Top Stories
ప్రధాన వార్తలు
![YS Jagan Mohan Reddy direction to MPs at YSRCP Parliamentary meeting](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/jagan_6.jpg.webp?itok=-2_nHCC0)
యావత్ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్ జగన్
ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ పోరాటంలో మనతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోదాం. ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్దాం. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతోందో వివరిద్దాం. ధర్నా అనంతరం పార్టీ ఎంపీలు పార్లమెంట్కు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను అందరి దృష్టికి తీసుకెళ్లాలి. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన తాడే పల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్లు కోరాం. అపాయింట్మెంట్లు రాగానే.. వారికీ ఇక్కడి పరిస్థితిని వివరిస్తాం. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీ ఒక్కో బాధ్యత తీసుకోవాలి. వెంటనే ఢిల్లీ వెళ్లి ఆ పనుల్లో నిమగ్నం కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. అందుకే మనం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాం. అలా చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రజాస్వామ్య మనుగడకే పెను ప్రమాదం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అవి ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బ. అందుకే అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. వినుకొండలో రషీద్ హత్యే ఇందుకు పరాకాష్ట. ఆ హత్య వీడియో దృశ్యాలు.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపిన తీరు అత్యంత అమానుషం. తమ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది.రషీద్ హత్యపై వక్రీకరణకు యత్నం వినుకొండలో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ ఒక వైన్ షాపులో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఆ రాజకీయ హత్య ఘటనను వక్రీకరించడానికి ఎల్లో మీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, ఇప్పుడు జరిగిన దారుణ హత్యకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆ కాలిన బైక్.. వైఎస్సార్సీపీ వాళ్లది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. దాన్ని కూడా ట్విస్ట్ చేసి, నానా తప్పుడు రాతలు రాస్తున్నారు. అసలు తమ కొడుకు ఏం తప్పు చేశాడని రషీద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘సీఎంగా వైఎస్ జగన్ ఉంటే.. అంతా మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. హంతకుడైన జిలానీ.. లోకేశ్ పుట్టిన రోజున, స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలను రషీద్ తల్లిదండ్రులు చూపారు. స్థానిక ఎమ్మెల్యేతో కూడా కలిసి దిగిన హంతకుడి ఫొటోలను వారు చూపించారు.హత్యలు.. హత్యాయత్నాలు.. వేధింపులు.. విధ్వంసాలు పల్నాడు జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే హత్యతో సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు మల్లికా గార్గ్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆమె సమర్థురాలు. అందుకే ఆమెను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని నియమించుకుని ఈ దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది.ఎంపీపైనా యథేచ్ఛగా దాడి మరోవైపు తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఎంపీ మిథున్రెడ్డిపై దాడులు చేశారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఒక న్యాయవాది. ఎంపీ మిథున్రెడ్డి పుంగనూరులో ఆయన ఇంటికి వెళ్తే, రాళ్లతో దాడి చేసి.. వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన వాహనాన్ని దగ్ధం చేశారు. అన్ని తప్పులు చేసిన వారే, తిరిగి మన పార్టీ వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా?రాష్ట్రంలో 15 ఏళ్లుగా వైఎస్సార్సీపీ ప్రస్థానం సాగుతోంది. చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్సీపీని అణగదొక్కలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయడం ధర్మమా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? ప్రభుత్వాలు చేసే మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి. గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం. అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై ఎవరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన. అందుకే దగ్గరుండి విధ్వంసకాండను ప్రోత్సహిస్తున్నారు. పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి. కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
![North Korea Throws Trash Baloons On Seoul](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/trashbaloons.jpg.webp?itok=l0Td50BP)
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్పైకి ఆదివారం(జులై 21) ఉదయం నార్త్కొరియా మళ్లీ చెత్త బెలూన్లు ప్రయోగించింది. సియోల్పై చెత్త బెలూన్లు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్త బెలూన్లకు ప్రతీకారంగా సరిహద్దులో లౌడ్స్పీకర్లతో ఉత్తరకొరియా నియంత కిమ్కు వ్యతిరేక ప్రసారాలు చేస్తామని సియోల్ హెచ్చరించింది. చెత్త బెలూన్ల ప్రయోగంపై నార్త్ కొరియా స్పందించింది. కొంత మంది సౌత్ కొరియా పౌరులు బెలూన్ల ద్వారా నార్త్ కొరియాపైకి రాజకీయ కరపత్రాలు పంపడం వల్లే తాము చెత్త బెలూన్లు ప్రయోగించామని తెలిపింది. ఇది కొనసాగితే రానున్న రోజుల్లో సౌత్కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నియంత కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. గతంలోనూ సౌత్కొరియాపైకి నార్త్కొరియా చెత్త బెలూన్లను ప్రయోగించింది.
![Sakshi Editorial On AP TDP Chandrababu Govt and President rule](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/EDITCART20-7-24.jpg.webp?itok=67O5mfWh)
రాష్ట్రపతి పాలనే శరణ్యం!
‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్’ సెటిల్ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్ బుక్’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్ బుక్’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత, ‘రెడ్ బుక్’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్ కౌన్సిలర్నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్బుక్ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్లో తమ ’సూపర్ సిక్స్’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్ ఆన్ అకౌంట్’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com
![Nipah Infection Confirmed In 14 Year-Old Boy In Kerala](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/nipa.jpg.webp?itok=h9lIjvW6)
కేరళలో నిఫా వైరస్ కలకలం..!
కేరళలో నిఫా వైరస్ కలకలంతో ఒక్కసారిగా యావత్తు రాష్ట్రం ఉలిక్కిపడింది. వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా ఆరోగ్య కేంద్రాలను అలర్ట్ చేసింది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా బారిన పడ్డాడు. పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు. ప్రస్తుతం అతను ఒక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతన్ని అక్కడ నుంచి కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తారని అన్నారు. అతన్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హైరిస్క్ కాంటాక్ట్లు ఇప్పటికే వేరుచేసి నమునాలను పరీక్ష కోసం పంపినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్ల పేర్కొన్నారు వైద్యులు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సమీప ఆస్పత్రులన్నింటిలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు మాస్క్ ధరించాలని, రోగులు ఆస్పత్రులను సందర్శించే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. అంతకుమునుపు ఆస్ట్రేలియా నుంచి సేకరించి పూణే ఎన్ఐవీలో నిల్వ ఉంచిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు. ఆ బాధిత చిన్నారి పాండిక్కాడ్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు కేరళ అధికారులు. అంతేగాదు ఆయా సమీప ప్రాంతాల్లోని ప్రజలు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమీప మంజేరి వైద్య కళాశాలలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసింది. అంతేగాక నిపా వైరస్ సోకిన బాలుడితో పరిచయం ఉన్నవారందరినీ ఐసోలేషన్లో ఉంచారు. పైగా అంటువ్యాధి నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేసేలా ఆరోగ్య కేంద్రాలను కూడా ఆదేశించారు అధికారులు. నిఫా వైరస్ లక్షణాలు..తీవ్రమైన తలనొప్పిఅలసటవాంతులుబలహీనత మూర్ఛ, చూపు మందగించడంతో పాటు జ్వరంఈ వ్యాధి శరీర ద్రవాల ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది.పాటించాల్సిన జాగ్రత్తలు..సాధ్యమైనంత వరకు చేతులను వీలైనన్ని సార్లు కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులను సందర్శించటం, అంటువ్యాధులు ప్రబలే ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. పక్షులు లేదా జంతువులు సగం తిన్న లేదా కరిచిన పండ్లను తినకూడదు. అలాగే పండ్లను సరిగ్గా కడిగితినాలి. బహిరంగ కంటైనర్లలో నిల్వ ఉంచిన కల్లు వంటి పానీయాలను తీసుకోకూడదు వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.(చదవండి: వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?)
