suggestions
-
వర్గీకరణపై ఐదు సిఫారసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఐదు కీలక సూచనలు చేసింది. గతేడాది నవంబర్ 15న నియమితులైన ఆయన అదే నెల 27న బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి ఈ నెల 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పింపంచారు. నాలుగు నెలలపాటు అధ్యయనం చేసి 3,820 విజ్ఞాపనలు స్వీకరించిన కమిషన్ మొత్తం 360 పేజీల నివేదికలో ఐదు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. వాటిలో గ్రూపు–ఏలో 2.25 శాతం జనాభా కలిగిన అత్యంత వెనుకబడిన 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ అందించాలని సిఫారసు చేసింది. గ్రూప్–బీలో 41.56 శాతం జనాభా కలిగిన వెనుకబడిన 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంది. గ్రూప్ సీలో 53.98 శాతం జనాభా కలిగి మిశ్రమ వెనుకబాటుతనంతో ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది. రోస్టర్ విధానం ప్రకారం మొదట వంద పోస్టులు వస్తే 8 శాతం పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. ఈ మూడు కలిపితే 15 శాతమవుతుంది. అదే రోస్టర్ విధానంలో 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15, మాదిగ సామాజిక వర్గానికి 13, రెల్లి వర్గానికి రెండు వర్తిస్తాయి. తద్వారా రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవీ ఐదు కీలక సూచనలు..» ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలి. » 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యాక ప్రభుత్వం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చు. » ఎస్సీ 59 ఉపకులాలను ఏ, బీ, సీగా మూడు కేటగిరీల్లో వర్గీకరణ. » 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు. » రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి.జనగణన తర్వాతే వర్గీకరణఅసెంబ్లీలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రం యూనిట్గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జనగణన తర్వాతే జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప కులాల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికపై గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. 1995లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సుదీర్ఘకాలం సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే పరిష్కారం కావడం సంతృప్తినిచి్చందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో చెప్పినట్లే ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. 30 ఏళ్ల నిరీక్షణను నిజం చేస్తూ నా చేతుల మీదుగా వర్గీకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అంటరానితనంపై అప్పట్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ చేసిన 42 సిఫారసులు ఆమోదించి 25 జీవోలు, మెమోలు తీసుకొచ్చాం. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీ, ఎస్టీ చట్టం తెచ్చా. మాదిగ పేరు చెప్పుకొనేందుకు కూడా వెనుకాడిన రోజుల్లో మాదిగ దండోరాను స్థాపించి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు. వారి డిమాండ్లు సమంజసమని భావించి 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్వులు ఇచ్చాం. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచి్చంది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. పేదరికంలేని సమాజమే నా లక్ష్యం. ఉగాది నుంచి పీ 4 విధానం తెస్తాం’ అని చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మంద కృష్ణ, చంద్రబాబు ఇద్దరే కారణమని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే రెల్లి కులస్తుతులకు కూడా న్యాయం చేయాలన్నారు. బుడగ జంగాలనూ ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. -
పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి?
నాకు 3వ నెల. ప్రతిరోజు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. భయపడి పళ్లు తోముకోవడం మానేస్తే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. డాక్టర్ని కలిస్తే ఏ ట్రీట్మెంట్ చేయించుకోమంటారో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ చికిత్స తీసుకోవాలి? – పద్మ, కొమరిపాలెంగర్భం దాల్చిన 3వ నెల నుంచే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పళ్ల చిగుళ్లు వాపు రావడంతో పాటు కొంచెం తిమ్మిరి, నొప్పిగా కూడా ఉంటాయి. ఈ నొప్పి వల్ల చాలామంది పళ్లు తోముకోవడం మానేస్తారు. దానితో వ్యర్థ పదార్థాలు పళ్ల మధ్య ఉండి ఇన్ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. చాలామందికి రక్తస్రావం కూడా అవుతుంది.దీనిని చిగురువాపు అంటారు. దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనికి కొన్ని మౌత్వాష్ లోషన్స్, మెత్తటి కుచ్చు ఉన్న చిన్న బ్రష్లు వాడమంటారు తప్ప ఎటువంటి చికిత్సలూ ఉండవు. దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు మీరు గర్భవతని చెప్పాలి. ఏ కారణంతో అయినా చికిత్స అవసరమైతే ఈ సమయంలో చేయరు. ఎక్స్రే కూడా సరికాదు. ప్రసవానంతరమే చికిత్స చేస్తారు. ఈలోపు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తక్కువ మెతాదులో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.