.గార్డెనింగ్.. గుండెకు మేలు..తోటపనిలో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కలుపు మొక్కలను లాగడం, మొక్కలు నాటడం వంటి సాధారణ పనులన్నీ సూక్ష్మమైన ఏరోబిక్ వ్యాయామంలా కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆరుబయట చేసే తోటపని విటమిన్ డి లోపాన్ని తొలగిస్తుంది. స్వీడన్లోని స్టాక్హోమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో గార్డెనింగ్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం 30 శాతం తగ్గుతుందని తేలింది.పెట్స్.. హార్ట్ బీట్స్శునకాల వంటి పెంపుడు జంతువులు అద్భుతమైన సహచరులు కాగలవు. వాటితో గడిపే సమయం మరింత ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. పెట్స్ గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. అవుట్ డోర్.. ఫీల్గుడ్.. హైకింగ్ నుంచి గార్డెనింగ్ వరకు, అవుట్డోర్ హాబీలు శారీరకంగా మానసికంగా సమతుల్యతతో ఉండేందుకు సహాయపడతాయి. మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫీన్ అనే రసాయనాలను శరీరంలో విడుదల చేస్తాయి. అలాగే చర్మంపై సూర్యరశ్మి మానసిక స్థితిని మెరుగుపరిచే సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చిత్రకళ.. కంటిచూపు భళా..ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఉమెన్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ప్రచురించిన అధ్యయనం పెయింటింగ్ మన దృష్టిని మెరుగుపరుస్తుందని కనుగొంది. పెన్సిల్, వాటర్ కలర్ పెయింట్ల సెట్, పెయింట్ బ్రష్లు స్కెచ్బుక్లతో పాటు రంగులు కలపడానికి పేపర్ ప్లేట్ కాన్వాస్ను సమకూర్చుకుంటే చాలు రంగులతో ఆడుకోవచ్చు.. కంటిచూపు మెరుగు పర్చుకోవచ్చు.సంగీతం.. ఔషధం..సంగీతం పలికించడం లేదా వినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సంగీతం రోగనిరోధక శక్తిని పెంచి ‘ఒత్తిడి హార్మోన్’ కారి్టసాల్ను తక్కువ స్థాయికి చేరుస్తుంది. దీనితో ఆందోళన స్థాయిలను, నిరాశను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగుల్లో మందుల కంటే సంగీతం వినడం ఆందోళనను తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. గాయాలను మాన్పే ‘రచనా’వ్యాసంగం..జ్ఞాపకశక్తి పెంచడం, ఒత్తిడి స్థాయి తగ్గించడం, మంచి నిద్ర వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను వ్యస రచన అందిస్తుంది. అంటే కథలు, వ్యాసాలు రాయాలనే అనుకోవద్దు. కేవలం తమ అనుభవాల గురించి రాయడం కేన్సర్ రోగులు కోలుకోవడానికి సహాయపడిందని అధ్యయ నాలు వెల్లడించాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం రాయడం ద్వారా గాయాలు త్వరగా నయమవుతాయని తేలింది.పఠనంతో.. ప్రశాంతత..‘చదవడానికి సమయం వెచ్చించడం మనస్సును తేలికగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతికూల అనుచిత ఆలోచనల నుంచి మనస్సును దూరంగా ఉంచుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. పఠనాసక్తిని సజీవంగా ఉంచుకుంటే నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుంది.హాబీస్ ద్వారా ఫీల్గుడ్ హార్మోన్స్.. డబ్లు్యహెచ్ఓ ప్రకారం ఆరోగ్యం అంటే శారీరకం, మానసికం, భావోద్వేగాలతో సహా అన్నింటినీ సరైన తీరులో ఉంచుకుంటేనే సమగ్రమైన ఆరోగ్యం. శాస్త్రీయంగా అధ్యయనాలు నిరూపించిన అంశం ఇది. శారీరకమైన ఆరోగ్యం కోసం నృత్యం, వాకింగ్, డ్యాన్స్ ఎరోబిక్స్, గార్డెనింగ్.. వంటివి అదేవిధంగా మానసిక ఆరోగ్యం కోసం సంగీతం, సినిమాలు, పుస్తక పఠనం.. వాటితో పాటు భావోద్వేగ భరిత ఆరోగ్యం కోసం సన్నిహితులతో కలిసి విందు, వినోదాలు, పారీ్టలు వంటివన్నీ వస్తాయి. ఒక తీవ్రమైన ఒత్తిడి తర్వాత తప్పనిసరిగా దాన్ని తొలగించే చక్కని హాబీని ఆస్వాదించడం అవసరం. ఉదాహరణకు ఓ సర్జన్గా నేను ఏదైనా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసిన తర్వాత నాకు బాగా ఇష్టమైన మంచి మ్యూజిక్ తప్పనిసరిగా వింటాను. మానసిక, శారీరక ఉల్లాసాన్ని అందించే హాబీల వల్ల ఫీల్గుడ్ హార్మోన్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అవి ఇమ్యూనిటీ లెవల్స్ని పెంచుతాయి. తద్వారా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కునే శక్తిని అందిస్తాయి.– డా. కిషోర్రెడ్డి, అమోర్ హాస్పిటల్స్ -
Neha Bhasin: ఇదీ నా వేదన..!
‘నేను ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, తీవ్రమైన కండరాల నొప్పితో బాధించే ఫైబ్రోమయాల్జియా రుగ్మతలతో బాధ పడుతున్నాను. నా వేదన మీకు చైతన్యం కలిగించాలి’ అంది నేహా భాసిన్. బాలీవుడ్లో ఎన్నో ఎన్నో హిట్ ట్రాక్స్ పాడిన గాయని నేహా ఇటీవల ఇన్స్టాలో రాసుకున్న పోస్ట్ స్త్రీల ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది. ఆమె ఏం రాసింది?‘‘నేను చెప్పాల్సింది చాలా ఉంది. అయితే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టి, ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. నేను అనుభవిస్తున్న నరకాన్ని ఎలా ఏకరువు పెట్టాలో అర్థం కావడం లేదు. నా హెల్త్ రిపోర్టుల మీద రెండేళ్ల నుంచి అని రాసి ఉన్నప్పటికీ ఈ వేదనాపర్వం నా 20వ ఏటి నుంచి కొనసాగుతోంది. ఒంటరిగా ఉండకుండా నలుగురితో... అందునా నాకిష్టమైన, నేను ప్రేమించే వ్యక్తులను కలుస్తూ, పత్రికలకు వ్యాసాలు రాస్తూ నా ఇబ్బందులను ఎంతోకొంత అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నెలనెలా వేధించే నా ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ నన్ను కొత్త చీకట్లలోకి విసిరేస్తోంది. ‘ఇది నీ వైఫల్యమేనా?’ అంటూ నా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ నన్ను వెక్కిరిస్తూ ప్రశ్నిస్తోంది. ఫైబ్రోమయాల్జియా అంటూ డాక్టర్లు చెబుతున్న ఆ సమస్య నాలో వేదనాగ్ని జ్వాలల్ని రగిలిస్తోంది. ఏళ్ల తరబడి నేను వాటిని లెక్కచేయకుండా నిన్నమొన్నటివరకూ ప్రదర్శనలిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా డాక్టర్ ‘ఇంక మీరేమీ చేయకుండి. హాయిగా విశ్రాంతి తీసుకోండి’ అంటున్నాడు.నేనిలా విశ్రాంతి తీసుకోవడం నాకే నచ్చడం లేదు. దశాబ్దాల తరబడి లెక్కచేయకుండా నెట్టుకొస్తున్న నా వేదనలు నన్ను బాధిస్తున్నప్పటికీ... నా కలలను శ్వాసిస్తూ, నా కలలకు రూపం కల్పించే సంకల్పంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను. ఇవ్వాళ నేనో వృద్ధుణ్ణి చూశాను. ఒక చేత్తో ఓ పెద్ద బరువైన పెట్టెను మోస్తూ, మరో చేతిలో గొడుగుతో కుస్తీపడుతూ ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా అతికష్టమ్మీద నా వ్యాయామశాల సోపానాల చివరి మెట్టును అధిగమించాక నన్ను చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. అతడి ఆ నవ్వు ఎలా ఉందంటే... ‘ఈ వయసుకు తీవ్రమైన నొప్పులతో నేనూ బాధపడుతున్నా. వేదనా తరంగాల దొంతరల్లో ఈదులాడుతున్నా. నేనే ఇలా ఉన్నానంటే... నీకింకా ఏమీ ముగిసిపోలేదు. జీవితానికి కృతజ్ఞురాలివై ధైర్యంగా ఉండు. నీకంటే ఎక్కువ బాధపడుతున్నవారు ఇంకా ఎందరో ఉన్నారు’ అంటూ ఉద్బోధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.అందుకే... నా బాధలూ, నా వెతలూ, నా ఆవేదనలన్నీ నా జీవితాన్ని సవాల్ చేస్తున్నప్పుడు మీ ప్రేమతో పాటు నేను రాసుకుంటున్న ఈ కొన్ని మాటల్ని సాంత్వననిచ్చే ఓ మలాముగా పులుముకుంటున్నా’’ అంటూ ముగించింది నేహా.ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్..కొందరు యువతుల్లో నెలసరి ముందుగా తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) అంటారు. అందులోని అత్యంత బాధకరమైన ఒక రకం ‘ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్’. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో డాక్టర్లు దీనికి చికిత్స అందిస్తుంటారు.అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్..పూర్తి పర్ఫెక్షన్ రాలేదంటూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ, ఎంతకీ సంతృప్తి లేక దాన్నే కొనసాగిస్తూ విసుగు కలిగించే మానసిక వ్యాధి ఇది. దీని బారిన పడితే ఆలోచనలూ, పనులూ అలా అనియంత్రితంగా సాగుతూ ఎంతకీ పని పూర్తి చేయనివ్వక బాధిస్తుంటాయి. దీనికి మానసిక చికిత్స అవసరం.ఫైబ్రోమయాల్జియా..కండరాల, ఎముకల నొప్పితో తీవ్రమైన ఒళ్లు నొప్పులతో, స్పర్శ సున్నితంగా మారి ఒంటిని ముట్టుకోనివ్వనంతగా తీవ్రమైన వేదన కలిగిస్తుందిది. మానసిక ఆందోళనలు, యాంగై్జటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ వంటి సమస్యల కారణంగా మరింత పెచ్చరిల్లే ఈ నొప్పులకు సరైన చికిత్స అవసరం. -
ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం!
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
Earth Overshoot Day 2024: ఆగస్టు1 నాటికే.. అన్నీ వాడేశాం!
భూగోళం ప్రకృతి వనరులను పునరుత్పత్తి చేసుకోగలిగే వేగం కంటే.. ప్రకృతి వనరులను మనుషులు అధిక వేగంతో వాడుకుంటూ ఉండటం వల్ల ఈ ఏడాదంతా వాడుకోవాల్సిన వనరులు ఆగస్టు1 నాటికే పూర్తిగా వాడేసుకున్నట్లు గ్లోబల్ ఫుట్ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అంటే.. రేపటి (ఆగస్టు 2) నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరూ, వాడే వనరులన్నీ ప్రకృతికి పెనుభారమే! అది తెలియజెప్పేదే ‘ఎర్త్ ఓవర్ షూట్ డే’.ఒక విధంగా చెప్పాలంటే.. మనుషులు భూగ్రహంపై పర్యావరణ వ్యవస్థలు పునరుత్పత్తి చేయగల దానికంటే 1.7 రెట్లు వేగంగా ప్రకృతివనరులను ఖర్చు చేస్తున్నారని 2024 ఎర్త్ ఓవర్ షూట్ డే సూచిస్తోంది. ఈ పర్యావరణ లోటు ఎంత ఎక్కువగా ఉంటే.. అడవుల నిర్మూలన, నేలకోత, జీవవైవిధ్య నష్టం అంత వేగంగా జరుగుతున్నట్లు లెక్క.419 పిపిఎంకి పెరిగిన సీఓ2..భూవాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 2023 నాటికి 419.3 పార్ట్స్ పర్ మిలియన్(పిపిఎం) స్థాయికి పెరిగింది. 2022 – 2023 మధ్యలో 2.8 పిపిఎం పెరిగింది. ఏడాదికి 2 పిపిఎం కన్నా ఎక్కువగా పెరగటం వరుసగా ఇది 12వ సంవత్సరం. ఈ సాంద్రత వల్లే భూ తాపం పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం గతి తప్పి.. వాతావరణం మార్పులకు లోనవుతోంది.ఎవరు లెక్కిస్తున్నారు?కెనడాలోని యోర్క్ యూనివర్సిటీ ‘ఎకలాజికల్ ఫుట్ప్రింట్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పునరుత్పత్తి సామర్థ్యాన్ని, ఏయే దేశాల్లో ప్రకృతి వనరుల వాడకం ఏ తీరులో ఉంటోందో లెక్కగడుతోంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఈ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. 1971లో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ డిసెంబర్ ఆఖరి రోజుల వరకు సరిపోతూ ఉండేది. 1973 నుంచి లోటు పెరుగుతూ వచ్చింది. 1997 అక్టోబర్ వరకు ఉండేది. ఆ తర్వాత మరింత వేగంగా పెరుగుతూ 2024 ఆగస్టు 1 నాటికే పర్యావరణ వనరుల ఖాతా ఖాళీ అయే స్థితికి చేరింది.పర్యావరణ పాదముద్ర.. ఎంతమేరకు ప్రకృతి వనరులు వాడుతూ ఉంటే అంత పర్యావరణ పాదముద్ర (ఎకలాజికల్ ఫుట్ప్రింట్) ఉంటుందన్నమాట. ఇది ప్రతి మనిషికి, ప్రతి దేశానికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికన్లలా ప్రకృతి వనరులు వాడితే 5 భూగోళాలు అవసరం అవుతాయి. అయితే ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రకృతి వనరుల వాడకంలో భారతీయులు పొదుపరులేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అందరూ మనలా ఉండగలిగితే 30% వనరులు మిగిలే ఉంటాయి.మీ పర్యావరణ పాదముద్ర ఎంత?దైనందిన జీవితంలో మనం చేసే ప్రతిపనికీ ప్రకృతి వనరులు ఎంతోకొంత ఖర్చవుతూనే ఉంటాయి. మనం చేసే పనులు, తినే ఆహారం, వాడే వాహన ఇంధనం, ధరించే వస్త్రాలు.. ఇలాంటివన్నీ మన పర్యావరణ పాదముద్ర స్థాయిని నిర్ణయిస్తాయి.జీవన శైలిని మార్చుకొని సహజ వనరుల వాడకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి పరిరక్షణకు దోహదం చేయొచ్చు.. భూతలమ్మీద వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెంపొందించే పనులు తగ్గించే పనులను చేపట్టగలిగితే ఆ మేరకు.. ఎర్త్ ఓవర్ షూట్ డేని వెనక్కి జరపగలం! ఏటేటా పెరిగిపోతున్న పర్యావరణ అప్పు భారాన్ని ఆ మేరకు తగ్గించుకోగలుగుతాం. అయితే, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) ఎలాగైనా ఏటా పెరగాల్సిందే అనే మానవాళి ధోరణితో.. ఇదెంత వరకు సాధ్యం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!ఇవి చదవండి: వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్.. వరద నీటిలో మహిళపై వేధింపులు! -
చర్మంపై మృత కణాలు పోవాలంటే.. ఇలా చేయండి!
టొమాటో రసం పావు కప్పు తీసుకుని అందులో దూది ముంచి ముఖానికి అద్దాలి. ఆరిన తర్వాత వలయాకారంగా మర్దన చేస్తూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా కాంతివంతంగా మారుతుంది. వార్ధక్య లక్షణాలుగా కనిపించే ముడతలు కూడా తొలగిపోతాయి.మృత కణాలు పోవాలంటే...బొప్పాయి గుజ్జు పావు కప్పు తీసుకుని అందులో టీ స్పూన్ పన్నీరు (రోజ్వాటర్) కలిపి ముఖానికి రాయాలి. పది లేదా పదిహేను నిమిషాలకు తేమను చర్మం పీల్చుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా ముఖమంతా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్లు చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.ఇవి చదవండి: హెల్త్ ఫ్యాక్ట్: నాన్వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..? -
జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు!
తల నుంచి మోకాలి వరకు ఉండే ఈ భంగిమను జాను శీర్షాసన అంటారు. ‘జాను’ అంటే మోకాలు ‘శీర్ష’ అంటే తల. ఈ ఆసనాన్ని వేసే ముందు మ్యాట్ పైన సుఖాసనంలో కూర్చోవాలి.ఒక కాలును ముందుకు చాపి, చేతులతో ఆ కాలిపాదాన్ని పట్టుకోవాలి. తలను మోకాలి మీదుగా ఉంచాలి. మడిచి ఉన్న రెండవ కాలుపాదం మరొక కాలును తాకినట్టుగా, ΄÷ట్ట దగ్గరగా ఉండాలి. ఈ ఆసనంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వెన్నెముక సాగినట్టుగా, దిగువ శరీరం అంతా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, ఒత్తిడి, నిరాశ, అలసటపై ప్రభావం చూపుతుంది.అధిక బరువుకు:మొదట్లో ఈ ఆసనం వేస్తున్నప్పుడు కొంత సవాల్గా అనిపిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా మెల్లగా ప్రయత్నించడం వల్ల ఈ భంగమను సాధన చేయవచ్చు. ఒక కాలును ఒకసారి రెండవ కాలును మరొకసారి 5 సార్లు మార్చుతూ చేయాలి. రోజూ పరగడపున పది సార్లు ఈ ఆసనం వేయడం వల్ల అధికబరువు, గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. రోజులో ఉండే ఒత్తిడి నుంచి కూడా త్వరగా రిలాక్స్ అవుతారు.సూచన:గర్భిణులు, హెర్నియా, ఆస్తమా, స్పాండిలోసిస్, స్లిప్డ్ డిస్క్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లేదా యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ఇవి చదవండి: నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు! -
నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు!
రాత్రివేళల్లో నిద్రపోయేముందు బ్రష్ చేసుకోడాన్ని అందరూ తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎందుకంటే మెలకువతో ఉన్నప్పుడు అందరూ తినడానికీ, మాట్లాడటానికీ... ఇలా అనేక పనుల కోసం నోటిని అనేక మార్లు తెరుస్తుంటారు. కానీ నిద్రలో కనీసం ఏడెనిమిది గంటలు నోరు మూసుకుపోయే ఉండటంతో నోట్లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా వృద్ధిచెందుతాయి.రాత్రిపూట నోటిలో ఊరే లాలాజలం కూడా చాలా తక్కువే. ఫలితంగా నోట్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి, అవి దంతాలకు హానికరమైన యాసిడ్నూ ఉత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పళ్లూ తీవ్రంగా దెబ్బతినే అవకాశం పగటి కంటే రాత్రి పూటే ఎక్కువ. అందుకే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకునే అలవాటు పళ్లకు జరిగే హానిని గణనీయంగా తగ్గించడంతోపాటు నోటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇవి చదవండి: చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? -
చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
వేరుశనగపప్పులు బూజు పట్టి, చర్మం ముడుచుకుని పోయి ఉన్నాయంటే అవి తెగుళ్ల కారణంగా విషపూరితమయ్యాయని అర్థం. ఫంగస్ సోకిన, ముడుచుకుని పోయిన వేరుశనగ పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషాల బారిన పడకుండా దేహాన్ని సంరక్షించే ప్రక్రియలో మొదటగా దెబ్బతినేది కాలేయం, వ్యాధినిరోధక వ్యవస్థ.బూజు పట్టిన పప్పులు లివర్ డ్యామేజ్కి కారణమవుతాయి. కాలేయం వాపు, మచ్చలతోపాటు పనితీరు లోపించడం, లివర్ క్యాన్సర్ వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. వీటితోపాటు తక్షణం బయటపడే అనేక ఇతర అనారోగ్యాలు, అలర్జీలు, కడుపు నొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్లో బ్రాంకైటిస్, ఆస్త్మాతోపాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పెద్ద పేగు క్యాన్సర్లకు దారితీస్తుంది. సంవత్సరాలపాటు ఆహారంలో ఇవి కొనసాగినట్లయితే నర్వస్ సిస్టమ్ కూడా బలహీనపడుతుంది. తరచూ తలనొప్పి, దేహంలో ప్రకంపనలు, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. మనం ఊహించని మరో సమస్య పునరుత్పత్తి వ్యవస్థ అపసవ్యతలకు లోనుకావడం కూడా.అందుకే వేరుశనగపప్పులనాణ్యతను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వంటల్లో వాడాలి. పప్పులను కొన్న వెంటనే పేపర్ మీద పోసి బూజుపట్టిన, ముడుచుకు పోయిన పప్పులను తొలగించి మంచి పప్పులను డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. పప్పులు సేకరించి నూనె పట్టించుకునే వాళ్లు కూడా బూజు పట్టిన పప్పులను, డొల్లగా ఉన్న పప్పులను జాగ్రత్తగా ఏరి పారేసి మంచి పప్పులతో నూనె పట్టించుకోవాలి.– సుజాత స్టీఫెన్ ఆర్.డి, న్యూట్రిషనిస్ట్ఇవి చదవండి: వంధ్యత్వం కాదు.. అంధత్వం! -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
నగరవాసుల్లో 'నోమో ఫోబియా'
ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి అదే మరో చేత్తో మనల్ని తన గుప్పిట్లోకి తెచ్చేసింది స్మార్ట్ఫోన్. అయితే సరికొత్త ధైర్యాలతో పాటు భయాలను కూడా మనకు చేరువ చేస్తోంది. సరదాలను తీర్చడంతో పాటు సమస్యలనూ పేర్చేస్తోంది. రోజంతా ఫోన్తోనే గడిపే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో నోమో ఫోబియా అనే సరికొత్త అభద్రతా భావం పెరుగుతోందని ఒప్పో కౌంటర్పాయింట్ చేసిన అధ్యయనం వెల్లడించింది.ఈ ఫోబియా తీవ్రతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1,500 మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులపై ఈ అధ్యయనం జరిగింది. అదే విధంగా నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటే... మొబైల్ ఫోన్ నుంచి దూరం అవుతానేమో అనే భయంతో పుట్టే మానసిక స్థితి అని జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్ ల మితిమీరిన వినియోగం వల్ల సంభవించే మానసిక రుగ్మతల్లో ఇది ఒకటిగా తేలి్చంది. – సాక్షి, సిటీబ్యూరోఅప్పటిదాకా చేతిలోనే ఉన్న పోన్ కాసేపు కనబడకపోతే లేదా దూరంగా ఉంటే చాలు.. నా ఫోన్ ఏది? ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా... అంటూ ఆందోళనగా, అసహనంగా, గాభరాపడిపోవడం అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుందేమో అనే కంగారుపడేవాళ్లని చాలా మందినే మనం చూస్తున్నాం. అయితే వారిలో ఇది చూడడానికి సాధారణ సమస్యగా కనిపిస్తున్నా.. అది సాధారణం కానే కాదని, ఆ సమయంలో కలిగే భయాందోళనలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.కారణం ఏదైనా సరే.. మన ఫోన్కు కొద్దిసేపైనా సరే దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికైతే ఆందోళన కలిగిస్తుందో.. తరచుగా తమ ఫోన్ను తరచి చూసుకోవడం వంటి లక్షణాలతో నోమో ఫోబియా బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రతీ నలుగురు స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ముగ్గురిని ప్రభావితం చేస్తోందని, నగరాలు/ గ్రామాలు తేడా లేకుండా ఇది దాదాపు 75 శాతం జనాభాపై దాడి చేస్తోందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. మితమే హితం..డిజిటల్ అక్షరాస్యత అందరికీ అలవడాలి. బాధ్యతాయుతమైన స్మార్ట్ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. సమస్య ముదిరితే అంతర్లీన ఆందోళన లేదా డిపెండెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. స్మార్ట్ఫోన్ వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి. అంటే ‘టెక్–ఫ్రీ’ సమయాలు లేదా ప్రాంతాలు వంటివి. శారీరక శ్రమ మానసికోల్లాసం కలిగించే ఆఫ్లైన్ కార్యకలాపాలు వంటి హాబీల్లో పాల్గొనడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఆరోగ్యంపై దు్రష్పభావం.. నోమోఫోబియాతో ఆందోళన, శ్వాసకోశ మార్పులు, వణుకు, చెమట, ఆందోళన, అయోమయ స్థితి వగైరాలు కలుగుతున్నాయి. అలాగే నిద్రలేమి, ఏకాగ్రత లేమి, నిర్లక్ష్యాన్ని ప్రేరేపించి వ్యక్తిగత సంబంధాలను విస్మరించేలా చేస్తుంది. కారణం ఏదైనా సరే.. స్మార్ట్ఫోన్లపై అతిగా ఆధారపడటం వల్ల ముఖ్యమైన అప్డేట్లు, సందేశాలు లేదా సమచారాన్ని కోల్పోతారనే భయంతో వ్యక్తులు ఈ ఫోబియాకు గురవుతున్నారు.అధ్యయన విశేషాలివీ..– నో మొబైల్ ఫోబియానే షార్ట్ కట్లో ‘నోమో ఫోబియా‘గా పేర్కొంటున్నారు. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ ఫోన్ దగ్గర లేకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది.– అధ్యయనంలో పాల్గొన్న స్మార్ట్ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది తమ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు రకరకాల మానసిక అసౌకర్యాలకి గురవుతున్నారని అధ్యయనం తేలి్చంది. ఆ సయమంలో వీరిలో ఆందోళన, ఆత్రుత, డిస్కనెక్ట్, నిస్సహాయత, అభధ్రత భావాలు ఏకకాలంలో ముప్పిరిగొంటున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాటరీ పనితీరు సరిగా లేదనే ఏకైక కారణంతో 60 శాతం మంది తమ స్మార్ట్ఫోన్లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది.– ఈ విషయంలో మహిళా వినియోగదారుల (74 శాతం మంది)తో పోలిస్తే పురుష వినియోగదారులు (82 శాతం మంది) ఎక్కవ సంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అధ్యయనంలో తేలింది.– ఫోన్ ఆగకూడదనే ఆలోచనతో 92.5 శాతం మంది పవర్–సేవింగ్ మోడ్ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సైతం ఉపయోగిస్తున్నారని తేలి్చంది.– ‘ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో బ్యాటరీ గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. తర్వాత స్థానంలో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు’ అని రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.సాంకేతికత రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, నోమోఫోబియా, దాని అనుబంధ సవాళ్లను పరిష్కరించడం ఒక క్లిష్టమైన అంశం కాబోతోంది. ఆరోగ్యకరమైన సాంకేతికత అలవాట్లను పెంపొందించడం స్మార్ట్ఫోన్లతో కాకుండా వ్యక్తుల మ«ధ్య సంబంధాలను శక్తివంతం చేయడం వంటివి నోమోఫోబియా ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి. -
ఐవీఎఫ్తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండడం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగు నీరు కలుషితం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలోనూ ప్రజలు సహరించాలని కోరారు. దోమల ఉత్పత్తిని తగ్గించడానికి, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.కలుషిత నీటి నివారణ కోసం క్లోరినేషన్ చేసిన లేదా కాల్చి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవద్దని, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సంబంధిత ఆస్పత్రిని, వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. -
కుటుంబాన్ని మింగేసిన గీజర్ : ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
వేడి నీటి కోసం ఉపయోగించే గీజర్నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కారణంగా హైదరాబాద్లోని సనత్ నగర్కు చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఆధునిక కాలంలో దాదాపు ప్రతీ ఒక్కరూ తమ వాష్ రూములలో చిన్నా, పెద్దా గీజర్లను వాడుతున్నారు. పైగా ఇపుడు వర్షాకాలం కూడా కావడంతో స్నానానికి వేడి నీటిని వాడటం ఇంకా అవసరం. ఈ నేపథ్యంలో గీజర్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వాటర్ హీటర్ మీ ఇంటికి సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోవాలి. వాటర్ హీటర్ చాలా పెద్దది లేదా చాలా చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనెక్షన్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. నీళ్లు తొందరగా చల్లారిపోకుండా అదనపు మందపాటి ఇన్సులేషన్ వాడాలి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. వేడి నీటి హీటర్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా సెట్ చేయకూడదు. హాట్ వాటర్ హీటర్ నాబ్లు , బటన్లు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పిల్లలకు దూరంగా ఉండాలి.టెస్ట్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్: అధిక ఒత్తిడి , అధిక ఉష్ణోగ్రతల విషయంలో మీ వాటర్ హీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్, రిపేర్ వంటివి ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా, సర్వీస్ టెక్నీషియన్ ద్వారానే మరమ్మత్తు చేయించడం ఉత్తమంగ్యాస్ గీజర్లో బ్యూటేన్ , ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ను లాంటి హాని కరమైన వాయువులు విడుదలౌతాయ్. ఇవి శ్వాసకోస సమస్యలను పెంచుతాయ్. తలనొప్పి, వికారం లాంటి సమస్యలొస్తాయి. అందుకే బాత్రూమ్లో గీజర్ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ను కూడా అమర్చాలి. లేదా గాలి, వెలుతురు ఉండేలా అయినా జాగ్రత్త పడాలి.ముఖ్యంగా వర్షాకాలంలో గీజర్ ఆన్లోనే ఉండగానే షవర్ బాత్ చేయకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాదు, వీలైతే వేటి నీటిని బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసి తరువాత మాత్రమే స్నానానికి వెళ్లడం ఇంకా ఉత్తమం.ఎలక్ట్రిక్ హీటర్లు పర్యావరణానికి నష్టం కూడా. హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిది. అలాగే హీటర్లను వినియోగించేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండాలి. -
రొటీన్ చెకప్ స్కాన్లో రెండు ఓవరీస్లో సిస్ట్స్ ఉన్నాయి... ఏం చేయాలి?
నాకు 45 ఏళ్లు. రొటీన్ చెకప్ స్కాన్లో రెండు ఓవరీస్లో 3 సెం.మీ, 5 సెం.మీ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని భయంగా ఉంది. – రుబీనా, గాజులరామారంఆ వయసులో చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఓవరీస్లో సిస్ట్స్ ఫామ్ కావచ్చు. ఆ ఏజ్లో అంటే మెనోపాజ్కి ముందు క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ. సింపుల్ సిస్ట్స్ అయితే అసలు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆ సిస్ట్స్ 5 సెం.మీ కన్నా ఎక్కువుంటే చిన్న కీహోల్ సర్జరీ ద్వారా సిస్ట్ని మాత్రమే తీసేసి టెస్టింగ్కి పంపిస్తారు. ఓవరీస్ నుంచి 2– 3 సెం.మీ సైజులో ప్రతినెలా అండాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు ఇంకాస్త పెద్ద సైజులో కూడా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.3 సెం.మీ కంటే ఎక్కువ ఉంటేనే సిస్ట్ అంటాము. ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటాయి. అవి సింపుల్ సిస్ట్స్. కొంతమందికి బ్లడ్ ఫిల్ అయిన సిస్ట్స్ ఉంటాయి. వాటిని ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ అంటారు. డెర్మాయిడ్ సిస్ట్లో ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. మీరు ఇంటర్నల్ పెల్విస్ స్కాన్ చేయించుకోండి. అందులో సిస్ట్ సైజ్, దాని తీరు స్పష్టంగా తెలుస్తాయి. ఏ సింప్టమ్ లేకుండా ఈ సిస్ట్స్ చాలామందిలో స్కానింగ్లోనే తెలుస్తాయి. అప్పుడు వాటి నేచర్ని బట్టి సైజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. పదిలో ఒకరికి మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది.కొంతమందికి కింది పొట్టలో నొప్పి, లైంగికంగా కలసినప్పుడు నొప్పి, యూరినరీ ప్రాబ్లమ్స్, మోషన్ డిఫికల్టీస్ ఉండవచ్చు. అలాంటి వారికి వెంటనే కొన్ని రక్తపరీక్షలు చెయ్యాలి. ఫ్యామిలీ హిస్టరీని కూడా డీటేయిల్డ్గా తీసుకుంటారు. సిస్ట్ వల్ల సమస్య ఉందని తేలితే క్లోజ్ ఫాలో అప్లో డాక్టర్ మీకు విషయాన్ని వివరిస్తారు. చాలా సిస్ట్లకు వెయిట్ అండ్ వాచ్ పాలసీయే సూచిస్తారు. మీకున్న సింప్టమ్స్, బ్లడ్ రిపోర్ట్స్, సైజ్ని బట్టి ఎంత తరచుగా స్కాన్స్ ద్వారా రీచెక్ చెయ్యాలో చెప్తారు. సిస్ట్ సైజ్ 5–7 సెం.మీ ఉన్నప్పుడు ఏడాదికి ఫాలో అప్ ఉంటుంది. ఏడాదికి మళ్లీ స్కాన్ చేయించుకోమని సూచిస్తారు. 7 సెం.మీ కన్నా ఎక్కువ ఉంటే ఎమ్మారై స్కాన్ చేయించుకోమంటారు. ఈ దశలో సర్జరీని సజెస్ట్ చేస్తారు.మీ వయసుకి ఓవరీస్ని పూర్తిగా తీసేయడం మంచిది కాదు. 50–52 ఏళ్ల వరకు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ చాలా అవసరం. అందుకే లాపరోస్కోపీ ద్వారా కేవలం సిస్ట్ని మాత్రమే తీసేస్తారు. ఒకవేళ ఆ సిస్ట్ మెలికపడి పక్కనున్న బవెల్, బ్లాడర్ మీదికి స్ప్రెడ్ అయిన కొన్ని అరుదైన కేసెస్లో ఓవరీస్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. మీరొకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఇంటర్నల్ స్కాన్ చేసి డీటేయిల్డ్గా చూస్తారు.ఇవి చదవండి: స్కాన్లో ఓవరీస్లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా? -
స్కాన్లో ఓవరీస్లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా?
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ పెయిన్ సివియర్గా ఉంటోంది. స్కాన్లో ఓవరీస్లో చాకొలేట్ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. వీటివల్ల ప్రమాదమేమైనా ఉంటుందా? – కునాలిక, వైజాగ్ఇవి కొన్నిసార్లు గర్భసంచి పొరలోని టిష్యూ పెల్విస్లో ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా మీద పెరుగుతాయి. పీరియడ్స్ టైమ్లో గర్భసంచిలో బ్లీడింగ్ అయినట్టే వేరేచోట కూడా బ్లీడ్ అయ్యి సిస్ట్స్ పెయిన్ వేస్తాయి. పీరియడ్స్లో పొట్టలో నొప్పి, యూరిన్లో, మోషన్లో లోయర్ బాడీ అంతా నొప్పి ఉండొచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణమేమీ లేదు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్స్కి సంబంధించిన కారణాలు ఉంటాయి.ఇవి పదిమందిలో ఒకరికి ఉంటాయి. ఎమ్మారై స్కాన్లో కన్ఫర్మ్గా ఇది ఎండోమెట్రియాసిస్ అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ని వాడాల్సి వస్తుంది. పారాసిటమాల్, ట్రామడాల్ లాంటివి బాగా పనిచేస్తాయి. మీ ఏజ్ గ్రూప్ వారికి హార్మోన్ పిల్స్ బాగా పెయిన్ రిలీఫ్ని ఇస్తాయి. ఇవి ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ లేదా చాకొలేట్ సిస్ట్స్ని కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి. కంబైన్డ్ ఓరల్ కంట్రాసెప్టివ్ పిల్స్ని క్రమం తప్పకుండా నెలంతా వేసుకోవాలి.ఈ మాత్రలతో వికారం, తలనొప్పి వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. 3 నుంచి 6 నెలల్లో మినిమమ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాకొలేట్ సిస్ట్స్ సైజ్ 5 సెం.మీ కన్నా ఎక్కువున్నా, హార్మోన్స్ పనిచేయకపోయినా లాపరోస్కోపీ సర్జరీ సూచిస్తారు. ఈ సిస్ట్స్ని తీసేసిన తరువాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవుతుంది. కానీ రికరెన్స్ అంటే మళ్లీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. క్లోజ్ ఫాలో అప్ స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో కావాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.కొంతమందికి GnRH analogue ఇంజెక్షన్స్ ఇస్తారు. సర్జరీ తరువాత కూడా కొందరికి వీటిని సజెస్ట్ చేస్తారు. లాపరోస్కోపీ సర్జరీలో సిస్ట్స్ని తొలగించి.. ఏమైనా ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఉంటే వాటిని కూడా fulgurate చేస్తే పెల్విక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు క్లోజ్ ఫాలో అప్లో ఉండాలి.ఇవి చదవండి: ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా? -
కిచెన్ టిప్స్.. ఇక కల్తీ కథ కంచికే!