![Man Who Punched Pune Woman In Road Rage Case Arrested Along With Wife](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/Jerlyn%20D%26%23039%3BSilva.jpg.webp?itok=RhiP2kMa)
రెండున్నర కిలోమీటర్లు.. మహిళను వెంబడించి..
పూణే : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపేందుకు స్కూటీ మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు. అయితే జాతీయ రహదారి మీద వెళ్తున్న ఆమె స్కూటీని ఓ కారు సుమారు రెండున్న కిలోమీటర్లు వెంబడించింది. స్కూటీ ముందుకు పోకుండా కారును అడ్డుగా పెట్టింది. అడ్డంగా అనంతరం కారులో నుంచి దిగిన భార్య, భర్తలు సదరు మహిళపై దాడికి దిగారు. పిడుగుద్దులు గుద్దుతూ దూర్బుషలాడారు. అక్కడి నుంచి పరారయ్యారు.పూణే పోలీసుల కథనం ప్రకారం.. పూణేలో నివాసం ఉండే జెర్లిన్ డిసిల్వా కంటెంట్ క్రియేటర్గా, మార్కెటింగ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో శనివారం తన ఇద్దరు పిల్లలతో స్కూటీ మీద పాషన్-బానర్ లింక్ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ సమయంలో డిసిల్వా స్కూటీని కారు యజమాని స్వప్నిల్ కేకరేలు రెండున్న కిలోమీరట్లు వెంబడించారు. స్కూటీని ఆపేశారు. View this post on Instagram A post shared by Jerllyyn || Pune Content Creator (@jerlyndsilva) అనంతరం కారులో నుంచి దిగిన స్వప్నిల్ కేకరే దంపతులు డిసిల్వాను జుట్టు పట్టుకుని ఈడ్చారు. పిల్లలు ఎదురుగా ఉన్న పట్టించుకోకుండా భర్త బాధితురాలిపై పిడుగులు గుద్దారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.ముక్కు నుంచి రక్తం దారాళంగా కారుతుండగా డిసిల్వా తనపై జరిగిన దాడిని వివరిస్తూ వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిసిల్వా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా డిసిల్వా మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండండి. ఈ నగరం ఎంత సురక్షితంగా ఉందో చూడండి? ప్రజలు ఉన్మాదుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. డిసిల్వా మేనమామ విశాల్ సంఘటన జరిగిన తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి కారణం లేకుండా నిందితుడు తనపై దాడి చేశాడని చెప్పారు.తన మేనకోడలు స్కూటీ ఆ కారును ఢీకొట్టలేదు. అయినా కారణం లేకుండా దాడి చేశాడు. తానెంత శక్తివంతుడినో చూపించడానికి అతను అలా చేసి ఉండవచ్చు. స్వప్నిల్కేకరే’తోపాటు ఆయన భార్య ఉంది. కానీ ఆమె దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![Actor Ram Charan Gave New Name To Wife Upasana](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/ram-charan-upasana.jpg.webp?itok=Q0DlvLDM)
భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఈమె పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా చాలామంది ఉపాసనకు విషెస్ చెప్పాడు. ఇకపోతే బర్త్ డే వేడుకల్ని చరణ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ.. కొత్త పేరు ఏంటనేది రివీల్ చేశాడు.(ఇదీ చదవండి: సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్)రామ్ చరణ్కి ఉన్న ఫ్యాన్ బేస్ సంగతేమో గానీ గత కొన్నాళ్లలో మెగా కోడలు ఉపాసన కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించారు. గతేడాది కూతురికి జన్మనిచ్చిన ఉపాసన.. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా బర్త్ డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక పుట్టినరోజు ఫొటోని పోస్ట్ చేసిన చరణ్.. ఉపాసనని 'కారా మమ్మీ' అని రాసుకొచ్చాడు. నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా సంభోదించాడు. దీనికి రిప్లై ఇచ్చిన ఉపాసన.. 'థ్యాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ మాత్రం సూపర్' అని రాసుకొచ్చింది. ఇదిప్పుడు మెగాఫ్యాన్స్ని తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్కి కూడా!) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)
![Woman Dislocate Shoulder To Fall Asleep Comfortably Goes Viral](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/influe.jpg.webp?itok=kTTT-fkR)
వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?
‘నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు– ‘చక్కని సంగీతం వింటాను. నచ్చిన పుస్తకం చదువుకుంటాను’... ఇలాంటి జవాబులు వినిపించడం సాధారణమే. అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ టియా విల్సన్ నోటి నుంచి వచ్చిన మాట విని నెట్ లోకులు షాకు అయ్యారు. ‘సౌకర్యవంతంగా. సుఖంగా నిద్రపోవడానికి నా భుజాన్ని డిస్లొకేట్ చేస్తాను. నిద్ర నుంచి లేచిన తరువాత తరిగి యథాస్థానంలో అమర్చుకుంటాను’ అంటుంది విల్సన్. ‘జోక్ చేస్తోందా?’ అనుకోవద్దు. ఆమె చెప్పింది నిజమే. ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (ఈడీఎస్)తో బాధపడుతోంది టియా విల్సన్. ‘ఈడీఎస్’ అనేది జన్యుపరమైన రుగ్మత. చర్మం సాగదీయబడినట్లుగా ఉంటుంది. కీళ్లు వదులవుతాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. భుజాన్ని డిస్లొకేట్ చేసినప్పుడు అచేతనంగా మారి వేలాడబడుతున్నట్లుగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ‘హౌ ఐ స్లీప్’ క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో టియా విల్సన్ పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వీక్షకుల గుండెలను చెమ్మగిల్లేలా చేసింది. View this post on Instagram A post shared by Tia Wilson (@tortillawilson) (చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు..చివరికి?)
![Man Suicide Attempt In Begumpet Railway Station](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/3258.jpg.webp?itok=hKgwZARZ)
హైదరాబాద్లో దారుణం.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
![EPFO record high net enrollment in May](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/epfo.jpg.webp?itok=T6tgoucA)
ఈపీఎఫ్వో రికార్డ్.. భారీగా పెరిగిన ఉద్యోగాలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.మే నెలలో ఈపీఎఫ్వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్ఫోర్స్లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది.
![KL Rahul likely to re-join RCB after reported rift with LSG](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/WhatsApp%20Image%202024-07-21%20at%2008.14.11.jpeg.webp?itok=bi0rTkxC)
IPL 2025: డుప్లెసిస్కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు.
‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు
తండ్రి కాబోతున్నతెలుగు ప్రముఖ కమెడియన్.. పోస్ట్ వైరల్
మూడేళ్లుగా సింగిల్గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు
కేరళలో నిఫా వైరస్ కలకలం..!
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
తుపాకీతో భార్య కాల్చివేత
Pavithra Gowda: పవిత్రకు అందని పెట్టె
రెండున్నర కిలోమీటర్లు.. మహిళను వెంబడించి..
Today Horoscope: ఈ రాశి వారికి.. కొత్త పరిచయాలు, బంధువుల నుంచి శుభవార్తలు!
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్ జగన్
తాడిపత్రిలో హై టెన్షన్
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు
తండ్రి కాబోతున్నతెలుగు ప్రముఖ కమెడియన్.. పోస్ట్ వైరల్
మూడేళ్లుగా సింగిల్గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు
కేరళలో నిఫా వైరస్ కలకలం..!
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
తుపాకీతో భార్య కాల్చివేత
Pavithra Gowda: పవిత్రకు అందని పెట్టె
రెండున్నర కిలోమీటర్లు.. మహిళను వెంబడించి..
Today Horoscope: ఈ రాశి వారికి.. కొత్త పరిచయాలు, బంధువుల నుంచి శుభవార్తలు!
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్ జగన్
తాడిపత్రిలో హై టెన్షన్
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
సినిమా
![Legal Notices To Kalki 2898 AD Movie Team](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/kalki-movie-legal-notice.jpg.webp?itok=kY_CKynV)
'కల్కి 2898' టీమ్కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్కి కూడా!
ప్రభాస్ 'కల్కి' రిలీజై దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితేనేం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడంతో ఇప్పటికే విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహాభారతం సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వీటికోసమే జనాలు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ సన్నివేశాల విషయమై చిత్రబృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.(ఇదీ చదవండి: శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్)'కల్కి' సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్రబృందంతో పాటు ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్కు నోటీసులు పంపారు. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'మన పురాణాల్లో ఉన్న వాటికి ఈ సినిమా విరుద్ధంగా ఉంది. మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది' అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లే పేర్కొన్నారు.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?)
![Movies to Release on Independence Day in Tollywood](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/MOVIE.jpg.webp?itok=HKJ74n5-)
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్గా థియేటర్స్లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది.
![Most Watched Hindi Web Series Of First Half of 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/movies.jpg.webp?itok=WYMccHRb)
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్జెండర్ అంటూ కామెంట్స్
![Tollywood Actress Social Halchal Looks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/social.jpg.webp?itok=NPWmyuqo)
జిమ్లో మృణాళ్.. గ్లామర్తో కృతి శెట్టి.. మురారి పోస్టర్తో మహేశ్
మనుసులో సంతోషం ఉంటే అంతకు మించిన గ్లామర్ మరొకటి లేదంటున్న కృతి శెట్టిమహేశ్ బాబు హిట్ సినిమా 'మురారి' రీ-రిలీజ్ పోస్టర్ వైరల్బర్త్డే వేడుకుల జరుపుకున్న సితార ఘట్టమనేని కల్కి షూట్ సమయంలో భైరవ ఎంట్రీ సీన్ మేకింగ్ స్టిల్ పంచుకున్న మేకర్స్ జిమ్లో కసరత్తులు చేస్తున్న మృణాళ్ ఠాకూర్ View this post on Instagram A post shared by Genelia Deshmukh (@itsgeneliad) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by AMB Cinemas (@amb_cinemas) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anilkrishna Kanneganti (@aneelkanneganti)
క్రీడలు
![Manolo Marquez appointed as new Indian football team head coach](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/indian-foot-ball.jpg.webp?itok=pTUfCEHo)
భారత ఫుట్బాల్ టీమ్ హెడ్ కోచ్గా మనోలో మార్క్వెజ్
భారత ఫుట్బాల్ టీమ్కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్కు చెందిన మనోలో మార్క్వెజ్ను టీమ్ హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టీమ్ ఎఫ్సీ గోవాకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.అయితే 2024–25 సీజన్లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్సీ గోవా కోచ్గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. కోచ్గా యూఈఎఫ్ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.వియత్నాం, లెబనాన్లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్సీ గోవాకు కోచ్గా మారక ముందు ఐఎస్ఎల్లో ఆయన హైదరాబాద్ ఎఫ్సీకి కోచ్గా పని చేశారు.మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్ఎల్ చాంపియన్గా నిలవడం విశేషం. స్పెయిన్లో కోచ్గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్కు కూడా కోచ్గా పని చేశారు.
![PV Sindhu for a Historic Hat-Trick at Paris Olympics 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/SINDHU-LOST-INDIA-OPNE-1S-R.jpg.webp?itok=NbMjxmyg)
Paris Olympics 2024: ‘హ్యాట్రిక్’పై సింధు గురి
బ్యాడ్మింటన్ను 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో, ఆ తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్లలో ఎగ్జిబిషన్ / డెమాన్్రస్టేషన్ స్పోర్ట్గా ఆడించారు. అంటే పోటీలు జరిపి విజేతలను ప్రకటించినా...ఆ విజయాలను పతకాల జాబితాలో కలపరు. 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్నుంచి అధికారికంగా బ్యాడ్మింటన్ ఒలింపిక్స్లో భాగమైంది. 1992 నుంచి 2008 వరకు భారత షట్లర్లు పోటీల్లో పాల్గొన్నా...ఈ ఐదు ప్రయత్నాల్లోనూ మనకు ఒక్క పతకం కూడా దక్కలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో చెప్పుకోదగ్గ విజయాలతో అప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిష్త్, పీవీవీ లక్ష్మి, అపర్ణా పొపట్, అనూప్ శ్రీధర్లాంటి ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరడమే అప్పటి వరకు భారత అత్యుత్తమ ప్రదర్శన. వరుసగా మూడు సార్లు... 2012 లండన్ ఒలింపిక్స్లో భారత్ పరిస్థితి మారింది. అప్పటికే వరుస విజయాలు, సూపర్ సిరీస్ టైటిల్స్తో అద్భుత ఫామ్లో ఉన్న సైనా నెహా్వల్ భారత్కు బ్యాడ్మింటన్లో తొలి ఒలింపిక్ పతకాన్ని అందించింది. సెమీ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిన సైనా...