కల్తీ... కల్తీ... కల్తీ. కల్తీ లేని వస్తువు కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. బతకాలంటే రోజుకు మూడుసార్లు తినాలి. హోటల్లో తిందామంటే పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వంటల్లో రంగులేస్తారు. ఇంట్లో శుభ్రంగా వండుకుని తిందామంటే... వంట దినుసులు కల్తీ. మిరప్పొడి కొందామంటే అందమైన ప్యాకింగ్ మీద నోరూరించే ఎర్రటిరంగు ఫొటో ఉంటుంది.లోపల మిరప్పొడి ఏ రంగులో ఉందో కనిపించదు. ఇంటికి తెచ్చి ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక్కోసారి రంపం పొట్టులా, ఇటుక పొడిలా నిర్జీవంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఎర్రటి ఎరుపుతో ఇది కారంపొడేనా లేక గోడలకేసే రంగా అన్నంత చిక్కగా ఉంటుంది. మనం దాదాపుగా వంటల్లో రోజూ వాడే ఐదు దినుసులను ఎలా పరీక్షించుకోవచ్చో చూద్దాం.మిరప్పొడి: ఒక కప్పు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ మిరప్పొడి వేయాలి. మిరప్పొడి నీటిమీద తేలుతూ ఉండి రేణువులు నీటిని పీల్చుకుంటూ మెల్లగా మిరప్పొడి మొత్తం కప్పు అడుగుకు చేరుతుంది. కల్తీ మిరప్పొడి అయితే నీటిలో వేయగానే అడుగుకు చేరుతుంది. అంతేకాదు, కప్పు అడుగుకు చేరేలోపు రంగు వదులుతూ నీటిని ఎర్రగా మారుస్తుంది.ఇంగువ: ఇంగువకు మండే గుణం ఎక్కువ. ఇంగువ కల్తీని తెలుసుకోవడానికి అదే మంచి గీటురాయి కూడా. ఇంగువను చిన్న ముక్క తీసుకుని మంట మీద పెడితే వెంటనే మంట అంటుకుని ఇంగువ ముక్క మండిపోతుంది. కల్తీ ఇంగువ అయితే వెంటనే మండదు. మంట మీద పెట్టి వెలిగించే ప్రయత్నం చేసినా సరే వెలగకుండా మాడిపోతుంది. ఇంగువ పొడి కొనేవాళ్లకు కూడా ఇదే చిట్కా. చిన్న పేపర్ మీద పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాగితాన్ని వెలిగించాలి. కాగితంతోపాటే ఇంగువ కూడా మంటను ఆకర్షిస్తే అది అసలైన ఇంగువ. కాగితం మండిపోయి ఇంగువ పొడి నల్లబారి సరిగా మండకపోతే అది కల్తీ ఇంగువ అని అర్థం.మిరియాలు: మిరియాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే... బొ΄్పాయి గింజలను కలుపుతారు. ఒక కప్పు నీటిలో టీ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు బరువుగా ఉంటాయి నేరుగా నీటి అడుగుకు చేరతాయి. బొ΄్పాయి గింజలు తేలిక. కాబట్టి అవి నీటిలో తేలుతాయి.జీలకర్ర: జీలకర్రలో ఏ గింజలు కలుపుతారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ అసలు జీలకర్ర, అందులో కలిపిన గింజలు ఒకేరకంగా కనిపించడానికి కొద్దిగా నల్లరంగు కలుపుతారు. జీలకర్రను పావు టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసి బాగా రుద్దాలి. చేతులకు నలుపు అంటితే కల్తీ జీలకర్ర అని అర్థం.పసుపు: పసుపుకు కూడా రంగులద్దుతారు. అర టీ స్పూన్ పసుపును కప్పునీటిలో వేయాలి. మిరప్పొడి వలెనే ఇది కూడా నీటిని పీల్చుకుంటూ మెల్లగా నానుతూ అడుగుకు చేరుతుంది. రంగు కలిపిన పసుపు అయితే నీటి అడుగుకు చేరే లోపే రంగు వదులుతుంది. వేసిన వెంటనే నీరు చిక్కటి పసుపురంగులోకి మారుతాయి. -
ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టడంలేదు!
విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.కానీ విజయ్కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.నిద్రలేమికి కారణాలు..- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి. - షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. - యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..- స్లీప్ ఆప్నియా, రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.మంచి అలవాట్లతో మంచి నిద్ర..మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి. - రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి. - కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి. - నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు. - పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. - గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. - ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్ను కలవడం తప్పనిసరి. - నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. - లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. - ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఎవరి నిద్ర వారిదే..నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. - త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు. - గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. - ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. - పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం..
వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఇదే. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామానికి తోడు రోజువారీ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.రోజువారీ ఆహారం..ఉదయం రెండు ఇడ్లీలు లేదా 60 గ్రాముల గింజ ధాన్యాలు లేదా 25 గ్రాముల పప్పులతో 150 మిల్లీ లీటర్ల పాలు తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల సమయంలో ఏదో ఒక పండు, నిమ్మరసం లేదా జామకాయ తింటే మేలు. ఇవేవీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసు పాలైనా తాగాలి. మధ్యాహ్నం భోజనంలో 75 గ్రాముల గింజ ధాన్యాలు, ఆకుకూరలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు 50 గ్రాముల గింజ ధాన్యాలతో చిరుతిండి, ఒక కప్పు పాలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా రెండు చపాతీలు లేదా పుల్కాలు కూరగాయలతో తినాలి. ఒకవేళ కూరగాయ, పెరుగు వద్దనుకుంటే 100 గ్రాముల మాంసాహారం తీసుకోవచ్చు.నీరు.. పాలు..పరిశ్రుభమైన నీటినే తాగాలి. ఎత్తు, బరువుకు సరిపడా నీరు తాగితే 50 శాతం రుగ్మతలు దరిచేరవు. ఎక్కువగా కాచి వడబోసిన నీటినే తీసుకోవాలి. నీటితో పాటు పాలు కూడా చాలా అవసరం. రోజుకు 250 ఎం.ఎల్. పాలు తాగాలి. కాఫీ, టీ అలవాటు ఉన్న వారు రోజుకు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ తీసుకోకపోవడమే శ్రేయస్కరం.పప్పు ధాన్యాలు కీలకంఆహారంలో పల్లీలు, మినుములు, శనగలు, బాదం పప్పు వంటివి ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూర కనీసం 100 గ్రాములు తీసుకోవాలి. జామ, నిమ్మ, ఉసిరి ఏదో ఒక దానిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ ఉడికించిన గుడ్డు, వారంలో ఒకసారి చికెన్, మటన్ తినాలి.తాజా పండ్లు, కూరగాయలు మేలు..ప్రతిపూట భోజనానికి ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజ రంగులో ఉండే పండ్లు కొన్నిరకాల దీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పండ్లను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.వీటికి దూరంగా ఉండాల్సిందే..నిల్వ చేసిన ఆహారం, తీపి పదార్థాలు తీసుకోరాదు. బయట దొరికే రెడీమేడ్ ఆహారం, ఉప్పుతో కూడిన ఆహారం, కూల్డ్రింక్స్, ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.జలుబు నివారణకు..ఈ కాలంలో ఎక్కువగా పీడించేవి జలుబు, దగ్గు, ఆయాసం. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం మిరియాలు, అల్లం, వెల్లుల్లి బాగా ఉపయోగపడతాయి. వీటిని అవసరం మేరకు వేడినీరు, పాలు, టీలో ఏదేని ఒకదానిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.మంచి ఆహారంతో ఆరోగ్యంఆహారం బాగా ఉడికించి తినాలి. ఏ, సీ, డీ, కే విటమిన్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంధత్వంతో పాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోస సంబంధ వ్యాధులను నివారించేందుకు ఏ విటమిన్ బాగా పని చేస్తుంది. తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారెట్, మునగాకు, మామిడి, బొప్పాయి, గుమ్మడి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇలా చేస్తే రోగకారకాలను నియంత్రించవచ్చు. – బాలాజీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి -
Beauty Tips: అందానికి 'ఓట్లు'..
ఓట్స్ ఆరోగ్యపోషణతోపాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. ఓట్స్తో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో చూద్దాం.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్పౌడర్లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిక్స్ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతమవుతుంది.మొటిమలు తగ్గాలంటే టేబుల్ ఓట్స్ పౌడర్లో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును ఓట్స్ పీల్చుకోవడం వల్ల మొటిమలు వాడిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నాలుగు వారాల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ సహజమైన బ్లీచ్. చర్మాన్ని తెల్లబరుస్తుంది. మృదువుగా మారుతుంది కూడా.ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, బాదం ΄÷డి టేబుల్ స్పూన్, తేనె టేబుల్ స్పూన్, పాలు లేదా పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి, మెడకు పట్టించి వలయాకారంలో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు చర్మకణాల్లో పట్టేసిన మురికి వదులుతుంది. ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వేస్తుంటే ప్రత్యేకంగా స్క్రబ్ క్రీమ్లు, బ్లీచ్లు వాడాల్సిన అవసరం ఉండదు.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ΄÷డి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు ఉన్నవాళ్లు బాదం ఆయిల్ లేకుండా ప్యాక్ వేసుకోవచ్చు.ఇవి చదవండి: Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం! -
పెయిన్కిల్లర్స్ అబ్యూజ్..! పెయిన్ తగ్గించడమా? ప్రాణసంకటమా?
మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్ కిల్లర్స్ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్ అప్సెట్), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్ అల్సర్స్) రావచ్చు.అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.హైపర్టెన్షన్ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్ కిల్లర్స్ వల్ల రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.కిడ్నీలపైన: కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్కిల్లర్ టాబ్లెట్స్లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్కిల్లర్స్ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్ వంటì వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం – చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్కు తెలపాలి.దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... – పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. – అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. – కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి. – పెయిన్ కిల్లర్స్ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు -
ప్రెగ్నెన్సీలో కాఫీ తాగడం.. ఎంతవరకూ మంచిదంటే?
నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్గా అసాధ్యం.కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: దాని కోసం.. ప్లాన్ చేస్తున్నాం! కానీ..
నాకిప్పుడు 35 ఏళ్లు. ఏడాదిగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం. అయినా రాలేదు. ప్రెగ్నెన్సీ కోసం ఏయే టెస్ట్లు చేయించుకోవాలో సజెస్ట్ చేయగలరా? – జయంతి శ్రీరాం, తునిప్రెగ్నెన్సీ కోసం ఏడాది ప్లాన్ చేసుకుంటే సాధారణంగా పదిమందిలో ఎనిమిది మందికి సక్సెస్ అవుతుంది. మీ వయసు 35 ఏళ్లు అంటున్నారు కాబట్టి కొన్ని టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది.. అంతా బాగానే ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం. టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే వారానికి 2–3 సార్లు .. నెల మధ్యలో అంటే మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత 11వ రోజు నుంచి 25వ రోజు వరకు భార్యాభర్తలిద్దరూ కలవాలి. మీ బీఎమ్ఐ (మీ హైట్, వెయిట్ రేషియో) 30 దాటినా, అధిక బరువున్నా.రిపీటెడ్ యాంటీబయాటిక్స్ , స్టెరాయిడ్స్ లాంటివి వాడినా, సర్వైకల్ లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గర్భధారణ ఆలస్యమవుతుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మూడు నెలల ముందు నుంచే వాడటం మొదలుపెట్టాలి. పాప్స్మియర్, రుబెల్లా టెస్ట్లు చేయించుకోవాలి. మీకు, మీవారికి మెడికల్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్, బీపీ, సుగర్ లాంటివి ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచాలి. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే మీకు, మీవారికి ఏయే టెస్ట్లు అవసరమో చెప్తారు.అన్నీ నార్మల్గానే ఉంటే పిల్లల కోసం ఆరు నెలల నుంచి ఏడాది ప్రయత్నించమని సూచిస్తారు. ఒకవేళ సెమెన్ అనాలిసిస్లో ఏదైనా సమస్య ఉన్నా, మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి నుంచి మూడు నెలలలోపు అన్నీ సర్దుకుంటాయి. ట్రాన్స్వెజైనల్ స్కాన్ ద్వారా మీ గర్భసంచి, అండాశయాలు ఎలా ఉన్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేవా? ఫాలోపియన్ ట్యూబ్స్ తెరుచుకునే ఉన్నాయా లేవా? అని చూస్తారు. కొంతమందికి అన్నీ నార్మల్గానే ఉన్నా రెండేళ్లలో గనుక ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. 36 ఏళ్ల వయసు దాటుతున్నప్పుడు ఐయూఐ లేదా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ 5 ఎక్సర్సైజ్లతో.. మీ ఓవర్ థింకింగ్కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్సైజ్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్సైజ్లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
జుట్టు రాలడం.. బరువు తగ్గడం జింక్ లోపం కావచ్చు!
మన శరీరానికి జింక్ చాలా అవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే జింక్ లభిస్తుంది. శరీరం జింక్ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.అకారణంగా జుట్టు రాలుతున్నా, బరువు తగ్గుతున్నా, గాయాలు త్వరగా నయం కాకపోతున్నా జింక్ లోపం గా అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.గాయాలు నయం కాకపోవడం..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.బరువు తగ్గడం..జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేకమైన ఇతర ఆరోగ్యసమస్యలూ ఉత్పన్నమవుతాయి.జుట్టు రాలడం..జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.తరచూ జలుబు..జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది.చూపు మసక బారడం..ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. చూపు మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి.అయోమయం..మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.సంతానోత్పత్తిపై ప్రభావం..జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.రోగనిరోధక శక్తి బలహీనం..శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.ఇలా నివారించాలి..జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లలో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జింక్ లోపం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.ఇవి చదవండి: వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..?? -
వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
నవపాకాలతో అన్నం వడ్డించినా, చివరలో పెరుగన్నం తినకుండా ఆ భోజనం పరిపూర్ణం అనిపించుకోదు. ఎందుకంటే పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా పెరుగు ΄÷ట్టకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రోటీన్, కాల్షియం,ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల పెరుగు వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు చాలా పదార్థాలను పెరుగుతో కలిపి తింటూ ఉంటారు. అయితే, పెరుగుతో కలిపి తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి తినడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుతో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో... ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.పెరుగు, చేపల మిశ్రమం ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేదం ప్రకారం, చేప, పెరుగు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కలయికతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.సిట్రస్ పండ్లు... పెరుగు: ఇప్పటికే కాస్త పుల్లగా ఉండి, నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి పెరుగు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పిని కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండూ ప్రోటీన్ కు మంచి మూలాధారాలు. అయితే వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ΄÷త్తికడుపులో భారాన్ని, గ్యాస్ను కలిగిస్తుంది.ఉల్లిపాయ, పెరుగు: వీటి కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తుంది.పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.ఇవి చదవండి: ఆరోగ్యమే ఆనందం.. -
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్లో బ్లాక్స్తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.జీర్ణ సమస్యలు..కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.కిడ్నీవ్యాధులు..మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.బీపీ, షుగర్..మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.కాలేయ సంబంధ వ్యాధులు..లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్వాష్లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త! -
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్షీట్ను నీట్గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
Beauty Tips: పాదాల రక్షణకై.. సింపుల్గా ఇలా చేస్తే చాలు..
మారుతున్న సీజన్ కారణంగా మన చర్మం పొడిబారటం, చీలికలు ఏర్పడటం జరుగుతంది. ముఖ్యంగా పాదాల విషయంలో ఈ సమస్య తరుచుగా కనిపిస్తుంది. పాదాల రక్షణకై వంటింట్లోనే ఉండే పదార్థాలతో వాటిని అందంగా మార్చాలంటే ఇలా చేయండి..!మూడు నిమ్మకాయలు, టేబుల్ స్పూన్ చక్కెర, టీ స్పూన్ బాదం నూనె, పది నుంచి పదిహేను పుదీన ఆకులు తీసుకోవాలి.నిమ్మకాయలను ముక్కలు చేయాలి.పుదీన ఆకులు, నిమ్మకాయ ముక్కలను (తొక్కతో సహా) మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులో చక్కెర, బాదం నూనె కలిపితే పాదాలకు స్క్రబ్ రెడీ.దీనిని పాదాలు, మడమలు, వేళ్ల మధ్య పట్టించి ఆరిన తర్వాత చేత్తో ఐదు నుంచి పది నిమషాల సేపు వలయాకారంగా మర్దన చేసి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.ఇది అన్ని కాలాల్లోనూ అవసరమే.వర్షాకాలంలో పాదాలు నాని ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడానికి ఈ స్క్రబ్లో చిటికెడు పసుపు కలుపుకోవాలి.ఇవి చదవండి: సాగుకు భరోసా..! -
జీర్ణాశయాన్ని బాధించే.. ఈ సమస్యలోంచి బయటపడాలంటే?
జీర్ణాశయాన్ని బాధించే సమస్యలలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అనే రెండూ ప్రధానమైనవి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి రావడమనే ఇబ్బంది తప్ప ‘ఐబీడీ’లాగా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేమీ ఉండవు. ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, దానిని అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తినీ తినగానే వెంటనే టాయ్లెట్కు పరుగెత్తాలనిపించడం లేదా బయట ఎక్కడైనా తినాల్సి వస్తే అలా తినడానికి ముందే మరుగుదొడ్డి ఎక్కడుందో వెతుక్కోవాల్సి రావడం ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (ఐబీఎస్)లో ప్రధాన సమస్య. అందుకే ఈ సమస్య ఉన్నవారు బయట లంచ్ చేయడానికీ, ఎవరి ఇంటికైనా అతిథిగా హాజర య్యేందుకూ, విహార యాత్రలకు వెళ్లడానికీ వెనకాడుతుంటారు. అయితే మరికొందరిది దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. వాళ్లను మలబద్ధకం వేధిస్తుంటుంది.ఈ అంశం ఆధారంగా ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’లో నాలుగు రకాలుంటాయి.ఐబీఎస్ రకాలు:– ఐబీఎస్ – డయేరియా (ఐబీఎస్–డీ): నీళ్లవిరేచనాలతో కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – కాన్స్టిపేషన్ (ఐబీఎస్–సీ): మలబద్ధకంతో పాటు కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – మిక్స్డ్ (ఐబీఎస్ – ఎమ్): కొన్నిసార్లు నీళ్లవిరేచనాలూ, మరికొన్నిసార్లు మలబద్ధకం... ఈ రెండు ఇబ్బందులూ మార్చి మార్చి వస్తుండడం. – ఐబీఎస్ – అన్–ఐడెంటిఫైడ్ (ఐబీఎస్–యూ): లక్షణాలు స్థిరంగా ఉండక మారుతుంటాయి.కారణాలు: నిర్దిష్టమైన కారణాలు లేవు. అయితే, జీర్ణాశయానికీ, మెదడుకు మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ లోపాలే ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా భావిస్తుంటారు. దాంతోపాటు పేగుల కదలికలలో లోపాలు, జీర్ణాశయపు నరాల్లో అతి చురుకుదనం, జీర్ణాశయం (గట్) బ్యాక్టీరియాలో మార్పుల వల్ల వచ్చే తేడాలు, కొందరిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత, మరికొందరిలో కొన్ని రకాల ఆహారాలు సరిపడక΄ోవడం, బాల్యంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం వంటివి.లక్షణాలు:– విరేచనానికి వెళ్లగానే కడుపులోని ఇబ్బంది తొలగి΄ోవడం– లవిసర్జనలో విరేచనం అయ్యాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్– కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం– మలంలో బంక.నిర్ధారణ:– లక్షణాలను బట్టి నిర్ధారణ చేస్తారు.– కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్షతో పాటు జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరుగుతోందేమో తెలుసుకోవడం కోసం ‘హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్’ అనే పరీక్ష.చికిత్స:పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో పాటు‘లో–ఫోడ్మ్యాప్’ఆహారం.లో–ఫోడ్మ్యాప్ ఆహారం అంటే...‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్’అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూ΄÷ందించారు. ఆహారాల్లోని ΄ోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెరలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. ఆ ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...తీసుకోవాల్సిన ఆహారాలు... అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్; అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొ΄్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ; క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ్ర΄÷టీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్లో పల్లీలు, వాల్నట్స్.తీసుకోకూడనివి...పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పియర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.పాటించాల్సినవి...– నీళ్లు ఎక్కువగా తాగడం, క్రమబద్ధమైన వ్యాయామం, కంటినిండా నిద్ర ∙లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే... మలబద్ధకం ఉన్నవారికి లాక్సెటివ్స్ అనే విరేచనకారి మందులూ, నీళ్లవిరేచనాలు అయ్యేవారికి యాంటీ డయేరియల్ మందులు, అవసరాన్ని బట్టి కొందరికి యాంటీ డిప్రెసెంట్స్, ఇంటెస్టినల్ స్పాజమ్స్, క్రాంప్స్ తగ్గించే మందులూ వాడాల్సి రావచ్చు. – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ఇవి చదవండి: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే? -
వామ్మో.. మైనర్ల డ్రైవింగ్! జర జాగ్రత్త!!
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని పోలీస్ శాఖ విస్తృత ప్రచారం జనం చెవికెక్కడం లేదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఎక్కడా మార్పు కనిపించటం లేదు.పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా వినడం లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగదని జనం అభిప్రాయపడుతున్నారు.సోమవారం కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిస్తూ ‘సాక్షి’ కంటపడగా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
నేచురల్గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?
నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరాఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్ ఉండాలి. పాజిటివ్గా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని డీల్ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ రావచ్చు.బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్ పెరగొచ్చు. అయితే కరెక్ట్ డయాగ్నసిస్, ట్రీట్మెంట్తో వీటిని మేనేజ్ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్ పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్ వ్యాధి రిస్క్ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్లో యూరిన్లో సుగర్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ యూరిన్లో సుగర్ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్ సుగర్ టెస్ట్ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్ కన్సల్టేషన్తో మేనేజ్ చేస్తారు.సుగర్ కంట్రోల్ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ వస్తాయి. రెగ్యులర్గా బిడ్డ ఎదుగుదలను చెక్ చేస్తే స్కాన్స్ని రిఫర్ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్ చేస్తారు. బీపీ, సుగర్ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మానెయ్యాలి. ఇన్ఫెక్షన్స్ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్ని తగ్గించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో.. గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా?
నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సివియర్ గ్యాస్ట్రైటిస్తో డాక్టర్ దగ్గరకి వెళితే Hiatus Hernia అని డయాగ్నోస్ చేశారు. నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దీనివల్ల ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువవుతాయా? మందులు వాడకూడదు అంటారు కదా.. మరి ప్రెగ్నెన్సీలో గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా? – పేరు, ఊరు రాయలేదు.Hiatus Hernia అనేది చాలా కామన్. మామూలుగా పొట్టకి, ఆహారనాళానికి మధ్య డయాఫ్రమ్ అనే రెస్పిరేటరీ కండరం.. జంక్షన్ని టైట్గా క్లోజ్ చేసి పెడుతుంది. ఈ గ్యాప్ వదులైనప్పుడు పొట్టలోని యాసిడ్స్ ఆహారనాళంలో పైకి వచ్చి గ్యాస్, ఎసిడిటీ, వాంతులను ప్రేరేపిస్తాయి. అధిక బరువు, ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్లో ఈ గ్యాప్ ఎక్కువై గ్యాస్ ప్రాబ్లమ్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది వీక్ కూడా కావచ్చు.ప్రెగ్నెన్సీలో యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఇప్పటి నుంచే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీని మేనేజ్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో మందులు వాడే అవసరం తగ్గించుకోవాలి. ఎసిడిటీని పెంచే ఆహారం అంటే ఆరేంజ్ జ్యూస్, టొమాటో సాస్, సోడా వంటివి అవాయిడ్ చేయాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, వెనిగర్, చాక్లెట్స్, కాఫీలు తగ్గించాలి. కొంచెం కొంచెం ఆహారాన్ని నెమ్మదిగా.. ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకుండా.. మూడు నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తల కింద ఎత్తు పెట్టుకుని పడుకోవాలి. రాత్రి భోజనం పెందరాళే ముగించాలి. స్కాన్ చేసి.. హెర్నియా పెద్దగా ఉందని కనుక చెబితే.. కొంతమందికి డాక్టర్లు సర్జరీని సూచిస్తారు. లాపరోస్కోప్ ద్వారా చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో గుండెలో మంట, ఎసిడిటీ ఎక్కువుంటే సురక్షితమైన కొన్ని సిరప్లు, జెల్స్, మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు.మొదటి మూడునెలల్లో వీటి అవసరం ఎక్కువుంటుంది. యాంటాసిడ్ జెల్స్ చాలావరకు రిలీఫ్నిస్తాయి. జీవనశైలి మార్పులతోనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. నెలలు నిండే కొద్ది ముఖ్యంగా చివరి మూడు నెలల్లో బిడ్డ బరువుతో ఈ ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీకి ఇబ్బంది కలగొచ్చు. అలాంటప్పుడు భోజన వేళలను సర్దుబాటు చేసుకోవడంతో పాటు డైటీషియన్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.గుండెకు బలం..ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్గా ఉంచుతుంది.కండరాలు బలంగా ఉంటాయి..ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! -
కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి!
రాత్రిపూట మంచి నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఏ బాత్ రూమ్కో వెళ్లాల్సి వచ్చి కాలు కింద పెడదామని చూస్తే అడుగు ముందుకు పడదు. పిక్కలు, కండరాలు పట్టేసినట్లుంటుంది. చాలామందికి ఇదొక బాధాకరమైన అనుభవం. అంతేనా.. మండుటెండలో చెమట పట్టేలా కష్టపడుతున్నప్పుడు ఉన్నట్లుండి తొడ కండరాలు పట్టేసి విపరీతమైన బాధతో కుంటుతూ నడవాల్సి వస్తుంతది. ఒక్కోసారి మంచి చలికాలంలో వేళ్లు కొంకర్లుపోయినట్లుగా అయి΄ోయి ఎంత ప్రయత్నించినా అవి అలాగే బిగుసుకు΄ోయి బాగా నొప్పితో పళ్ల బిగువున బాధను అణిచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. దీనినే కండరాలు పట్టెయ్యడం లేదా మజిల్ క్రాంప్స్ అంటారు. దీనికి కారణాలు, నివారణోపాయాలను తెలుసుకుందాం.మనం శారీరక శ్రమ చేసినప్పుడు చెమటతో పాటు ఉప్పు రూపంలో సోడియమ్ ను కూడా చాలా వరకూ కోల్పోతాం. సోడియమ్ తగ్గడం వల్ల శరీరంలోని కండరాలు...ముఖ్యంగా పిక్క, తొడ, భుజం కండరాలు పట్టేసినట్లుగా నొప్పికి గురవుతాయి. అందుకే చాలామందికి ఎండాకాలంలో తరచూ ఈ సమస్య ఎదురవుతుంది. వేసవికాలంలో ఆటగాళ్లు చాలామంది ఈ సమస్యకు గురవుతుంటారు. ఇంకా కొందరిలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా సోడియమ్ను కోల్పోతారు. అలాంటివారిలో కూడా ఒళ్లు నొప్పులు రావడం, నీరసపడి΄ోవడం జరుగుతుంది.కారణాలు...మహిళల్లో చాలామంది కుటుంబ సభ్యులకు తినిపించడంలోనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, తాము తినడానికి రెండో ్రపాధాన్యత ఇస్తుండటం వల్ల వారికి తగిన క్యాల్షియం, ఇతరపోషకాలూ సరిగా అందక ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా... థైరాయిడ్..మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల వచ్చే వ్యాధిని హై΄ోథైరాయిడిజమ్ అంటారు. హై΄ోథైరాయిడ్ ఉన్నవారికి మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా రావచ్చు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే ఎక్కువ దూరం పరుగెత్తలేరు. మహిళలకైతే రాత్రి సమయంలో పిక్కలు నొప్పిపెడుతుంటాయి. మగవారు కూడా ఎక్కువ దూరం నడవలేరు.శరీరం ద్రవాలు కోల్పోవడం..సాధారణంగా శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల కండరాలు అకస్మాత్తుగా బిగుసుకు΄ోతాయి. వాంతులు, విరేచనాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, శారీరక శ్రమ వల్ల కూడా ఇలా కావచ్చు. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళన, పని ఒత్తిడి, టైట్ షెడ్యూల్స్, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు మజిల్ క్రాంప్ సమస్య అధికంగా ఉంటుంది.నివారణ..వేసవిలో వచ్చే మజిల్ క్రాంప్స్ నివారణకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నుండి ద్రవాలను కోల్పోకుండా చూసుకోవాలి.ఒకవేళ ఎక్కువగా ద్రవాలను కోల్పోయే పరిస్థితి ఉంటే నిమ్మకాయ రసంలో ఉప్పు కలుపుకుని తాగడం లేదా కొబ్బరినీళ్లు తాగడం... ఈ రెండూ అందుబాటులో లేక΄ోతే కనీసం కాసిని మంచి నీరు తాగడం. తాజాపండ్లు తినడం మంచిది.క్యాల్షియమ్ లోపం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తుంటే క్యాల్షియమ్ సప్లిమెంట్స్ను తీసుకోవాలి. దానికి మనం తినే ఆహారంలో పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.చలి కారణంగా వచ్చే మజిల్ క్రాంప్స్ను నివారించడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. చలికి ఎక్కవగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయాలి.ఒత్తిడి వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి ∙హై΄ోథైరాయిడిజమ్ వల్ల వచ్చే మజిల్ క్రాంప్స్ను తగ్గించడానికి తగిన చికిత్స తీసుకోవాలి.ఇవి చదవండి: ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే! -
ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...శక్తిని పెంచుతుంది..మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.గుండెకు బలాన్నిస్తుంది..రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.మానసిక బలంరోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. -
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్యాకెట్లపై ఆకర్షణీయమైన ఫొటోలు, తక్కువ ధరలు ఆఫర్లు చూసి మోసపోవద్దు. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. విత్తనాల బెడద రైతులకు సవాల్గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లోకి వస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని చేయాలని వ్యసాయాధికారులు సూచిస్తున్నారు.తక్కువ ధరలు, ఆఫర్లు నమ్మొద్దు.. వర్షాలు పడితే చాలు రైతుల హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరుతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆ ఆఫర్ల కోసం డీలర్లు రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండవచ్చు. ఫొటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీ వారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం మంచిదని వ్యవసా«యాధికారులు పేర్కొంటున్నారు.రైతులు తీసుకోవాలి్సన జాగ్రత్తలు..1. గుర్తింపు పొందిన దుకాణం నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తేనే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.2. విత్తనాలు కొన్న అనంతరం దుకాణం నుంచి తప్పనిసరిగా రశీదు తీసు కోవాలి.3. విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్పై ఉన్న లేబుల్, లాట్ నంబర్ రశీదుపై నమోదు చేసుకొని, భద్రపర్చుకోవాలి.4. తొలుత విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్పై చూసి కొనాలి.విత్తనాలపై అవగాహన ఉండాలి..విత్తనాలపై రైతులు అవగాహన ఉండాలి. కొన్న ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. రసీదులు, ప్యాకెట్లను భద్రపర్చుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో నాసిరకమా? అనేది చూసుకోవాలి.– వెండి విశ్వామిత్ర, వ్యవసాయాధికారి, బోథ్ -
ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఒక్క నిమిషం.. ఫోన్ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్ ఫోన్ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్లు సూచిస్తున్నారు.ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్ ఫోన్. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్ ఫోన్తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయలేకపోయినా, రాత్రి ఫోన్ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.కేస్స్టడీ.. 1ఆఫీస్ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్ అయ్యాడు. ఫోన్ గుర్తొచ్చింది. టీ పాయ్ మీద లేదు. టీవీ ర్యాక్ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్తో రింగ్ చేయించాడు. రింగ్ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్ వినపడలేదు. సుందర్కు చెమటలు పట్టాయి. మైండ్ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్ కొని ఫోన్పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్.. మొబైల్ ఫోన్.. అదిపోతే... అదిపోతే... మైండ్ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్ లో అయి ఉంది’ అని. ఫోన్ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.కేస్ స్టడీ.. 2ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్ ఫోన్ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్కు నోమొ ఫోబియా ఉంది.కేస్ స్టడీ.. 3దుర్గారావు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అందవని. కాల్స్ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్ కోసం హోటల్ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.నష్టాలు..1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్ను నష్టపోతారు. పనులు పెండింగ్లో పడతాయి.3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.4. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.5. ఫోన్ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్ని కనిపెట్టుకుని ఉంటారు.ఎలా బయటపడాలి?1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్ను పక్కన పడేయడంప్రాక్టీస్ చేయండి.2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మొదలుపెట్టండి.3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లో పడేయడమో, మ్యూట్ చేసి జేబులో పడేయడమో చేయండి.4. ఫోన్ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.6. ఫోన్లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్ కంప్యూటర్లోనో మెయిల్స్లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్ ఎప్పుడుపోయినా మరో సిమ్ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు! -
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలిప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.అవి శరీరంలోకి ఇన్సర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్ను విడుదల చేస్తూ బ్లీడింగ్ని తగ్గిస్తుంది.ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్ను సూచిస్తారు. అవుట్ పేషంట్గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, హైదారాబాద్ -
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, హైదారాబాద్ -
తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?
జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్–హైదరాబాద్, ఎన్ఐఎన్ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్లైన్స్ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్లైన్స్లో ముఖ్యమైనవి..మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్ సప్లిమెంటరీ ఫుడ్ను ఇవ్వాలి.చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.కండలు పెంచేందుకు ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.ఇవి చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! -
కిచెన్లోని ఈ వస్తువులతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
ఇంట్లో ఉన్నటువంటి వస్తువులుగానీ, తిను పదార్థాలు గానీ చాలారోజులు నిలువలేకుండా పాడవుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోతుంది. కానీ మనకు తెలియకుండానే కొన్నిరకాల టిప్స్తో చాలాకాలం మన్నికగా ఉండేట్లు చేయవచ్చు. మరవేంటో చూద్దాం!ఇలా చేయండి..అరకిలో వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. కప్పు సూజీ రవ్వను బాణలిలో వేసి, వేడెక్కిన తరువాత రవ్వలో వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. రవ్వ, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి దించే యాలి. వెల్లుల్లి ముక్కలను రవ్వ నుంచి వేరుచేసి మిక్సీజార్లో వేసి పొడిచేసుకోవాలి. దీనిని పిండి జల్లెడతో జల్లించుకుని మెత్తని పొడిని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇది ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లి పేస్టుకు బదులు ఈ పొడిని కావాల్సిన కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే తరచూ వెల్లుల్లి పొట్టు తీసి దంచే పని ఉండదు.అన్నం కొద్దిగా మాడినా, అడుగున మొత్తం మాడిపోయినా మిగతా అన్నం కూడా మాడు వాసన వస్తుంది. ఆ వాసనకు అన్నం తినబుద్ది కాదు. ఒక ఉల్లిపాయను తీసుకుని నాలుగు ముక్కలుగా తరగాలి. మాడిన అన్నం గిన్నె మధ్యలో నాలుగు ముక్కలను నాలుగు చోట్ల పెట్టి పదిహేను నిమిషాలపాటు మూతపెట్టి ఉంచాలి. పావు గంట తరువాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల మాడు వాసనపోతుంది. అన్నం ఉల్లిపాయ వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది.ఇంట్లో అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు... తొక్క తీసి కొద్దిగా నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఐస్ ట్రేలో వేసుకుని ఫ్రీజర్లో నిల్వ చేసుకోవాలి. ఈ అల్లం క్యూబ్స్ ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీస్పూను డిష్వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లుపోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములు దరిచేరవు.సాల్ట్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్ వేయాలి. సాల్ట్లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్ను పొడిగా ఉంచుతుంది.ప్లాస్టిక్ రోల్ అతుక్కుని త్వరగా ఊడి రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత ఓపెన్ చేస్తే అతుక్కోకుండా సులభంగా వచ్చేస్తుంది. -
బిహార్ మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కేన్సర్ ఎలాంటిదంటే?
బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి. గొంతు కేన్సర్కు కారణమేమిటి?– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్కు గురయ్యే అవకాశం ఉంది.– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి -
ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్ఫామ్ గురించి సింగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్స్ లేదా మెటల్ ఫెన్స్ లేదా రోజ్ హెడ్ నెయిల్స్ సహాయంతో వ్యవసాయ సీజన్ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్ షీట్ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్ షీట్ కప్పి చైన్లింక్ ఫెన్స్కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం! -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్తోనే డ్రెస్సింగ్ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్ను స్కూల్కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్కు వెళ్ళారు. పేరెంట్స్తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
టెక్నాలజీతో జరుగుతున్న మోసాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు
టెక్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ' (AI). అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ టెక్నాలజీ ఈ రోజుల్లో అనేక రకాలుగా ఉపయోగపడుతోంది, అదే విధంగా అనర్థాలకు హేతువుగా మారుతోంది. ఈ కథనంలో ఏఐ వల్ల ఎలా డబ్బు పోగొట్టుకుంటున్నారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం.. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన డబ్బు అడగటం.. లేదా ఉద్యోగావకాశాల పేరిట డబ్బు వసూలు చేయడం వంటివి గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో కూడా ఓ వ్యక్తి రతన్ టాటా మాదిరిగా ఓ వీడియో క్రియేట్ చేసి పెట్టుబడులు పెట్టాలని సూచించాడు. మరో వ్యక్తి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ట్రేడింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్నట్లు డీప్ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్లు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మోసపోవడం ఖాయం. కేవలం పారిశ్రామిక వేత్తల మాదిరిగా కాకుండా టెక్నాలజీ ఉపయోగించి మన కుటుంబ సభ్యులలో ఒకరుగా ఫోన్ చేసి ఒక అకౌంట్ నంబరుకు డబ్బు పంపించమని అడిగితే నిస్సంకోచంగా.. పంపించేస్తాము. బ్యాంకులు కూడా ఇలాంటి లావాదేవాలాను మోసపూరితాలుగా పరిగణించే అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా కొందరు ఏకంగా సంస్థలను కూడా మోసం చేయడానికి సిద్దమైపోతున్నారు. కొన్ని రోజులకు ముందు ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం మెషీన్లలో డబ్బు రాదంటూ వచ్చిన పుకార్లను నమ్మి ఎక్కువమంది ఆ బ్యాంక్ కష్టంరాలు పెద్ద ఎత్తున తమ ఖాతాల నుంచి డబ్బు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి చర్యల వల్ల ఆ సంస్థల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో డీప్ ఫేక్ ఏది? అసలైనది ఏది? అని వెంటనే గుర్తించలేకపోవడం కూడా ఇలాంటి మోసాలు చేసేవారికి ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. ఇలాంటి డీప్ ఫేక్ భారీ నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది. తీసుకోవాలసిన జాగ్రత్తలు ఏదైనా స్కీమ్స్ ద్వారా ఎక్కువ డబ్బు వస్తుందని తెలిస్తే.. తప్పకుండా దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఆశపడితే నష్టపోవడం తథ్యం. ఇటీవల లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ నిజం కాదని RBI స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం వినియోగదారులను ఆకర్శించి మోసగించాడనే విషయం తప్పకుండా ప్రజలు గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఓటీపీ లేదా పిన్ నెంబర్ వంటి విషయాలను ఇతరులతో పంచుకోకూడదు, ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా ఓటీపీ షేర్ చేయమని ఎప్పుడూ అడగదు. కొన్ని సమయాల్లో మీ ఖాతాలో డబ్బు కట్ అయినట్లు.. వెంటనే చెక్ చేసుకోవాలని తెలియని నెంబర్స్ నుంచి మెసేజులు వస్తే, అలాంటి వాటిని నమ్మకపోవడం చాలా వరకు ఉత్తమం. -
లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్
డెట్రాయిట్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్ చేసింది. ఇవి సుమారు 20 లక్షల పైచిలుకు ఉంటాయి. 2012 అక్టోబర్ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఆటోపైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. డ్రైవర్లకు జారీ చేసే హెచ్చరికలు, అలర్ట్లను సాఫ్ట్వేర్ అప్డేట్ మరింతగా పెంచుతుందని, అలాగే ఆటోపైలట్ బేసిక్ వెర్షన్లు పని చేయగలిగే పరిధిని కూడా నియంత్రిస్తుందని పేర్కొంది. ఆటోపైలట్ పాక్షికంగా వినియోగంలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలపై జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత ఏజెన్సీ రెండేళ్ల పాటు దర్యాప్తు నిర్వహించిన మీదట టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోపైలట్ మోడ్లో ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు టెస్లా కార్లలో తీసుకున్న జాగ్రత్త చర్యలు తగినంత స్థాయిలో లేవని దర్యాప్తులో ఏజెన్సీ అభిప్రాయపడింది. పేరుకు ఆటోపైలట్ సిస్టమ్ అయినప్పటికీ ఇది డ్రైవర్కు కొంత అసిస్టెంట్గా మాత్రమే పని చేయగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే (తన లేన్లో) వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్ చేయడం, బ్రేక్లు వేయడం మొదలైన పనులు చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డ్రైవరు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తనే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ జాగ్రత్తలను పక్కన పెట్టి ఆటోపైలట్ను ఆన్ చేసి వెనక సీట్లో కూర్చోవడం లేదా తాగేసి కూర్చోవడం వంటివి చేస్తుండటమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. -
థక్ థక్ గ్యాంగ్: కాలు తొక్కారు.. అద్దం దించండి
ఢిల్లీలో ఒంటరిగా కారు నడుపుతున్న స్త్రీల వస్తువుల చోరీకి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఆ గ్యాంగ్ను థక్థక్ గ్యాంగ్ అంటారు. వీరు ఎలా చోరీ చేస్తారు? ఒంటరి స్త్రీలు కారు ప్రయాణం చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విస్తృతంగా వాహనాలు నడుపుతున్న స్త్రీలూ... బహుపరాక్. థక్థక్ గ్యాంగ్ ఎక్కడైనా ఉండొచ్చు. సంఘటన 1: నిర్మానుష్య ప్రాంతం అక్కర్లేదు. బాగా రద్దీ ఉన్న రోడ్డు మీదే. ట్రాఫిక్ సమయంలోనే. మీరు కారు మెల్లగా పోనిస్తుంటారు. ఒక మనిషి మీ కారు ముందు నుంచి దాటుతాడు. ఆ తర్వాత వేగంగా వెనక్కు వచ్చి మీ పక్క అద్దం మీద ‘టక్ టక్’మని వేలితో కొట్టి అద్దం దించమని కోపంగా అంటాడు. ‘నా కాలు తొక్కావు. అద్దం దించు’ అని హడావిడి చేస్తాడు. మీరు కంగారులో అద్దం దించుతారు. అంతే! మీ పక్క సీటులో మీరు ఉంచుకున్న హ్యాండ్బ్యాగ్, పర్స్, ల్యాప్టాప్ తీసుకుని తుర్రుమంటాడు. మీరు కారు దిగి వెంటాడ లేరు. ట్రాఫిక్లో ఉంటారు. ఇదీ ‘టక్ టక్’ లేదా ‘థక్థక్ గ్యాంగ్’ నేరం చేసే తీరు. సంఘటన 2: ఇలాగే ట్రాఫిక్లో మీరు వెళుతుంటారు. మెల్లగా వెళుతున్న మీ కారు వెనుక టైరు ఏదో ఎక్కి దిగినట్టుగా అవుతుంది. వెంటనే ఒక మనిషి డ్రైవింగ్ సీట్ దగ్గరకు వచ్చి అద్దం మీద బాది ‘నా కాలు తొక్కావ్’ అంటాడు. మీరు ఇంజన్ ఆఫ్ చేసినా, కారు పక్కకు తీసి ఆ మనిషితో వాదనకు దిగినా, మరో మనిషి మీ కారు వెనుక సీటులో ఉన్న వస్తువు తీసుకుని ఉడాయిస్తాడు. మీరు స్లోగా వెళుతున్నప్పుడు వెనుక టైరు కింద రాయి పెట్టి కాలు తొక్కిన భావన కలిగిస్తారు. ఇంకా ఏం చేస్తారు?: మీ కారు బైక్ మీద వెంబడించి ఇంజన్ లీక్ అవుతుంది అంటారు. అలా అనిపించడానికి వారే వెనుక కొంత ఆయిల్ వేస్తారు. మిమ్మల్ని అలెర్ట్ చేసిన వారు మిమ్మల్ని దాటి వెళ్లిపోతారు. కాని మీరు కారు ఆపి ఇంజన్ ఆయిల్ను చెక్ చేస్తుంటే ఇంకో బ్యాచ్ వచ్చి డోర్లు తీసి దోచుకుని పోతుంది. కారు ఎక్కేటప్పుడు కొన్ని నోట్లు కింద పడేసి మీ డబ్బు పడింది అంటారు. మీరు నోట్లు ఏరుకుంటుంటే కారులో ఉన్న వస్తువులు పట్టుకెళతారు. బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని చెప్తారు. కారు ఆపితే అంతే సంగతులు. కొన్నిసార్లు క్యాటపల్ట్ (క్యాట్బాల్)తో రాయి విసిరి అద్దం మీద కొడతారు. టప్పున అద్దం తాకితే మీరు కంగారులో కారు ఆపి దిగుతారు. వారు చేతివాటం చూపుతారు. ఒంటరి స్త్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ థక్ థక్ గ్యాంగ్ చాలా సులువుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏం చేయాలి? అద్దాలు ఎప్పుడూ ఎత్తి పెట్టాలి ► ఎవరు వచ్చి వాదనకు దిగినా అద్దం దించకుండా పోలీసులకు ఫోన్ చేయాలి. ఇంజన్ ఆఫ్ చేయకూడదు. చేస్తే డోర్లు తెరుచుకుంటాయి. ► మీ పక్క సీటులో, వెనుక సీటులో విలువైన ఏ వస్తువులూ కనిపించేలా పెట్టకూడదు. ► ఏదైనా రాయి వచ్చి అద్దాన్ని కొట్టినా వెంటనే ఆపకుండా బాగా దూరం వెళ్లి ఎవరూ వెంబడించడం లేదని గమనించుకుని ఆపాలి. ► ముఖ్యంగా ఫ్లై ఓవర్లు దిగేప్పుడు, ట్రాఫిక్ ఉంటే ఇలాంటి దాడులు చేస్తారు. ఫ్లై ఓవర్ మీద కారు పక్కకు తీసి మీరు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఫ్లై ఓవర్ల మీద జాగ్రత్తగా ఉండాలి. -
టాటులు వేయించుకోవడం మంచిది కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు రావా?
పచ్చబొట్టు వేసుకోవడం పురాతన కళ. ప్రపంచవ్యాప్తంగా ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. పలుదేశాల్లో బయటపడిన కొత్తరాతియుగం నాటి ఆధారాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా 3300 నుంచి 3200 నాటి ‘ఓట్జీ ది ఐస్ మ్యాన్’ మమ్మీ.. ఆస్ట్రియా–ఇటలీ సరిహద్దుల్లో దొరికింది. అతడి పచ్చబొట్లను ఎక్స్ రే తీసిన శాస్త్రవేత్తలు.. అతడి శరీరంపైనున్న ప్రతి పచ్చబొట్టుకు కొన్ని నొప్పులు, వ్యాధులే కారణమని నిర్ధారించారు. దీనిని బట్టి పురాతన చికిత్సా విధానాల్లో భాగంగా పచ్చబొట్లను వేసుకునేవారని తేలింది. ఫ్రాన్స్, పోర్చుగల్, స్కాండినేవియన్ దేశాల్లోని పురావస్తు శాఖ పరిశోధకులకు పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే పురాతన పరికరాలు దొరికాయి. అవి సుమారు పన్నెండువేల ఏళ్ల నాటి మంచు యుగానికి చెందినవని నిర్ధారించారు. ఆనాటి కొన్ని స్త్రీల బొమ్మలపై పచ్చబొట్ల లాంటి చిత్రాలు ఉన్నాయి. తొడలపైన, వీపు మీద పచ్చబొట్లు వేయించుకోవడం అప్పటి నుంచే ఉండేదనేందుకు ఆ చిత్రాలే నిదర్శనాలు. పచ్చబొట్లు చర్మం మీద వేయించుకొనే శాశ్వత చిహ్నాలు. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి. ఇప్పుడు పచ్చబొట్లు రకరకాల రంగులతో మరింత కళాత్మకంగా రూపు దిద్దుకున్నాయి. పూర్వం చాలామంది సంతల్లో, జాతర్లలో తమ పిల్లలు తప్పిపోకూడదని చేతులపై వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించేవారు. పలు తెగలకు చెందిన గిరిజన స్త్రీలు తమ ముంజేతులు, భుజాలు, పాదాలపై నక్షత్రాలు, చందమామ చిత్రాలను తమ తమ సంప్రదాయాల ప్రకారం పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అప్పట్లో కొందరు స్త్రీలు సౌందర్యం కోసం బుగ్గలు, పై పెదవి, చుబుకం మీద పుట్టుమచ్చల్లా పచ్చబొట్లు వేయించుకునేవారు. కాలక్రమేణా మనసులోని ప్రేమను వ్యక్తపరచేందుకు ప్రియమైనవారి పేరును పచ్చబొట్టు వేయించుకునేవారు పెరిగారు. ప్రాచీన గ్రీకు, రోమన్, పర్షియన్ రాజ్యాల్లో బానిసలు, నేరగాళ్లు పారిపోయినా, వారిని సులువుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుగా వారి శరీరాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా పచ్చబొట్లు వేసేవారు. రోమన్ చక్రవర్తుల కాలంలో పచ్చబొట్ల కళకు రాజాదరణ అమితంగా ఉండేది. రాజులను మెప్పించడానికి రాజ దర్బారులోని వారంతా పచ్చబొట్లు వేయించుకునేవారు. దర్బారులోని రాజోద్యోగులను చూసి సామాన్య పౌరులూ పచ్చబొట్లు వేయించుకోవడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ధోరణి విపరీతమైన కొన్నాళ్లకు.. కొందరు మతపెద్దలు పచ్చబొట్లను నిషేధించడంతో 19వ శతాబ్దం వరకూ పశ్చిమ యూరోపియన్లకు పచ్చబొట్ల కళ దూరమైంది. ఇక తూర్పు యూరోపియన్లు కూడా పచ్చబొట్లపై పెద్దగా ఆసక్తికనబరచలేదు. అయితే వారు తమ శత్రువులను అవమానించడానికి అసహ్యకరమైన పచ్చబొట్లను నుదుటిపై వేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. టాటూ అర్థాలు వాటర్ కలర్ టాటూలు, బ్లాక్వర్క్ టాటూలు, ఇలస్ట్రేటివ్ టాటూలు, హెన్నా టాటూలు, డాల్ఫిన్ టాటూలు, పువ్వులు, సీతాకోక చిలుకలు, పక్షుల టాటూలు.. ఇలా ఒకటి రెండూ కాదు కొన్ని వందల టాటూలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా రంగులు పెరిగే కొద్దీ సహజమైన అందాలను అచ్చంగా అద్దే ఆర్టిస్ట్లు చాలామందే పుట్టుకొస్తున్నారు. అయితే టాటూ బాగుంది కదా అని వేయించుకునే వారికంటే.. వాటి అర్థాలు తెలుసుకుని వేయించుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో టాటూ అర్థాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కువమంది వాడే కొన్ని టాటూల అర్థాలు చూద్దాం. డ్రాగన్ – ధైర్యం, బలం, రక్షణ, శక్తి, జ్ఞానం సీతాకోక చిలుక – అందం, స్వేచ్ఛ, విశ్వాసం పక్షులు – స్వేచ్ఛ, ఆకాశమే హద్దు నక్షత్రం – ఆశ, విశ్వాసం, పరివర్తన, ఆశయం, విజయం పువ్వులు – సున్నితత్వం, ప్రశాంతత (ఎంచుకున్న రంగును బట్టి, పువ్వును బట్టి మరిన్ని అర్థాలు మారతాయి) సూర్యుడు – ఆరంభం, శక్తి మ్యూజిక్ టాటూ – ప్రేమ, పరివర్తన, అహ్లాదం (డప్పు, పియానో, ప్లేబ్యాక్ బటన్స్ వంటి రూపాలను బట్టి అర్థాలు మారతాయి) పులి – నాయకత్వం, ప్రాణాంతకం, భయానకం, ప్రకృతిపై ప్రేమ సింహం – రాజసం త్రాసు – సానుకూలత, ఆదర్శవాదం శాశ్వత అలంకరణగా టాటూ మేకప్ ఎర్రని పెదవులు, గులాబి బుగ్గలు, నిండుగా ఉన్న కనుబొమలు, దట్టంగా కనిపించే కనురెప్పలు.. వీటితో స్త్రీలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అందుకే తాత్కాలిక కాస్మెటిక్స్ పక్కన పెట్టి మరీ.. ఈ పర్మినెంట్ టాటూ రంగుల్ని వాడటం మొదలుపెట్టారు నేటి మహిళలు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదని.. 1902లో లండన్లో మొదలైందనే ఆధారాలున్నాయి. అయితే భారతీయుల్లో పర్మినెంట్ మేకర్ అనే ఈ కళ 19వ శతాబ్దం చివర్లో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవాప్తంగా పలు సెలూన్స్, స్కిన్ క్లినిక్స్ ఇలాంటి శాశ్వతమైన మేకప్ ట్రెండ్ని అందిస్తున్నాయి. అయితే కొంతమంది అమ్మాయిలు.. పార్టీలు, ఫంక్షన్ల కోసం మాత్రమే సెమీ పర్మినెంట్ మేకప్స్ వేయించుకుంటున్నారు. అవి కొన్ని రోజుల పాటు చెక్కు చెదరని అందాన్ని ఇస్తుంటాయి. కానీ పర్మినెంట్ మేకప్స్ పట్ల మోజు చూపే యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. సున్నితమైన పెదవులు, కళ్లు వంటి చోట్ల పర్మినెంట్ మేకప్లో భాగంగా రసాయనాలు వాడుతుండటం అంత మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో వీటి జోలికి వెళ్లేందుకు కాస్త వెనుకాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కపుల్ టాటూస్తో పాటు ఫ్రెండ్స్ టాటూలూ బాగానే ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వీటితో పాటు పాపులర్గా నిలుస్తున్న కొన్ని టాటూస్ విశేషాలు చూద్దాం. ►కలర్ఫుల్ టాటూస్: వీటిలో చాలా కలర్స్ వాడుతారు. మనిషి ముఖం, పువ్వులు వంటి ప్రకృతి అందాలను సహజసిద్ధంగా చెక్కుతారు. ►టెంపరరీ టాటూ: నచ్చిన స్టికర్ సెలెక్ట్ చేసుకుంటే.. దాని మీద ఒకరకమైన స్ప్రే జల్లి.. ఆ స్టికర్ లాగేస్తారు. ఇది మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. ►యానిమే టాటూ: వీడియో గేమ్స్ నుంచి ప్రేరణ రూపొందిన టాటూలు ఇవి. యానిమేషన్ లవర్స్ వీటిని విపరీతంగా వేయించుకుంటున్నారు. ►లివింగ్ టాటూ: దీన్నే త్రీడీ టాటూ అనీ అంటారు. వీటిలో కొన్ని చూడటానికి కదలుతున్నట్లుగా ఉంటాయి. మనదేశంలో ఇవి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ►మ్యూజిక్ ప్లేయింగ్ టాటూ: ఇష్టమైన వారి వాయిస్ని రికార్డ్ చేసి.. దాన్ని మ్యూజిక్ సింబల్ రూపంలో మార్పించి, దాన్ని టాటూగా వేయించుకోవచ్చు. అలా వేయించుకున్న టాటూని.. ఫోన్లో తిరిగి స్కాన్ చేస్తే ఆ వాయిస్ మనకు వినిపిస్తుంది. టాటూ క్యాన్సర్ కారకమా? కలప బూడిదతో, నూనె, పసుపు కాల్చిన మసితో మూలికలను జోడించి.. పూర్వం పచ్చబొట్టు సిరాలను తయారు చేసేవారు. అయితే నేడు రకరకాల పిగ్మెంట్స్తో తయారైన కెమికల్ ఇంకును వాడుతున్నారు. పైగా ఏది ఎంత మోతాదులో వాడుతారనేదానికి సరైన తూకం లేదు. తయారీదారులు వాటి సాంద్రతను, గాఢతను బహిర్గతం చేయాల్సిన పనిలేదు. అలాగే టాటూ డిజైనర్స్.. వేసే డిజైన్ని బట్టి సొంతంగానే సిరాను కలిపి పచ్చబొట్లను చిత్రిస్తారు. దాంతో దేని మోతాదు ఎంత? దాని వల్ల కలిగే ఫలితాలేంటి అనేవి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే గత ఏడాది అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు టాటూ ఇంక్స్ మీద పలు పరిశోధనలు చేశారు. అప్పుడే ఓ షాకింగ్ విషయం బయటపడింది. టాటూల కోసం ఉపయోగించే ఇంకుల్లో క్యాన్సర్ కారకం ఉందని వారు వెల్లడించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్కు చెందిన సైంటిస్ట్ స్వియర్క్ నేతృత్వంలో దాదాపు వంద రకాల టాటూ ఇంకులను పరీక్షించారు. టాటూలు ఎప్పటికీ తొలగిపోకుండా శరీరంపై ఉండటానికి ఇంకుల్లో ఉండే పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్ని వాడుతుంటారు. శాస్త్రవేత్తలు పరీక్షించిన 100 ఇంకుల్లో 23 ఇంకుల్లో అజో అనే సింథెటిక్ రంగుల ఉనికిని గుర్తించారు. సాధారణంగా అజో సింథెటిక్ రంగులను ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి బ్యాక్టీరియా చేరినా, అధిక సూర్యరశ్మి తగిలినా క్యాన్సర్ కారకంగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావా? ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధపడే వారు.. శరీరంపై పచ్చబొట్లు వేయించుకునే ఆలోచన మానుకుంటే మంచిది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, పోలీసు ఉద్యోగాలతో పాటు.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) వంటి ఉద్యోగాలు ఒంటిపైన పచ్చబొట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రావు. వాస్తవానికి, శరీరంపై పచ్చబొట్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోవడానికి.. పచ్చబొట్లు పలు వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందనేది ఒక కారణం కాగా.. సైన్యం వంటి రక్షణ రంగంలో శరీరంపై టాటూలు భద్రతకు ముప్పు అనేది మరో కారణం. అంతేకాదు టాటూ వేసుకున్నవారు క్రమశిక్షణా రాహిత్యంతో ఉంటారనే అభిప్రాయమూ ఉంది. అయితే గత ఏడాది.. అన్ని అర్హతలూ ఉన్నా కేవలం తన ఒంటి మీదున్న టాటూ కారణంగా తనకు సర్కారు కొలువును నిరాకరించారంటూ అసోమ్కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ హైకోర్టు్టను ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో కోర్టు.. పచ్చబొట్టు తీయించుకునేందుకు రెండు వారాలు గడువు ఇచ్చింది. పచ్చబొట్టు తొలగించుకున్నాక మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని, ఆ తర్వాతే నియామకం జరుగుతుందని తీర్పు చెప్పింది. రక్తదానం చేయకూడదా? గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రక్తదానాలు చేసే వారి సంఖ్య పెరిగింది. రాజకీయ అభిమానులు, సినీ నటుల అభిమానులతో పాటు చాలామంది యువత సేవాభావంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సర్వసాధారణమైంది. అయితే రక్తదానం చేయడానికి ముందుకొచ్చేవారిలో వందకు సుమారు తొంభై మంది టాటూస్తోనే ఉంటున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే.. రక్తం తీసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు వైద్యులు. ఆ జాగ్రత్తల్లో రక్తం ఇచ్చేవారు టాటూ వేయించుకున్న సమయం కూడా ముఖ్యమే. ఎందుకంటే టాటూ కారణంగా.. కొన్ని రకాల చర్మవ్యాధులు, హెపటైటిస్– ఏ, హెపటైటిస్–బీ, హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులూ సోకే ప్రమాదం ఉంది. ఎవరైనా టాటూ వేయించుకుంటే సంవత్సరం పాటు రక్తదానం చేయకూడదనేది రెడ్ క్రాస్ నిబంధన. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన టాటూ సెంటర్స్లో టాటూ వేయించుకుంటే సమస్య లేదు. కానీ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ టాటూ వేయించుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు రక్తదానం చేయొద్దని అంటోంది. ఆరోగ్య నిపుణుల సలహాలతో, ప్రొఫెషనల్ టాటూ సెంటర్స్లో టాటూలు వేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఇవి వద్దు గురూ.. చిరునవ్వు సానుకూలత.. విచారం ప్రతికూలత అనేది తెలిసిన సంగతే. ఇదే టాటూల విషయంలోనూ కనిపిస్తుంది. సానుకూల సంకేతాలతో మేలు, ప్రతికూల సంకేతాలతో కీడు ఎలా వచ్చిపోతాయో మన పురాణాల్లో ఋషులు వర్ణించారు. అందుకే కొందరు శాస్త్రం తెలిసిన పెద్దలు.. కొన్ని రకాల టాటూలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. పగిలిన అద్దం (అశుభానికి సంకేతం), తిరగబడిన గుర్రపు డెక్క (దురదృష్టానికి ప్రతీక), విరిగిన గడియారం (పురోగతికి అవరోధం) విచారంగా ఉండే ముఖం (దుఃఖానికి సూచన) వంటివి ఒంటిపై టాటూలుగా వేయించుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే గబ్బిలం, పాము, బల్లి, పిల్లి, తేలు వంటి రూపాలను టాటూలుగా వేయించుకుంటే అవి జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లవని కొందరి నమ్మకం. మొన్నటికి మొన్న హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ.. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై విజయానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. స్టేడియంలోనే.. తన జెర్సీని పైకి లేపి టాటూని చూపించాడు. ఒంటిపై వేయించుకున్న తల్లిదండ్రుల రూపాన్ని చూపించి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఆ దృశ్యం.. టాటూలపై మరోసారి చర్చకు దారితీసింది. యువత ఆకర్షణకూ కారణమైంది. ఈ రోజుల్లో యూత్.. టాటూ, టాటూస్య, టాటూభ్యోహ అనే రీతిలో టాటూ ఒరవడిని ఫాలో అవుతోంది. ఆ మాటకొస్తే అక్కినేని నాగార్జున, త్రిష, జూనియర్ ఎన్టీఆర్, నాని, తాప్సీ, విక్రమ్, షాలినీ పాండే, చార్మీ ఇలా ఎందరో సెలబ్రీటీలు ఏనాడో ఈ ట్రెండ్ ప్రారంభించారు. పచ్చబొట్టు చెరిగిపోద్దిలే.. పూర్వకాలం శరీరంపై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం నాటు పద్ధతులను ఉపయోగించేవారు. వెనిగర్, పావురాల రెట్టలతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని పిండికట్టులా పచ్చబొట్టుపై వేసేవారు. కానీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్తో పచ్చబొట్లను తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్రీట్మెంట్తో నలుపు రంగులో ఉన్న పచ్చబొట్లను చాలా సులువుగా తొలగించవచ్చు. కానీ పసుపు, ఎరుపు వంటి ఇతర రంగులను తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పాత పచ్చబొట్టు కొత్త రంగులతో వన్నె తరగని ట్రెండ్గా కొనసాగుతోంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ఆరోగ్యం.. ఆహ్లాదం.. ఆనందం! దానికి పచ్చబొట్టూ మినహాయింపు కాదు! (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్సీలు, సీహెచ్సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్వో: జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్వో: అన్ని పీహెచ్సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
రాష్ట్రానికి డెంగీ ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే జూలై వరకు రాష్ట్రంలో 961 డెంగీ కేసులు నమోదు కాగా, ఆగస్టు నెలలో సరాసరి రోజుకు వంద మందికి పైగా డెంగీ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈనెల సెప్టెంబర్ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందుతోందని చెబుతున్నారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే డెంగీ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్ డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వైలెన్స్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో డెంగీపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో రక్త నమూనాలు సేకరించి వాటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు పంపిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడెక్కడ డెంగీ తీవ్రత ఉందో అంచనా వేస్తారు. ఆ మేరకు చర్యలు చేపడతారు. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్థారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలని స్పష్టం చేస్తోంది. ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే కొన్నిసార్లు డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. -
హెయిర్–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!
ఒక వయసు దాటాక తెల్లబడ్డ వెంట్రుకలకు రంగువేయడం చూస్తుంటాం. ఇక యువతులూ, కొందరు మహిళలు కూడా స్ట్రెయిటెన్, బ్లీచింగ్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రక్రియల్లో జుట్టు (హెయిర్ స్ట్రాండ్స్) దెబ్బ తినకుండా సంరక్షించుకోడానికి చేయాల్సిన పనులివి... మాటిమాటికీ దువ్వడం, దువ్వుతున్నప్పుడు చిక్కులున్నచోట మృదువుగా కాకుండా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి. ఇలా దెబ్బతిన్నప్పుడు వెంట్రుక సాఫీగా లేకుండా కొన్నిచోట్ల ఉబ్బుగానూ, మరోచోట పలచగానూ కనిపించవచ్చు. ఇలా కనిపించే వెంట్రుకల్ని ‘బబుల్డ్ హెయిర్’ అంటారు. కాబట్టి వెంట్రుకలపై బలం ఉపయోగించకుండా, మృదువుగా దువ్వేలా జాగ్రత్త వహించాలి షాంపూ వాడే సమయంలో దాన్ని నేరుగా వాడకుండా... అరచేతిలో వేసుకుని, కొన్ని నీళ్లు కలిపి, దాని సాంద్రతను కాస్త తగ్గించాలి. దీంతో వెంట్రుకల మీద షాంపూలోని రసాయనాల తాకిడి, ప్రభావం తగ్గుతాయి తలస్నానం తర్వాత డ్రైయర్ వాడేటప్పుడు వెంట్రుకలకు వేడి గాలి మరీ నేరుగా తగలకుండా జాగ్రత్త వహించాలి రంగువేయడం, బ్లీచింగ్లతో జుట్టు రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంది. దాంతో వెంట్రుక పైపొర అయిన ‘క్యూటికిల్’ దెబ్బతినే అవకాశముంది. క్యూటికిల్ దెబ్బతినగానే కాస్త లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటపడుతుంది. ఇది క్యూటికిల్లా నునుపుగా కాకుండా కాస్తంత గరుకుగా ఉంటుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది. అందుకే రంగువేసే సమయంలో నాణ్యమైన హెయిర్–డై వాడుకోవాలి. ఒకసారి తమకు సరిపడుతుందా లేదా అన్నదీ చూసుకోవాలి. (చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్! లాభాలేమిటంటే?) -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
పిల్లల చేత ఇలా చేయిస్తే.. మెడనొప్పిని నివారించొచ్చు..
పిల్లల్లో మెడనొప్పి అంతగా కనిపించకపోయినా అరుదేమీ కాదు. వాళ్ల రోజువారీ అలవాట్లవల్ల కొద్దిమందిలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు వీపు వెనక పుస్తకాల బ్యాగ్ తాలూకు బరువు మోస్తూ... మెడను ముందుకు చాపి నడుస్తూ ఉండటం, స్కూళ్లలో బెంచీల మీద కూర్చుని... చాలాసేపు మెడ నిటారుగా ఉంచడం, కంప్యూటర్ మీద ఆటలాడుతూ చాలాసేపు మెడను కదిలించకుండా ఉంచడం వంటి అనేక అంశాలతో మెడనొప్పి రావచ్చు. ఇలాంటి పిల్లల చేత తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించేలా చేయడం వల్ల మెడనొప్పిని నివారించవచ్చు. స్కూల్లో తమ బెంచీ నుంచి డెస్క్కూ / ఇంట్లో తమ రీడింగ్ టేబుల్ నుంచి తమ కుర్చీకీ తగినంత దూరంలో ఉందా, పిల్లల ఎత్తుకు తగినట్లుగా ఉందా అన్నది చూసుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు ఆ రీడింగ్ టేబుల్ ఎత్తును అడ్జెస్ట్ చేయాలి. వాటికి తగినట్లుగా తమ కూర్చునే భంగిమ (పోష్చర్) సరిగా ఉందా అన్నది కూడా తల్లిదండ్రులు పరిశీలించాలి. ∙స్కూల్లో లేదా ఇంట్లో... చదివే సమయాల్లో వెన్నును కంఫర్టబుల్గా ఉంచుకోవాలి. వెన్ను ఏదో ఒక వైపునకు ఒంగిపోయేలా కూర్చోకూడదు. అదే పనిగా చదవకుండా మధ్య మధ్య గ్యాప్ ఇస్తుండాలి. ∙పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ... మెడను చాలాసేపు నిటారుగా ఉంచడం సరికాదు. మధ్యమధ్యన మెడకు విశ్రాంతినిస్తూ ఉండాలి. ∙పిల్లలు వీడియోగేమ్స్ మాత్రమే కాదు... గ్రౌండ్లోనూ ఆటలాడేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల్లో మెడనొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే వారు తినే తినుబండారాలు ఆరోగ్యకరంగా ఉండాలి. వీలైనంతవరకు జంక్ఫుడ్ /బేకరీ ఐటమ్స్కు దూరంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు మెడనొప్పిని నివారిస్తాయి. అప్పటికే మెడనొప్పి ఉంటే తగ్గిస్తాయి. ఇవి పాటించాక కూడా తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను సంప్రదించాలి. -
మండుతున్న సూరీడు.. ఆ జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నేడు 44 నుంచి 45 డిగ్రీల వరకు శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
తెలుగు రాష్ట్రాలపై సూర్య ప్రతాపం: భరించలేని వేడి, ఉక్కపోత.. భయం భయంగా జనం (ఫొటోలు)
-
ఉదయం నుంచే భగభగ.. తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం 9 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు, మరో 10 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. 13 మండలాల్లో 46 డిగ్రీలు, 39 మండలాల్లో 45 డిగ్రీలు, 255 మండలాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 148 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 46.7 శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేడు 20 మండలాల్లో వడగాడ్పులు బుధవారం 20 మండలాల్లో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లాలో 2 మండలాలు, గుంటూరు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 3, పల్నాడులో 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. -
స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు.. ఆ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం..!
లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి: సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’ -
ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!
ప్రస్తుతం భూమి.. బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. దీంతో భూమిపై పెట్టుబడి పెట్టేవారు ఇటీవల కాలంలో బాగా పెరిగారు. అధికంగా పెట్టుబడులు పెట్టే స్థోమత ఉన్నవారు షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం కన్నా కూడా స్థిరాస్తి మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో డీలా పడిన రియల్ ఎస్టేట్ రంగం తర్వాత పుంజుకుంది. (త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్కుక్!) కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కూడా ప్రస్తుతం తక్కువ వడ్డీకి హోంలోన్లు ఇస్తున్నాయి. దీంతో ఇల్లు లేదా స్థలం కొనడానికి ఇదే అనువైన సమయమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసేవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఎలాంటివి కొనాలి.. ఎక్కడ కొనాలి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. (జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) అనుమతులన్నీ ఉన్నాయా? స్థిరాస్తి కొనుగోలు అన్నది అధిక పెట్టుబడులతో కూడుకున్నది. కాబట్టి జాగ్రత్తలు కూడా ఎక్కువే తీసుకోవాలి. ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్న చోటు అంటే ఆ నగరం లేదా పట్టణంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి పరిశోధన చేయాలి. రహదారులు, హైవేలు, కనెక్టివిటీ వంటివి తెలుసుకోవాలి. ఏవైనా వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసేవారు వాటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే ఇల్లు కట్టుకునేటప్పుడు చిక్కులు తప్పవు. ఇక ఇదివరకే నిర్మించిన ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే యాజమాన్య ధ్రువీకరణ పత్రం, బిల్డింగ్ లే అవుట్ ఆమోదం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, వ్యవసాయేతర అనుమతి, నీరు, అగ్నిమాపక విభాగం ఆమోదం వంటివి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. నివాసం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించడానికి రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ కూడా పరిశీలించాలి. అలాగే కొత్తగా ఏమైనా నిబంధనలు వచ్చాయేమో తెలుసుకోవాలి. ఆస్తి కొంటున్న ప్రాంతం ఏ అధీకృత సంస్థ పరిధిలోకి వస్తుందో దాని ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆయా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అసలైనవేనా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎలాంటివి కొనాలి? సాధారణంగా ఇల్లు లేదా స్థలాలను కొనేవారిలో చాలా మంది సొంత వినియోగం కోసమే తీసుకుంటున్నారు. మరికొంత మంది కేవలం పెట్టుబడి కోణంలోనే ఆస్తులు కొంటున్నారు. అయితే సొంత వినియోగం కోసం ఆస్తులు కొనేవారు నాణ్యమైనవి కొనుగోలు చేయాలి. ఇందు కోసం మార్కెట్లో నమ్మకమైన బ్రాండెడ్ డెవలపర్ల దగ్గర కొనుగోలు చేస్తే మంచిది. గుర్తింపు లేని, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కొనాలి? ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లు, బస్సులు, ఆటోలు వంటి ప్రజా రవాణాకు అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఆస్తులను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచిది. అంతేకాకుండా స్థిరాస్తికి సమీపంలో పాఠశాలలు, వాణిజ్య భవన సముదాయాలు, ఆసుపత్రులు ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సౌకర్యాలన్ని ప్రాథమిక అవసరాలు తీర్చడమే కాకుండా ఆస్తి విలువ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బిల్డర్ గురించి తెలుసుకున్నారా? ఏదైనా ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు, బిల్డర్ గత రికార్డు, అతను ఎన్ని ప్రాజెక్ట్లను పూర్తి చేశాడు, నిర్మాణం పూర్తి చేసే సమయం, నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి. కొనుగోలుదారులు అజాగ్రత్తగా ఉంటే మోసపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేసేవారు ముందుగా తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం చాలా అవసరం. -
దడపుట్టిస్తున్న జ్వరాలు.. తేలికగా తీసుకోవద్దు!