ప్లే ఆఫ్ మ్యాచ్లో గ్జిన్ వాంగ్ (చైనా)పై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరో వైపు పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ వరకు రాగలిగాడు. నాలుగేళ్ల తిరిగే సరికి షటిల్లో భారత్ పతకం మరింత మెరుగైంది. అంతర్జాతీయ యవనికపై దూసుకొచ్చిన 21 ఏళ్ల యువ తార పూసర్ల వెంకట (పీవీ) సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పదునైన ఆటతో ఫైనల్ చేరిన సింధు...తుది పోరులో కరోలినా మరీన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. ఈ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ వరకు చేరినా...చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి నిష్క్రమించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. ఈ సారి కూడా సింధునే పతకాన్ని గెలుచుకుంది. సెమీస్లో తై జు (తైపీ) చేతిలో ఓటమిపాలైన సింధు... ప్లే ఆఫ్ పోరులో బింగ్జియావో (చైనా)పై గెలిచి వరుసగా రెండో ఒలింపిక్ పతకాన్ని తన మెడలో వేసుకుంది. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై ఆ సమయంలో మంచి అంచనాలే ఉన్నా...దురదృష్టవశాత్తూ వాళ్లు గ్రూప్ దశకే పరిమితమయ్యారు. అనుకూలమైన ‘డ్రా’తో... ఒలింపిక్స్లో భారత్నుంచి వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సింధు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్లోనూ పతకం గెలిచి ఆల్టైమ్ గ్రేట్గా నిలిచే అవకాశం సింధు ముందుంది. ఊహించినట్లుగానే గ్రూప్ దశలో రెండు సునాయాస మ్యాచ్లు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా 2020లో కాంస్య పోరులో తాను ఓడించిన బింగ్జియావో, చెన్ యు ఫె, మరీన్లను దాటితే ఫైనల్ వరకు వెళ్లగలదు. గత కొంత కాలంగా గొప్ప ఫామ్లో లేకపోయినా...కీలక సమయంలో సత్తా చాటగల నైపుణ్యం సింధు సొంతం. అందుకే ఆమె పతకం గెలవడంపై అంచనాలున్నాయి. పురుషుల డబుల్స్లో కూడా సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి మంచి ‘డ్రా’నే లభించింది. గ్రూప్ ‘సి’లో విజేతగా ముందంజ వేస్తే ఈ జోడీకి నాకౌట్లోనూ తమకంటే బలహీన ప్రత్యర్థులే ఎదరు కావచ్చు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ ఎంత వరకు వెళతాడనేది ఆసక్తికరం. జొనాథన్ క్రిస్టీలాంటి టాప్ ప్లేయర్ను ఓడిస్తే లక్ష్యసేన్ నాకౌట్కు వెళ్లే అవకాశం ఉంది. ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్, ప్రణయ్ ఎదురు కావచ్చు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో జోడి గ్రూప్ దశను దాటి నాకౌట్కు చేరడం కష్టమే. ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో గత మూడు ఒలింపిక్స్లలో వరుసగా పతకాలు వచ్చాయి. 2012లో సైనా నెహా్వల్ కాంస్యంతో మెరవగా...2016లో పీవీ సింధు రజతం సాధించింది. 2020లోనూ తన జోరును కొనసాగిస్తూ సింధు కాంస్యాన్ని అందుకుంది. –సాక్షి క్రీడా విభాగం
![Hardik Reminded By Gambhir: Report Claims Coach Stern Message On ODI Future](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/hp.jpg.webp?itok=PMWHJh5g)
అలా అయితేనే వన్డేల్లో రీ ఎంట్రీ.. హార్దిక్కు బీసీసీఐ కండిషన్!
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అతడికి కాలం కలిసిరావడం లేదు.భార్య నటాషా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం ఇద్దరం సమానంగా బాధ్యత వహిస్తామని.. కో పేరెంటింగ్ చేస్తామని వెల్లడించాడు.కానీ సంయుక్త విడాకుల ప్రకటన అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని తన పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిపోయింది. ముంబై ఎయిర్పోర్టు నుంచి అక్కడికి బయల్దేరుతున్న సమయంలో అగస్త్య ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఏడ్చేసిన అగస్త్య!తండ్రిని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోయినా.. తల్లి బలవంతం చేయడంతోనే అగస్త్య ఆమెతో వెళ్లినట్లుగా ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో హార్దిక్ సైతం తీవ్రమైన బాధతో కుంగిపోతున్నట్లు సమాచారం.వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు.. టీమిండియాలోనూ కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ను బీసీసీఐ పక్కనపెట్టింది.చేజారిన కెప్టెన్సీకొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టు కెప్టెన్గా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటన నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్గా సూర్యను ప్రకటించి హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా పేర్కొంది.అయితే, ఈ టూర్లో భాగంగా వన్డే సిరీస్ కూడా జరుగనుంది. కానీ జట్టులో హార్దిక్కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మూడు ఫార్మాట్లలో ఆడాలికాగా కోచ్గా ప్రయాణం మొదలుపెట్టకముందే.. గంభీర్ తన వైఖరేంటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఫిట్గా ఉండే ఆటగాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడాలని పేర్కొన్నాడు.గాయాల భయంతో ఆటకు దూరంగా ఉంటే తనకు నచ్చదని పేర్కొన్నాడు. హార్దిక్ విషయానికొస్తే.. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ తరచూ గాయాల బారిన పడుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే.అందుకే ఇప్పటికే అతడు టెస్టు ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడిన తర్వాత అతడికి మళ్లీ వన్డే ఆడే అవకాశం రాలేదు.దేశవాళీ క్రికెట్ ఆడితేనే రీఎంట్రీఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని గంభీర్ హార్దిక్కు కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ(వన్డే)లో ఆడి.. బౌలింగ్లోనూ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే యాభై ఓవర్ల ఫార్మాట్లో పునరాగమనం చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా చెప్పిందిదేఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘వన్డేల్లో హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేస్తే చూడాలని ఉందని గంభీర్ అతడికి ఫోన్ కాల్ ద్వారా తెలిపాడు’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాయి.ఇక శ్రీలంక టూర్కు జట్ల ప్రకటన సమయంలో బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్కు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఉందని.. దేశీ టోర్నీల్లో పాల్గొన్నాలన్న నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. చదవండి: ICC: టీమిండియా మ్యాచ్లు అన్నీ లాహోర్లోనే?!
![Smriti Mandhana Gifts Phone To Special Fan After Ind vs Pak Match: Video](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/smriti2.jpg.webp?itok=Iq0WhniT)
మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వుమెన్స్ ఆసియా టీ20 కప్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే.శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలి మ్యాచ్లోనే గెలుపు నమోదు చేసింది.పాక్ను చిత్తు చేసిన భారత్పాకిస్తాన్ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(29 బంతుల్లో 40), స్మృతి మంధాన (31 బంతుల్లో 45) రాణించారు.ఇక పాక్ను 108 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్ బౌలర్ దీప్తి శర్మ(3/20)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.స్పెషల్ ఫ్యాన్ఇదిలా ఉంటే.. డంబుల్లా వేదికగా జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ను చూసేందుకు ఓ ‘ప్రత్యేకమైన’ చిన్నారి స్టేడియానికి వచ్చింది. ఆమె పేరు ఆదీషా హెరాత్.ఆదీషాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే భారత క్రికెటర్ స్మృతి మంధాన అంటే మరీ ఇష్టం. అందుకే తన అభిమాన ప్లేయర్ను కలుసుకునేందుకు ఆదీషా తల్లి సాయంతో మ్యాచ్ వేదిక వద్దకు వచ్చింది.స్పెషల్ ఏబుల్డ్ చైల్డ్ అయినా ఆదీషాను తన తల్లి వీల్చైర్లో తీసుకువచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన ఆదీషా దగ్గరికి వెళ్లి పలకరించింది. అంతేకాదు తనకు మొబైల్ ఫోన్ను బహుమతిగా అందించింది.సంతోషంగా ఉందిఈ విషయంపై స్పందించిన ఆదీషా తల్లి మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మ్యాచ్ కచ్చితంగా చూడాలంటూ నా కూతురు పట్టుబట్టింది. భారత జట్టు క్రికెటర్ మంధానను కలిశాం.ఆమె నా కూతురికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. తనలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి బహుమతి మేము అస్సలు ఊహించలేదు. నిజంగా ఈ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలే’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత్ తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తలపడనుంది.చదవండి: IND Vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?.. నాకైతే అర్థం కావడం లేదుAdeesha Herath's love for cricket brought her to the stadium, despite all the challenges. The highlight of her day? A surprise encounter with her favorite cricketer, Smriti Mandhana, who handed her a mobile phone as a token of appreciation 🥺𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐞𝐬𝐞… pic.twitter.com/iqgL2RNE9v— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 20, 2024
బిజినెస్
![First Driverless Trucks in Dubai, Complete Initial Tests](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/driverless-truck.jpg.webp?itok=4_sUOIWR)
డ్రైవర్ అవసరం లేని ట్రక్.. దుబాయ్లో టెస్ట్
టెక్నాలజీ పెరుగుతుంటే.. వినియోగించే వాహనాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే డ్రైవర్లెస్ వెహికల్స్ పుట్టుకొచ్చాయి. ఈ రంగం మరో అడుగు ముందుకు వేసి వాణిజ్య విభాగంలోకి ప్రవేశించి డ్రైవర్లెస్ ట్రక్కును తీసుకువచ్చింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి డ్రైవర్లెస్ ట్రక్కును దుబాయ్ కంపెనీ విజయవంతంగా టెస్ట్ చేసింది. డిసెంబర్ 2022లో ఏవియేషన్ హబ్ దుబాయ్ సౌత్.. ఎవోకార్గో భాగస్వామ్యంతో డ్రైవర్లెస్ ట్రక్కులకు సంబంధించిన ఓ ఒప్పందం ఏర్పడింది.ఈ డ్రైవర్లెస్ ట్రక్కు ఆటోమాటిక్గా ముందుకు కదులుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరాలు చుట్టూ ఉన్న పరిసరాలను చూపిస్తాయి. ఇవి అల్ట్రాసోనిక్ సెన్సార్లుగా పనిచేస్తాయి. ఈ ట్రక్కును ఆబ్జెక్ట్ డిటెక్షన్, యాక్సిడెంట్ ప్రివెన్షన్, ఎమర్జెన్సీ స్టాప్లు, రివర్స్ ఆపరేషన్లు వంటి కీలక అంశాలలో టెస్ట్ చేశారు. ఈ అన్ని పరీక్షల్లోనూ ఈ ట్రక్కు విజయం సాధించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో దాదాపు అన్ని వాహన విభాగాల్లో ఆటోమాటిక్ రవాణాను పెంపొందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2030 నాటికి 25 శాతం ఆటోమాటిక్ వాహనాలు రోడ్డు మీదికి రానున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నాయి.
![Karnataka Propose Extending IT Work Hours To 14](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/work-hours_0.jpg.webp?itok=717irMqX)
ఇదే జరిగితే.. టెకీల పరిస్థితి ఏంటి?
ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 10 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని చూస్తోంది. ఇది ఐటీ రంగ సంఘాల నుంచి వ్యతిరేకతను రేకెత్తించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) సభ్యులు ఇప్పటికే కార్మిక మంత్రి సంతోష్ లాడ్తో సమావేశమై ఈ పరిణామానికి సంబంధించి తమ సమస్యలను వినిపించారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులపై ఉంటుందని అన్నారు.కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో ఓవర్టైమ్తో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది. ఒక ఉద్యోగి చేత మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు.ప్రస్తుతం ఈ పనిగంటలు పెంపుకు సంబంధించిన ప్రతిపాదలన మీద చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రాష్ట్ర కార్మకశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా పని చేసే పని గంటలపై ఎటువంటి కట్ ఆఫ్ లేదని కేఐటీయూ సెక్రటరీ సూరజ్ నిడియంగ అన్నారు. వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
![elon musk Congratulates PM NarendraModi for 100 million followers on x](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/modi01.jpg.webp?itok=QIDYHquB)
ఎక్స్లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్ అభినందనలు
ఎక్స్ ప్లాట్ఫామ్లో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఇలాన్మస్క్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్గా మారంది.‘అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు’ అని మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు. మోదీకి ఎక్స్లో 100.1 మిలియన్ల(10 కోట్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ సందర్భంగా ప్రధాని..‘ఎక్స్లో వంద మిలియన్లు! ఈ శక్తివంతమైన మాధ్యమంలో చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను ఆదరించినందుకు సంతోషంగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Congratulations PM @NarendraModi on being the most followed world leader!— Elon Musk (@elonmusk) July 19, 2024ఇదీ చదవండి: విండోస్లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తులుఇలాన్మస్క్ 189 మిలియన్లుబరాక్ ఒబామా 131 మిలియన్లుక్రిస్టియానొ రొనాల్డో 112 మిలియన్లు జస్టిన్ బీబర్ 110 మిలియన్లురిహన్నా 108 మిలియన్లుకాటిపెర్రీ 106 మిలియన్లునరేంద్రమోదీ 100 మిలియన్లుటేలర్ స్విఫ్ట్ 95.3 మిలియన్లుడొనాల్డ్ ట్రంప్ 87.5 మిలియన్లులేడీ గగా 83.1 మిలియన్లు
![Microsoft outage should be a wake up call SEBI Chairperson](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/sebi.jpg.webp?itok=pjKfRQUe)
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బగ్తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
ఫ్యామిలీ
![Complex Surgeries With Robots In Surgical Procedures](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/robo.jpg.webp?itok=lqj0YfwA)
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్బ్లాడర్లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్
![Budget 2024: Special Story About Budget 2024-25](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/iStock-1311030191-money.jpg.webp?itok=1i3e5VH6)
Budget 2024: ఆమె బడ్జెట్ ఎంత?