ఢిల్లీ: ప్రస్తుతం దేశంలో విజృంభిస్తోంది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. కరోనా కాకున్నా ఆ వైరస్లానే H3N2 ఇన్ఫ్లూయెంజా ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోందని హెచ్చరిస్తున్నారాయన. పండుల సీజన్ వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారాయన. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కొత్త ఫ్లూ విజృంభిస్తోంది. జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. దగ్గు, జలుబు, తీవ్ర జ్వరంతో జనాలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వైరస్ పరివర్తన చెందడం, ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల కిందట.. H1N1 కారణంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభించింది. ఇప్పుడు H3N2 వైరస్ విజృంభిస్తోంది. ఇది ఒక సాధారణమైన ఇన్ఫ్లూయెంజా జాతి. ప్రతీ వైరస్ లాగే.. ఇదీ పరివర్తనం చెందుతోంది. కానీ, H3N2 మ్యూటేషన్తో ఇన్ఫెక్షన్ త్వరగతిన వ్యాపిస్తూ.. ఎక్కువ కేసులను చూడాల్సి వస్తోంది. శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్తున్నారాయన. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాస్కులు వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. కరోనా టైంలో పాటించిన జాగ్రత్తలను పాటిస్తే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చిన చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్ వాడొద్దని ఇదివరకే ఐసీఎంఆర్ ప్రజలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. వృద్ధులు, చిన్నారులతో పాటుగా గుండె, కిడ్నీ, ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్లు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
ఎండలు.. జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా సూచనలు చేసింది. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని పేర్కొంది. దాహం వేసేంతవరకు వేచిచూడడం మంచి సూచిక కాదని తెలిపింది. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దనీ, వాహనం లోపల ఉష్ణోగ్రత ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది. ►బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను వినియోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలను తీసుకోవాలి. పుచ్చ, కర్బూజ, ఆరెంజ్, ద్రాక్ష, వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలను తినాలి. అలాగే పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినాలని సూచించింది. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. గొడుగు, టోపీ, టవల్ వంటి ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో తలను ఎండ వేడి నుంచి రక్షించుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని ప్రదేశాల్లో ఉండాలి. ప్రత్యక్ష సూర్యకాంతి, వేడి గాలులను నిరోధించాలి. పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ►ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ►అనారోగ్యంతో ఉన్నవారు ఎండాకాలంలో ఇతరులకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. వీరు అదనపు శ్రద్ధ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఒంటరిగా నివసించే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రతి రోజూ పర్యవేక్షించాలి. ►శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడిబట్టలను ఉపయోగించాలి. ►మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దు. ఒకవేళ వచ్చినా ఎండలో శారీరకమైన కఠినమైన పనులు చేయకూడదు. ►తీవ్రమైన ఎండ సమయంలో వంట గదిలో వంట చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే వంటిల్లు వెంటిలేషన్తో ఉండాలి. వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవాలి. ►ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తీసుకోకూడదు. ఇవి శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు. ►ఆరు బయట పనిచేసే కార్మికుల కోసం పని ప్రదేశంలో చల్లని తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ప్రతి 20 నిమిషాలకు ఒక గ్లాసు నీరు తాగాలని వారికి చెప్పాలి. ►సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 97.5ని ఫారిన్హీట్ నుండి 98.9ని ఫారీన్ హీట్ ఉండాలి. -
షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి?
ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. డయాబెటిస్ రెండు రకాలు.. మొదటి రకం (టైపు -1) ఇది.. పిల్లల్లో వచ్చేది . శరీరానికి రక్షణ కల్పించాల్సిన ఇమ్మ్యూనిటి వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంపైనే దాడి చేస్తుంది. పెద్దల్లో కనిపించే టైపు - 2 డయాబెటిస్కు కారణాలివే.. ►ఒంటికి సూర్య రశ్మి తగలక పోవడం - దీని వల్ల కలిగే డి విటమిన్ లోపం ►అధిక బరువు - ఊబకాయం - శారీరిక శ్రమ లోపించడం, అధిక తిండి ►జన్యు వారసత్వం (తల్లి తండ్రి లో ఒకరికి ఉన్నా వచ్చే అవకాశముంది) ►టెన్షన్ - స్ట్రెస్ ►భోజనంలో పిండిపదార్థాలు ఎక్కువ కావడం - ప్రోటీన్ , పీచు లాంటివి బాగా తక్కువ కావడం రాకుండా ఎలా కాపాడుకోవాలి ? ►చిన్నపటి నుంచి పిల్లలని, బుసబుస పొంగే కూల్ డ్రింక్స్ , పిజ్జా , బర్గెర్ , పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్కు దూరంగా ఉంచండి. ఆయా కాలాల్లో దొరికే పళ్ళు బాగా తినాలి. పిల్లలు ఆటలాడాలి ►ఒకప్పుడు నలబై యాభై లలో డయాబెటిస్ వచ్చేది . ఇప్పుడు ముప్పై వయసులోనే కొంతమందిలో ఇరవై లోనే టైపు 2 చక్కర వ్యాధి వచ్చేస్తోంది . గతం తో పోలిస్తే ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది ►క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం , రక్తం లో ఇన్సులిన్ ఉన్నా అది సరిగా స్పందించకపోవడం - ఈ కారణంచేత రక్తం లో షుగర్ లేదా గ్లూకోస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి . ఇదే చక్కర వ్యాధి రక్తం లో గ్లూకోస్ లెవెల్ ఎంత ఉండాలి? ►ఇంట్లో accu చెక్ లాంటి పరికరంతో రక్తం లో గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు ►అన్నం తిన్నాక గంటన్నర కు చెక్ చేసుకోవాలి . రీడింగ్ 140 ఉంటే సమస్యే లేదు . 180 దాక ఉన్నా పెద్దగా సమస్య కాదు . 300 దాటితే మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్టు ►500 దాటితే ఆపాయ స్థితి సహజ పద్ధతిలో డయాబెటిస్ను ఎలా జయించాలి ? ►రోజుకు కనీసం 30 నిముషాలు ఎండలో { ఉదయం లేదా సాయంకాలం} వేగంగా నడవాలి . అప్పుడు డి విటమిన్ అందుతుంది . శారీరిక శ్రమ వల్ల ఇన్సులిన్ ఉత్త్పత్తి పెరుగుతుంది/దాని పని తీరు మెరుగు పడుతుంది. బరువు కూడా తగ్గడం దీనికి మరింత దోహద పడుతుంది . ►మానసిక ఒత్తడికి దూరం కావాలి . అనారోగ్యం గా వున్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు . అది పెద్ద సమస్య కాదు. టెన్షన్ ఉన్నప్పుడు కూడా ►ఆధునిక జీవనం టెన్షన్ ల మయం. కొద్దిపాటి లేదా కాసేపు టెన్షన్ సరే అనుకోవచ్చు . రోజుల తరబడి టెన్షన్ పడితే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగి పోతుంది . యోగ , పాటలు వినడం, NLP .. ఏ పద్దతి అయినా ఫరవాలేదు. ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి . తగిన విశ్రాంతి , నిద్ర , సంతోషం , తృప్తి.. ఇవన్నీ అవసరం . ►ఎలాంటి మందులు లేకుండా చక్కర వ్యాధి ని దూరం చేయాలంటే ఆహార నియమాలు తప్పని సరి . పిండి పదార్థాలు అంటే బియ్యం గోధుమలు లాంటి వాటితో చేసిన వంటకాలు - బాగా తగ్గించాలి. ►తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం మెరుగు, దాని కన్నా బాసుమతి మెరుగు . దాని కన్నా సిరి ధాన్యాలు మెరుగు . మీ కంచం లో పిండి పదహార్థాలనిచ్చే బియ్యం తో చేసినవి గోధుమలతో చేసినవి బాగా తక్కువ ఉండాలి. ►ఆరు పాళ్లల్లో కేవలం ఒక పాలు మాత్రం ఇవి కావాలి . మిగతావి అయిదు రెట్లు ఉండాలి . అంటే అన్నం ఒక కప్పు అయితే ఆకుకూరలు , కాయగూరలు , మాంసాహారులైతే చికెన్, మటన్, చేపలు, గుడ్డు, శాకాహారులైతే పన్నీర్, పప్పు , వేరుశనగ గింజలు, బ్రాన్ చన, పుట్ట గొడుగులు ఇవి అయిదు పాళ్లు కావాలి. ప్రతిదీ ప్రతి రోజూ తినాలని కాదు. వీలు బట్టి .. అవకాశాన్ని బట్టి.. ►ఆకు కూరలు కాయగూరలు మాత్రం ప్రతి రోజు .. ఆ మాటకు వస్తే ప్రతి పూట ఉండేలా చూసుకోవాలి. కాయగూరల్ని కొన్ని పచ్చివిగా తినొచ్చు . ఉదాహరణ కీర.. మిగతావి మీ టేస్ట్ బట్టి కుక్ చేసి ►కాయగూరల్లో బంగాళాదుంప లాంటివి బియ్యం తో సమానం. అంటే వీటిలో పిండి పదార్థాలు అధికం. కాబట్టి వాటిని తక్కువగా వాడాలి. మీ బ్లడ్ గ్లూకోస్ ఎక్కువ స్థాయిలో ఉంటే అసలు తినకూడదు . ►చికెన్, మటన్, పనీర్ లాంటివి ప్రోటీన్ ను అందిస్తాయి . ఇవి ఎంతో అవసరం . ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీ లు పాడైపోతాయి అనుకోవడం అపోహ. మీ శరీర బరువు 60 కిలోలు ఉంటే మీకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇది వరకే కిడ్నీ సమస్య ఉన్నవారు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవద్దు. ►ఒకటి -రెండు నెలలుప్రతి రోజు .. మీ గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోండి . రెండు కప్పుల తెల్లన్నం తిన్నా , మీ రీడింగ్ 140 దాటడం లేదంటే మీకు షుగర్ సమస్య లేనట్టే . అలాగని ఎక్కువ తెల్లనం తింటే ఊబకాయం వచ్చి భవిషత్తులో షుగర్ సమస్య రావొచ్చు . మీ రీడింగ్ 250 లోపు ఉంటే , మరుసటి పూట అన్నం తగ్గించండి . ఖీర, చికెన్ లాంటివి పెంచండి. ►ఇలా ఒక నెల రోజులు ప్రతి రోజూ మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకొంటుంటే మీ శరీర తత్త్వం మీకే అవగాహన అయిపోతుంది. ఎలాంటి ఫుడ్ తింటే మీ రీడింగ్ 140 లోపే వుందని అర్థం చేసుకొంటారు ►వీలైనంత వరకు 140 లోపు ఉంచేలా ప్రయత్నించండి . 180 దాక అయినా ఫరవాలేదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తూ మీ రీడింగ్ ను 140 దాటకుండా చూసుకొంటే ఎప్పుడో ఒక సారి జిహ్వచాపల్యం తట్టుకోలేక స్వీట్స్ లాంటివి తిని రీడింగ్ కాసేపు 250 టచ్ చేసినా ఏమీ కాదు. అర గంటలో తగ్గిపోతుంది. ►ఇలా మీరు ఆహార నియమాన్ని పాటిస్తూ మీ రీడింగ్ను 140 దాటకుండా రెండు -మూడు నెలలు చూసుకోగలిగితే , అప్పుడు సాయంకాలం ఒక పండు తినొచ్చు . బాగా తీయగా వుండే మామిడి, ద్రాక్ష, అరటి కాకుండా మిగతా పళ్లు.. దీని వల్ల మీ క్లోమం బలపడుతుంది. షుగర్ సమస్య దూరం అయిపోతుంది . ►రెండు మూడు నెలలు రీడింగ్ చూసుకొంటే ఆ తరువాత మీకే ఐడియా వస్తుంది. ఏ ఫుడ్ తినాలి ? ఎంత తినాలి ? ఎంత తింటే రీడింగ్ ఎంత ఉంటుంది? అని. అప్పుడు మీకు మీరే న్యూట్రిషనిస్ట్. ఇలా శాశ్వతంగా డయాబెటిస్ను జయించవచ్చు . మీ రెడింగ్ 300 దాటితే మీకు ఇన్సులిన్ సమస్య తీవ్రంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వాడుతున్న మెట్ఫార్మిన్ లాంటివి ఒక్క సరిగా మానేస్తే షుగర్ లెవెల్స్ భారీగా పెరిగి పోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కిడ్నీ లు దెబ్బ తిని ఉంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ మంచిది కాదు . అలాంటాప్పుడు నేను చెప్పిన పద్ధతిని ఆచి తూచి రిస్క్ లేని రీతిలో నెమ్మదిగా పాటించొచ్చు -వాసిరెడ్డి అమర్నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు -
గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నారా..? ఎంత డేంజర్ అంటే?
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. కానీ కూర్చుని కదలకుండా పనిచేస్తే కొండంత ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయన్నది నేటి సామెతగా మారింది. ఐటీతో పాటు అనేక రంగాల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే డెస్క్జాబ్స్ పెరిగిపోయాయి. ఆ ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చునే ఉండటం, పనిఒత్తిడి కారణంగా వివిధ రకాల వ్యాధులూ పెరిగి పోతున్నాయి. అందువల్ల పనిప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ డెస్క్ వర్క్.. ‘డిస్క్’పై ఎఫెక్ట్.. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో శక్తి ఖర్చు తగ్గి కొవ్వు పేరుకుపోతోంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకపై ప్రభావం పడుతోంది. తొలుత పనిచేసేటప్పుడే ఈ ఒత్తిడి ఉంటుంది. తర్వాత పడుకున్పప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. కొన్నేళ్లలో ఇది పూర్తి స్థాయి డిస్క్ సమస్యగా మారుతుంది. పనిచేసే చోట కూర్చునే తీరులో లోపాలు, దీర్ఘకాల పని గంటలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మణికట్టుపై ‘పని’కట్టు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఈ సమస్య మణికట్టు దగ్గర వస్తుంది. మణికట్టు దగ్గర దాదాపు 15 చిన్నచిన్న కండరాలు ఉంటాయి. వీటిలో ఒక్క కండరానికి వాపు వచ్చినా మిగతా అన్నింటిపై ఒత్తిడి పడుతుంది. దీనితో చేతిలో తిమ్మిర్లులా రావడం, రాత్రి పడుకున్నప్పుడు వేళ్లు వణకడం వంటివి జరగొచ్చు. రోజంతా మౌస్, కీబోర్డు వాడి.. ఆ తర్వాత బైక్ హ్యాండిల్, కార్ స్టీరింగ్ పట్టుకోవాల్సిన అవసరం వల్ల మణికట్టు కండరాలు మరింత అధిక శ్రమకు గురవుతాయి. ఐటీ రంగంలో ఎక్కువగా.. ప్రముఖ వెల్నెస్ సంస్థ సోల్ హెల్త్కేర్ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఓ కంపెనీలో పనిచేసే 784 మందిని ఎంచుకుంటే.. అందులో 179 మంది నడుము నొప్పి, 129 మంది గర్భాశయం, వెన్నెముకలోని కీళ్లు/ డిస్క్లను ప్రభావితం చేసే గర్భాశయ స్పాండిలోసిస్, 65 మందిలో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (చేతుల్లో తిమ్మిర్లు), 61 మందిలో సాక్రోలియాక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ►ఐటీ ఉద్యోగుల్లో గుండె జబ్బులు 147 శాతం ఎక్కువని, వీటితో మరణించే ప్రమాదం 18 శాతం పెరుగుతోందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడైంది. ►ది జర్నల్ ఆఫ్ నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ఎక్కువగా కూర్చోవడం పెద్దపేగు కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదాన్ని 21 శాతం, ఎండోమెట్రియల్ కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం వరకు పెంచుతోంది. కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు దూరం ►కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు వెన్నెముక కుర్చీకి ఆసాంతం ఆనుకునేలా నిటారుగా కూర్చోవాలి. కళ్లకు, స్క్రీన్కు మధ్య తగినంత దూరం ఉండేలా ఉంచుకోవాలి. పాదాలను నేలపై విశ్రాంతిగా ఆనించి ఉంచి మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో కాళ్లు ఉంచాలి. ►మోచేయి ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల కలిగే ‘టెన్నిస్ ఎల్బో’ సమస్య డెస్క్ జాబ్ ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితిలో కీబోర్డు, మౌస్లను వినియోగించేప్పుడు మణికట్టును వదులుగా ఉంచాలి. ►45 నిమిషాల నుంచి గంట కంటే ఎక్కు వసేపు నిర్విరామంగా కూర్చోవడం మంచిది కాదు. మధ్య మధ్యలో నిలబడటం, నడవటం చేయాలి. ►పని సమయంలో కాఫీలు/టీలు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ అవకాశాలు పెరుగుతాయి. ►ప్రతి 20 నిమిషాల పాటు కంప్యూటర్, ల్యాప్టాప్ స్క్రీన్పై పనిచేశాక.. కనీసం 20 సెకన్లపాటు మీకు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ సుధీంద్ర, కిమ్స్ ఆస్పత్రి వైద్యుడు ముందే గుర్తించా.. కంప్యూటర్ ముందు పనిచేయడం మొదలెట్టిన కొన్నినెలల్లోనే ఆరోగ్యంలో తేడా గమనించాను. వేళ్ల తిమ్మిర్లు, నొప్పులు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చాయి. డాక్టర్ను కలిసి వారి సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నా. ఇప్పుడు సమస్యలు తగ్గిపోయాయి. మా సీనియర్లలో చాలా మంది మాత్రం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. – స్రవంతి, ప్రైవేటు ఉద్యోగిని హెల్త్ సెషన్స్ జరుగుతున్నాయి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇప్పుడు సాధారణమైపోయాయి. అనేకమంది జాబ్స్ వదిలేసి సొంత ఉపాధి వైపు మళ్లుతుండటానికి ఇదో కారణం కూడా. అందుకే ఆఫీసుల్లోనే ఆరోగ్యంపై వర్క్షాప్స్ జరుగుతున్నాయి. – సంతోష్, ఐటీ ఉద్యోగి -
అటెన్షన్గా లేకపోతే టెన్షనే! బయటపడటం కష్టమా? డాక్టర్లు ఏమంటున్నారు?
మారుతున్న కాలానికి అనుగుణంగా మానసిక జబ్బులకు గురవుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వైద్యుల పరిశీలనలతో వెల్లడింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో కలవకపోవడం, పలకరించినా స్పందించకపోతుండటంతో సదరు వ్యక్తులను తీసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలోని సర్వజనాసుపత్రికి మానసిక రుగ్మతలతో వస్తున్న వారిని పరిశీలించగా.. మానసిక ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. సగటున 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తేలింది. చాలా మంది మహిళలు లేదా పురుషులు ఈ రుగ్మతలు ఉన్నట్లు కూడా తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తుండటంతో తీవ్రత పెరిగాక వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో.. మగవాళ్లు ఎందుకు ఎక్కువ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో చిన్న చిన్న శారీరక సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారని తేల్చారు. జలుబు, దగ్గు లాంటివి ఎక్కువ రోజులు వేధించినా వారు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. చిన్న విషయానికే నిరాశ.. వాస్తవానికి చెడు అలవాట్లు ఆడవాళ్లలో చాలా తక్కువ. అయినా సరే నిరాశకు గురై మానసిక ఆందోళన చెందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ (నిరాశ)కు గురవున్నారు. మహిళలు చిన్న చిన్న కుటుంబ విషయాలకు కూడా తీవ్రంగా స్పందించడం, ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటు న్నారని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక.. ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళన చెందుతున్నారనేది వైద్యుల అభిప్రాయం. పట్టించుకోకపోతే ముప్పే.. మానసిక రుగ్మతలను పట్టించుకోకపోయినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటివి పెరిగిపోవడంతో అసిడిటీ, అల్సర్ లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాయదుర్గానికి చెందిన 42 ఏళ్ల యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించారు. అతను పనిచేసే ఆఫీసులో తీవ్ర ఒత్తిడి ఉంది. బాస్ నిత్యం వేధిస్తున్నారన్న భావన నెలకొంది. దీంతో రోజు రోజుకూ మానసికంగా కుంగిపోయి సొంతవూరికి వచ్చేశారని వైద్యులు తేల్చారు. ఉరవకొండకు చెందిన 36 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమి చెప్పినా ఆలకించే స్థితి దాటిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. గత ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో కూతురుకు తక్కువ మార్కులు రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. బాధితులు ఎక్కువవుతున్నారు ఫలానా మానసిక రుగ్మత అందరికీ ఉండాలని లేదు. మగవాళ్లలో స్కిజోఫినియా ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ల విషయంలో డిప్రెషన్ ఎక్కువ. సోషియల్ ఎలిమెంట్స్ అంటే సామాజిక కారణాలు.. కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటివి ఒక కారణం. చిన్న చిన్న సమస్యలకు కూడా కొందరు కుంగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి కౌన్సిలింగ్ కావాలి. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్మిషన్ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది ప్రధానంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలకు చదువులో మంచి మార్కులు రాకపోయిన, తమ గోల్ సాధించకపోయిన ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఒత్తిడి ఉంటోంది. అన్ని వయస్సుల వారు ఒత్తిడి బారిన పడుతున్నారు.అలాగే వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆ«ధిపత్యం వంటి ఎన్నో ఒత్తిడికి కారణమవుతున్నాయి. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాం. – డాక్టర్ అనిల్కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ మానసిక ఒత్తిడికి చెక్పెట్టండిలా... ► కనీసం మనిషి రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ► కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. 45 నిముషాల పాటు వాకింగ్, రన్నింగ్ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ► యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడిని జయించవచ్చు. ► తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, చిరు ధాన్యాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటీన్స్, విటమిన్స్తో పాటు మినరల్స్ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. -
కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
బీఎఫ్.7.. కరోనా ఒమిక్రాన్లో సబ్వేరియెంట్. ప్రస్తుతం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు కొత్తేం కాదు. అక్టోబర్లోనే బిఎఫ్.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్ వేరియెంట్ అత్యంత బలమైనది. కరోనా సోకి యాంటీబాడీలు వచ్చిననవారు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. భారత్లో జనవరిలో థర్డ్ వేవ్ వచ్చిన సమయంలో ఒమిక్రాన్లోని బిఏ.1, బీఏ.2 సబ్ వేరియెంట్లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం. ఇన్నాళ్లు అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ ప్రజల్లో కరోనాని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థలేదు. అదే ఇప్పుడు చైనా కొంప ముంచింది. వాస్తవానికి ఇప్పుడు చైనాలో నెలకొన్నలాంటి స్థితిని దాటి మనం వచ్చేశామని కోవిడ్–19 జన్యుక్రమ విశ్లేషణలు చేసే సంస్థ ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. 2021 ఏప్రిల్–మే మధ్యలో డెల్టా వేరియెంట్తో భారత్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్లో బీఎఫ్.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు. అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్.7తో భారత్కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్ వేరియెంట్ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి. చదవండి: దేశంలో క్యాన్సర్ విజృంభణ -
కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 41,914 విద్యుత్ ప్రమాదాలు సంభవించగా.. మహారాష్ట్ర 10,698, ఉత్తరప్రదేశ్ 9,970, గుజరాత్ 3,767 ప్రమాదాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అదే నాలుగేళ్లలో 2,922 ప్రమాదాలు జరిగాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వీటిని సైతం నివారించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విద్యుత్ షాక్కు గరవుతున్నారు. కొన్ని జాగ్రతలు పాటిస్తే పెనుప్రమాదం నుంచి బయటపడవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి వ్యవసాయ పంపుసెట్లకు మోటార్ స్టార్టర్లు, స్విచ్లు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్విచ్లను, పరికరాలను తాకకూడదు. ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడానికి విద్యుత్ అర్హత గల ఎలక్ట్రీషియన్ను పిలిపించాలి. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండి.. 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంబంధిత విద్యుత్ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలి. పంటను జంతువుల బారినుంచి రక్షించేందుకు పెట్టే ఫెన్సింగులకు విద్యుత్ సరఫరా చేయకూడదు. పాడైన విద్యుత్ వైర్లను ఇన్సులేషన్ టేపుతో చుట్టాలి. వాహనాలపై విద్యుత్ తీగలు తగిలితే బయట పడేందుకు హాపింగ్ (గెంతుట, దుముకుట) విధానం అనుసరించాలి. అంతేతప్ప ఒక కాలు వాహనంలోనూ, మరో కాలు నేలపైనా ఉంచకూడదు. వర్షం వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు. నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ మోటారుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్ వైరు వదులై మోటారుపై ప్రభావం చూపుతుంది. విద్యుత్ స్తంభం నుంచి మోటారుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బ్యాక్, స్టార్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మోటార్ వద్ద ఫ్యూజ్లు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్ను చెక్కపై బిగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుప డబ్బాపై బిగించకూడదు. భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉన్నట్టు గుర్తిస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇదీ చదవండి: ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ -
Diwali: బాణసంచా కాల్చేవేళ.. జాగ్రత్తలిలా..
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే 2, 3 రోజులలో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయి అనుమతించదగిన పరిమితి కంటే 200 రెట్లు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల పని తీరుపై క్రాకర్స్ ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అంటున్నారు. ఆరోగ్యంపై దీపావళి క్రాకర్స్ ప్రతికూల ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరివైనా ఊపిరితిత్తులు ఇప్పటికే వ్యాధి తాలూకు దు్రష్పభావాలు కలిగి ఉంటే, క్రాకర్స్ వెలువరించే దట్టమైన విషపూరితమైన పొగకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మరింత దెబ్బతినడం సహా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయవచ్చు. శ్వాస కోస వ్యవస్థకు హాని... ►‘క్రాకర్స్ హానికరమైన వాయు కాలుష్యాలను కలిగి ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు పదార్థాలు శ్వాసకోశ లైనింగ్ (శ్లేష్మ పొర)కు హాని కలిగిస్తాయి. ఆస్తమా, అలర్జీ రోగులకు సమస్యగా పరిణమిస్తుంది. ఇప్పుడు వీరికి మాత్రమే కాకుండా కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా ప్రమాదకరంగా మారింది. భారీ పరిమాణంలో ఫైర్ క్రాకర్స్కు సంబంధించిన పొగ గాలిలో వ్యాపిస్తున్న సమయంలో ఈ రోగులు ఇంటి లోపలే ఉండడం శ్రేయస్కరం’ అంటున్నారు ఇండియన్ చెస్ట్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ రాజేష్ స్వర్ణాకర్. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ► ‘కోవిడ్ వ్యాధితో బాధపడిన కొందరు రోగుల ఊపిరితిత్తుల పనితీరులో మార్పు వచి్చంది. దీపావళి సందర్భంగా, పరిసర గాలిలో నలుసు పదార్థం ఇతర అస్థిర కర్బన సమ్మేళనాలు అపారంగా పెరుగుతాయి. దీనికి గురైనప్పుడు, దీంతో తీవ్రమైన కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు’ అని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ సమీర్ చెప్పారు. పెద్దవాళ్ల పర్యవేక్షణ అవసరం.. ►‘టపాకాయలు కాల్చే సమయంలో ప్రతి చిన్నారి వద్ద పెద్దవారు ఒకరు ఉండి తప్పనిసరిగా వారిని పర్యవేక్షించాలి. ఏవైనా కాలిన గాయాలు, ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్తలను తీసుకోవాలి’ అని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ.ఆప్తల్మాలజీ కన్సల్టెంట్, డాక్టరు అనుభా రాఠి సూచించారు. ► టపాసును కాల్చే సమయంలో పిల్లల్ని ఒంటరిగా వదలవద్దు. రక్షణ ఇచ్చే కంటి అద్దాలను ఉపయోగించాలి. టపాసు వెలిగించే వ్యక్తి నుంచి మిగిలినవారు తగినంత దూరంలో ఉండాలి. క్రాకర్స్ వెలిగించడానికి పొడవైన కొవ్వొత్తి లేదా కాకర పువ్వొత్తిని ఉపయోగించండి. ► దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఉంచుకుని. చర్మం కాలినట్లయితే, కాలినచోట ఎక్కువ నీరు పోయాలి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లండి. సొంత వైద్యం వద్దు. తీవ్రమైన కాలిన గాయాలైతే, మంట ఆరి్పన తర్వాత, ఆ వ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి, వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ►చేతిలో పట్టుకుని టపాకాయలను వెలిగించకండి. వాటిపై వంగి టపాకాయలను వెలిగించవద్దు. సీసా, రేకు డబ్బా లేదా బోర్లించిన కుండవంటి పాత్రలో పెట్టి టపాకాయలను వెలిగించడం ప్రమాదకరం. వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా, కొంతసేపు ఆగి వెళ్లండి. టపాసులను జేబులో పెట్టుకోవద్దు. ౖక్రాకర్స్ కాల్చే సమయంలో సింథటిక్ లేదా వదులుగా ఉన్న దుస్తులు కాక, మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించండి. ►భారీ గాలులు వీచే సందర్భాల్లో బాణసంచా కాల్చవద్దు. కాలినచోట క్రీమ్ లేదా ఆయింట్మెంట్ లేదా నూనెను పూయకండి. బదులుగా వెంటనే వైద్య సహాయం పొందండి. శ్వాసకోశ రోగులూ.. జాగ్రత్త.. బాణసంచా కాల్చడంతో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవారికి ప్రమాదకరం. శ్వాసకోస వ్యాధి రోగులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ ఆ పొగకు 2 రోజుల పాటు దూరంగా ఉండడం మంచిది. కోవిడ్ వల్ల గతంలో లంగ్స్ దెబ్బతిన్నవారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. – డా.జి.వెంకటలక్ష్మి, పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్ ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ– అత్యవసర సహాయక నంబర్లు 040 68102100, 040 68102848, 73311 29653 -
భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి
‘‘నెల నెలా డాక్టర్ దగ్గరకు వెళ్తున్నావా’’ ‘‘న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం తింటున్నావా’’ ‘‘రోజూ వాకింగ్ చేస్తే డెలివరీ సులువవుతుంది’’ ‘‘నీకేం తినాలని ఉందో చెప్పు... చేసి పంపిస్తాను’’ గర్భిణికి ఇలాంటి ఆత్మీయ పలకరింపులెన్నో. ఆత్మీయతలు... ఆనందాలు బయటకు కనిపిస్తాయి. ఆమె మనసు పడే సంఘర్షణ బయటకు కనిపించదు. ఆమె మనసు మౌనంగా మాట్లాడుతుంది. జీవిత భాగస్వామి ఆ మనసు భాషను అర్థం చేసుకోవాలి. తగిన సహకారం అందించాలి. గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. మరొక అడుగు ముందుకు వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోమనే ఓ మంచిమాట కూడా. అయితే గర్భంతో ఉన్న మహిళకు ఈ జాగ్రత్తలతోపాటు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరమనే సున్నితమైన విషయాన్ని చెప్పేవాళ్లుండరు. ‘సైకాలజిస్ట్ను సంప్రదించడం ఎందుకు? ఏ మానసిక సమస్య ఉందని’ అనే ప్రతిస్పందన కొంచెం ఘాటుగా కూడా వినిపిస్తుంటుంది. ‘నిజానికి పై జాగ్రత్తలన్నింటితోపాటు మానసిక విశ్లేషకుల సలహాలు, సూచనలు కూడా అవసరమే. ఆ సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా’ అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్ కాంతి. ఇద్దరికీ కౌన్సెలింగ్ ‘‘ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఉండాలి. తల్లి కావాలనే అందమైన ఆకాంక్ష ప్రతి మహిళకూ ఉంటుంది. అలాగే మాతృత్వం గురించిన మధురోహలతోపాటు అనేకానేక భయాలు కూడా వెంటాడుతుంటాయి. ప్రసారమాధ్యమాల్లో వచ్చే అనేక దుర్వార్తల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తన బిడ్డకు అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే భయం వెంటాడుతూ ఉంటుంది. ఆమె తన భయాలను భర్తతో పంచుకున్నప్పుడు వచ్చే ప్రతిస్పందన చాలా కీలకం. నిర్లక్ష్యంగానో, విసుగ్గానో రెస్పాండ్ అయితే గర్భిణి మనసుకయ్యే గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే గర్భిణిలో తలెత్తే శారీరక, మానసికమైన మార్పుల గురించిన అవగాహన భర్తకు ఉండి తీరాలి. అందుకే కౌన్సెలింగ్కి ఇద్దరూ రావాలని చెబుతాం. కొంత మంది భర్తలు ప్రెగ్నెంట్ ఉమన్తో వాళ్ల తల్లిని లేదా సోదరిని పంపిస్తుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి రాజీలు ఉండకూడదని చెబుతుంటాం. భార్య మానసిక స్థితిలోని సున్నితత్వం స్థాయులు భర్తకు అర్థమైనప్పుడే అతడు భార్యకు అన్ని వేళల్లోనూ అండగా నిలబడగలుగుతాడు. మెంటల్ వెల్బీయింగ్ గురించిన అవగాహన ఇద్దరిలో ఉన్నప్పుడే పాపాయిని జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా పరిణతితో వ్యవహరించగలుగుతారు. మూడో వ్యక్తికి సాదర స్వాగతం సాధారణంగా మన ఇళ్లలో గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. డెలివరీ తర్వాత బాధ్యతలన్నీ ఆమె భుజాల మీద మోపుతూ జాగ్రత్తల పేరుతో ఆమెను కట్టడి చేస్తుంటారు. నిజానికి ఈ దశలో భర్త సపోర్టు చాలా అవసరం. పోస్ట్ పార్టమ్ డిజార్డర్ ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. మహిళ తన జీవితం ఒక్కసారిగా స్తంభించి పోయినట్లు భావిస్తుంది. ఒంటరితనం, నెగిటివ్ థాట్స్, ‘అందరూ సంతోషంగా ఉన్నారు... నా జీవితమే ఇలాగైంది, సోషల్ లైఫ్కు దూరంగా ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమైపోయింది జీవితం... అని దిగులు పడడం వంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది మగవాళ్లకు తండ్రి అయిన తర్వాత కూడా లైఫ్స్టయిల్ ఏమీ మారదు. ఆడవాళ్ల విషయంలో అందుకు పూర్తిగా భిన్నం. అలాంటప్పుడే భర్త పట్టించుకోవడం లేదనే న్యూనత కూడా మొదలవుతుంది. అందుకే పోస్ట్ డెలివరీ ప్రిపరేషన్ గురించి డెలివరీకి ముందే భార్యాభర్తలిద్దరినీ మానసికంగా సిద్ధం చేయడం జరుగుతుంది. మగవాళ్లు తండ్రి అయిన సంతోషాన్ని బయట స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు, ఇంట్లోనే స్నేహితులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి భార్యను కూడా వేడుకలో భాగస్వామ్యం చేయాలి. పెటర్నిటీ లీవ్ సౌకర్యం ఉంటుంది. ఆ సెలవు తీసుకుంటారు, కానీ భార్యకు సహాయంగా ఉండక ఇతర వ్యాపకాలతో గడిపే వాళ్లూ ఉంటారు. కానీ తమ కుటుంబంలో మూడో వ్యక్తికి స్వాగతం పలికే క్రమంలో ప్రతి దశలోనూ భర్తను భాగస్వామ్యం చేయగలిగితే ఇలాంటి పరిణామాలుండవని నా అభిప్రాయం. డెలివరీ అయిన మహిళలకు దేహాకృతి విషయంలో ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంటుంది. దేహం తిరిగి మామూలు కాదనే భయం వెంటాడుతుంటుంది. మరికొందరు... నా బిడ్డకు నేను చేయాల్సినంత చేయడం లేదేమో, నేను మంచి తల్లిని కాలేనేమో అని బాధపడుతుంటారు. ఒక్కొక్కరైతే తమలో తామే బాధపడుతూ మౌనంగా రోదిస్తుంటారు, పెద్దగా వెక్కి వెక్కి ఏడుస్తారు కూడా. భావోద్వేగ పరమైన అసమతుల్యతకు లోనవుతున్న విషయాన్ని గుర్తించలేకపోతారు. మా కౌన్సెలింగ్లో భార్యాభర్తలిద్దరికీ ఇలాంటి విషయాలన్నింటి మీద అవగాహన కల్పిస్తాం. కాబట్టి భార్య మానసికంగా న్యూనతకు లోనయినప్పుడు ఎమోషనల్ సపోర్టు ఇవ్వాలనే విషయం మగవాళ్లకు తెలుస్తుంది. – ఎమ్. కాంతి, క్లినికల్ సైకాలజిస్ట్ హైదరాబాద్ చర్చ కావాలి... వాదన వద్దు! ఇక చంటి బిడ్డను చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ‘ఫలానా ఆమె తన బిడ్డను కింద పెట్టకుండా ఒంటి చేత్తో పెంచుకుంటోంది’ వంటి స్టేట్మెంట్లు అలవోకగా ఇచ్చేస్తుంటారు. ఆ మాటల ప్రభావంతో అన్నీ తనే చూసుకుంటూ సూపర్ మామ్ కావాలనే అవసరం లేని పట్టుదలకు కూడా పోతుంటారు చంటిబిడ్డల తల్లులు. ఇలాంటి కామెంట్లకు ప్రభావితం కాకుండా, విపరీత పరిణామాలకు తావివ్వకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇద్దరికీ అవగాహన ఉంటే చంటిబిడ్డను పెంచడంలో భార్యాభర్తలిద్దరూ సమంగా బాధ్యతలు పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్నీ చక్కగా చర్చించుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తాం. అలాగే ఇద్దరి మధ్య డిస్కషన్ వాదనకు దారి తీయకూడదనే హెచ్చరిక కూడా చేస్తాం. సామరస్యమైన చర్చ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. వితండ వాదన వివాదానికి దారి తీస్తుంది. మన సంప్రదాయ పెంపకంలో... మగవాళ్లను అనేక విషయాలకు దూరంగా ఉంచడమే జరిగింది ఇంతవరకు. భార్యకు ఎమోషనల్ సపోర్టు ఇవ్వడం, బిడ్డ పెంపకంలో బాధ్యతను పంచుకుంటూ బాలింతకు విశ్రాంతినివ్వడం వంటివేవీ మగవాళ్లకు తెలియచేయడం ఉండదు. అందుకే ఏ విషయంలోనైనా భర్త తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే అది అతడికి ఎలా స్పందించాలో తెలియక పోవడం కూడా అయి ఉండవచ్చు. అపోహ పడడానికి ముందు అతడికి తెలియచేసే ప్రయత్నం చేయాలని కూడా మహిళలకు చెబుతుంటాం. భార్యకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యతను భర్తకు గుర్తు చేస్తుంటాం’’ అన్నారు కాంతి. – వాకా మంజులారెడ్డి -
వర్షాకాలంలో పాముల బెడద.. అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి బుధవారం పొలం పనికి వెళ్లాడు. కాలుకి ఏదో విష పురుగు కరిచిందని గుర్తించాడు. నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిమిషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనకు కరిచింది విషపురుగు కాదని, చంద్రపొడి (రెసెల్స్వైపర్) జాతికి చెందిన విష సర్పం కాటువేసిందని గమనించి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. కేవలం అవగాహన లోపంవల్ల రైతు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ మంగళవారం పొలంపని నిమిత్తం తన పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన తక్షణమే ఎటువంటి భయానికి గురికాకుండా తన దగ్గరలోవున్న పీహెచ్సీకి వెళ్లి స్నేక్యాంటీ వీనం వ్యాక్సిన్ను చేయించుకున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండేళ్లలో 493 మంది పాముకాటుకు గురయ్యారు. చాలామంది సకాలంలో ఆస్పత్రికి చేరడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే మృతిచెందారు. అవగాహన ఉంటే పాముకరిచినా ప్రమాదం కాదని, సకాలంలో వైద్యసేవలు అందితే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తతే ప్రధానం.. వర్షా కాలం ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకో వటానికి అనేక ప్రాంతాలను నివాస స్థలాలుగా ఎంపిక చేసుకొంటాయి. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతోపాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకుంటాయి. కావున అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచుకోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవటం చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు. విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాము కాటు లక్షణాలు, చికిత్స.. ► పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావడంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. ► పాము కాటుకు గురైన వ్యక్తిని కంగారుపెట్టరాదు. ఆందోళనకు గురయితే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తిచెందే అవకాశంఉంటుంది. ► పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి. ► వేగంగా యాంటీ వీనమ్ను అందించగల ఆరోగ్య కేంద్రానికి వ్యక్తిని తీసుకెళ్లాలి. ► కాటుకు దగ్గరగా గుడ్డను/వస్త్రాన్ని గట్టిగా కట్టరాదు, ఇది ప్రసరణను తగ్గిస్తుంది. ► గాయం కడగరాదు. గాయం మీద ఐస్ను పెట్టరాదు. ► గాయం నుంచి విషాన్ని బయటకు పీల్చడానికి ప్రత్నించరాదు. మెరుగైన వైద్యం పాముకాటు బారిన పడి న వ్యక్తికి పీహెచ్సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు సిద్ధం చేశాం. పాముకాటుకు గురైన వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవాలి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్వీనం డోస్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రధానంగా భయపడకుండా నిర్భయంగా ఉండాలి. – డాక్టర్ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం -
పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వొదిలి వెళ్తున్నారా..?
ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు కాపలా ఉండే రోజులు పోయాయి. తల్లిదండ్రులు ఉద్యోగాలకు.. వేరే ఏవైనా పనులకు వెళ్లాలి. నగరాల్లో అయినా పల్లెల్లో అయినా ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా పిల్లల్ని ఒదిలి వెళ్లక తప్పడం లేదు. గంటలో వచ్చేస్తాం.. రెండు గంటల్లో వచ్చేస్తాం.. అని చెప్పి వెళ్లినా ప్రాణం పీకుతూనే ఉంటుంది. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పిల్లలు ఇంట్లో ఉంటే తాతయ్యో అమ్మమ్మో గతంలో చూసుకునేవారు. ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన మేనత్తో చదువుకుంటున్న బాబాయో ఉండేవారు. లేదంటే పక్కింట్లో కూచోబెట్టి వెళ్లేవారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపుగా ఏ ఇంట్లోనూ సాధ్యం కావడం లేదు. ఉదయం లేచి పిల్లలు స్కూలుకు వెళ్లి సాయంత్రం వారు ఇంటికి చేరుకునే సమయానికి తల్లో, తండ్రో ఇంట్లో ఉంటే ఒక సంగతి. లేదా తల్లిదండ్రులు వచ్చేలోగా ఆ ఒకటి రెండు గంటల సమయాన్ని పిల్లలు తాళం తీసుకుని ఒంటరిగా ఉండాల్సి వస్తే వాళ్ల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు పిల్లల సెలవు రోజుల్లో వారు రానవసరం లేని పనులు ఉంటాయి. కార్యాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్దలు సినిమాకు వెళ్లాలనుకుంటే వారికి నచ్చని వాటికి రారు. ఇద్దరు పిల్లలు ఉంటే వారు ఒకరికొకరు తోడుంటే కొంత బెటర్. కాని ఒక్కరే సంతానం ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసులో ఒంటరిగా వదలొచ్చు? ఇది చాలా ముఖ్యమైన విషయం. అమెరికాలో దీనిపై పరిశోధన చేసిన వాలెంటీర్ల బృందం 12 ఏళ్లు వచ్చాకే పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లొచ్చని, పన్నెండు లోపల వదిలితే వారిని ప్రమాదంలో నెట్టినట్టేనని తేల్చారు. 12 ఏళ్ల లోపు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం ‘చట్టప్రకారం నేరం’ అని నిర్ధారించే వరకు కొన్ని పాశ్చాత్య దేశాలు వెళుతున్నాయి. మన దేశంలో ఈ దిశగా ఏ చర్చా లేకపోయినా 12 ఏళ్లలోపు పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలి రెండు మూడు గంటలు వెళ్లడం వారి పట్ల ‘నిర్లక్ష్యం’ వహించడమేనని నిపుణులు అంటున్నారు. గ్యాస్, కరెంట్ ప్లగ్గులు ఇంటి నుంచి పెద్దలు పిల్లల్ని వదిలి వెళ్లేప్పుడు తప్పనిసరిగా గ్యాస్ను, అనవసరంగా ఆన్లో ఉన్న స్విచ్లను (గీజర్/ఐరన్ బాక్స్/మిక్సీ) ఆఫ్ చేసి వెళ్లాలి. వాటి దగ్గరకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాలి. ఒక ఫోన్ ఇంట్లో వదిలి వెళ్లాలి. దానికి స్క్రీన్ లాక్ ఉంటే ఎలా తీసి కాల్ చేయాలో నేర్పించాలి. అంతే కాకుండా అపార్ట్వెంట్/ఇరుగు పొరుగులలో నమ్మకమైన మిత్రుని నంబర్ ఏదో చెప్పి అది ఏ పేరుతో ఫోన్లో ఉందో చూపాలి. అర్జెంట్ అనిపిస్తే ఆ ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేయమని చెప్పాలి. తల్లిదండ్రుల నంబర్లు, ఊళ్లోనే ఉన్న దగ్గరి బంధువుల (బాబాయ్/పిన్ని) నంబర్లు మొత్తం నాలుగైదు కంఠతా వచ్చి ఉండేట్టు చూడాలి. ఫ్రిజ్ మీద కూడా ముఖ్యమైన నంబర్లను కాగితం మీద రాసి అంటించి ఉంచవచ్చు. తలుపు ఎవరికి తీయాలి తలుపు ఎవరికి తీయాలి అనేది మరో ముఖ్యమైన సంగతి. అపరిచితులు ఎవరో... స్నేహితులు ఎవరో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అపరిచితులు ఏం చెప్పినా తలుపు తియ్యనే కూడదని నేర్పాలి. పరిచితులు మీరు లేని టైమ్లో వస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. వారు మరీ ముఖ్యులైతే పిల్లలకు పరిచయం ఉంటే వారు వచ్చినప్పుడు మాత్రమే తలుపు తీయాలని చెప్పాలి. గ్యాస్/పేపర్ బిల్/ పాల బిల్ వీటి కోసం వచ్చినా తలుపు లోపలి నుంచే మళ్లీ రండి అని చెప్పి పంపించేయడం నేర్పాలి. తలుపు లోపలి నుంచి గడి పెట్టుకోవడం లేదా తలుపు తీసి ఉంచి గ్రిల్కు తాళం వేసి పెట్టుకోవడం నేర్పాలి. తాళం ఒక గుర్తుండే చోటులో పెట్టుకోవాలని చెప్పాలి. తాళం వేశాక దానిని ఎక్కడో పడేసి మర్చిపోకుండా ఈ ఏర్పాటు. ముఖ్యం ఎవరికీ అనవసరంగా ఫోన్ చేయకూడదని ఎవరైనా ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పకుండా తర్ఫీదు ఇవ్వాలి. పదిహేనేళ్లు దాటే వరకూ పిల్లల్ని ఒంటరిగా వదిలితే తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రమాదాలను నివారించాలి. ఆహారం, యాక్టివిటీ పిల్లలు ఒంటరిగా ఉన్నంత మాత్రాన వాళ్లు ఇంట్లో ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందన్న సంకేతం ఇవ్వరాదు. ‘కాసేపు టీవీ చూడు... కాసేపు ఫోన్ చూడు... మిగిలిన టైమ్లో ఇదిగో ఈ పుస్తకం చదవాలి, ఈ బొమ్మ గీయాలి, ఈ పజిల్స్ ఫిల్ చేయాలి’... ఇలా టాస్క్ ఇచ్చి వెళ్లాలి. మీరొచ్చే సమయానికి టాస్క్ పూర్తి చేస్తే మెచ్చుకోలు కానుకలు తప్పక ఇవ్వాలి. బయటకు వెళ్లే పని ఆలస్యం అవ్వొచ్చు ఒక్కోసారి. అందుకని వారి కోసం స్నాక్స్ తప్పక పెట్టాలి. ఏదైనా తేలికపాటి టిఫిన్ బాక్స్ పెట్టి ఏది ఎప్పుడు తినాలో చెప్పాలి. పిల్లలు మందులు వేసుకోవాల్సి ఉంటే ఆ మందులు మనమే ఒక దగ్గర పెట్టాలి... అధిక డోసు ప్రమాదం లేకుండా... వేరే మందులు వేసుకోకుండా. నో హెడ్ఫోన్స్ పిల్లలు హెడ్ఫోన్స్ పెట్టుకుని సినిమా/ కంప్యూటర్/ ఫోన్ చూడటాన్ని ఆ టైమ్లో నిషేధించాలి. ఎందుకంటే ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని హెడ్ఫోన్స్లో వింటుంటే బెల్ కొట్టినా ఫోన్ మోగినా వినపడదు. తల్లిదండ్రులు కాల్ చేస్తే రెస్పాన్స్ రాకపోతే అనవసరంగా కంగారు పడాల్సి వస్తుంది. అలాగే తలుపు తీసి పెట్టి పక్కింటికి వెళ్లడం, కారిడార్లో ఆడుకోవడం, ఇంటి బయట సైకిల్ తొక్కడం చేయరాదని చెప్పాలి. పెద్దలు ఎంత ముఖ్యమైన పని మీద బయటకెళ్లినా మధ్య మధ్య పిల్లలకు ఫోన్ చేసి వారు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అలాగే వెళ్లే ముందు ఇరుగు పొరుగున ఉన్న నమ్మకమైన వ్యక్తులకు తాము బయటకు వెళుతున్నట్టు తెలియ చేస్తే వారు ఒక కన్ను వేసి పెట్టే వీలుంటుంది. -
కామ్గా ఉంటే కబళించే దోమ కాటు.. క్యూలెక్స్, ఏడిస్, అనాఫిలిస్తో జరపైలం!
నేరడిగొండ (ఆదిలాబాద్): వర్షాకాలం కావడంతో దోమల సీజన్ మొదలైంది. చిన్నదోమే కదా.. కుడితే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దోమల నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల వ్యాప్తితో ప్రమాదం.. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రా ంతాల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి. గు డ్డు, లార్వా, ప్యూపా వృద్ధి చెంది దోమగా మారి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈప్రమాదాన్ని ని వా రించాలంటే నీటిని సక్రమంగా వినియోగించా లి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. క్యూలెక్స్తో దోమ కాటుతో హఠాత్తుగా జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలో పెరిగే క్యూలెక్స్ దోమతో ఈవైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. పంట పొలాలు, పెద్ద పెద్ద స్థలాలు, మైదానాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ఏడిస్ దోమతో.. 1 ఆకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్లుగానే తగ్గి వారం లేదా పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. ఏడిస్ దోమ కాటు కారణంగా ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాళ్లలో నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. డెంగీ, చికెన్గున్యా వ్యాధి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. నెలల తరబడి నొప్పులు బాధిస్తాయి. దీని నివారణ కోసం దోమల పెరుగుదలను అరికట్టాలి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. దోమ కాటుకు గురైతే.. అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. వ్యాధి ప్రారంభంలో సరైన చికిత్స చేయించకపోతే నెలల తరబడి బాధిస్తుంది. గర్భిణులకు, చిన్నారులకు ఈవ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి. సకాలంలో మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
‘కల్తీ’ కథలు.. ఒకటేమిటీ అన్నీ అంతే.. తినేదెలా? బతికేదెలా?
కేసరి దాల్పైనే దాడులు పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలోని ఓ ఇంట్లో దాచిన 112 బస్తాల నిషేధిత కేసరిదాల్ను 2017లో సీజ్చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ నుంచి సరుకు ఇక్కడికి అక్రమంగా వస్తున్నట్టు అప్పట్లో అధికారుల విచారణలో తేలింది. 2018లో సైతం పుడ్సేప్టీ అధికారులు పలమనేరు ప్రాంతంలోని పలు వారపుసంతల్లో కల్తీ సరుకులపై దాడులు చేపట్టి భారీగా జరిమానాలు విధించారు. ఎముకలతో నూనెలు పలమనేరు సమీపంలోని గడ్డూరు వద్ద ఓ ఇంట్లో టన్నులకొద్దీ దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కబేళాలనుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా వంటనూనెలపై తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసి, ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ కల్తీ సరుకును మార్కెట్లో్లకి తెచ్చి అమ్మకాలు మొదలెట్టారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతోంది. చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం అక్రమార్కులకు కలసి వచ్చింది. తమిళనాడు నుంచి యథేచ్ఛగా కల్తీ సరుకు మార్కెట్లోకి దిగుతోంది. వారపు సంతల్లో అమ్ముడవుతోంది. మరోవైపు దుకాణాలు, హోటళ్లు, టీ స్టాళ్లు వంటి ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతోంది. ఇలా కల్తీ సరుకు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరు (చిత్తూరు): జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరందుకుంది. పప్పు దినుసులు, టీపొడి, నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతోపాటు కేసరి దాల్ అమ్మకాలు వారపు సంతల్లో భారీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కల్తీ సరుకులు ఇక్కడికి గుట్టుగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలను తింటే అనారోగ్యం తప్పదని తెలిసినా ఫుడ్సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కల్తీ ఇలా వంటనూనెలే అధికం దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం, రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలో, ఏది నకిలీనో కనుక్కోలేకపోతున్నారు. బియ్యం మొదలుకొని శెనగపప్పు, కందిపప్పు, చక్కెర, పెసరపప్పు, మైదాపిండి, గసాలు, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఆఖరుకు వంటనూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా దుకాణాల్లో లభించే ప్రముఖ కంపెనీల నూనె ప్యాకెట్లు ఈ ప్రాంతంలోని వారపు సంతల్లో సైతం అదే కంపెనీల పేరుతో నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ధరలో కూడా భారీ తేడా ఉండడంతో ప్రజలు ఎగబడి వీటినే కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా లీటరు ప్యాకెట్లలో 900 మిల్లీలీటర్ల నూనె నింపి సులభంగా సొమ్ముచేసుకుంటున్నారు. చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు జిల్లా మొత్తానికి ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వారు దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంబందిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీలు చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆహార కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడునుంచి వచ్చిన కల్తీ టీపొడి టీపొడి భారీ వ్యాపారం కల్తీ టీ పొడి అక్రమార్కుల పంట పండిస్తోంది. సాధారణంగా మార్కెట్లో పావు కిలో బ్రాండెడ్ టీ పొడి కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెట్టాలి. అంటే కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. అది కల్తీ టీ పొడి అయితే కిలో రూ.170కే దొరుకుతోంది. వినియోగించిన టీ పొడిలో చింతగింజల పొడి, రసాయనాలతో కూడిన చాక్లెట్ పొడి కలిపి చౌకగా దొరికే టీ పొడిని విక్రయిస్తున్నారు. ఈ చాక్లెట్ పొడిని కలపడం వల్ల ఎంత ఉడికించినా టీ రంగు మారదు. జిల్లాలోని పలు టీ దుకాణాల్లో ఈ కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీని వల్ల వ్యాపారులకు ఆదాయం అధికంగా వస్తోంది. క్వింటాళ్ల కొద్దీ కల్తీ టీ పొడిని జిల్లాలోని మార్కెట్లో విక్రయించేస్తున్నారు. నిల్వ ఉంచిన కేసరిదాల్ను సీజ్ చేసిన అధికారి (ఫైల్) కేసరి దాల్పై 1961 నుంచే నిషేధం జిల్లాలో ప్రమాదకర కేసరి దాల్(లంకపప్పు) అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఖాయం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అశోం రాష్ట్రాల్లో విరివిగా పండే లతిరస్ సటివస్ అనే మొక్క గింజలను పప్పులుగా చేస్తారు. వాటికి రసాయన రంగులను కలిపి కేసరి దాల్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో న్యూరో టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని తింటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం 1961 నుంచి ఈ పంటపై నిషేధం విధించింది. కానీ ఈ పప్పు ధర చౌకగా ఉండడంతో జనం దీన్ని కొనుగోలు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో పలమనేరు సమీపంలో అధికారులు సీజ్ చేసిన ఎముకల గోడోన్ కబేళాల నుంచి బోన్ ఆయిల్ జిల్లాలోని పలు పట్టణాల్లో తమిళనాడులోని కబేళాలతో లభ్యమయ్యే ఎముకలనుంచి తయారవుతున్న నూనెలను లూజు పామోలిన్, శెనిగనూనెలో కలిపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు, నగిరి, పుత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు, కొన్ని హోటళ్లలో బిరియానీ, బోండా, బజ్జీలతో పాటు స్వీట్స్టాల్స్లో ఈ కల్తీ నూనెలు వినియోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ కల్తీ దందాను నడిపిస్తున్నారు. కారుచౌకగా ఈ నూనెను జిల్లాలో విక్రయిస్తున్నట్టు సమాచారం. పొట్టేలు మటన్లో లేగదూడల మాంసాన్ని సైతం కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తాయి వంటనూనెల కల్తీతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తొలుత గ్యాస్స్ట్రిక్తో ఈ సమస్య ప్రారంభమై ఆ తర్వాత తీవ్ర స్థాయికి వెళుతుంది. కల్తీ ఆహార పదార్థాలను తిన్న వెంటనే చర్మంపై దురదలు, అలర్జీ వచ్చిందంటే వెంటనే అక్కడ కల్తీ జరిగినట్లు భావించవచ్చు. కల్తీ అయిన నూనెలతో తయారు చేసే ఆహారపదార్థాలు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరం. – డా.హరగోపాల్, వైద్యాధికారి, పలమనేరు ఏరియా ఆస్పత్రి ఆకస్మిక దాడులు చేస్తాం జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు, వంటనూనెలు, హోటళ్లలో మాంసాహార పదార్థాలు, పప్పులు, రెండోరకం వస్తువులు, వారపుసంతలో విడి విక్రయ సరుకులపై త్వరలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మన జిల్లాలో కల్తీ సరుకుల విక్రయానికి అవకాశం ఉంటుంది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరతో లభిస్తోందని ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు. – సతీష్కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్, చిత్తూరు -
కాంగ్రెస్ గడ్డి అంటే తెలుసా? దీనితో అలర్ట్గా ఉండకపోతే ఆగమే..
జగిత్యాల అగ్రికల్చర్: పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న వయ్యారి భామ మొక్కలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి మనుషుల అనారోగ్యానికి కూడా కారణమవుతున్నాయి. పార్థీనియం.. వయ్యారిభామ.. కాంగ్రెస్ గడ్డి.. క్యారెట్ గడ్డి.. నక్షత్ర గడ్డి.. ఇలా రక రకాల పేర్లతో పిలిచే ఈ మొక్కను శాశ్వతంగా నిర్మూలించాలని శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనిపిస్తున్నాయి. 1950లో మన దేశంలోకి.. 1950లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలతో ఈ విత్తనం మన దేశంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే అంతటా విస్తరించింది. బంజరు, పంట భూములు, జనవాసాలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు, పెట్రోల్ బంకులు, కాల్వలు, పొలాల గట్లపైన, బీడు భూములు, బస్ స్టాపులు, పాడుబడ్డ ప్రదేశాల్లో వయ్యారిభామ మొక్కలు పెరుగుతాయి. ఇది ఏకవార్షిక మొక్క. 90 నుంచి 150 సెం.మీ. ఎత్తు ఉంటుంది. ఒక్కో మొక్క 50 నుంచి 80 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. వైరస్లకు ఆశ్రయం వయ్యారిభామ ఒక్క పంటలకే కాదు మనుషులకు, జంతువులకు ఎంతో హాని చేస్తుంది. పంటల దిగుబడిని 40 శాతం, పశుగ్రాస దిగుబడిని 90 శాతం వరకు తగ్గిస్తుంది. ఇది ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులు టమాట, మిరప, మొక్కజొన్న, వంగ పూతలపై పడినప్పుడు వాటిలో ఫలదీకరణం నిలిచిపోతుంది. కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కల్లో వివిధ రకాల చీడపీడల వ్యాప్తికి కారణమవుతుంది. పార్థీనియం ద్వారా మనుషులకు చర్మవ్యాధులు, కళ్లు ఎర్రబడటం, జలుబు, తీవ్ర జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీకిన వెంటనే తగులబెట్టాలి పార్టీనియం మొక్కను పూతకు రాకముందే పీకి, వెంటనే తగులబెట్టాలి. పూతకు వచ్చిన తర్వాత చేస్తే వాటి నుంచి విత్తనాలు రాలి, మళ్లీ కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. తాత్కాలిక నివారణ ఇలా.. రోడ్ల పక్కన, ఇంటి పరిసరాల్లో లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలుపు మందును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పార్థీనియం మొక్క మొలకెత్తితే 15 నుంచి 20 రోజుల తర్వాత లీటర్ నీటికి 5 నుంచి 7 మి.లీ. పారాక్వాట్ కలిపి, పిచికారీ చేయాలి. వర్షాలతో ఎక్కువవుతున్నాయి ఎన్నిసార్లు దున్నినా వయ్యారిభామ మొక్కలు శాశ్వతంగా పోవడం లేదు. వర్షాలతో ఎక్కువవుతున్నాయి. రసాయన మందు పిచికారీ చేస్తే, 2, 3 నెలల్లోనే మళ్లీ పెరుగుతున్నాయి. – ఏలేటి జలంధర్ రెడ్డి, ఇటిక్యాల, రాయికల్ మండలం పూతకు వచ్చే ముందే దున్నేయండి వయ్యారిభామ మొక్కలను పూత వచ్చే ముందే దున్నేయాలి. తర్వాత ఆ మొక్కలను ఏరి, కాల్చివేయాలి. వేసవిలో లోతు దుక్కులు చేస్తే కొంత వరకు వీటిని నివారించవచ్చు. – డాక్టర్ పద్మజ, వ్యవసాయ శాస్త్రవేత్త, పొలాస -
మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?
దూరాన మేఘాలు గర్జిస్తున్నాయి. ఆకాశం నీళ్ల ధారలు కుమ్మరించనుంది. మరి వానలకు మీ ఇల్లు సిద్ధమేనా? కొట్టాల్సిన కొమ్మలు నాటాల్సిన మొక్కలు చెక్ చేయాల్సిన పైకప్పులు వాననీళ్లు పారాల్సిన తూములు విద్యుత్ తీగల నుంచి భద్రత దోమల నివారణకు తెరలు పిల్లలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రెడీ అవుదాం. మన దేశంలో వానకాలం వస్తే దృష్టి సగమే ఉంటుంది. అంటే? రోడ్డు ఉంటుంది... అది రోడ్డో కాదో తెలియదు. వీధి ఉంటుంది. అది వీధో కాదో తెలియదు. నీళ్లు కప్పిన నేలను ఏ లేపనం పూసుకున్నా ఎగురుతూ దాటలేము. కాలో, బండి చక్రమో వేయాల్సిందే. గోతుల్ని చూసుకోకపోతే పడాల్సిందే. అందుకే తీరిగ్గా కాకుండా ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అది ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నవారైనా, అపార్ట్మెంట్లలో ఉంటున్నవారైనా. చెట్లు... మొక్కలు ఇది చెట్లు మొలిచే సమయం. చెట్లు ఊగే సమయం కూడా. మన ఇంట్లో వేసుకోవాల్సిన కొత్త మొక్కల కోసం కుండీలను, వాటికి అవసరమైన స్థలాలను గుర్తించాలి. పాతవి, డొక్కువి, పగిలిపోయినవి, అడుగుపోయినవి ఇప్పుడే పారేయాలి. ఈ వానల్లో తడిసిన కొత్త మొక్కల్ని చూడటం ఎంతో బాగుంటుంది. అలాగే ఇళ్లల్లో గాని అపార్ట్మెంట్ చుట్టూగాని పెరిగిన చెట్లు ఎలా ఉన్నాయి... వాటి కొమ్మల ధాటి ఎలా ఉంది చూసుకుని విరిగి పడేలా ఉండే వాటిని కొట్టించేయాలి. చాలా ఇళ్లకు, అపార్ట్మెంట్లకు సోలార్ ఫెన్సింగులు ఉన్నాయి. గాలివానలకు పెద్ద చెట్ల వల్ల వీటికి నష్టం జరక్కుండా చూసుకోవాలి. అలాగే ఏ మొక్కా, చెట్టూ లేకుండా కళావిహీనంగా ఉన్న ఇంటిని, అపార్ట్మెంట్లను ఈ సీజన్లో మొక్కలతో నింపుకోవాలి. అందుకు అవసరమైన మట్టిని, పనిముట్లను, బడ్జెట్ను కూడా సిద్ధం చేసుకోవాలి. గోడలు... కిటికీలు.. పైకప్పులు వాన నీరు నెత్తి మీద చేరే కాలం ఇది. ప్రతి ఇంటి పైకప్పును క్షుణ్ణంగా చెక్ చేయించుకోవాలి. లీకేజీ లేకుండా ఇప్పుడే నిపుణులతో పూడ్చుకోవాలి. వాటర్ప్రూఫ్ కోటింగ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంటి బయటి గోడలకు వాటర్ప్రూఫ్ పెయింటింగ్ చేయించుకోవడం కూడా ఒక మంచి సంరక్షణ. పైకప్పు మీద వాన నీరు నిలువ ఉండకుండా వాలును, నీరు బయటకు వెళ్లే పైపులను చెక్ చేసుకోవాలి. ఇంటి గోడల చుట్టూ ఉండే స్థలంలో నీటి గుంటలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఆ గుంటల్లోని నీరు గోడలని దెబ్బ తీస్తుంది. కాంపౌండ్ వాల్స్గా చాలా పాత గోడలైతే కనుక వాటికి చుట్టుపక్కల పిల్లలు ఆడుకోకుండా ఉండటమే కాదు వెహికల్స్ పార్క్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోడలు, చెట్లు కూలి వాహనాలు ధ్వంసం కావడం ఈ సీజన్లో సాధారణం. కనుక బయట పార్క్ చేసేప్పుడైనా ఇంటి దగ్గర పార్క్ చేసేప్పుడైనా పరిస్థితి అంచనా వేసుకోవాలి. అలాగే గాలికి, నీటి ధాటికి కిటికీలు నిలుస్తాయో లేదో చూసుకుని ఇప్పుడే రిపేర్లు చేసుకోవాలి. విద్యుత్ స్తంభాల నుంచి వైర్లు కిందకు వేళ్లాడి ఉంటే వాటిని సరి చేయించుకోవాలి. మన ఇంటి గోడలకు, శ్లాబ్లకు ఈ వైర్లు తగలకుండా చూసుకోవాలి. పాత సామాను పారేయండి ఇది వెలుతురు, ఎండ తగలని సమయం. ఇంట్లో పాత సామాను, చల్లదనానికి ముక్కిపోయే సామాను ఉంటే ఇప్పుడే వదుల్చుకోవడం మంచిది. మంచి వానల్లో చెత్త పారేయడం కూడా సాధ్యం కాదు. అలాగే ఇప్పటి వరకూ వాడిన కూలర్ల వంటి వాటిని అడ్డం లేకుండా అటక ఎక్కించడం మంచిది. అలాగే ఇంట్లో ఉండే ఫర్నీచర్, కప్బోర్డులు వాసన కొట్టకుండా, పురుగు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దోమలు, ఈగలు పెరిగే కాలం. దోమలు ఇళ్లల్లోకి దూరకుండా మెష్లు కొట్టడం, పాతవి రిపేరు చేసుకోవడం తప్పదు. మరీ ఎక్కువ దోమలున్న ఏరియాల్లో వారు దోమతెరలు తెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా చిన్నారులు ఉంటే. డాక్యుమెంట్లు జాగ్రత్త చాలా మంది డాక్యుమెంట్లను చెక్క బీరువాల్లో, టేబుళ్లలో పెట్టుకుంటారు. ముఖ్యమైన సర్టిఫికెట్లు, దస్తావేజులు... ఇవన్నీ ఈ కాలమంతా పూర్తిగా పొడిగా ఉండే సురక్షితమైన చోట ఉండేలా ఇంట్లో పెట్టుకోవాలి. వాటిని ప్లాసిక్ట్ ఫోల్డర్లలో భద్రపరచుకోవాలి. ఎమర్జెన్సీ కిట్ వానాకాలంలో ప్రతి ఇంట్లో ఎమర్జెన్సీ కిట్ ఉండాలి. బ్యాటరీ, టార్చ్లైట్, అగ్గిపెట్టె, వరద నీరు చేరితే దాటడానికి తాడు, ముఖ్యమైన మందులు, అదనపు చార్జింగ్ పరికరాలు... ఇవన్నీ ఇంట్లో ఉండాలి. అలాగే శుభ్రమైన నీరు గురించిన పరిశీలన కూడా అవసరం. ఇంటికి వచ్చే నీరు లీకేజీకి గురికావచ్చని అనుకుంటే ఫిల్టర్ పెట్టుకోవాలి. లేదా వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి. అలాగే ఊహించని భారీ వర్షం, ఉత్పాతం జరిగితే మనం వెళ్లవలసిన ఇళ్లు, కాంటాక్ట్ చేయాల్సిన నంబర్లు కుటుంబ సభ్యులు చర్చించుకోవాలి. ముఖ్యంగా లోతట్టు కాలనీల్లో ఉన్నవారు తమకు ఏదైనా సమస్య వస్తే తల దాచుకోవడానికి వస్తాం అని ముఖ్యమైన మిత్రులకో, బంధువులకో చెప్పి వారిని మానసికంగా సిద్ధం చేసి పెట్టాలి. వాహనాలు ఉన్నవారు ఈ కాలంలో బ్యాటరీలు మొరాయించకుండా చెక్ చేయించుని అవసరమైతే కొత్త బ్యాటరీలు వేయించుకోవాలి. ఆల్ట్రాలైట్ రెయిన్ కోట్ వాన వసే గొడుగులో ప్రతిసారీ పోలేము. వాహనం కూడా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే రెయిన్ కోట్ తప్పనిసరిగా ఒక్కటన్నా ఉండాలి. పిల్లలకు ఉండటం కూడా మంచిదే. ఎప్పుడూ బండిలో. కారులో గొడుగు పెట్టుకుని ఉండాలి. కార్లు ఉన్నవారు వైపర్లను చెక్ చేయించుకోవడం తప్పనిసరి అని వేరే చెప్పక్కర్లేదు కదా. -
పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
మొన్నటి సోమవారం.. వేకువజాము నుంచే ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు.. అకస్మాత్తుగా ఇళ్ల మధ్యలో ఉన్న ఓ చెట్టు నుంచి మంటలు.. ఆ రోజు మనమంతా చాలా భయాందోళనకు గురయ్యాం కదా.. వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. చెట్లు కాలిపోతుంటాయి. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు.? అసలు.. ఈ పిడుగులేమిటి? వాటి కథేంటి? ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు(ఎలక్ట్రాన్లు) దగ్గరలో ఉన్న వస్తువు వైపు ప్రయాణిస్తాయి. మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల (విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి) నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్ లైట్నింగ్గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది. తొలిసారిగా 1847లో థామస్ మోరిస్ ఈస్టర్లీ అనే వ్యక్తి వీటిని గుర్తించాడు. (క్లిక్: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..) జాగ్రత్తలు తప్పనిసరి ► ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండటం ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి. ► పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ► నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి. ► చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ► ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ► స్మార్ట్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు. ► గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి నిలిపివేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. ► పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. క్యుములోనింబస్ మేఘాలు ప్రమాదం క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రదేశంలో పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ మేఘాలకు వర్టికల్ వేగం సెకనుకు సెంటీమీటరుగా ఉంటే, క్యుములోనింబస్ మేఘాలకు వర్టికల్ స్పీడ్ సెకను మీటర్లుగా ఉంటుంది. (క్లిక్: మామిడి తాండ్ర.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) ఉష్ణమండల ప్రాంతాల్లో అధికం ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. డాప్లర్ రాడార్ సహాయంతో పిడుగులను ముందస్తుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం సాధ్యపడుతుంది. ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత నేడు అందుబాటులో ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణశాస్త్ర విభాగం, ఏయూ -
వడదెబ్బ నుంచి తప్పించుకోండి ఇలా..
ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే అందరూ ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నివారణ, వైద్య ఆరోగ్య శాఖలు తెలిపాయి. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) జాగ్రత్తలు.. ► ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ► తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి. ► ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. ► అవసరాన్ని బట్టి ఓఆర్ఎస్ ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి, మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. ► తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. ► లకు ఎండ తగలకుండా టోపీ, రుమాలు చుట్టుకోవాలి. వడదెబ్బ ప్రమాదం ► ఎండలు, వడగాడ్పుల సమయంలో బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ► తక్కువగా నీరు తాగడం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, చల్లదనం ఇవ్వని దుస్తులు ధరించడం, చెమటను పీల్చని దుస్తులు, మద్యం సేవించడం వల్ల వడదెబ్బ సోకుతుంది. ► వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ► శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తి కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారు. దీనిని చాలా మంచి జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు.. ► రక్తప్రసరణ తగ్గి బీపీ డౌన్ అవుతుంది ► శరీరంతో పాటు పెదాలు, గోర్ల రంగు మారుతుంది. ► ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ► కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ► నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ► మాటల్లో స్పష్టత తగ్గుతుంది. ► ఇతరులు చెప్పే మాటలను కూడా వినలేకపోతారు ► కొంత మంది కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ► విపరీతమైన తలనొప్పి రావడం, హృదయ స్పందన బాగా పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, చర్మం బాగా కందిపోయి మంటగా ఉండటం, బుగ్గలు, మెడ, గొంతు, మోచేతులు, ఛాతి బాగాలు ఎరుపెక్కడం మొదలైనవి.. నివారణ చర్యలు.. ► తక్షణమే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపట్టకపోతే అవయవాలు శాశ్వతంగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ► వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు అలానే చేయాలి. ► చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణాగ్రత తగ్గుముఖం పడుతుంది. బాత్టబ్లో ఐదు నుంచి పది నిమిషాలు గడపాలి. లేదా చల్లని దుప్పటిని శరీరమంతా కప్పాలి. ఆ తరువాత ఐస్ ముక్కలలతో శరీరమంతా అద్దాలి. ఇలా చేస్తే శరీరం వణుగు తుగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► తీవ్రతను బట్టి ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వెంటనే చికిత్స ప్రారంభం అయితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. ఏం తినాలి.. వడదెబ్బ సోకిన వారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, అదనంగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, శక్తినిచ్చే శీతలపానీయాలు, మజ్జిగ తాగాలి. అలాగే చిరుధానాయలు తీసుకోవాలి. షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా వడదెబ్బ తీవ్రతను తగ్గిస్తాయి. -
వాస్క్యులర్ వ్యాధులు–శస్త్ర చికిత్సలు..
శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే, మంచి వాస్క్యులర్ (నాడీ వ్యవస్థ) ఆరోగ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్కు చెందిన వాస్క్యులర్ –ఎండోవాస్క్యులర్ సర్జన్, డా. సి. చంద్ర శేఖర్. ఈ వ్యాధుల వివరాలు అందించే చికిత్సల విషయాలను ఆయన ఇలా తెలియజేస్తున్నారు.. రక్త సరఫరాపై ప్రభావం... రక్తనాళాలు కణజాలాల నుండి వ్యర్థాలను తొలగిస్తాయి శరీరమంతటికీ ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళతాయి. అయితే వాస్క్యులర్ వ్యాధులు సాధారణంగా ఈ రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి, ఈ ఫలకం (కొవ్వు, కొలెస్ట్రాల్తో తయారైనది) సిరలు లేదా ధమనుల లోపల రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది . రక్త నాళాలకు ఏదైనా నష్టం జరిగి రక్తం ప్రవహించకుండా నిరోధించడం వలన ప్రాణాంతక అంతర్గత రక్తస్రావం లేదా స్ట్రోక్ వంటి వివిధ సమస్యలు కలుగుతాయి. శస్త్రచికిత్సలతో... చిన్నపాటి వాస్కులర్ వ్యాధులను జీవనశైలి మార్పుల ద్వారా సరిచేయవచ్చు, అయితే కొంతమందికి మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వాస్కులర్ వ్యాధుల చికిత్సకు అందుబాటులో ఉన్న వాస్కులర్ సర్జరీలు... ► యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అనే ప్రక్రియలో కాథెటర్–గైడెడ్ బెలూన్ని ఉపయోగించి ఇరుకైన ధమనిని తెరుస్తారు. ఈ విధానం కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. ► అథెరెక్టమీ: ఇది రక్తనాళాల నుండి ఫలకాన్ని కత్తిరించడానికి, తొలగించడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన కాథెటర్ను నిరోధించబడిన ధమనిలోకి చొప్పించే మరొక అతితక్కువ ఇన్వాసివ్ ప్రక్రియ, ► ఆర్టెరియోవెనస్ ఫిస్టులా: ముంజేయిలోని సిర నేరుగా ధమనికి అనుసంధానించి, సిరను బలంగా వెడల్పుగా చేస్తుంది ► ఆర్టెరియోవెనస్ గ్రాఫ్ట్: ఈ రకమైన శస్త్రచికిత్సలో సింథటిక్ ట్యూబ్ ద్వారా ధమనిని సిరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ► ఓపెన్ అబ్డామినల్ సర్జరీ: ఈ శస్త్రచికిత్సలో పొత్తికడుపు గుండా వెళ్ళే ప్రదేశంలో చిన్న కోత ఉంటుంది. సమస్య ఉన్న ప్రాంతం చుట్టూ రక్త ప్రవాహాన్ని మళ్లించడానికి దీన్ని చేస్తారు. ► థ్రోంబెక్టమీ: ఈ ప్రక్రియలో సిర లేదా ధమని నుంచి రక్తం గడ్డకట్టడం తొలగించబడుతుంది. సరైన రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది. దీనికి బదులుగా ఒక్కోసారి యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ కూడా చేయవచ్చు. ► వాస్కులర్ బైపాస్ సర్జరీ: బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది దెబ్బతిన్న నాళాన్ని దాటవేసే రక్త ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. వెర్టెబ్రోబాసిలర్ వ్యాధి, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, మూత్రపిండ వాస్కులర్ వ్యాధి, మెసెంటెరిక్ వాస్కులర్ వ్యాధి ఉన్న రోగులకు దీన్ని చేస్తారు. ఓపెన్ కరోటిడ్ , ఫెమోరల్ ఎండార్టెరెక్టమీ: ఈ ప్రక్రియలో కాళ్లు లేదా మెదడులకు రక్తాన్ని అందించే ధమనుల లోపలి పొరలో ఉన్న ఫలకాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరుగుతుంది. ► ఈ శస్త్రచికిత్సలు రోగి జీవితాన్ని మెరుగుపరుస్తాయి, రోగుల శారీరక పరిస్థితిని బట్టి శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడానికి 1–2 వారాలు అవసరం కావచ్చు –డా. సి. చంద్ర శేఖర్,వాస్కులర్ – ఎండోవాస్కులర్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి -
కనిపించని శత్రువు.. ముందే గుర్తిస్తే మందులతో నయం!
ఎలా సోకుతుంది....? వంశపారంపర్యంగా... దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే ఎలర్జీ, జీవన విధానం లక్షణాలు శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం పిల్లికూతలు ఊపిరి ఆడనంతగా ఆయాసం ఎడతెరపిలేకుండా దగ్గు రావడం పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం. చికిత్స ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్హీలర్థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం. ఓపీలో సేవలు స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు. అవగాహన సదస్సు ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం. –డాక్టర్ ఆర్.సునీల్కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు -
ఈత.. కడుపుకోత! నీట మునిగితే కష్టమే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఈ నెల 2న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు వద్ద గోదారిలో ఉగాది రోజున పుణ్యస్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతై మరుసటి రోజు శవాలై తేలారు. మృతుల్లో ఆకుదారి సాయివర్దన్(17), డొంగిరి సందీప్(13), బెడిక సతీష్(16) ఉన్నారు. తాజాగా.. జనగామ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి రంజిత్ (14) గురువారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి యశ్వంతాపూర్ వాగు సమీప ఓడల బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. బావిలో దూకిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయాడు. ...ఇలా ఈత సరదా విద్యార్థులు, యువకుల ప్రాణాలను హరిస్తోంది. ఉమ్మడి వరంగల్లోనే నీటి ప్రమాదాల కారణంగా మూడేళ్లలో సగటున ఏటా 69 మంది చనిపోతుండగా.. ఈ ఏడాది ఏడు ప్రమాదాల్లో 22 మంది గోదావరి, చెరువుల్లోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. ఈసారి కూడా గతేడాదికి ఏమాత్రం తీసిపోకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో మొదటిసారి ఈరెండు రోజుల్లో 40 డిగ్రీలు దాటింది. వేసవిలో చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. పెద్దలు సైతం వీలు చూసుకుని ఈత కొలనులు, బావులు, వంకకు వెళతారు. ఈత మంచి వ్యాయామం. ఆరోగ్యకరం. కానీ.. ఈత నేర్చుకోకుండా నీటిలో దిగడం ప్రమాదకరం. ఫలితంగా అనేక మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మచ్చుకు కొన్ని.. ► ములుగు జిల్లాలో గతనెల 15న హోలీ పండుగ రోజు మంగపేట మండలం మల్లూరులోని సమీపంలో రావుల కార్తీక్(23) అనే యువకుడు మృత్యువాతపడ్డారు. శివరాత్రి రోజున భూక్య సాయి(19) కుటుంబ సభ్యులతో కలిసి మంగపేట మండలం కమలాపూర్ తీరంలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. ► జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్లో గతేడాది సరదాగా నీటిలోకి దిగిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన లకావత్ సుమలత, లకావత్ సంగీత, అవినాష్ బొమ్మకూర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. సరదాగా నీటిలోకి దిగారు. ఒక్కసారిగా లోతులోకి వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. నిఘాలేదు.. పర్యవేక్షణ లేదు.. నీటి కుంటలు, బావుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి చిన్నారులను హెచ్చరించాలి. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. నీట మునిగేవారిని కాపాడే ప్రయత్నంలోనూ కొందరు ఈత వచ్చినవారే ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిమాపక, పోలీస్శాఖ, గజ ఈతగాళ్ల సహకారంతో, రక్షించే మెళకువలపై అవగాహన కల్పించాలి. అప్పుడే.. ఈత సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నీట మునిగితే ప్రాణాలతో బయట పడటం చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తేనే నిరోధించవచ్చు వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రామాల్లోని చెరువులు, బావులు, పంట కాలువలు, కెనాల్స్లో ఈత వెళ్లి మృత్యువాతపడుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు డ్రైవింగ్ నేర్పించిన విధంగా ఈత నేర్పిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. ప్రస్తుతం కాళేశ్వరం, ఇతరత్రా ప్రాజెక్టుల వల్ల గ్రామాల్లో చెరువులు, కాలువలు, కెనాల్స్ నిండుగా ప్రవహిస్తున్నాయి. వీటిల్లో ఈతకు వెళ్లేందుకు పిల్లలను అనుమతించొద్దు. గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత సమయంలో గుంతలు ఏర్పడ్డాయి. ఇలాంటి చెరువుల్లోకి దిగితే లోతు తెలవకుండా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చెరువుల వద్ద, కెనాల్స్పై పోలీసులు హెచ్చరిక బోర్డులు.. పెట్టించడం తరచుగా పెట్రోలింగ్ నిర్వహిస్తే కొంత మేరకు ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించవచ్చు. -భగవాన్రెడ్డి, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ వరంగల్ -
మండేకాలం.. జాగ్రత్త సుమా..!
ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఉష్ణతాపం మొదలైంది. రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మరింత తీవ్రతరం కానుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మున్ముందు వడగాల్పులకు ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రాణనష్టం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ఒక వైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే వారికి అవసరమైన అత్యవసర ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు ప్రారంభమయ్యాయి. అత్యవసర వైద్యసేవలు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఒంగోలు అర్బన్: వేసవికాలం ఎండ తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో వడగాల్పులకు, వడదెబ్బలకు ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు శాఖలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఒంగోలు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ శాఖల ద్వారా భారీ ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే చలివేంద్రాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యూనియన్లు, ప్రజా సంఘాలు కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసేలా యంత్రాంగం కృషి చేస్తోంది. వడగాల్పులు, వడదెబ్బ, డీ హైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లలో అవసరమైన ఔషధాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో డీ హైడ్రేషన్కు గురి కాకుండా ఉండేందుకు విరివిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా యంత్రాంగం చర్యలు తీసుకోంటోంది. అంతేకాకుండా వడగాల్పులకు తిరిగి వడదెబ్బకు గురయ్యేకంటే ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించేలా ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదుకు ప్రణాళిక సిద్ధమైంది. కరపత్రాలు, వాల్పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రజలు కూడా ఎండ, వేడి తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయంలో పనులను సడలింపు చేసుకోవాలని అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలతో బయట తిరగాలని కలెక్టర్ దినేష్కుమార్ ప్రజలకు సూచించారు. తాగునీటి సమస్యపై దృష్టి జిల్లాలో కొన్ని గ్రామాల్లో నీటి కొరత ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నీటి వనరులను గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో నీటి సరఫరాకు సంబంధించిన పైపులైన్ మరమ్మతులు చేపట్టారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో అవకాశం మేరకు బోర్లు వేయడం, పైప్లైన్ అవకాశం లేని గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేలా రంగం సిద్ధమైంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాల యాజమాన్యలకు విద్యార్థులకు వడదెబ్బ సోకుండా పాటించాల్సి విధివిధానాలను విద్యాశాఖ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల, కళాశాలల్లో తప్పనిసరిగా విద్యార్థులకు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. వేసవి తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ డిపోలు, నగరంతో పాటు జిల్లాలో రహదారుల వద్ద ఉన్న బస్టాండ్లలతో ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, ఓఆర్ఎస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామ, పట్టణ స్థాయిల్లో గృహాలు, పరిశ్రమలు ఇతర ప్రాంతాల్లో వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది నీటిని నింపుకున్న వాహనాలతో నిరంతరం సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా అగ్నిప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండేలా సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. వడగాల్పులకు ఇబ్బందులు లేకుండా అన్నీ తీసుకున్నాం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడగాల్పులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందుబాటులో ఉంచడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు వంటి వాటితో మరిన్ని చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా వడగాల్పుల పట్ల అవగాహనతో వడదెబ్బల పాలవకుండా, మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ పరంగా కూడా ప్రజలకు వడగాల్పులకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకున్నాం. ప్రజలు సహకరించి వేసవిలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్త వహించాలి. – ఏఎస్ దినేష్ కుమార్, కలెక్టర్ -
ప్రైవేట్ టీకా కేంద్రాల్లో 'ప్రికాషన్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోసు టీకా పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. రెండో డోసు టీకా తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషన్ టీకా వేసుకోవడానికి అర్హులు. తొలి రెండు డోసులు ఏ టీకా పొందారో ప్రికాషన్ డోసు కింద అదే రకం టీకా వేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 446 ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా పంపిణీకి గతంలో వైద్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఆస్పత్రులు టీకా తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేపట్టవచ్చు. ఆయా కేంద్రాల్లో ఎంఆర్పీ ధరకే టీకా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా వైద్య శాఖ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో 18–59 సంవత్సరాల మధ్య వయసు గల 3.47 కోట్ల మందికి ప్రభుత్వమే ఇప్పటివరకూ రెండు డోసుల టీకా వేసింది. 60 ఏళ్లు పైబడిన వారికి జనవరిలోనే ప్రికాషన్ డోసు టీకా పంపిణీ ప్రారంభించగా.. ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. -
తరుచూ బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే
కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం ఇటీవల కాలంలో బాగా అలవాటైంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది లివర్ సిర్రోసిస్కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. లివర్ను కాపాడే పదార్థాల విషయానికి వస్తే.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు... ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి మోతాదు మించని కాఫీ, టీల వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కాఫీ, టీ అలవాటు లేకపోతే, కొత్తగా అలవాటు చేసుకోనవసరం లేదు. ఉదయమే గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. చదవండి: చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే.. ద్రాక్షలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని కాపాడతాయి. కాబట్టి తరచు ద్రాక్ష పండ్లు తినడం ఎంతో మంచిది. అలాగే వెల్లుల్లి. దీనిని వెల్ ఉల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని హానికర విషాలు తొలగిపోతాయి. కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. రోజూ వీటిని డైట్లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. ఆపిల్స్ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇంకా యాపిల్లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్గా తినొచ్చు. శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. రోజూ ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. క్యాబేజీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్లో భాగం చేసుకోవడం మరచిపోవద్దు. చదవండి: వాష్రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు? గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ లివర్ని కాపాడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్లో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పరిశోధనలలో తేలింది. -
ముందు ఆర్భాటం.. ఆ తర్వాత సెటిల్మెంట్లు..
‘ఇస్నాపూర్లో 40 అంతస్తుల్లో లగ్జరీ అపార్ట్మెంట్ను నిర్మిస్తున్నామని ఓ నిర్మాణ సంస్థ ప్రచారం చేస్తోంది. ఏ కంపెనీ, ప్రమోటర్లు ఎవరు, గత ప్రాజెక్ట్లు ఏంటని శోధిస్తే.. రాత్రికి రాత్రే బోర్డ్ ఏర్పాటు చేసిన కంపెనీ అది. పోనీ ప్రమోటర్లకు ప్రాజెక్ట్లు నిర్మించిన అనుభవం ఉందా అంటే ప్చ్.. అదీ లేదు! హైరైజ్ అపార్ట్మెంట్ అని భూ యజమానికి ఆశ చూపించి ఒప్పందం చేసుకున్నాడు. తక్కువ ధర అని ప్రచారం చేస్తుండటంతో కొనుగోలుదారులూ తొందరపడుతున్నారు. ప్రాజెక్ట్ను పూర్తి చేసే ఆర్థిక దమ్ము ఉందా లేదా ఆరా తీశాక ముందు పడితేనే కస్టమర్లకు గృహమస్తు. లేకపోతే శోకమస్తే!’ సాక్షి, హైదరాబాద్: చిన్నాచితకా కంపెనీలు, అనుభవం లేని వాళ్లు రియల్టీ రంగంలోకి వచ్చేసి స్థల యజమానితో అగ్రిమెంట్ చేసుకోవటం, హైరైజ్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని గొప్పలు చెప్పడం ఎక్కువైపోయింది. అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్), ప్రీలాంచ్లో విక్రయాలు చేస్తూ.. పారదర్శకంగా ప్రాజెక్ట్లు చేపట్టే నిర్మాణ సంస్థలకు, సంఘటిత పరిశ్రమకు విఘాతం కలిగిస్తున్నారు. కొనుగోలుదారులు, భూ యజమానులు, స్టేక్ హోల్డర్లు, డెవలపర్ల సంఘాలతో సహా ప్రభుత్వం మేల్కొనకపోతే.. వచ్చే ఏడాది కాలంలో నగర రియల్టీ కుప్పకూలిపోయే ప్రమాదముందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గొప్పలకు పోవద్దు స్వలాభం కోసం 30–40 ఫ్లోర్లలో అపార్ట్మెంట్లు కడతామని గొప్పలకు పోవద్దు. భూ యజమానులను ఆశ పెట్టొదు. ఆ ప్రాంతంలో అంత ఎత్తులో నిర్మాణాలు సాధ్యమయ్యే పనేనా? కొనుగోలుదారుల భవిష్యత్తు తరాల మనుగడ ఎలా ఉంటుంది? వంటి సుదీర్ఘ ఆలోచన చేయాలి. అంతే తప్ప అమ్మేశాం.. డబ్బు చేసుకున్నాం.. చేతులు దులుపుకున్నాం అనే రీతిలో ఉండకూడదు. శంకర్పల్లి, ఇస్నాపూర్లో 30–40 ఫోర్లు కడుతున్నామని కొందరు డెవలపర్లు ఆర్భాటాలు చేస్తున్నారు. అడ్వాన్స్లు తీసుకొని.. ప్రాజెక్ట్ను నిర్మించలేక ఆఖరికి సెటిల్మెంట్ చేసుకునే స్థాయికి దిగజారిపోయారని ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ఓసీ వచ్చాక ఫర్ సేల్ ఉందా? సొంతిల్లు అనేది మధ్యతరగతికి జీవితాశయం. అలాంటి వారికి ఆశ పెట్టి అందిన కాడికి దోచుకోవటం అన్యాయం. నిర్మాణ అనుమతులు రాకముందే ప్రీలాంచ్, యూడీఎస్లో విక్రయాలు చేయడం ఆపైన లీగల్ సమస్యలు తలెత్తి, అనుమతులు రాక చేతులెత్తేస్తే మధ్య తరగతి కొనుగోలుదారుల పరిస్థితేంటని ఒక్కసారి పునరాలోచించుకోవాలి. కొనుగోలు చేసే ముందు కస్టమర్లు కూడా ప్రాజెక్ట్ పూర్వాపరాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డర్ చరిత్ర, ఆర్థిక స్థోమత, ప్రమోటర్లు ఎవరనేది తెలుసుకోవాలి. పాత ప్రాజెక్ట్స్లో అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయాయా? లేక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చాక కూడా ఫర్ సేల్ బోర్డ్ ఉందా గమనించాలి. సొంత డబ్బుతో ప్రాజెక్ట్ను ఎవరూ పూర్తి చేయలేరు. ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లకే బ్యాంక్లు రుణాలు మంజూరు చేస్తాయి. డెవలపర్ల సంఘాలు మేల్కోవాలి.. పరిశ్రమ వృద్ధిలో డెవలపర్ల సంఘాలది కీలక పాత్ర. కానీ, ఫీజు తీసుకొని సభ్యత్వ నమోదు వరకే పరిమితం అవుతున్నాయే తప్ప పరిశ్రమ వృద్ధికి ఆలోచన చేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా మేల్కొని భజన కార్యక్రమాలు ఆపి, నిర్మాణ రంగంలోని ప్రతికూల నిర్ణయాలపై ఒక్కతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలి. నిర్భయంగా, స్పష్టంగా ప్రతికూల ప్రభావమేంటో వివరించాలి. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, అనుభవజ్ఞులను కలుపుకొని పోవాలి. దిగువ స్థాయి ఉద్యోగాలు కల్పించే అతిపెద్ద రంగం నిర్మాణ రంగమే. అలాంటి రంగం ఉనికికే ప్రమాదం ఏర్పడితే విక్రయాలకే కాదు ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. చదవండి:నిర్మాణంలోని అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటున్నారా..! అయితే ఈ విషయాల పట్ల జాగ్రత్త..! -
సీజనల్ వ్యాధులు.. కిచెన్ ఫార్మసీతో చెక్ పెట్టండి
ఈ సీజన్ పిల్లలకు పరీక్ష కాలమనే చెప్పాలి. స్కూలు పరీక్షల కంటే ముందు వాతావరణం సీజనల్ టెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు, దగ్గు, వాటి తీవ్రత పెరిగితే ఒళ్లు వెచ్చబడడం తరచూ పలకరించే సమస్యలే. ఏది ఒమిక్రాన్ జలుబో తెలియని ఆందోళన కాలం. అందుకే కిచెన్ ఫార్మసీని సిద్ధంగా ఉంచుకోవాలి. ►జలుబు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. చిన్నారులకు ఆ ఆవిరిని పట్టిస్తే జలుబుతోపాటు దగ్గు తీవ్రత కూడా తగ్గుతుంది. ►పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు రోజుకు రెండుసార్లు తాగించాలి. ►జలుబుతోపాటు గొంతునొప్పి ఉంటే... గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు కలిపి, ఆ నీటితో గార్గిలింగ్ చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు – మూడు సార్లు చేయవచ్చు. ►పదేళ్లు నిండిన పిల్లలకు ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి 10–15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ►ఆరోగ్య సమస్య వచ్చిందంటే పిల్లలకు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేకపోతారు. ఈ కారణంగా నీరసం దరి చేరకుండా ఉండాలంటే... రోజులో రెండు– మూడు సార్లు తేనె చప్పరించాలి. ►జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు గాలిపీలుస్తుంటే ఊపిరితిత్తుల నుంచి గుర్...మనే శబ్దం వస్తుంది. అప్పుడు ఛాతీ మీద ఆవనూనె, వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. అలాగే దేహంలో నీటిశాతాన్ని తగ్గనివ్వకుండా ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. -
కంటిని కాపాడుకోవాలంటే.. ఇలా చేయాల్సిందే..
ఒకప్పుడు చత్వారం అంటే నలభై ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యేది. హ్రస్వదృష్టి, దూరదృష్టి వంటి సమస్యలకు కళ్లద్దాలు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్న వయసులోనే కంటి సమస్యలు మొదలవుతున్నాయి. నూటికి పదిమంది కళ్లద్దాల అవసరం ఉన్న రోజుల స్థానంలో నూటికి యాభై మందికి కళ్లజోళ్లు దేహంలో భాగమైపోతున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్లో ఉండగానే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు తప్పించుకున్న పిల్లలకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్య కళ్లద్దాల అవసరాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోషకాహారలోపం, కంటికి వ్యాయామం లేకపోవడమే. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. వ్యాయామం ఇలా.. వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు కంటి వ్యాయామాలు చేయడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. పక్కనున్న ఫొటోను పరిశీలించండి. 1. తలను, మెడను నిటారుగా ఉంచి... కుడివైపుకు, ఎడమవైపుకు చూడాలి. 2. ఇంటి పై కప్పును, నేలను చూడాలి. ఇలా చేస్తున్నప్పుడు కనుగుడ్డు మాత్రమే కదలాలి. తలను పైకెత్తకూడదు, కిందకు దించకూడదు. 3. వలయాకారంగా క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్గా తిప్పాలి. 4. దూరంగా ఉన్న వస్తువు మీద పది సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి. 5. ఆ తర్వాత ఐ మూలగానూ, దానికి వ్యతిరేక దిశలోనూ చూడాలి. 6. ముక్కు కొనను చూడాలి. ఈ ప్రక్రియ మొత్తానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. ఇలా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూసేవాళ్లు గంటకోసారి చేయవచ్చు. వీటిని తిందాం! మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే దానికి ముఖ్య కారణం పోషకాల లోపం కూడా కారణం అవ్వచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను తెలుసుకుందాం. ఇవన్నీ మనకు సులువుగా దొరికేవే. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది. ఇతర ఆకుకూరల్లో పొన్నగంటి, మెంతికూర, తోటకూరలను వారంలో కనీసం రెండుసార్లయినా తీసుకోవాలి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాలు, పాల ఉత్పత్తులు, క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. -
గ్యాస్ సిలిండర్ పేలకుండా ఉండాలంటే.. ఇవి పాటించాల్సిందే!
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో వంట చేయడమే కనిపిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన వంట గ్యాస్ వినియోగం నేడు గ్రామాల్లోనూ విస్తరించింది. ఎంతో ప్రాముఖ్యమున్న వంట గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గ్యాస్తో ఆటలాడుకోవద్దనే వాదనను అందరూ వినిపిస్తుంటారు. ఎందుకంటే అది ప్రమాదవశాత్తు పేలితే ప్రాణ, ఆస్తి నష్టాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వంట గ్యాస్ వాడకంపై వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. మహారాణిపేట(విశాఖ దక్షిణ): గ్యాస్ సిలిండర్ పేలుడు.. సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి. ఏదో మూల.. ఏదో ఒక ప్రాంతంలో గ్యాస్ ప్రమాదాల వార్తలు వింటూ ఉన్నాం. కేవలం అవగాహన లోపం... నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గ్యాస్ సిలిండర్తో ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. చిన్న చిన్న జాగ్రత్తలు, గ్యాస్ వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి వాటితో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. చదవండి: హజ్ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో ముగియనున్న గడువు తూకాల్లో మోసాలు.. వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహవసర సిలిండర్ లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలుపుకుని మొత్తంగా 29.500 కేజీలు ఉండాలి. మీకు సరఫరా చేస్తున్న సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణమే తూకం వేయించాలి. తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరిస్తే వెంటనే జిల్లా సరఫరా అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మూడు దశల్లో రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష గ్యాస్ సిలిండర్ల నాణ్యతకు సంబంధించి నిర్వహించే రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ముందుగా విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇందులో సిలిండర్ పనికి రాదని తేలితే దాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. లేకపోతే హైడ్రాలిక్ పరీక్షలకు పంపుతారు. అక్కడ సిలిండర్లలో నీటిని నింపి 5 సార్లు ఫ్రెషర్ ద్వారా లీకేజీలను గుర్తిస్తారు. ఆ తర్వాత వాలు పరిస్థితిని గమనించి నిమాటి ఫ్రెషర్ పరీక్ష చేస్తారు. సిలిండర్లలో గాలి నింపి ఒత్తిడిని పెంచుతారు. అన్ని పరీక్షల్లో సిలిండర్ మంచిదని తేలితే దానిని ప్రజా వినియోగానికి అనుమతిస్తారు. ఈ పరీక్షను ఏడాదిలో 4 సార్లు నిర్వహించాలి. వంటగదిలో పాటించాల్సిన జాగ్రత్తలు.. ►వంటగదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేయాలి. ►గ్యాస్ స్టౌకు ఎదురుగా మాత్రం కిటికీ ఉండకూడదు. ►వంట గదిలో గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండాలి. కిరోసిన్, ఇతర మండే స్వభావం ఉన్న పదార్థాలు ఉంచకూడదు. ►అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్ను తొలగించడానికి వీలైనంత స్థలముండాలి. ►స్టౌవ్ పైభాగంలో అలమరాలు ఉండరాదు. ►మీ గ్యాస్ సిలిండర్ను ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కారం కాదు. ►గ్యాస్ స్టౌకు సంబంధించిన మరమ్మతులను డీలర్ వద్దగానీ, అనుభవం కలిగిన మెకానిక్ వద్దగానీ చేయించాలి. అంతే కానీ వ్యక్తిగత ప్రయోగాలు చేయరాదు. ► వంట చేసే సమయంలో పిల్లలను దగ్గరకు రానీయకూడదు. వంట చేసే సమయంలోనూ, స్టౌవ్ వాడకంలో ఉన్నప్పుడు వంట గదిలోనే ఉండాలి. కంపెనీల నిర్లక్ష్యం ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో వినియోగదారుల మాట అటుంచితే కొన్ని చమురు సంస్థలు తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వినియోగంలో దెబ్బతిన్న సిలిండర్లను మార్చడం లేదా, వాటికి మరమ్మతు లు చేయడంలో కంపెనీలు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి గ్యాస్ సిలిండర్లకు 7 సంవత్సరాల జీవిత కాలం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది పూర్తయితే వాటిని రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు పంపాల్సి ఉంటుంది. అంతా ఓకే అనుకుంటేనే దానిని మరో 5 సంవత్సరాల పాటు వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. గ్యాస్ వాసన వస్తుంటే... ♦ గ్యాస్ వాసన వస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్, తర్వాత స్టౌవ్ ఓపెన్ను ఆఫ్ చేయాలి. ♦ విద్యుత్ బోర్డులో స్విచ్లు వేయడం, తాకడం వంటివి చేయకూడదు. ♦ అన్ని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ♦ రెగ్యులేటర్ను వేరుచేసి సిలిండర్పైన సేఫ్టీ కప్ పెట్టి సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. ♦ గ్యాస్ లీకవుతున్నట్టు భావిస్తే ప్రమాదాల నివారణకు దగ్గరలోని అగి్నమాపక కేంద్రాలు, డీలర్లకు ఫోన్ చేయాలి. వినియోగంలో ఇవి తప్పనిసరి.. ♦ గ్యాస్ సిలిండర్ నాబ్కి కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్ బిగుతా లేకుండా ఊడిపోయినట్లు ఉంటే తిరస్కరించాలి. ♦ సిలిండర్ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం.. పక్కకు వంచి ఉంచడం చేయరాదు. ♦ గ్యాస్ సిలిండర్ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. ♦ వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ కట్టేయాలి. లీకేజీ సమస్య రాకూడదంటే రెగ్యులేటర్ కట్టేసిన తర్వాత స్టౌపై మంటను అలాగే ఉంచి పరిశీలించాలి. దీని వల్ల ట్యూబులో ఉండే గ్యాస్ పూర్తిగా బయటకు వచ్చి మండిపోతుంది. ♦ సిలిండర్ వినియోగించని సందర్భంలో ప్లాస్టిక్ మూత పెట్టేయాలి. ఖాళీదైనా ఇలాగే చేయాలి. ♦ గ్యాస్ స్టౌని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎత్తులోనే ఉంచాలి. ♦ రెగ్యులేటర్కు మరో ట్యూబ్ను కలిపి మరో స్టౌకు జత చేయరాదు. ♦ రబ్బరు ట్యూబ్కు ఏ విధమైన కవర్ని తొడగరాదు. ♦ సిలిండర్ను గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ♦ గ్యాస్ సిలిండర్ కాలపరిమితిని సూచించే నంబర్ను పరిశీలించాలి. సిలిండరుకు అతికి ఉన్న ఊచల వెనుక వైపు ఈ నంబర్ ఉంటుంది. ♦ గ్యాస్ పరికరాలను ప్రతి రెండేళ్లకోసారి పరీక్షిస్తూ ఉండాలి. ♦ నాణ్యమైన స్టౌలు వాడాలి. వీటి వాడకం వల్ల ఏడాదికి రెండు సిలిండర్లు వరకు ఆదా చేయవచ్చు. ♦సిలిండర్కు రెగ్యులేటర్ బిగించే చోట ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది. వాచర్ సరిగ్గా లేకపోతే రెగ్యులేటర్ బిగించిన తరువాత గ్యాస్ లీకవుతుంది. కాబట్టి డెలివరీ బాయ్స్ సిలిండర్ ఇచ్చినప్పుడు దానిపైన ఉన్న సీల్ను అతని ముందే తొలగించండి. వాచర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలని కోరండి. వారి వద్ద రెగ్యులేటర్ ఉంటుంది. దానిని సిలిండర్కు బిగించి పరిశీలిస్తారు. గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే రబ్బర్ వాచర్ మార్చి మరోసారి చెక్ చేస్తారు. సిలిండర్పై నంబర్లు పరిశీలించండి.. రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు సంబంధించి ప్రతి సిలిండర్పై భాగాన ఉన్న సపోర్టుల్లో ఏదో ఒక దానిపై లోపలి వైపున ఎబీసీడీల అక్షరాలతో ఒక కోడ్తో పాటు రెండు నంబర్లు సంవత్సరానికి సంబంధింనవి సూచిస్తారు. నాలుగు అక్షరాలు సిలిండర్కు పరీక్ష నిర్వహించాల్సిన నెల కోడ్ను సూచిస్తాయి. జనవరి నుంచి మార్చి వరకు–ఎ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు–బి, జూలై నుంచి సెపె్టంబర్ వరకు–సి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు –డి కోడ్ను కేటాయించారు. ఉదాహరణకు సిలిండర్పై డి–20 అని ఉంటే డిసెంబర్ 2020లో ఆ సిలిండర్ జీవిత కాలం పూర్తవుతుందని అర్థం. ఈ విషయంలో గృహిణులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సీల్ లేకుండా డెలివరీ వద్దు గ్యాస్ సిలిండర్ డెలివరీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సిలిండర్కు తప్పని సరిగా సీల్ ఉంటుంది. సీల్ లేకుండా ఇచ్చే సిలిండర్లను ఎవరూ తీసుకోవద్దు. సీల్ లేకుండా డెలివరీ చేస్తే డెలివరీ బాయ్స్పై, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ అంతా తమ వెంట తూనిక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. వినియోగదారులు ఎవరైనా అడిగితే సిలిండర్ తూకం వేసి చూపించాలి. వినియోగదారుడి సమక్షంలో గ్యాస్ బాయ్లు సీల్ తీసి వాల్వు తనిఖీ చేయాలి. – రొంగలి శివప్రసాద్, రూరల్ డీఎస్వో, విశాఖపట్నం -
పాదాలు కదలడం లేదా? అయితే గులియన్ బ్యారీ సిండ్రోమ్!
కొంతమందిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గాక... ఎందుకోగానీ.... వారి సొంత వ్యాధినిరోధక శక్తే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి ఓ రుగ్మతే ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’. ఇందులో బాధితుడు చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంటాడు. కానీ అతడి దేహం కాళ్ల దగ్గర్నుంచి అచేతనం కావడం మొదలై క్రమంగా పైపైకి పాకుతూ ఉంటుంది. గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. సంక్షిప్తంగా ‘జీబీ సిండ్రోమ్’ అని పిలిచే... ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ గురించి తెలిపే కథనమిది. ఓ చిన్న కేస్స్టడీ ద్వారా గులియన్ బ్యారీ సిండ్రోమ్ తీవ్రత ఎలా ఉంటుందో చూద్దాం. జీవన్ టాయిలెట్కు వెళ్లాడు. పనిపూర్తయ్యాక లేచి నిలబడి ఎప్పటిలాగే బయటకు వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా పాదాలు కదలడం లేదు. అత్యంత కష్టంగా బయటకు వచ్చాడు. కాళ్లెందుకు స్వాధీనంలో లేవో తెలియలేదు. దాంతో హాస్పిటల్లో చేరాడు. తొలుత పాదాలూ, కాళ్లే కాదు... క్రమంగా నడుమూ... అటు తర్వాత చేతులు, మెడ... ఇలా దేహంలోని అన్ని అవయవాలూ అచేతనమైపోవడం మొదలైంది. బయటకు కనిపిస్తున్న ఆ లక్షణాలను గమనించిన డాక్టర్లు దాన్ని ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’గా భావించారు. కారణం... మనకు ఏవైనా వైరస్ల వల్ల జ్వరం/ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనలోని రోగనిరోధక శక్తి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి, ఆ జ్వరానికి/ఇన్ఫెక్షన్కు కారణమైన వైరస్ను తుదముట్టిస్తుంది. కరోనా సోకినప్పుడు కూడా యాంటీబాడీస్ ఆ వైరస్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో ఒక్కోసారి అది నరాలనూ దెబ్బతీసే అవకాశముంది. అలా జరిగినప్పుడు ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ కనిపించవచ్చు. అయితే నరాలు ఏ మేరకు దెబ్బతిన్నాయన్న విషయం మనలో తయారైన యాంటీబాడీస్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన 70 శాతం మందిలో సాధారణంగా రెండు వారాల్లో వారు నడవలేని పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. దాదాపు ఒక నెల రోజులు మొదలుకొని ఆర్నెల్ల తర్వాత వారు కోలుకుని పూర్తిగా నార్మల్ కాగలరు. అయితే 10 శాతం మందిలో మాత్రం సమస్య మరింత ముదిరి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడే కండరాలు కూడా చచ్చుబడిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మింగే శక్తిని కూడా కోల్పోతారు. మెడలను నిలపలేరు. బాధితులు ఇలాంటి దశకు చేరుకుంటే మాత్రం వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించాలి. ఇక మిగతా 20 శాతం మందిలో ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకిలా జరుగుతుందంటే...? మన మెదడు... దేహంలోని ప్రతి అవయవాన్నీ నియంత్రిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. మెదడు నుంచే నరాల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ, కండరాలకు ఆదేశాలూ, సమాచారాలూ అందుతూ ఉంటాయి. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర (మైలీన్ షీత్) ఉంటుంది. వాస్తవానికి ఈ పొర కారణంగానే ‘కదలిక’లకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో అయా అవయవాలకు అందుతూ ఉంటుంది. ఒక్కోసారి మన వ్యాధినిరోధకతకు దోహదపడే యాంటీబాడీస్... ఏ కారణం వల్లనో ఈ ‘మైలీన్’ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు నుంచి అందే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారానికి అంతరాయం కలుగుతుంది. దాంతో కండరాలను కదిలించడం సాధ్యం కాదు. ఆ విధంగా మైలీన్ పొర దెబ్బతిన్న ప్రతి కండరమూ అచేతనమవుతుంది. తీవ్రత స్థాయులు వ్యాధి తీవ్రత చాలా స్వల్పం మొదలు కొని అత్యంత తీవ్రం వరకు ఉండవచ్చు. స్వల్పంగా ఉంటే నడవడం కష్టం కావచ్చు. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితుడు పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం జరగవచ్చు. సాధారణంగా కాళ్లూచేతులు కదిలించడం అన్న పనులు మన ప్రమేయంతో మనమే చేసేవి. చాలా సందర్భాల్లో జీబీ సిండ్రోమ్లో మన ప్రమేయం లేకుండా జరిVó కీలక కార్యకలాపాలు చాలా అరుదుగా ప్రభావితమవుతాయి. ఒకవేళ అలా జరిగినçప్పుడు కొందరిలో గుండె స్పందనల వేగం తగ్గడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలోంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం జరగవచ్చు. కాస్తంత అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోవడయూ జరగవచ్చు. ఒకసారి వ్యాధి కనిపించడం మొదలయ్యాక అది ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో క్రమంగా పెరుగుతూ, తీవ్రమవుతూ పోవచ్చు. బాధితులు కొంతకాలం అచేతనంగా ఉండి... ఆ తర్వాత మళ్లీ కోలుకోవడం మొదలుకావచ్చు. అయితే కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్ అందకపోవడం జరిగితే... అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీవయచ్చు. చికిత్స : గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన రోగులు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నా, బీపీలో హెచ్చుతగ్గులు, గుండె స్పందనల్లో లయ తప్పుతున్నా (అటనామిక్ న్యూరోపతి ఉన్నా) వాళ్లకు జీబీ సిండ్రోమ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. ప్రస్తుతం బాధితులకు రెండు రకాల ప్రధాన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవి... ►ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స: బాధితుడి బరువు ఆధారంగా నిర్ణయించిన మోతాదు ప్రకారం...అతడికి ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి మన దేహంలోని యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కబరుస్తాయి. తద్వారా నరాల పైన ఉండే మైలీన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. ►ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స: ఈ చికిత్సలో శరీరంలో జబ్బుకు కారణమైన యాంటీబాడీస్ను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా బాధితుడి శరీరం బరువును పరిగణనలోకి తీసుకుని... ప్రతి కిలోగ్రాముకూ 250 ఎమ్ఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా.... అంటే దాదాపు నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేస్తారు. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాను సెలైన్, ఆల్బుమిన్లతో భర్తీ చేస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే పూర్తవుతుంది. ఈ రెండూ ఇంచుమించూ సమానమైన ఫలితాలనే ఇస్తాయి. రోగి కోలుకునే అవకాశాలు : ►జీబీ సిండ్రోమ్ వచ్చిన రోగుల్లో చాలామంది పూర్తిగా కోలుకునే అవకాశాలే ఎక్కువ. అయితే 3 శాతం నుంచి 5 శాతం రోగుల్లో మాత్రం మంచి చికిత్స ఇప్పించినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక పది శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. ఈ గణాంకాలు మినహాయించి మిగతా అందరిలోనూ కోలుకునే అవకాశాలు ఎక్కువే ఉండటం ఓ సానుకూల అంశం. ►వయసు పైబడిన రోగులతో పోలిస్తే వయసులో ఉన్నవారు, యుక్తవయస్కులు చాలా త్వరగా కోలుకుంటారు. ►చచ్చుబడ్డ అవయవాలు పూర్తిగా పనిచేయడం ప్రారంభించి మళ్లీ నార్మల్ కావడం అన్న అంశం రోగి నుంచి రోగికి మారుతుంది. ►ఐదు శాతం మందిలో మాత్రం జీబీ సిండ్రోమ్ వచ్చినవారికే మళ్లీ వచ్చే అవకాశాలుంటాయి. -
చలికాలం సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాక్షి, తూర్పుగోదావది: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల దారి పడుతుండడం ఇందుకు నిదర్శనం. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు డెంగీ, మలేరియా, చికెన్గున్యా బారిన పడుతున్నారు. గతంలో ఊపిరితిత్తులు, ఆస్తమా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న వారికి చలి తీవ్రత కారణంగా ఎక్కువ అవుతోంది. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు అల్పపీడన ప్రభావాలతో ఈ ఏడాది నవంబర్ రెండోవారం నుంచి నమోదు అవుతున్న తక్కువ ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులతో పాటు ఆయాసం, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం జాగింగ్, వాకింగ్కు వెళ్లే వారి చర్మం పొడిబారి బిరుసుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటు కాళ్ల మడమలు, పెదాలు పగలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వ్యాధులు బారిన పడకుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్లిజరన్ సబ్బుల వాడకం మేలు చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండడానికి గ్లిజరిన్ సబ్బుల వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుని తలస్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. పాదాలు పగిలే ప్రమాదం చలికాలంలో పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. నీటిలో ఉంచిన తరువాత సబ్బుతో కడుక్కుని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలను పాటించాలి. చిన్నారుల పట్ల జాగ్రత్తలు చలికాలంలో చిన్నారులకు చలి నుంచి రక్షణకు స్వెటర్లను తొడిగించాలి. వేడి నీటితో స్నానం చేయించాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. చలికాలంలో రాత్రి వేళ తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు. పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు ఉన్ని దుస్తులు ధరించాలి. బ్రాండెడ్ దుస్తులు అయితే మంచిది. బైక్పై వెళ్లేవారు మంకీక్యాప్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజ్లు ధరించాలి. ఆస్తమా ఉంటే.. చలికాలంలో ఆస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలిలో తిరగవద్దు. శ్వాస నాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. ఇన్హేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గుండెజబ్బులు ఉన్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►చలిగాలులు వీస్తున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. ►శరీరానికి వేడిని కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ►పొలం పనులకు వెళ్లేవారికి చలి వల్ల కాళ్లు, చేతులు దురదలు పెడుతుంటాయి. వ్యాజిలిన్, చర్మ క్రీములు రాసుకోవడం ఉత్తమం. ►శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు పొడి దుస్తులను ధరించాలి. ►చలి తీవ్రతతో జలుబు బాగా వచ్చి ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నెబ్యులైజర్ వినియోగించుకోవాలి. శ్వాసకోస వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి ఆస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు ఉదయం 8 గంటల వరకు సాయంత్రం 6 గంటల తరువాత బయటికి వెళ్లకూడదు. బయటికి వచ్చే సమయంలో మాస్కులు ధరించడం మేలు. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే సమీప ప్రాంతాల్లోని వైద్య సిబ్బందిని ఆశ్రయించాలి. వేడి ఆహార పదార్థాలు, నీటిని స్వీకరించాలి. చిన్నపిల్లలకు న్యుమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. చల్లటి వాతావరణంలో బయటకి వెళ్లకుండా చూడాలి. – డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా.. కనిష్టం గరిష్టం మంగళవారం 23 29 బుధవారం 22 29 గురువారం 22 32 శుక్రవారం 20 29 శనివారం 19 32 ఆదివారం 19 28 సోమవారం 19 28 -
‘ఆ మూడు మాత్రలతో కరోనా కట్టడి..ప్రయోగాత్మకంగా రుజువు’
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కరోనాను తరిమేసేందుకు ఆస్ప్రిన్, మిథైల్ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్లు చాలని కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ విషయం రుజువైందంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 60 మంది కోవిడ్ బాధితులకు వారం పాటు ఆస్ప్రిన్ 150 ఎం.జీ. రోజుకొకటి, మిథైల్ప్రెడ్నిసోలాన్ 10 ఎం.జీ. ఉదయం, రాత్రి, అలాగే అజిత్రోమైసిన్ 250 ఎంజీ ఉదయం, రాత్రి ఇచ్చి వైద్యం అందిస్తే.. 59 మంది కేవలం వారంలో పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు. వారి సాచ్యురేషన్ స్థాయి 93 శాతం పైనే కొనసాగిందని పేర్కొన్నారు. తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న పారాసిట్మాల్, ఐవిర్మెక్ట్ర్న్, హైడ్రాక్సీక్లోరోక్వినోన్, డాక్సీసైక్లిన్ తీసుకున్న 60 మందిలో 8 మంది ఆరోగ్యం దిగజారి ఆస్పత్రి పాలైనట్టు వెల్లడించారు. తాను ప్రతిపాదించిన మూడు మాత్రలతో కోలుకున్న వారిలో నిస్సత్తువ నామమాత్రానికే పరిమితం కాగా, తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న మందులు వాడిన వారిలో దీర్ఘకాలిన నిస్సత్తువ, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తెలిపారు. తన పరిశోధనల సారాంశాన్ని అధ్యయన పత్రాల రూపంలో ఈ నెల 17, 18 తేదీల్లో అమెరికాలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆన్ డిసీజెస్’లో సమర్పించినట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తన అధ్యయనాన్ని కోయలిస్ గ్రూప్ స్కోపస్ ఇండెక్స్ అనే ప్రామాణిక పరిశోధనల డేటా బేస్లో ప్రచురిస్తారని మురళీకృష్ణ వెల్లడించారు. -
ఆ చెట్లకి డై బ్యాక్ వ్యాధి.. ఆందోళనలో అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేప చెట్లు డై బ్యాక్ వ్యాధితో ‘ఫోమోప్సిస్ అజాడిరిక్టే’అనే శీలీంధ్రం సోకి ఎండిపోయి, చనిపోతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. దేశ కల్పతరువు, సహజ సంజీవిని, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి అయిన వేప నేడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నందున దీన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు తమ సామాజిక బాధ్యతగా ఉద్యమించి వేప చెట్టుకు జీవం పోసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. కార్బెండిజమ్ (50 శాతం డబ్ల్యూపీ) మందును లీటర్ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచేలా పోస్తే వేర్లు, కాండం మొదలులో ఉన్న శీలీంధ్రాన్ని.. ఈ మందు సమర్థవంతంగా అరికడుతుందని పేర్కొంది. ఏడు రోజుల తర్వాత థయోఫనేట్ మిథైల్ (70 శాతండబ్ల్యూపీ) మందును లీటర్ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోస్తే చెట్టు మొత్తానికి ఈ మందు చేరుకుని శీలీంధ్రాన్ని నాశనం చేస్తుందని తెలిపింది. ఇది మార్కెట్లో రోకో, థెరపీ తదితర పేర్లతో దొరుకుతుందని పేర్కొంది. 20 రోజుల తర్వాత మూడోచర్యలో భాగంగా ప్రోఫినోపాస్ మందును లీటర్ నీటిలో 3 మి.లీ. కలిపి చెట్టు మొదలు తడిచేలా పోయాలని తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది. చదవండి: Hyderabad: మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి.. -
శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తుందా..!
తిరుపతి సాక్షి : భారత దేశంలో గుండె పోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో చాల మంది ప్రముఖులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తున్నాం. గత వారం కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ (46) వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ప్రఖ్యాత క్రికెట్ ఆటగాళ్లు సౌరవ్ గంగూలి, బ్రియన్ లారా వంటి ఆటగాళ్లు కూడా మధ్య వయస్సులో గుండె పోటుకు గురి అయ్యారు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా గుండె పోటు నుండి తప్పించుకోలేకపోతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన, ఒత్తిడి, మన ఆధునిక ఆహారపు అలవాట్లు, ధూమపానం, మధ్యపానం, ఘగర్, బీపీ, స్థూల కాయం ఉన్న వారిలో ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం కానీ,అతి డైటింగ్ ,నిద్ర పోవడం వంటి కార్యకలాపాలను పరిమితంగా చేయాలి లేదా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో హ్తె ప్రొటీన్ డైట్ ఇచ్చిన ఎలుకల్లో గుండెపోటు అధికంగా వచ్చినట్లు తేలింది. వైద్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం చికిత్సతోపాటు జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. హృదయ స్పందనలో ఏం జరుగుతుంది గుండె కొట్టుకోవడంలో కొంత సమస్య మొదలవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే చికిత్స చేస్తే పల్స్ తిరిగి మొదలవుతుంది. ఇలా వెంటనే చికిత్స అందించడం వల్ల రోగి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ పనిని ఇంజెక్షన్ ద్వారా లేదా యాంజియోప్లాస్టీ ద్వారా చేస్తారు. అటువంటి పరిస్థితిలో కార్డియాలజిస్ట్ బాధితుడిని మరణం నుండి రక్షించగలరు. చాలా మంది రోగులు గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే మరణిస్తారు. గుండెపోటులో 50 శాతం మొదటి గంటలోనే సంభవిస్తాయి. అందువల్ల, మొదటి గంటలో దానిని గుర్తించడం.. చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి లక్షణాలను గుర్తించడం.. వెంటనే ఈ రోగిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ప్రాథమిక చికిత్స ఎలా ఉండాలి గుండెపోటు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. గుండెపోటు వచ్చిన వెంటనే మొదట ఆస్పిరిన్ మాత్రను అందించాలి. ప్రారంభ చికిత్స సమయంలో ఇంజెక్షన్ సుమారు 1 నుంచి 60–70 శాతం వరకు సక్సెస్ ఉంటుంది. యాంజియోప్లాస్టీ 90% కంటే ఎక్కువ విజయవంతమైంది. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను 1 నుండి 100 వరకు లెక్క పెట్టుకుంటే..తిరిగి 100 నుండి 1 వరకు లెక్కపెట్టి మనస్సుసై ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు శ్వాస నిశ్వాసలపై ఏకాగ్రత పెడుతుంటారు. మరి కొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ►షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ఉన్నట్టుండి ఛాతీ భాగం, మెడ భాగంలో నొప్పులు వచ్చి చెమటలు పడుతుంటాయి. ►శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి. ►గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ►మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి. ►తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ►కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు. ►వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. ►గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్ బీట్ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ►గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి. ►రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి. ►తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే. -
ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోనే కాదు..గ్రేటర్ జిల్లాల్లోనూ కరోనా కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ అనేక మంది కోవిడ్ పరీక్ష కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయినా జనం వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. కోవిడ్ నిబంధనల్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. మాస్క్ను, భౌతిక దూరాన్ని మర్చిపోయారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడం..వ్యాక్సిన్ వేసుకున్నామన్న ధీమాతో చాలా మంది వీకెండ్ పార్టీలు, ఫంక్షన్లు, మార్కెట్ల పేరుతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఫలితంగా మళ్లీ వైరస్ బారినపడుతున్నారు. గతంతో పోలిస్తే..ప్రస్తుతం చికిత్సకు పడుతున్న సమయం రెట్టింపైంది. రికవరీ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున వందకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఇదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే..భవిష్యత్తులో థర్డ్వేవ్ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దులో ఉన్న చైనా సహా ఇతర ప్రపంచదేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ తరహాలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించి, టీకాల కార్యక్రమం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యా సంస్థల్లో కన్పించని భౌతికదూరం కేసులు తగ్గక పోయినప్పటికీ..విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అయినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కో గదిలో 40 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టి పాఠాలు బోధిస్తున్నాయి. తరగతి గదులను కనీసం శానిటైజ్ చేయడం లేదు. విద్యార్థులే స్వయంగా శానిటైజర్లను వెంటతెచ్చుకుని వారు కూర్చొనే ప్రదేశాన్ని శానిటైజ్ చేసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు పారిశుధ్యలోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను మున్సిపాలిటీ, గ్రామపంచాయితీలకు అప్పగించినప్పటికీ అక్కడి పారిశుధ్య కార్మికులు ఇందుకు నిరాకరిస్తుండటం ఆందోళన క లిగిస్తుంది. రెండో డోసు కోసం తప్పని నిరీక్షణ.. ► ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ జిల్లాల్లో ఇప్పటి వరకు 1,05,98,603 మందికి టీకాలు వేయగా, వీరిలో 43,17,778 మంది రెండు డోసులు పూర్తి చేసుకోగా, మరో 75,32,946 మంది ఫస్ట్ డోసు పూర్తి చేసుకుని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. ► మొదట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 720 కేంద్రాల్లో టీకాలు వేశారు. ప్రస్తుతం వీటి సంఖ్యను వందలోపునకే కుదించారు. ఫలితంగా ఇప్పటికే ఫస్ట్ డోసు వేసుకుని, రెండు డోసు గడువు సమీపించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. ► ఏ సెంటర్లో ఏ టీకా వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాదు మొదట్లో 364 కేంద్రాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే...ప్రస్తుతం వంద కేంద్రాల్లోనే చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. నవంబర్ 3 వరకు వందశాతం పూర్తి కోవిడ్ నియంత్రణ, టీకాల వేగవంతం కోసం గ్రామస్థాయిలో మల్టీ లెవల్ డిసిప్లీనరీ టీమ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుల్లో ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్ఏలను సభ్యులుగా నియమిస్తున్నాం. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి, ఇప్పటి వరకు టీకా తీసుకోని వారితో పాటు ఎవరెవరు ఎన్ని డోసులు టీకా తీసుకున్నారో గుర్తించి ఆ మేరకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూస్తారు. జిల్లా అదనపు కలెక్టర్లు సహా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ను స్వయంగా పర్యవేక్షించనున్నారు. - డి.అమయ్కుమార్, కలెక్టర్ రంగారెడ్డి జిల్లా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఆగస్టు, సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో పాజిటివ్ కేసుల సంఖ్య కొంత పెరుగుతున్నట్లు కన్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. లేదంటే మళ్లీ ప్రమాదం తప్పదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు టీకా తీసుకోని వారు 45 వేల మంది ఉన్నట్లు గుర్తించాం. ఒకటి రెండు రోజుల్లో వీరందరికీ టీకాలు వేయిస్తాం. - డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి చదవండి: Giant Owl:150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం -
పండుగ వేళ జర భద్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్కు ఆస్కారం ఉండదు..రాదు...అనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక, శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి ఆదివారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుదలు ఈ శిబిరాలు విజయవంతం అయ్యాయి. నాలుగున్నర కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. మరో కోటి మంది తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అయితే, ఆదివారం శిబిరాల ఏర్పాటు కారణంగా మందుబాబులు, మాంసం ప్రియులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. దీంతో ఈసారి మెగా శిబిరం శనివారానికి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రపథమంగా 50 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశారు 60 లక్షల మేరకు డోస్ల టీకాను సిద్ధంగా ఉంచారు. అయితే, ఆశించిన మేరకు ఈసారి ఈ డ్రైవ్కు స్పందన రాలేదు. 15 లక్షల మంది మేరకు టీకా వేయించుకున్నారు. సీఎం పరిశీలన, సమీక్ష కన్నగి నగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడా రు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే, అక్కడ వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సుల్లో ఆకస్మికంగా ఎక్కి.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సేవల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు కొన్ని సమస్యలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సీఎం స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. పండుగ సీజన్ వేళ కరోనా ఆంక్షల సడలింపు, ఈనెల 31తో ముగియనున్న ఆంక్షలు, కొనసాగింపు గురించి సమీక్షించారు. అంగన్వాడీలు, నర్సరీ పాఠశాలలు నవంబర్ 1వ తేదీ నుంచి తెరవాలనే విషయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. షిఫ్ట్ల వారీగా తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ నుంచి షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా ఆంక్షలను నవంబర్ 15వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. క్రీడల, స్విమ్మింగ్ తదితర పోటీల నిర్వహణకు, థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు, ఆలయ ఉత్సావలకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక చెన్నైలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించినానంతరం ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, పండుగ సీజన్లో జనం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు దేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్ ఆందోళన కల్గిస్తోందని, టీకా వేసుకోని వాళ్లు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఇంకా కోటి మందికి తొలి డోస్ వేసుకోవాల్సి ఉందని, మరో 57 లక్షల మంది రెండో డోస్ వేసుకోవాల్సి ఉందని వివరించారు. వీరంతా టీకా వేయించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరియలూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులు కుంటు పడకుండా ఉండేందుకే.. పాఠశాలల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత దాని ధర డబుల్ .. -
ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే, మీ ఇల్లు భద్రమే
దసరాకు ఊరెళ్లే హడావుడిలో చాలా మంది ఇంటి భద్రత పట్టించుకోరు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చేస్తారు. ఇళ్లలో చొరబడి ఉన్నదంతా దోచేస్తారు. పండగ సందర్భంగా చోరీల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సైబరాబాద్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఊరెళ్లే ముందుకు ఇంట్లో ఉన్న నగలు, నగదును బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల్లో దాచడం వల్ల, ఎటువంటి ఆందోళన లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవచ్చని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు తప్పనిసరి ప్రయాణంలోనూ వీలైనన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు అంటున్నారు. దొంగతనాల నివారణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలి్పస్తున్నారు. ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి మైక్లో ప్రచారం నిర్వహించడంతో పాటుగా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. చాలా మంది సీట్లలో బ్యాగ్లను వదిలి తినుబండారాలు, తాగునీటి కోసం బస్సులు దిగుతుంటారు. ఇలాంటి సమయంలో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రయాణాల్లో మహిళలు, చిన్నారులు బంగారు ఆభరణాలు ధరించకపోవడమే మంచిదంటున్నారు. కార్లలో వెళ్లే వారు సైతం అప్రమత్తంగా ఉండాలని, దొంగలు అద్దాలు పగలగొట్టి అందులోని సామగ్రిని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పోలీసుల సూచనలు ► ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పీఎస్లో సమాచారం ఇవ్వాలి ► ద్విచక్ర వాహనాలను ఇంటి ఆవరణలో పార్కు చేసి లాక్ వేయాలి ► ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకుని వాటిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఊరెళ్లే ముందు ఇంటి ఆవరణలో లైట్లు వేసి ఉంచాలి. ► సోషల్ మీడియాలో బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. ఇంట్లో నమ్మకమైన వారినే సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకోవాలి. ► ఇంట్లో ఉండే బీరువాలు, అల్మారా, కప్బోర్డుల తాళాలను జాగ్రత్తగా ఉంచాలి. వీలైతే ఇంటి గేటుకు లోపల తాళం వేయడం మంచిది. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం తాళంను అమర్చుకోవాలి. ప్రత్యేక పోలీసు బృందాలు దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. ఉదయం, రాత్రి వేళల్లో విస్తృతంగా పెట్రోల్, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం అందించాలి. ప్రయాణ సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. – నవీన్కుమార్, సీఐ షాద్నగర్ లాకర్లలో భద్రపర్చుకోవాలి విలువైన బంగారు నగలు, డబ్బులు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి. దుకాణాల్లో, ఇళ్లల్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దొంగతనాలు జరగకుండా శాఖా పరంగా ప్రత్యేక చర్యలు చేపట్టాం. చోరీల నివారణపైప్రజల్లో అవగాహనకల్పిస్తున్నాం. – భూపాల్ శ్రీధర్, సీఐ -
పారా హుషార్.. మూత్రాశయ కేన్సర్..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం...దాదాపు 45000 మంది మగవాళ్లు, 17వేల మంది మహిళలు ఏటేటా మూత్రాశయ కేన్సర్కు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మూత్రాశయ కేన్సర్ గురించి విషయాలు, జాగ్రత్తలను అపోలో స్పెక్ట్రా కు చెందిన యూరాలజిస్ట్ డా.ప్రియాంక్ సలేచా వివరించారు. అదృష్టవశాత్తూ చాలా వరకూ మూత్రాశయ కేన్సర్లు ముందస్తుగానే గుర్తించవచ్చు. తద్వారా చక్కని చికిత్స అందించడం సాధ్యమవుతుంది. విజయవంతంగా చికిత్స అందించిన తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ, సంప్రదింపులు అవసరం అవుతాయి. మూత్రాశయంలోని యూరోథెలియల్ నాళాలపై ప్రభావం చూపే సాధారణ తరహా కేన్సర్ ఇది. దిగువ పొత్తికడుపులో మూత్రాన్ని నిల్వచేసేందుకు సహకరించే బోలుగా ఉండే కండర రూప అవయవం ఇది. ఖచ్చితంగా ఇదీ అనే కారణాన్ని మూత్రాశయ కేన్సర్కి చెప్పలేం. అయితే నియంత్రణ లేని విధంగా అసాధారణ వృద్ధితో కణజాలం పెరగడం జరుగుతుంది. అవి ఇతర టిష్యూలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. గుర్తించడం ఎలా... యూరోథెలియల్ కార్సినోమా, స్వే్కమస్ సెల్ కార్సిమోనా, అడెనోకార్సినోమా, స్కేమస్సెల్ కార్సినోమా, అడెనో కార్సినోమా పేరిట 3 రకాల మూత్రాశయ కేన్సర్లు ఉన్నాయి. రోగుల్లో యూరోథెలియల్ కార్సినోమా లేదా ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమాలు ఎక్కువగా కనిపించే రకాలు. పేరుకు తగ్గట్టే ఈ కేన్సర్ మూత్రాశయంలోని అంతర్గత పొరకు చెందిన ట్రాన్సిషనల్ సెల్స్లో మొదలవుతుంది. మూత్రాశయ కేన్సర్లతో బాధపడుతున్న ప్రజలు పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇవి చాలా సార్లు ఇతర వ్యాధులుగా పొరపాటు పడేందుకు కారణమవుతాయి. అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎముకలు సున్నితంగా మారడం, మూత్ర విసర్జన సమయంలో బాధ, తరచు వేగంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం రావడం, పొత్తికడుపు భాగంలో లేదా వెన్నెముక దిగువ భాగంలో నొప్పి... వంటివి ప్రత్యేకంగా దీనికి సంబంధించిన లక్షణాలుగా పేర్కొనవచ్చు. నివారణ... కొన్ని మార్పు చేర్పుల ద్వారా మూత్రాశయ కేన్సర్ను నివారించవచ్చు. –థూమపానం చేసినప్పుడు హానికారక రసాయనాలు ఉత్పత్తి అయి చివరగా మూత్రాశయానికి చేరి, అక్కడి లైనింగ్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి పొగ తాగడం మానేయాలి. –దాహార్తి అనే పరిస్థితికి చేరకుండా చూసుకోవడం కూడా మూత్రాశయ కేన్సర్ను నివారిస్తుంది. రోజులో వీలైనంత నీరు తాగడం వల్ల అది టాక్సిన్స్ను తోసివేసేందుకు మూత్రాశయం దెబ్బతినకుండా ఉండేందుకు సహకరిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీటిని తాగుతూఉండాలి. –రబ్బర్, లెదర్, డైస్, టెక్స్టైల్స్, పాలిన్ ఉత్పత్తుల తయారీలో వాడే కొన్ని రసాయనాల్లో కొన్ని మూత్రాశయ కేన్సర్కు దారి తీసేవి కూడా ఉంటాయి. ఇలాంటి హనికారక రసాయనాలను ఫిల్టర్ చేసే ప్రక్రియలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీలైనంత వరకూ ఈ తరహా రసాయనాలను శరీరంలోకి చేరకుండా చూసుకోవాలి. –కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మూత్రాశయ కేన్సర్తో బాధపతుండడం జరిగి ఉంటే. ఇతరులు కూడా ఆ వ్యాధికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, అలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే ముందస్తుగానే ఆరోగ్యకర జీవనశైలి అలవరచుకోవడం, వైద్యులను తరచు సంప్రదిస్తుండడం అవసరం. ఉపసంహారం... ఆరోగ్యకరమైన జీవనశైలి, నిద్ర... ఈ వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. అలాగే సిస్టెక్టొమీ అనే సర్జికల్ ప్రొసీజర్ ద్వారా కూడా ఏ వయసులో సోకిన కేన్సర్నైనా విజయవంతంగా చికిత్స చేయవచ్చు. డా.ప్రియాంక్ సలేచా, యూరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
లింఫోమా అంటే ఏంటి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
Lymphoma disease Precautions: లింఫోమా అనేది రక్త సంబంధిత క్యాన్సర్లలో ఒకటి. తెల్ల రక్తకణాల్లో ఒక రకం కణాలైన లింఫోసైట్స్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, ఆ తర్వాత వాటిని తరలించుకు వెళ్లే కణజాలాల్లో వచ్చే క్యాన్సర్ ఇది. దీనిలో ప్రాథమికంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్–హాడ్జ్కిన్స్ లింఫోమా. లక్షణాలు : ∙మెడలో, చంకలో, గజ్జల్లో వాపు వస్తుంది. ఆ వాపు నొప్పి లేకుండానే వస్తుంటుంది. ►ప్లీహం (స్ప్లీన్) పెరుగుతుంది. పొట్టలో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉంటుంది. ►జ్వరంతో చలిగా అనిపించడం లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం, విపరీతమైన నిస్సత్తువ కనిపిస్తుంది. నిర్ధారణ పరీక్షలు : ∙రక్త పరీక్షలు ∙బయాప్సీ ∙ఎముక మూలుగ పరీక్ష ∙సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్స్ పరీక్ష ∙మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ∙ఎక్స్రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు చేయించాలి. వాటిని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించి, లింఫోమా ఉందా, ఉంటే అది ఏ దశలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు. చికిత్స : ఒకసారి లింఫోమా ఉందని నిర్ధారణ అయ్యాక ఎలాంటి చికిత్స అందించాలన్న విషయం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ►బాధితుడికి ఉన్నది ఏ రకమైన లింఫోమా ∙దాని దశ (అంటే... లింఫోమా కారణంగా ఏయే అవయవాలు ప్రభావితమయ్యాయి) ∙బాధితుడి సాధారణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది... అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. లింఫోమా తర్వాత... చికిత్స తీసుకుంటూనే బాధితులు కొన్ని జాగ్రత్తలతో వ్యాధి అనంతర జీవితాన్ని సాధ్యమైనంత ఆరోగ్యంగానే జీవించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ►పుష్టికరమైన సమతులాహారం తీసుకోవాలి. అయితే అది ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా... సాధ్యమైనంత తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువసార్లు తింటుండాలి. నోట్లో పుండులాంటిది ఏదైనా ఉంటే దాన్ని గాయపరచని రీతిలో మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలనూ, బత్తాయిరసాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. అయితే మిగతా ద్రవాహారాలను పుష్కలంగా తీసుకోవడమే మంచిది. డాక్టర్ సలహా మేరకు తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలతో పాటు, శరీరానికి శ్రమ కలగని రీతిలో కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ∙తగినంత విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి పీల్చాలి. ∙కుంగుబాటు (డిప్రెషన్)ను దరిచేరనివ్వకూడదు ఒకవేళ డిప్రెషన్తో బాధపడుతుంటే తప్పక డాక్టర్ను సంప్రదించాలి. ఒకసారి లింఫోమా ఉందని తేలాక బాధితులు ఆపైన... లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అవి మాత్రమే కాదు... డాక్టర్ సూచన మేరకు మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. -
కంటిగాయాలు.. ఓ లుక్ వేయండి
వ్యవసాయ పనుల్లో ఉండేవారికీ, పల్లెల్లో కూలీ పనులు చేసేవారికి పెద్దగా కంటికి గాయాల వంటివి ఉండవని చాలామంది అపోహపడుతుంటారు. పట్టణాల్లో, నగరాల్లో జరిగే ప్రమాదాల్లోనే అవి ఎక్కువని భావిస్తుంటారు. నిజానికి వ్యవసాయ, కూలి పనుల్లోనే కంటికి గాయాలయ్యే అవకాశాలెక్కువ. ఉదాహరణకు ఓ వ్యవసాయదారు పొలంలో కంపకొడుతుంటాడు. అకస్మాత్తుగా ఏ కంపముల్లో కంట్లో తగిలే అవకాశాలెక్కువ. ఎడ్లబండి తోలుతూ రైతు డొంకదారిన వస్తుంటాడు. దార్లోకి ఒంగిన తుమ్మముల్లు తగిలే అవకాశాలెక్కువ. ఇలాంటి గాయాలతో ప్రతిరోజూ ఎందరో పల్లెవాసులు, అలాగే మిగతా పట్టణ, నగరవాసులూ చూపు కోల్పోతున్నారు. గాయం తగిలిన వెంటనే చికిత్స అందితే ఈ అంధత్వాలను చాలావరకు నివారించవచ్చు. కంటికి అయ్యే గాయాలెటువంటివీ, ముందుగా ఎలాంటి ప్రథమచికిత్సలు, ఆ తర్వాత ఏ ప్రధాన చికిత్సలు అవసరం లాంటి అనేక విషయాలను తెలిపేదే ఈ కథనం. కంటి గాయాలూ... వాటి రకాలు కంటికి ప్రధానంగా రెండు రకాలుగా గాయాలయ్యే అవకాశాలుంటాయి. 1) భౌతికంగా అయ్యే గాయాలు. 2) రసాయనిక ప్రమాదాలు భౌతికంగా అయ్యే గాయాలు : వ్యవసాయ, ఇతరత్రా పనుల్లో : పొలాల్లో, డొంకదారుల్లో ఉండే ముళ్లచెట్లతో వ్యవసాయదారులకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకున్నాం. అలాగే కట్టెలు కొట్టే సమయాల్లో చెక్కపేడు వంటివి ఎగిరివచ్చి కంట్లో గుచ్చుకోవచ్చు. రాళ్లు కొట్టేవారు సుత్తిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇటుక, ఇతరత్రా బట్టీలో పెళ్లలు ఎగిరొచ్చి కంట్లో పడవచ్చు. ఇక పట్టణాల్లో వెల్డింగ్ వంటి వర్క్షాపుల్లో కంటికి గాయాలు తగిలే అవకాశాలెక్కువ. రోడ్డు / ఇతరత్రా ప్రమాదాల్లో : రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వాహనం మెల్లగానే నడుపుతున్నప్పటికీ రోడ్డు మీదికి ఓరగా ఒంగిన చెట్ల కొమ్మలు కంట్లో కొట్టుకుని గాయాలయ్యే ప్రమాదాలెక్కువ. రాత్రివేళల్లో వాహనంపై ప్రయాణం చేసేవారికి పురుగుల వంటివి ఎగిరి వచ్చి కంట్లో పడవచ్చు. యాక్సిడెంట్లలో కంటికి లేదా కనుగుడ్డు అమరి ఉండే గూడు (ఆర్బిట్)కు గానీ లేదా తలకు అయ్యే గాయాల వల్ల కంటిచూపు ప్రభావితమయ్యే ప్రమాదాలుంటాయి. ఆటల్లో : కంట్లో బంతి తగలడం, షటిల్కాక్ వంటివి బలంగా తగలడం వల్ల; అలాగే పిల్లలు పదునైన ఉపకరణాలతో లేదా బాణాల వంటి పదునైన వస్తువులతో ఆడుకుంటున్నప్పుడు; బాణాసంచా వంటివి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నప్పుడు. పండుగలూ, వేడుకల్లో : దీపావళి, హోలీ వంటి పండగల్లో, వేడుకల్లో. ఎగిరి వచ్చే పదార్థాల వల్ల (ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) : చిన్న చిన్న రాతిముక్కలు, గాజు ముక్కలు, లోహపు పదార్థాలు, కలప వంటి వాటితోపాటు, పురుగులు కంట్లో బలంగా కంటిని తాకడం వల్ల. సర్రున ఎగిరివచ్చి తాకే ఎలాంటి వస్తువుల వల్లనైనా. రసాయనిక ప్రమాదాలు రసాయన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముందు చెప్పుకున్నట్లుగా వ్యవసాయ పనుల్లో పెద్దగా కంటి ప్రమాదాలు జరగవనే అపోహ లాంటిదే... ఈ రసాయనిక ప్రమాదాలూ జరగవనే భావన కూడా. కానీ పొలంలో ఆర్గానోఫాస్ఫరస్ (అంటే ఎండ్రిన్ వంటి) మందుల పిచికారీలూ, ఎరువులు వేస్తున్నప్పుడు రసాయనాలు కంట్లోకి వెళ్లే ప్రమాదాలు చాలా ఎక్కువ. దాంతోపాటు పొలానికి మందు కొట్టిన సందర్భాల్లో చేతులు కడుక్కోకుండా వాటితోనే కళ్లునులుముకోవడం వంటి చర్యలతోనూ కళ్లలోకి రసాయనాలు చేరుతాయి. ఇక పట్టణాలూ, నగరాల్లోని రకరకాల పారిశ్రామిక కేంద్రాలూ, ఫౌండ్రీలలో కొన్ని రకాల ఆమ్లాలు / క్షారాల వంటి రసాయన కంట్లో పడి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా చికిత్స జరిగితే శాశ్వత అంధత్వాన్ని చాలావరకు నివారించవచ్చు. అంతేకాదు... మన ఇళ్లలో ఉండే సుగంధద్రవ్యాలను స్ప్రే రూపంలో చిమ్ముకుంటున్నప్పుడు కూడా ఈ తరహా రసాయన ప్రమాదాలు జరగవచ్చు. అందుకే చిన్నపిల్లలను పర్ఫ్యూమ్స్కు దూరంగా ఉంచాలి. ఇక ఇళ్లలో జరిగే గాయాల్లో.... సిమెంట్ పని చేస్తున్నప్పుడు, ఇంటికి సున్నాలు/కలర్స్ వేయిస్తున్నప్పుడు, పాన్లో వాడే సున్నాన్ని పిల్లలు కళ్లల్లో పెట్టుకున్నప్పుడు, బాత్రూమ్ల వంటి చోట్ల యాసిడ్ వంటి రసాయనాలతో పనిచేస్తున్నప్పడు కంట్లోకి సున్నం లేదా యాసిడ్ వంటి రసాయనాలు వెళ్లే అవకాశాలెక్కువ. రసాయనాల కారణంగా జరిగే ప్రమాదాలతో కెమికల్స్కు సహజంగానే తినేసే గుణం (కాస్టిక్ ఎఫెక్ట్) ఉంటుంది. పైగా అందులోని రసాయనాలు కంటిలోని కణాలూ, ఎంజైముల, ప్రోటీన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఆ రసాయనాలు... కార్నియా, కంజెంక్టివా వంటి కంటి పొరలను దెబ్బతీస్తాయి. ఫలితంగా చూపుకోల్పోయే ప్రమాదాలెక్కువ. రసాయన ప్రమాదాల్లో తక్షణం అందించాల్సిన చికిత్స : కంటిలో పడే రసాయన గాఢతను వీలైనంతగా తగ్గించాలి (డైల్యూట్ చేయాలి). అందుకోసం రసాయనాలకు ఎక్స్పోజ్ అయిన కంటిని దాదాపు 30 నిమిషాల పాటు పరిశుభ్రమైన నీటితో కడగాలి. రోగి అయోమయంలో ఉంటే ప్రమాదస్థలంలోని ఎవరైనా ఈ పని చేయవచ్చు. పేలుళ్లు : ఈ తరహా ప్రమాదాలలో రెండు రకాలుగా కన్ను గాయపడుతుంది. ఒకటి నిప్పురవ్వలు. రెండోది... పేలుడు ధాటికి చిన్న చిన్న రాతి/ఇతరత్రా రవ్వలు కంటిని బలంగా తాకడం వల్ల. గాయాలు నివారించే జాగ్రత్తలివి... సాధారణంగా కంటికి అయ్యే గాయాల్లో దాదాపు 90 శాతం నివారింపదగినవే. అందునా 80 శాతం గాయాల్లో డాక్టర్ను సరైన సమయంలో సంప్రదిస్తే, చూపు పోకుండా కాపాడుకోవచ్చు. ∙కర్షకులూ, కార్మికులూ, నిర్మాణరంగంలోని పనివారూ ఎండ వేడిమి నుంచి కంటిని రక్షించుకోవాలి. ఎందుకంటే సూర్యరశ్మిలో యూవీఏ, యూవీబీ కిరణాలుంటాయి. అవి టెరిజియమ్, క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలకు కారణమవుతాయి. పరిశ్రమల్లో పనిచేసే వారికి యూవీఏ, యూవీబీ కిరణాలతో ముప్పు మరింత ఎక్కువ. పొలాల్లో పనిచేసేవారికి కళ్లజోడేమిటి అనే సందేహాలూ, నామోషీలు లేకుండా ప్లెయిన్ గ్లాసెస్ వాడాలి. దాంతో వ్యవసాయం, రాతికొట్టుడు వంటి పనుల్లో కన్ను గాయపడకుండా ఉంటుంది. వ్యవసాయదారులే కాదు.. హాబీగా గార్డెనింగ్ చేసేవారు కూడా ఎప్పుడూ ప్రొటెక్టివ్ గాగుల్స్ తప్పక ధరించాలి. ►స్పోర్ట్స్ ఇంజ్యూరీ : ఆటల్లో కన్ను గాయపడకుండా ఉండేందుకు పాలీకార్బనేట్ కళ్లజోళ్లు వాడాలి. (ఇది ప్లాస్టిక్ వంటిది. పగలదు). హెల్మెట్స్, కంటి షీల్డ్లతో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ నివారించవచ్చు. ►ఇంట్లో : ఇంట్లో అనేక రకాల పదునైన వస్తువులతో కంటిగాయాలయ్యే అవకాశాలుంటాయి. ఉదాహరణకు పదునైన మూలలు ఉండే మంచాలు, చిలక్కొయ్యలూ, హ్యాంగర్స్గా వాడుకునే ఇనుపకొక్కేల వంటి వాటితో కూడా కంటి గాయాలయ్యే అవకాశాలున్నాయి. ఇంటివస్తువులు పదునుగా ఉండకుండా చూసుకోవాలి. ఇళ్లలో కూల్డ్రింక్ ఓపెన్ చేసేటప్పుడు ఆ సీసామూతను బయటికి వైపునకు 45 డిగ్రీల ఏటవాలుగా ఉంచి తెరవాలి. అప్పుడు కన్ను గాయపడే అవకాశం ఉండదు. ►పంటపొలాల్లో ఆర్గానోఫాస్ఫరస్ (ఎండ్రిన్ వంటివి) చల్లేటప్పుడు నోరు, ముక్కులకు మాస్క్తో పాటు కళ్లకు ప్రొటక్టివ్ గాగుల్స్ తప్పకుండా పెట్టుకువాలి. ►కార్ఖానాల్లో రసాయనాలను అంటుకునే ముందు, అంటుకున్న తర్వాత చేతులు కడుక్కోకుండానే కళ్లునులుముకోవడం సరికాదు. ►పిల్లల ఆటల్లో విల్లుబాణాలూ అస్సలు వద్దు. బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్లు చిన్నారుల పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ►టూవీలర్స్ నడిపేవారు ఐ వేర్, ఐ షీల్డ్, హెల్మెట్ ధరించి తీరాలి. నిజానికి వ్యవసాయం, నిర్మాణ పనివాళ్లు, రాతి పనివాళ్లు, స్టోన్ కట్టర్స్, ట్రాక్టర్ డ్రైవర్లు... వీళ్లంతా పనివేళ్లల్లో కంటికి అద్దాలు, ఐ షీల్డ్ ధరించాలి. హెల్మెట్ తరహాలోనే ఈ మేరకు ఓ చట్టం రావడమూ చాలావరకు మేలు చేసే అంశమే. ►కంటిగాయాల ప్రథమ చికిత్సపై అవగాహన పెంచుకోవాలి. ►ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగకూడదు. గాయమైన వెంటనే... కంటికి గాయం తగలగానే తక్షణం ఓ శుభ్రమైన మెత్తటి గుడ్డ సహాయంతో రెండు కళ్లనూ మూసి ఉంచాలి. వీలైనంతగా కనుగుడ్లు కదలకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్కు చూపించాలి. కంటికి గాయాలను స్వయంగా పరిశీలించుకోవడం, సొంత చికిత్స చేసుకోవడం చాలా ప్రమాదం. అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. కెమికల్స్ పడ్డాయని తెలియగానే... చేతులను సబ్బు, మంచినీళ్లతో శుభ్రంగా కడగాలి. దొరికితే ప్రిజర్వేటివ్ ఫ్రీ యాంటీబయాటిక్ డ్రాప్స్, ల్యూబ్రికెంట్స్ వేసుకోవాలి. కళ్లునలపకూడదు. కంటి మీద ఒత్తిడి పడనివ్వకూడదు. కళ్లలో పడ్డ నలకలను (ఫారిన్బాడీని) మనంతట మనమే తీయకూడదు. వీలైనంత త్వరగా కంటి డాక్టర్తో చికిత్స తీసుకోవాలి. అవసరమైతే వారి సలహా మేరకు పెద్ద ఆసుపత్రుల్లో కంటి వైద్యనిపుణులకు చూపించుకోవాలి. డాక్టర్ను కలవాల్సింది ఎప్పుడు? ►కన్ను నొప్పి, నీళ్లు కారడం, వెలుగు చూడలేకపోవడం, చూపు తగ్గడం, ఎర్రబారడం, తలనొప్పి, కళ్లు (కనుగుడ్లు) కదిలిస్తున్నప్పడు నొప్పి ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. చికిత్స ►ఫస్ట్ ఎయిడ్ చికిత్స ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అంటే ఉదాహరణకు... సున్నం, సిమెంట్, బాత్రూమ్ యాసిడ్ వంటివి పడ్డప్పుడు వెంటనే కన్ను శుభ్రంగా కడుక్కుని, ఆ వెంటనే కంట్లో చుక్కల మందులు అయిన ప్రిజర్వేటివ్–ఫ్రీ యాంటిబయాటిక్ ఐ డ్రాప్స్ అందుబాటులో ఉంచుకోవాలి. ఇక కన్ను కడుక్కోడానికి పరిశుభ్రమైన నీరు (ప్లేన్ వాటర్) వాడాలి. అదంత శుభ్రంగా ఉండదనుకుంటే ప్యాకేజ్డ్ వాటర్బాటిల్ నీళ్లు వాడుకోవచ్చు. ఇక గాయాన్ని బట్టి చేయాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే ఎంత త్వరగా చికిత్స అందిస్తే చూపు దక్కే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. -
నిపా వైరస్: పండ్లు కడిగే తింటున్నారా?