ఆకాశంలో సగం అన్నారు స్త్రీలను. బిడ్డకు జన్మనిచ్చి ΄పౌరుడిగా దేశానికి ఇస్తుంది స్త్రీ. కుటుంబ నిర్మాణంలో సమాజ ముందడుగులో ఆమె భాగస్వామ్యం సగం. జనాభాలో ఆమె సగం. కాని బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమెప్రాధాన్యం వెనక్కు వెళ్లి ఇతరప్రాధాన్యాలు ముందుకొస్తాయి. ‘ఇది పేదవాడి బడ్జెట్’, ‘రైతు బడ్జెట్’, ‘మధ్యతరగతి బడ్జెట్’ లాంటి మాటలు వినిపిస్తాయి తప్ప ‘ఇది స్త్రీ సంక్షేమం కోరిన బడ్జెట్’ అనే మాట వినపడదు. ఇప్పుడు రానున్నది బడ్జెట్ కాలం.దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆయా సభలు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నాయి. ఈ సందర్భంగా స్త్రీలు ఏం కోరుతున్నారు? ఆర్థిక మంత్రులకు ఏం సందేశం ఇస్తున్నారు?ఆదాయం పెంచుకునేలా చూడాలిదివ్యాంగులు, సీనియర్ మహిళలు, ఒంటరి మహిళల గురించి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి సారించాలి. వారు స్వయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి. కుటీర పరిశ్రమలతోపాటు హోమ్మేడ్ ఇండస్ట్రీలలో ప్రోత్సహించాలి. విద్య, నైపుణ్యావృద్ధి, ఉపాధి సంబంధించి నోడల్ డిపార్ట్మెంట్లు కొత్త కొత్త ప్రయోగాల్లో మహిళలను భాగస్వాములు చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలి. సాఫ్ట్వేర్, మెడిసిన్, రేడియోగ్రఫీ తదితర అత్యంత నైపుణ్యం కలిగిన రంగాలలో స్త్రీల కోసం బడ్జెట్లో నిధులు వెచ్చించి ప్రోత్సహించాలి. వెల్బీయింగ్, కేర్ ఎకానమిలతో స్త్రీలు ఆదాయం పెంచుకునేలా చూడాలి.– చిత్రామిశ్ర, ఐఏఎస్, పీఓ, ఐటీడీఏ, ఏటూరునాగారంవిద్యకు ప్రాధాన్యం ఇవ్వాలిబాలికల విద్యకుప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్ర, సాంకేతికరంగాల్లో బాలికలు రాణించేలా కార్యక్రమాలు నిర్వహించాలి.ప్రాథమిక పాఠశాల సమయంలో డ్రా΄పౌట్స్ను నిరోధించాలి. వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలి. పనిచేసే తల్లుల పిల్లలను చూసుకునేందుకు పని స్థలాల్లో కేర్టేకర్లను ఏర్పాటు చేయాలి. పాఠశాల, కళాశాల రోజుల్లో వైద్యశిబిరాల ద్వారా వివిధ వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు పరీక్షలు చేయాలి. – శేషాద్రిని రెడ్డి, ఏఎస్పీ, వేములవాడకుటీర పరిశ్రమల ఏర్పాటుపురుషులతో సమానంగా మహిళలు విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదిగితేనే ప్రపంచ దేశాలతో ΄ోల్చి నప్పుడు గర్వపడేలా దేశాభి వృద్ధిని సాధించగలం. మహిళల ఎదుగుదలకు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. అడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అందోళనకు గురి కాకుండా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. యువతులు ఇంటర్, డిగ్రీతోనే చదువు మానేసి వివాహం చేసుకోవడం వల్ల పురుషులతో సమానంగా ఎదగలేక΄ోతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించాలి. స్కూల్స్, జూనియర్, సాంకేతిక కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి. బాలికలు, మహిళలకు ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చేలా బడ్జెట్ నిధులు కేటాయించాలి.– ఇంజారపు పూజ, ఎస్పీ (ఐపీఎస్ అధికారి), పీటీసీ, మామునూరురక్షణకు నిధులు పెంచాలిపెరుగుతున్న మహిళా జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు పెంచాలి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే వివిధ శాఖలకు ఆ నిధులను ఖర్చు చేయాలి. వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గ్రామాల్లో ప్రత్యేక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన పథకాలు రూ΄÷ందించాలి. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు అనుకూలంగా మౌలిక వసతులు కల్పించడం ముఖ్యం. మహిళలపై రాక్షసంగా వ్యవహరించేవారికి కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాల్లో మార్పు తీసుకురావాలి. రాజకీయపరంగా అన్ని విభాగాల్లో మహిళలు తన కలలను సాకారం చేసుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాపార రంగంలో భాగస్వామ్యంఅభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. మన దేశంలోనూ అన్ని రంగాల్లోప్రాతినిధ్యం పెరిగింది. ఉన్నత చదువుల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు వ్యాపారరంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచాలి. వైద్యం, శారీరక దృఢత్వం కోసం అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్ఠం చేయాలి. మహిళలు విభిన్న రంగాల్లో రాణించేలా రిజర్వేషన్లు కల్పించాలి. మొత్తంగా రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్య, వైద్యం అన్నింటా మహిళలనుప్రొత్సహించాలి. – లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్, కరీంనగర్విద్య వైద్యం రవాణా ప్రభుత్వానిదేఇది గ్లోబలైజేషన్ కాలం. గ్లోబలైజేషన్కి హ్యూమన్ఫేస్ ఉండదని ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అన్న మాటలు ఈ మూడు దశాబ్దాల్లో స్త్రీల పట్ల సాగుతున్న వివక్ష చూసినప్పుడు సత్యమని తేలాయి. కనీసం విద్య, వైద్యరంగాలనైనా ప్రభుత్వం స్వయంగా నిర్వహించినప్పుడు మాత్రమే ఆ సేవలకు మానవముఖం ఉంటుంది. విద్య, వైద్యంతోపాటు ప్రజా రవాణా, ఉపాధి... ఈ నాలుగూ ప్రభుత్వరంగంలో ఉన్నప్పుడే మహిళలకు రాజ్యాంగంలో సూచించిన విధంగా జీవనోపాధి పరస్పర గౌరవంతో కూడిన జీవితం సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగిలిన ఏ రంగంలోనూ మగవాళ్లకు, మహిళలకు సమాన పనికి సమానవేతనం లభించడం లేదు. ప్రజల సంక్షేమమే ప్రధానంగా లేని బడ్జెట్లో మహిళల సంక్షేమం దుర్భిణీతో చూసినా దొరకదు. ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో నిర్దేశించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో సంపూర్ణ మహిళ అక్షరాస్యత, ప్రసవ మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్యాలను చేరడానికి నామమాత్రపు చర్యలు తప్ప చిత్తశుద్ధితో ప్రణాళికలు చేపట్టలేదు. ‘ఇలాగే కొనసాగితే భారతదేశం 2040 నాటికి కూడా మహిళల అక్షరాస్యత సంపూర్ణంగా సాధించలేదు’ అని తదుపరి సమీక్షలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయాన్ని మర్చి΄ోకూడదు. నిర్భయ ఘటన నేపథ్యంలో జస్టిస్ వర్మ కమిటీ ‘ప్రజారవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి’ అన్నది. ఆర్టీసీ బస్సులో ఎప్పుడైనా నిర్భయ ఘటనలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయా? మహిళకు క్షేత్రస్థాయిలో అందాల్సిన కనీస అవసరాల్లో అందడం లేదు. మొక్కకు నీరు ΄ోయకుండా చెట్టుకు అంటుకడతానంటే దానిని అభివృద్ధి అనలేం. – తోట జ్యోతిరాణి, ఎకనమిక్స్ ప్రొఫెసర్ (రిటైర్డ్), కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
![Performance Of Hair Removal Machine And Laser Treatment](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/kdkdk.jpg.webp?itok=MpZCBocZ)
ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి.. ఎవరైనా షాక్ అవాల్సిందే..!
ఐస్ కూలింగ్ టచ్తో.. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్తో ఆకట్టుకుంటున్న ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి సౌందర్య ప్రియులంతా ముగ్ధులు అవాల్సిందే. ఈ మెషిన్తో అవాంఛిత రోమాలను నొప్పి లేకుండా తొలగించుకోవచ్చు. దీనితో క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ కొనసాగిస్తే.. చర్మం మీది వెంట్రుకలు పలుచపడి.. కొంత కాలానికి మొదలుకంటా తొలగిపోతాయి.3 వారాల నుంచి ఫలితం కనిపిస్తుంటుంది. 5 వారాలకు స్పష్టమైన రిజల్ట్ని చూడొచ్చు. అయితే దీని లేజర్ ట్రీట్మెంట్ అందుకునే ముందు.. అవాంఛిత రోమాలున్న చోట షేవ్ చేసుకుని.. క్లాత్తో క్లీన్ చేసుకుని.. ఆ తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ సమయంలో ఈ డివైస్.. చల్లదనాన్నిస్తుంది.చేతులు, కాళ్లు, ముఖం, నడుము, పొట్టభాగం, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ ఇలా ప్రతిచోట దీనితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్ టెన్ ్స పల్స్డ్ లైట్ టెక్నాలజీ .. ఆటో ఫ్లాషింగ్ .. 3 మోడ్స్ ఆప్షన్ ్సతో ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ ని.. మహిళలతో పాటు పురుషులూ వినియోగించుకోవచ్చు. అయితే పచ్చబొట్టు ఉన్న ప్రదేశాల్లో, ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట, గాయలున్న భాగాల్లో దీన్ని యూజ్ చేయకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలు ఈ ట్రీట్మెంట్కి దూరంగా ఉండాలి.ఇక ఈ పరికరాన్ని ఉపయోగించే సమయంలో.. పవర్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ముందే చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకునే వీలు ఉండదు. తెల్లగా .. కాస్త చామన ఛాయలో ఉన్నవారికి మాత్రమే ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. బ్లాక్, బ్రౌన్ , డార్క్ బ్రౌన్ , లైట్ బ్రౌన్ కలర్స్లో ఉన్న వెంట్రుకలను మాత్రమే ఈ మెషిన్ గుర్తించగలదు. వైట్ కలర్, రెడ్ కలర్ వెంట్రుకలను తొలగించలేదు. దీని ధర 239 డాలర్లు. అంటే 19,951 రూపాయలు.
![Have You Ever Heard Of An Induction Coffee Maker?](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/indu.jpg.webp?itok=rGtORf1y)
చిక్కటి, చక్కటి.. ఇండక్షన్ కాఫీ మేకర్..
ఈ రోజుల్లో టీ, కాఫీల కోసం పాత్రలు, వడకట్టులు వాడేవారు తగ్గిపోయారు. స్విచ్ ఆన్ చేస్తే గ్లాసు నిండిపోయే మెషిన్ ్సకే ఓటేస్తున్నారు. అయితే మెషిన్ కాఫీ అంటే అంతగా ఇష్టపడని వారికీ.. చిక్కటి, చక్కటి ఫ్లేవర్ కాఫీని కోరుకునే వారికీ ఈ మేకర్ తెగ నచ్చేస్తుంది.యాంటీ–స్కాల్డింగ్ హ్యాండిల్, నాన్–స్లిప్ ఫినిషింగ్తో రూపొందిన ఈ డివైస్.. నాణ్యమైన స్టెయిన్ లెస్ స్టీల్తో ఆకట్టుకుంటోంది. దీని కిందున్న బౌల్లో నీళ్లు నింపుకుని.. దానిపై అమర్చుకునే ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటే చాలు. పైనున్న బౌల్లోకి కాఫీ పొంగి.. నిండుతుంది. ఇదే మోడల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. 4 గ్లాసులు, ఎనిమిది గ్లాసులు అందించే 2 రకాల సైజులూ దొరుకుతున్నాయి. అయితే రెండిటికీ మధ్య ధరల్లో పెద్దగా తేడా కనిపించదు.పోర్టబుల్ స్మోకర్..కొందరు గ్రిల్డ్ ఐటమ్స్ తినేటప్పుడు.. స్మోకీ ఫ్లేవర్ని కోరుకుంటారు. అలాంటి వారికోసమే ఈ స్మోకర్. ఇది కేవలం ఆహారానికి లేదా పానీయాలకు.. గుబాళించే స్మోకీ ఫ్లేవర్లను అందిస్తుంది. ఈ డివైస్కి పైనున్న గుంతలో చెక్కపొట్టు, మూలికలు, టీ పొడి, ఎండిన గులాబీ పువ్వులు ఇలా వేటినైనా సరే ఇంధనంగా వేసి మండిస్తే.. దీనికి అటాచ్డ్గా ఉన్న గొట్టం నుంచి పొగ వస్తుంది. దాన్ని బౌల్తో కప్పి.. ఆహారానికి లేదా పానీయాలకు ఫ్లేవర్ని అందించొచ్చు. అందుకు వీలుగా డివైస్కి బ్యాటరీలు అమర్చుకుని.. పవర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది.సింక్ ర్యాక్..వంటింటి పనుల్లో సింక్ క్లీనింగే కష్టమైనది. గిన్నెలు కడగడం ఒకెత్తయితే సింక్లో జామ్ అయిన చెత్తను తీయడం ఒకెత్తు. ఎప్పటి చెత్తను అప్పుడు సింక్లోకి వెళ్లకుండా ఆపగలిగితే.. మిగిలిన పని ఒక లెక్కే కాదు. ఈ ర్యాక్ చేసేది అదే! దీన్ని సింక్ పక్కనో.. ఎదురుగానో పెట్టుకుని.. దీనికి డిస్పోజబుల్ మెష్ బ్యాగ్ అమర్చి.. చెత్త సింక్ తూముకు అడ్డం పడకుండా చేసుకోవచ్చు.ఈ ర్యాక్ అటూ ఇటూ కదలకుండా.. మిక్సీకి ఉన్నట్లుగా యాంటీ స్లిప్ మినీ బూట్ ఒకటి అడుగున ఉంటుంది. ఆ బ్యాగ్ నిండగానే.. జాగ్రత్తగా దాన్ని చెత్తబుట్టలో వేసుకోవచ్చు. క్లీనింగ్ తర్వాత.. ఈ ర్యాక్ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దాని వల్ల స్థలమూ ఆక్రమించదు. తడి టవల్ వంటివి ఆరేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన ఈ ర్యాక్ తుప్పుపట్టదు. ఎప్పటికప్పుడు నెట్ బ్యాగ్ తీసిపారేస్తూ ఉంటాం కాబట్టి.. కూరగాయలు, పండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ మెస్ బ్యాగ్స్ను వాడుకోవచ్చు.ఇవి చదవండి: ఆ వాహనం కాలం చెల్లిందే
ఫొటోలు
![Interesting Facts About Nikhila Vimal: Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/21/87.jpg.webp?itok=XZxVjCFi)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/21/87.jpg.webp?itok=XZxVjCFi)
అప్పుడు హీరో చెల్లెలు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్.. ఎవరంటే? (ఫొటోలు)
![Paris Olympics 2024: Meet Indian Badminton Stars Competing This Time](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/21/777.jpg.webp?itok=OC9SjV9h)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/21/777.jpg.webp?itok=OC9SjV9h)
Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్ బృందం ఇదే (ఫొటోలు)
![Heavy Devotees At Simhachalam Giri Pradakshina Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/Heavy%20Devotees%20At%20Simhachalam%20Giri%20Pradakshina%20Photos%20%2830%29.jpg.webp?itok=AHjiN60D)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/Heavy%20Devotees%20At%20Simhachalam%20Giri%20Pradakshina%20Photos%20%2830%29.jpg.webp?itok=AHjiN60D)
విశాఖ సింహాచల గిరి ప్రదక్షిణకు తరలి వచ్చిన భక్తజనం (ఫొటోలు)
![Anasuya Bharadwaj Latest Stunning Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/222_1.jpg.webp?itok=D4ERfnaM)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/222_1.jpg.webp?itok=D4ERfnaM)
హాలీవుడ్ బ్యూటీలా అనసూయ.. లుక్ అదిరిపోలా! (ఫోటోలు)
![Aapke Dum Hai Toh: Shami Warning Over Wedding Rumours With Sania Mirza Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/18_1.jpg.webp?itok=T9TJ_IHM)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/18_1.jpg.webp?itok=T9TJ_IHM)
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
International View all
![title](/sites/default/files/article_images/2024/07/21/trashbaloons.jpg)
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్ప
![title](/sites/default/files/article_images/2024/07/21/houthiisrael.jpg)
హౌతీలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
సనా: యెమెన్లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయె
![title](/sites/default/files/article_images/2024/07/21/bangla.jpg)
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది.