థర్డ్ వేవ్తో కరోనా విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నిఫా వైరస్ పేరు మళ్లీ వినిపించడం వైద్యసిబ్బందిని కలవరపాటుకు గురి చేస్తోంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిపా వైరస్ కారణంగా చనిపోవడంతో కేరళ, ఆ పొరుగునే ఉన్న తమిళనాడు జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. ఈ తరుణంలో ఫేక్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. నిపా విషయంలో అప్రమత్తంగా ఉంటేనే నష్టనివారణ చేయొచ్చని సూచిస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. నిపా.. జూనోటిక్ డిసీజ్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకడమనే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. అందుకే జంతువులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ చెబుతున్నారు. ఫ్రూట్ బ్యాట్(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని డాక్టర్ బిస్వాస్ అంటున్నారు. సెప్టెంబర్ 5న నిపా కారణంగా కేరళ కోజికోడ్ బాలుడు చనిపోగా.. బాధితుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్ పండ్ల’(చెట్టు నుంచి కిందపడిన పండ్లు) ద్వారా వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు కడగాల్సిందే! గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల(ఫ్రూట్స్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిస్వాస్ సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్ను అంటిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను సంబరంగా తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను.. కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు ఎలాంటివైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని ఆయన సూచిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ జాగ్రత్త తప్పక పాటించాలని, లేకుంటే ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారాయన. ప్రాథమిక జాగ్రత్తలు ► పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం.. వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు ఓ కంటకనిపెడుతుండడం. ► చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవటం. ► ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం ► పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. లక్షణాలు ► శ్వాసకోశ సమస్యలు, ► జ్వరం ► ఒళ్లు నొప్పులు ► తలనొప్పి ► వాంతులు ► లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ► నిపా నిర్ధారణ అయితే వైద్యసిబ్బందిని సంప్రదించడం. మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్ సోకింది. భారత్లో మొదటిసారి పశ్చిమబెంగాల్లో, రెండోసారి కేరళలో విజృంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే ఉండదని వైద్యులు చెప్తున్నారు. చదవండి: మరోసారి నిపా కలకలం -
మీ ఇంట్లో వృద్ధులున్నారా? అయితే, ఈ మార్పులు చేయాల్సిందే!
చలాకీగా ఉండే వయసు హరించుకుపోయి జీవిత చరమాంకానికి చేరుకునే తరుణంలో మనిషికి మానసిక స్వాంతన ఎంతో అవసరం. తన అనుకున్నవారికి తానే భారం అవుతున్నానన్న బాధ పెద్దవారికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లోవారిదే! ఇందుకోసం ఇంట్లో పెద్దల అవసరాలకు తగినట్లు కొద్దిపాటి మార్పులు చేయించడం కీలకమని డాక్టర్ల సలహా. దీనివల్ల వృద్ధులు తమ పనులు తాము చేతనైనంత వరకు సొంతంగా చేసుకుంటూ, ఒకరిపై ఆధారపడకుండా జీవించే వీలు చిక్కుతుంది. ఒకరిపై ఎక్కువగా ఆధారపడకుండా వృద్ధాప్యం గడిచేందుకు ఇంట్లో చేయాల్సిన చిన్నపాటి మార్పులను చూద్దాం! ► అవసరమైన చోట్ల వీల్చైర్ లేదా వాకర్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయాలి. ► టాయిలెట్లు, షవర్ల దగ్గర హ్యాండ్ రెయిల్స్, గ్రాబ్ బార్స్ను ఏర్పరచాలి. ► వీలుంటే మాములు టాయిలెట్ల బదులు ఒక్కటైనా రైజ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేయించడం మంచిది. ► ఇంట్లో స్మోక్, హీట్ డిటెక్టర్లను ఇన్స్టాల్ చేయించాలి ►వృద్దులకు అవసరమైనంత గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా అవసర వెంటిలేషన్ ఏర్పరచాలి. ►నిద్రలో నడిచే అలవాటు ఉన్న వారుంటే ఆటో సెన్సర్లను ఇన్స్టాల్ చేయించడం ద్వారా రాత్రుళ్లు వారి కదలికలపై కన్నేసి ఉంచొచ్చు. ►ఇంట్లో అనవసరమైన ఫర్నిచర్, సామగ్రి అడ్డదిడ్డంగా లేకుండా సర్దుకోవాలి. ►టెలిఫోన్ , ఇంటర్నెట్ తదితర వైర్లేవీ కాళ్లకు అడ్డం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఇంట్లో కరెంట్ కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త వహించాలి. వీలయినంత వరకు ఎవరో ఒకరు పెద్దవారిని గమనిస్తూ ఉండడం, వారికి వేళకు సరైన ఆహారాన్ని అందించడం, మందులు వాడుతుంటే మర్చిపోకుండా సమయానికి అందించడం, వారి మాటలకు విసుక్కోకుండా వారితో కొంత సమయం గడపడం, వీలైతే వారికి ఏదైనా వ్యాపకం కల్పించడం వంటి చర్యలు వృద్ధాప్యంలో ఉన్నవారికి ఊరటనిస్తాయి. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో పెద్దవారిని వృద్ధాశ్రమాల్లో చేర్చాల్సివస్తే సదరు ఆశ్రమాల్లో పైన పేర్కొన్న అంశాలున్నాయో, లేదో పరిశీలించి ఎంచుకోవడం మంచిది. -
వేరియంట్లు ఏవైనా జాగ్రత్తలు అవే..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్కు సంబంధించిన వేరియంట్లు చాలా వస్తున్నాయి.. అంతరించి పోతున్నాయి.. కానీ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు జాగ్రత్తలు మారవని కర్నూలు జనరల్ ఆస్పత్రి వైరాలజిస్ట్ డాక్టర్ రోజారాణి వెల్లడించారు. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మాస్కు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఈ జాగ్రత్తలే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు శాశ్వత పరిష్కార మార్గాలని చెప్పారు. మన రాష్ట్రంలో మొదటి వేవ్, రెండో వేవ్లకు సంబంధించి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వేరియంట్లు వచ్చాయని, కొన్ని అంతరించి పోయాయన్నారు. ప్రస్తుతం తెరమీదకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకంగా తేలిందన్నారు. మొదటి వేవ్లో శరీరంలోకి ప్రవేశించిన వైరస్ బాగా అభివృద్ధి చెందడానికి 14 రోజుల సమయం తీసుకునేదని, అదే సెకండ్ వేవ్కు వచ్చేసరికి మూడు, నాలుగు రోజులు పడుతోందన్నారు. ఇప్పటివరకు మాస్కులు అవసరం లేదని ప్రకటించిన దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్లతో మళ్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ అనగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గడప దాటగానే విధిగా మాస్కు ధరించాలన్న ఆలోచన మంచి ఫలితాలనిస్తుందన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ రక్షణనిస్తుందని, అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి వారిపట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. వివిధ వేరియంట్లను గుర్తించడం, వాటి ప్రభావ శీలతను లెక్కించడానికి జినోమిక్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ రోజారాణి పేర్కొన్నారు. -
వానలొస్తున్నాయ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
తొలకరి చినుకులకు ప్రకతి పులకరింపు సహజం. ఇదే సమయంలో అణగారిఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే!వర్షాలు పడడం స్టార్టయిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్ వరకుఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చల్లబడటం, ఈ క్లైమేట్ ఛేంజ్తో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి రకరకాల రోగాలు... వర్షాకాలం సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ బాధపడేది జలుబుతోనే! ఇది వైరల్ ఇన్ఫెక్షన్లలో అత్యంత కామన్ ఇన్ఫెక్షన్. ఈ జలుబు కొంతమందిలో క్రమంగా ఫ్లూ, నిమోనియా తదితర వ్యాధుల్లోకి దిగుతుంటుంది. వర్షాలు పడడంతో దోమల ప్రత్యుత్పత్తి వేగం పుంజుకుంటుంది. దీంతో వీటి జనాభా తీవ్రంగా పెరుగుతుంది. వీటి కారణంగా మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులు ప్రబలుతాయి. ∙వానలతో గ్రౌండ్వాటర్లో, ఉపరితల నీటివనరుల్లో రసాయన మార్పులు జరుగుతాయి. ఇవి నీటిలో బాక్టీరియా ఉధృతికి దోహదం చేస్తాయి. ఇలాంటి కలుషిత జలాలతో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్లాంటి రోగాలు విజృంభిస్తాయి. కొత్తనీరు, పాతనీరు కలయికతో పెరిగే ఫంగస్ కారణంగా కొన్నిరకాల చర్మరోగాలు కలుగుతాయి. చదవండి: బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే వర్షాకాలం కరోనా ఎలా మారుతుంది? వేడి వేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి, వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది. కానీ ఇందుకు సరైన ఆధారాల్లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది సైతం వర్షాకాలంలో కరోనా విజృంభణ చాలావరకు తగ్గింది. నిజానికి వర్షాకాలంలో కరోనా కన్నా సీజనల్ వ్యాధులే ఎక్కువ డేంజరని చెబుతున్నారు. వీటికి కరోనా జతకలిస్తే మరింత ప్రమాదమని, అందువల్ల సీజనల్ వ్యాధులను అరికడితే కరోనా ఆట కూడా కొంతమేర కట్టించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలతో ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ డిపాజిట్లు కొట్టుకుపోతాయని కొందరు నిపుణుల అంచనా. అయితే ఇది పూర్తిగా నిజం కాదని, కరోనాను వర్షాలు కొంతమేర డైల్యూట్ చేయగలవు కానీ పూర్తి గా తొలగించలేవని డెలావర్ ఎపిడమాలజీ డిపార్ట్మెంట్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వైరస్ సంగతేమో కానీ వాననీటితో బాక్టీరియా పెరుగుతుందని, ఇది కొత్త రోగాలను తెస్తుందని చెప్పారు. వర్షాలతో కరోనా విజృంభిస్తుందని చెప్పలేమని, సీజనల్ వ్యాధులతో కలిసి కరోనా మరింత కలకలం సృష్టిస్తుందని, అందువల్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు వంటింటి చిట్కావైద్యాలు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలు పాలు, పసుపు నీళ్ల ఆవిరి లాంటివి. సో... తగిన ముందు జాగ్రత్తలు తీసుకొంటే వానాకాలం రాగానే వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడం ఈజీనే! ఏం చేయాలి... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.. అంటే చికిత్స కన్నా నివారణే మేలు! వర్షాకాలంలో వచ్చే జబ్బులబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సీజన్లో సప్తసూత్రాలు పాటిస్తే చాలావరకు రైనీ సీజన్ రోగాలకు చెక్ పెట్టవచ్చు. ► ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం. బాగా ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ►దాహం లేకున్నా వీలయినంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అదికూడా ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి. ►వానలో తడిసేటప్పుడు మాత్రమే సరదాగా ఉంటుంది, తర్వాత వచ్చేరోగాలతో సరదా తీరిపోతుందని గ్రహించి సాధ్యమైనంత వరకు వానలో తడవకుండా జాగ్రత్త పడాలి. ►ఇంటిలోపల, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు ముసిరే వాతావరణం కల్పించకూడదు. ►ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మస్క్యుటో రిపల్లెంట్స్ వాడాలి. లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగ పెట్టైనా దోమలను తరిమేయాలి. ►చలిగా ఉందని బద్దకించకుండా రోజూ రెండుపూట్లా శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మరోగాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ►చేతులతో ముక్కు, కళ్లు, నోరును సాధ్యమైనంతవరకు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి. -
అనాథ పిల్లల పేరున రూ.10 లక్షల డిపాజిట్: సింఘాల్
సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో 21,493 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ రోజువారి గరిష్ట వినియోగం 650 మెట్రిక్ టన్నులు కాగా అందుబాటులో 635 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. ఆక్సిజన్ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 4+2 ఐఎస్ఓ ట్యాంకర్లు కలిగిన 2 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ట్యాంకర్కు 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఏపీలో కొత్తగా 23,160 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 23,160 మందికి పాజిటివ్గా నిర్థారణ కాగా 106 మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 24,819 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 12,79,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,82,41,637మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి మరణించినవారి వివరాలు.. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, గుంటూరు, విశాఖ, ప.గో.జిల్లాల్లో 8 మంది చొప్పున.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఐదుగురు.. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 1466, విజయనగరం- 965, విశాఖ- 2368 కేసులు, తూ.గో- 2923, ప.గో- 1762, కృష్ణా- 1048, గుంటూరు- 1291 కేసులు, ప్రకాశం- 785, నెల్లూరు- 1251, చిత్తూరు- 2630 కేసులు, అనంతపురం- 2804, కర్నూలు- 991, వైఎస్ఆర్ జిల్లా- 1036 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఏపీలో కొత్త మెడికల్ ఆక్సిజన్ పాలసీ -
కరోనా పరిస్థితులపై సూపర్స్టార్ మహేశ్ ఆందోళన
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినీ ప్రముఖులు ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తెలంగాణ పోలీసులతో కలిసి ఓ వీడియో రూపొందించగా.. తాజాగా సూపర్స్టార్ మహేశ్బాబు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ‘తప్పనిసరైతేనే బయటకు రండి. అనవసరంగా బయటకు రావొద్దు. జాగ్రత్తలు తప్పక పాటించండి’ అంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు, సూచనలు ప్రజలతో పాటు తన అభిమానులకు చెప్పాడు. ‘రోజురోజుకు కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ ధరించండి. మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు అడుగు పెట్టండి. ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో తెలుసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీనిద్వారా అవసరమైన వారికి బెడ్లు అందుతాయి. ఈ క్లిష్ట పరిస్థితులు నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. చదవండి: కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you're around people and step out only if it's absolutely necessary! — Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021 -
కర్ణాటకలో లాక్డౌన్ ఆంక్షలతో సరిహద్దుల మూసివేత
-
మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్రాల ఇష్టమేనని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయడం లేదని సర్వత్రా వినిపిస్తున్న మాట. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అడ్డంకిగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే మే 2వ తేదీ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా చర్చ సాగుతోంది. వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే అప్రమత్తం కావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న ఎన్నికలతో కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. తత్ఫలితం ఇంత పెద్ద స్థాయిలో కరోనా విస్ఫోటనం జరిగిందని విదేశీ మీడియా నొక్కి చెబుతోంది. కరోనా వ్యాప్తికి ఇటీవల జరిగిన ఎన్నికలే కారణమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యమని మేధావులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, ప్రభుత్వాలు కరోనాను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు చేస్తున్నారు. అందువలనే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రికి కరోనా సోకిందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సభతోనే సీఎం కేసీఆర్కు కరోనా సోకిందని అందరికీ తెలిసిన రహాస్యమేనని పేర్కొంటున్నారు. ఇక పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల్లోనూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా కేసులు పెరగడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ఇంత జరుగుతున్నా కేంద్రం ఇప్పుడు కూడా స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రతిపక్షాలతో పాటు మేధావులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలపై కఠిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడానికి ఎందుకు జంకుతోందని నిలదీస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడే కారణమని వారే సమాధానం చెబుతున్నారు. ఇంకా పశ్చిమబెంగాల్లో మరో దశ పోలింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే యోచనలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఖాతరు చేయడం లేదని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అయితే ఎన్నికల ముగింపుతో పాటు ఫలితాలు మే 2వ తేదీన ఫలితాల వెల్లడి తర్వాతనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాతో పాటు విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే సమాచారంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. మే 2వ తేదీన ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోందని పునరుద్ఘాటిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మరి మే 2వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి. చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు -
ఇంట్లో ఎవరికైనా ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే, మిగతా కుటుంబ సభ్యులు కూడా మందులు వాడాలా?
వాడాలి. మిగతా కుటుంబసభ్యులు టెస్ట్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా, టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ నెగెటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా.. డాక్టర్ సూచన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఇన్ఫెక్షన్కు గురైనా లక్షణాలు ఉండకపోవచ్చు. ఇబ్బందిపడకపోవచ్చు. అలాగే లక్షణాలు బయటపడడానికి సమయం పట్టొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా యాంటీ బయోటిక్స్, ఇతరత్రా మందులు వాడితే సీరియస్ కాకుండా బయటపడొచ్చు. కుటుంబంలో ఎందరుంటే అందరూ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షణాలుండి నెగెటివ్ ఉన్నా తర్వాత రేపో మాపో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి లక్షణాలు లేకుండా కరోనా ఉండదు కానీ, చాలామంది వాటిని గుర్తించలేరు. ఉదాహరణకు కొందరికి తలనొప్పి వస్తుంది. దాన్ని సర్వసాధారణమని అనుకుంటారు. ఎండలో తిరగడం వల్ల, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అని అనుకుంటారు. కానీ ఇలాంటివి కూడా లక్షణాలే. తరచుగా కరోనా టెస్టులు చేయించుకోం కాబట్టి మందులు వాడితే మేలు. ఒకవేళ అది కరోనా కాకుండా ఇతరత్రా టైఫాయిడ్ వంటివి ఏమైనా అయినా కూడా ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. ఏవైనా యాంటీ బయోటిక్స్తో సెట్ అవుతాయి. ఏ మందులైనా డాక్టర్ల సూచన మేరకు వాడాలి. - డాక్టర్ హెఫ్సిబా ప్రభుత్వ వైద్య అధికారి, హైదరాబాద్ కరోనా సంబంధిత ప్రశ్నలు కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..? కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా? -
కరోనాపై అనవసర భయమొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్పై మరీ భయాందోళన పడాల్సిన అవసరం లేదని, 85% మందికి ఇంట్లోనే నయమైపోతుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా స్పష్టం చేశారు. అనవసరంగా రెమిడెసివిర్ వంటి మందులు, ఆక్సిజన్ను వినియోగించి కొరతకు కారణం కావొద్దని సూచించారు. బుధవారం ఆయన నారాయణ హెల్త్ చైర్మన్ డాక్టర్ దేవిశెట్టి, మేదాంత చైర్మన్ నరేశ్ ట్రెహాన్తో కలిసి ఓ వీడియో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులేరియా పలు అంశాలను వివరించారు. ఆయా అంశాలు రణ్దీప్ గులేరియా మాటల్లోనే.. ‘‘కోవిడ్ మహమ్మారి ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు తగినంత డేటా ఉంది. కోవిడ్ బాధితుల్లో 85 శాతం మంది ఎలాంటి ప్రత్యేక చికిత్స.. అంటే రెమిడెసివిర్ లేదా స్టెరాయిడ్స్, ఇతర డ్రగ్స్ లేకుండానే కోలుకున్నారు. సాధారణ జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటాయి. వాటిని బట్టి సాధారణ చికిత్స తీసుకుంటే.. ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారు. అనవసరంగా ఆస్పత్రులకు పరుగెత్తడం ద్వారా.. బెడ్ అవసరమైన మరొకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. మరో 15 శాతం మందికి వ్యాధి తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. అంటే ఆక్సిజన్ సాచురేషన్ స్థాయి తగ్గడం, హైగ్రేడ్ ఫీవర్ వంటివి రావొచ్చు. మరీ తీవ్రత పెరిగితేనే రెమిడెసివిర్, స్టెరాయిడ్స్, యాంటీ కాగ్నెంట్స్ అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో కన్వల్జెంట్ ప్లాస్మా ఇవ్వొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అనవసరంగా భయాందోళనకు గురవ్వొద్దు. రెమిడెసివిర్ వంటివి అతికొద్ది మందికి మాత్రమే అవసరం పడుతుంది. అసలు రెమిడెసివిర్ ప్రాణాలు కాపాడినట్టు, ప్రాణ నష్టం తగ్గించినట్టుగా డేటా ఏమీ లేదు. దీనిని ఒక మ్యాజిక్ బుల్లెట్గా పరిగణనలోకి తీసుకోవద్దు. అనవసరంగా ఆక్సిజన్ వాడొద్దు ఊపిరితిత్తులకు సంబంధించి న్యుమోనియా, క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్వల్ప సమయం, కొన్నిసార్లు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అనవసరంగా ఆక్సిజన్ తీసుకోవడం వృథా. ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉండి కూడా.. ఓ అరగంటో, గంటపాటో ఆక్సిజన్ తీసుకుంటే ఇంకా బాగుంటామని భావించడం సరికాదు. అది ఆరోగ్యానికి సాయపడుతుందనే డేటా ఏదీ ఇప్పటివరకు లేదు. చాలా మంది పేషెంట్లు ఇండ్లలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని.. రోజూ అరగంట, గంట, రెండు గంటలపాటు తీసుకుంటున్నారు. అలా చేస్తే వాస్తవంగా అవసరమైన వారికి ఆక్సిజన్ అందుబాటులో లేకుండా చేసిన వారవుతారు. సాచురేషన్ స్థాయిలో గమనించాల్సిందేంటి? రక్తంలో ఆక్సిజన్ సరఫరా అయ్యే లెవల్స్ను ఆక్సిజన్ సాచురేషన్ అంటాం. ఇది కచ్చితంగా 98, 99 శాతం ఉండాల్సిన పనిలేదు. 92 నుంచి 98 మధ్య స్థిరంగా ఉన్నా ఫర్వాలేదు. సాచురేషన్ 95పైన ఉంటే ఆక్సిజన్ అవసరం లేదు. 94 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాస్త పరిశీలన పెట్టాలి. ఆరోగ్యవంతుల్లో అప్పటికీ ఆక్సిజన్ అవసరం రాకపోవచ్చు. గుండె, ఊపిరితిత్తుల జబ్బులున్న వారికి మాత్రమే ఆక్సిజన్ అవసరం రావొచ్చు. 90-92 మధ్య ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. అంతేతప్ప ఆక్సిజన్ సాచురేషన్ 97- 98 శాతం ఉండాలన్న కంగారు పనికిరాదు. ఆక్సిజన్ అయినా, రెమిడెసివిర్ అయినా అవసరం ఉన్నవారికి అందేలా అందరూ సహకరించాలి. వాక్సిన్ వేయించుకున్నా కోవిడ్ వస్తుంది వాక్సిన్ వేసుకున్నాక కూడా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాక్సినేషన్ అనారోగ్యం నుంచి కాపాడుతుందే తప్ప ఇన్ఫెక్షన్ నుంచి కాదు. అంటే.. వాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కూడా కోవిడ్ సోకవచ్చు. మన ద్వారా ఇంకొకరికి వ్యాపించవచ్చు. కానీ మనం తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా రక్షణ ఉంటుంది. వాక్సిన్తో శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయి రక్షణ లభిస్తుంది. అందువల్ల వాక్సిన్ తీసుకున్నా కూడా.. కరోనా మీకు సోకకుండా, మీ నుంచి మరొకరికి వ్యాపించకుండా మాస్క్, భౌతిక దూరం వంటివి తప్పనిసరిగా పాటించాలి. మున్ముందు అసలు కోవిడ్ సోకకుండా ఉండే వాక్సిన్ రావొచ్చు. జాగ్రత్తపడటమే మేలు వైరస్ వ్యాప్తి చైన్ను తెంపడం ద్వారా విస్తృతిని తగ్గించవచ్చు. మాస్క్ను సరైన రీతిలో ధరించడం, భౌతిక దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలి. వెంటిలేషన్ సరిగ్గా ఉన్న గదుల్లో ఉండాలి. సమూహాలకు దూరంగా ఉండాలి. స్నేహితులు, బంధువులే కదా. ఏమీ కాదనుకోవద్దు. లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ వ్యక్తులు మనచుట్టూ ఉండొచ్చు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ -
పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా? అయితే జాగ్రత్త!
చిక్కడపల్లిలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఒక బంక్లోరెండు రోజుల క్రితం వాహనంలో పెట్రోల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక వ్యక్తి సుజికి యాక్సిస్ ద్విచక్రవాహనంపై దూరప్రాంతానికి వెళ్లి వస్తూ మధ్యలో బంకు వద్ద పెట్రోల్ పోయించుకుంటుండగా వేడిగా ఉన్న ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట నుంచి సికింద్రాబాద్కు వస్తున్న కారు తార్నాకలోని మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్, అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం అయింది. సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలకు ఇంధనం ఆవిరైపోతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్తో ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు ట్యాంక్లో పోస్తున్న ఇంధనం రోజువారీ అవసరాల కోసం ఏ మూలకు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఎండల్లో పార్కింగ్తో ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి ఆవిరై గాలిలో కలుస్తోంది. ఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్లను పోయించుకోవడం సర్వసాధారణమైంది. వాహనాల ట్యాంకులు ఉష్ణతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ వేడికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముప్పు పొంచి ఉంది.. సూర్యుడి ప్రతాపానికి కార్లు, ఆటోలు, బైక్ల నుంచి మంటలు చెలరేగుతాయి. సాధారణంగా వాహనాల్లో వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇంధనాలు లీకైనా వేడికి వెంటనే మంటలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏసీ కారులో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్లు సూచిస్తున్నారు. వైరింగ్లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లీకేజీలతో మంటలు అంటుకునే అవకాశాలు లేకపోలేదు. వాహనాల్లో నాణ్యత లేని వైర్లు వాడడంతో నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకునే ప్రమాదమున్నది. (చదవండి: సౌదీ చమురు పెత్తనానికి చెక్!) వాహనాలు.. ఇలా గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 65.14 లక్షల వాహనాలున్నాయి. అందులో ద్విచక్ర వాహ నాలు సుమారు 44.04 లక్షల వరకూ ఉంటాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజూ 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు సాగుతున్నట్లు చమురు కంపెనీల గణాంకాలు చెబుతున్నాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వలపై వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్లో సగం వరకే ఇంధనం నింపాలని స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్ను నిండుగా నింపితే ఉష్ణతాపానికి ఆవిరై పోవడంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్తలు ఇలా... వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయాలి. ఇంజన్కు సరిపడా ఆయిల్ ఉండేట్లు చూడాలి. ఎండల వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. వేసవిలో ఇంజిన్ గార్డు లు తొలగించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి కొద్దిసేపు ఇంజ¯Œన్కు విశ్రాంతినివ్వాలి. వాహనాల పెట్రోల్ ట్యాంకుపై దళసరి కవర్ ఉండేటట్లు చూడాలి. కవర్లు వేడెక్కకుండా ఉండేందుకు వెల్వెట్, పోస్టు క్లాత్ సీట్ కవర్లు వాడాలి. వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూసివేయాలి. (చదవండి: ఏప్రిలియా బుకింగ్స్ షురూ...!) -
కరోనా కట్టడికి యుధ్దప్రాతిపదికన చర్యలు అవసరం..
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్టాల సీఎంలతో వీడియో కాన్సరేన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడికి మరిన్నిచర్యలు అవసరమన్నారు. గడచిన కొన్నిరోజులుగా కేసులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్లో దీని తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాలు అవసరమైతే లాక్డౌన్ విధించి కరోనా తీవ్రతను అదుపుచేయాలని కోరారు. దీని కట్టడి కోసం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రోజుకు దాదాపు 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. కరోనాపై ప్రభుత్వాలు ఏమాత్రం నిర్లక్క్ష్యం చేయోద్దని అన్నారు. దీనిపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకొవాలన్నారు. ప్రతిచోట ట్రేసింగ్ నిర్వహించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ మాస్క్ను విధిగా ధరించడం,సామాజిక దూరం, శానిటైజేషన్ వంటివి ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. కోవిడ్ టెస్టుల సంఖ్యలను పెంచాలని కోరారు. ఆర్టీపీసీఆర్ల టెస్టులను పెంచాలని అన్నారు. గడచిన 24 గంటలలో మహరాష్ట్రలో 17,864 కేసులు, కేరళ లో 1,970..పంజాబ్లో 1,463 కేసులు నమోదయ్యాయని తెలిపారు. చదవండి: షాకింగ్: 150మంది సాధువులకు కరోనా