![title](/sites/default/files/article_images/2024/07/21/MICROSOFT-CROWD.jpg)
క్రౌడ్స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ
![title](/sites/default/files/article_images/2024/07/21/VINCENT.jpg)
Microsoft outage: బగ్తో పరిహాసమా?!
బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ
National View all
![title](/sites/default/files/article_images/2024/07/21/virus.jpg)
‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు
గుజరాత్ను చండీపురా వైరస్ వణికిస్తోంది.
![title](/sites/default/files/article_images/2024/07/21/Jerlyn%20D%26%23039%3BSilva.jpg)
రెండున్నర కిలోమీటర్లు.. మహిళను వెంబడించి..
పూణే : ఓ తల
![title](/sites/default/files/article_images/2024/07/21/earth-quake.jpg)
జమ్ముకశ్మీర్లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది.
![title](/sites/default/files/article_images/2024/07/21/yogi-guru.jpg)
గురుపౌర్ణమి వేళ.. సీఎం యోగి పూజలు
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
![title](/sites/default/files/article_images/2024/07/21/delhi-rain.jpg)
ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి.
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/20/Texas_Austin_NRI.jpg)
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం
ఆస్టిన్: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
![title](/sites/default/files/article_images/2024/07/20/fire-accident.jpg)
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/18/NRI2.jpg)
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా
![title](/sites/default/files/article_images/2024/07/18/Australia_telugustudents.jpg)
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో విషాదం చోటు చేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/18/NRI1.jpg)
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
క్రైమ్
![Muchumarri girl murder case: Lockup death of Dalit](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/jail.jpg.webp?itok=nGqFTR0G)
దళితుడి లాకప్డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్డెత్కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్స్టేషన్కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్స్టేషన్లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం.
![Royal Enfield vehicle thief arrested](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/99.jpg.webp?itok=dFQN4xQU)
‘రాయల్’ దొంగ అరెస్టు
మోతీనగర్: జల్సాలకు అలవాటు పడి రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న ఓ దొంగను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అల్లాపూర్లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లాపూర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..గోల్కొండకు చెందిన సయ్యద్ సాహిల్ ఎన్ఫీల్డ్ వాహనానికి సంబంధించిన పేపర్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో విచారించగా తాను రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకుకున్నాడు. జగద్గిరిగుట్ట, సనత్నగర్, జూబ్లీహిల్స్, జంజారాహిల్స్, మధురానగర్, అల్లాపూర్, పటాన్చెరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు రాయల్æఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగ నుంచి 5 రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు, ఒక సెల్ఫోన్ను రికవరీ చేశారు. ఈ మేరకు సయ్యద్ సాహిల్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
![three engineering students in road accident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/655656.jpg.webp?itok=95p5i1bS)
Hyderabad: ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
దుండిగల్: అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అక్షయ్, అస్మిత్, జస్వంత్, నవనీత్తో పాటు మరో స్నేహితుడు హరి కారులో దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్–5 వద్ద దిగారు. అక్కడి నుంచి సరీ్వస్ రోడ్డులో బౌరంపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్షయ్, హరి, అస్మిత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జస్వంత్, నవనీత్లను సూరారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు నడిపిన కారుపై ఇప్పటికే అయిదు చలాన్లు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![Man Committing Theft In Trains After Watching Movie Scenes Was Arrested](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/Man-Committing-Theft-In-Tra.jpg.webp?itok=4b5lplEn)
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్లు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్టాప్లు, ఐప్యాడ్, మూడు వాచ్లను స్వాధీనం చేసుకున్నారు.
వీడియోలు
![Hussain Sagar Water Level Increased](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/21.png.webp?itok=9fDsA0rm)
![Hussain Sagar Water Level Increased](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/21.png.webp?itok=9fDsA0rm)
Heavy Rains: హుసేన్ సాగర్ కు పోటెత్తిన వరద..
![Telangana CM Revanth Reddy Presented Bonam To Ujjain Mahankali Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/20.png.webp?itok=-bM2HsHe)
![Telangana CM Revanth Reddy Presented Bonam To Ujjain Mahankali Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/20.png.webp?itok=-bM2HsHe)
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సిఎం రేవంత్ రెడ్డి
![Good News For Sam Fans](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/18.png.webp?itok=RgMnEkTn)
![Good News For Sam Fans](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/18.png.webp?itok=RgMnEkTn)
సామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
![Siddhu Jonnalagadda Dj Tillu 3 Update News](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/17.png.webp?itok=Z6Ol6rqI)
![Siddhu Jonnalagadda Dj Tillu 3 Update News](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/17.png.webp?itok=Z6Ol6rqI)
టిల్లుని పక్కకి పెట్టిన సిద్దూ.. ఇప్పట్లో కమ్ బ్యాక్ కష్టమే..
![Producer Bunny Vasu Given Clarity On Allu Arjun And Sukumar Issue](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/16.png.webp?itok=DLRqRLmY)
![Producer Bunny Vasu Given Clarity On Allu Arjun And Sukumar Issue](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/16.png.webp?itok=DLRqRLmY)
అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై బన్నీ వాసు క్లారిటీ
![Simahachalam Appanna Temple Giri Pradakshina](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/15.png.webp?itok=I_gOBskq)
![Simahachalam Appanna Temple Giri Pradakshina](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/15.png.webp?itok=I_gOBskq)
అంగరంగ వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ
![MP Alla Ayodhya Rami Reddy About TDP Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/14.png.webp?itok=c_xLIyZt)
![MP Alla Ayodhya Rami Reddy About TDP Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/14.png.webp?itok=c_xLIyZt)
ఏపీలో టీడీపీ అరాచకాలు.. రాష్ట్రపతి, ప్రధానికి వివరిస్తాం
![Lashkar Bonalu Starts At Secunderabad Ujjaini Mahankali Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/13.png.webp?itok=-leWInEE)
![Lashkar Bonalu Starts At Secunderabad Ujjaini Mahankali Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/13.png.webp?itok=-leWInEE)
ఘనంగా ప్రారంభమైన లష్కర్ బోనాలు..
![Heavy Rains And Floods In Andhra Pradesh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/8.png.webp?itok=izyvH6AQ)
![Heavy Rains And Floods In Andhra Pradesh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/8.png.webp?itok=izyvH6AQ)
ఏపీని అతలాకుతలం చేస్తున్న వర్షాలు
![Lashkar Bonalu At Secunderabad Ujjaini Mahankali Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/7.png.webp?itok=uZqQsX-l)
![Lashkar Bonalu At Secunderabad Ujjaini Mahankali Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/7.png.webp?itok=uZqQsX-l)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది... రాష్ట్రపతి పాలన విధించాలి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక విధానాలను వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్