దంత సమస్యలు రాకుండా మొదటి నెల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2–5 నిమిషాల సమయం కేటాయించి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి. తిన్న వెంటనే పళ్ల మధ్య వ్యర్థాలు లేకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి. మొదటి మూడునెలల్లో వాంతులు ఎక్కువ ఉన్నవారు, వాంతి అయిన తర్వాత నోటిని మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల వాంతిలో ఉండే ఎసిడిటీ పళ్లను పాడు చేయకుండా ఉంటుంది.వాంతి అయిన వెంటనే ఎసిడిటీతో పళ్లు బాగా సున్నితంగా అవుతాయి. అందుకే గంట తరువాత బ్రష్ చెయ్యాలి. తీపి పదార్థాలు, చల్లని పానీయాలు తాగకూడదు. టీ, కాఫీ తాగిన తరువాత నోరు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కాయగూరలు, పెరుగు లాంటివి తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న మౌత్ వాష్లు వాడకూడదు. ఏదైనా శస్త్రచికిత్స తప్పనిసరైతే 5–7 నెలలో చేస్తారు. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ఏ విధమైన మందులు అవసరం లేదు. చల్లని ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. డాక్టర్ని కలిసినప్పుడు మీ ఇబ్బందులు చెబితే దానిని బట్టి ఎప్పుడెప్పుడు సంప్రదించాలో సూచిస్తారు. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: కిడ్నీ రోగులకు ఉపశమనం హెల్త్ ట్రీట్..మెనోపాజ్ ఔషధంతో లివర్కు ముప్పు!మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఔషధం వల్ల లివర్కు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల తేలింది. మెనోపాజ్లో సర్వసాధారణంగా ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనానికి ‘వియోజా’ మాత్రలను ఎక్కువమంది వాడుతుంటారు. ‘వియోజా’ మాత్రలలో ‘ఫెజోలినెటంట్’ అనే ఔషధం ఉంటుంది. ఇది నాన్హార్మోనల్ ఔషధం.ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడినట్లయితే, లివర్కు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) వెల్లడించింది. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్న మహిళలు ఈ ఔషధాన్ని వాడకుండా ఉండటమే మంచిదని సూచించింది. వరుసగా నలబై రోజుల పాటు ఈ ఔషధం తీసుకున్న వారిలో లివర్ దెబ్బతినడాన్ని గుర్తించినట్లు ఎఫ్డీఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ ఔషధం లేబుల్పై ‘లివర్కు హానికరం’ అనే హెచ్చరికను జోడించనున్నట్లు తెలిపారు. -
ప్రెగ్నెంట్ సమయంలో.. ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడిగర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు. చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు -
అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..
టీనేజర్లు ఎందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు? ఎందుకు చిత్ర విచిత్రమైన డ్రెస్లు వేస్తారు? ఎందుకు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు? ఎందుకంటే, అదంతా గుర్తింపు నిర్మాణ (ఐడెంటిటీ ఫార్మేషన్) ప్రక్రియలో భాగం. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగం. అయితే ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది అంత సులువుగా, సూటిగా జరగదు. స్వీయ భావన (సెల్ఫ్–కాన్సెప్ట్), స్వీయ గౌరవం (సెల్ఫ్–ఎస్టీమ్), సామాజిక గుర్తింపు (సోషల్ ఐడెంటిటీ)ల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా జరుగుతుంది.నేనెవరు? నేనేం కావాలనుకుంటున్నాను? సమాజంలో నా స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలతో యువత తర్జన భర్జన పడుతుంది. అందుకోసం విభిన్న పాత్రలను, విలువలను, విశ్వాసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని లేదా గందరగోళంలో పడతారని ప్రముఖ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ చెప్పాడు. అందుకే దీన్ని Identity Vs Role confusion అని పేర్కొన్నాడు.నేనెవరు?ఒక వ్యక్తికి తన సామర్థ్యం, విలువలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఉన్న అవగాహననే స్వీయభావన అంటారు. యవ్వనంలో ఇది వేగంగా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు చేస్తారు, కొత్త హాబీలను స్వీకరిస్తారు, కొత్త కొత్త దుస్తులు ప్రయత్నిస్తారు. విరుద్ధమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. ఇదంతా తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగమే. కానీ తల్లిదండ్రులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నిలకడగా ఉండరంటూ విమర్శిస్తుంటారు.ఉదాహరణకు, 15 ఏళ్ల మాయ చదువుపై శ్రద్ధ పెట్టడమా లేక సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొనడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆమె స్వీయ భావన రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం. యవ్వనంలో ఇలా అన్వేషించడం, నచ్చినదానికి కట్టుబడి ఉండటం వలన సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని, లేదంటే గందరగోళంలో పడతారని మీయుస్, తదితరులు చేసిన దీర్ఘకాలిక అధ్యయనం పేర్కొంది.నా విలువేంటి? ఒక వ్యక్తి తన విలువను తానెలా చూస్తున్నారనేదే స్వీయగౌరవం. ఇతరులతో పోల్చుకోవడం, విద్యాపరమైన ఒత్తిళ్లు, బాడీ ఇమేజ్కు సంబంధించిన అంశాల వల్ల టీనేజ్లో ఇది తరచుగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, పదహారేళ్ల రవి సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇతరులతో పోల్చుకుని, తాను అంత అందంగా లేనని మథనపడుతున్నాడు. దానివల్ల అతని స్వీయగౌరవం తగ్గిపోతోంది. దాంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నాడు. నిజానికి చదువులో అందరికంటే ముందుంటాడు. కానీ దాని విలువను అతను గుర్తించడంలేదు. స్వీయ–కరుణ (self&compassion) అనే భావనను అభివృద్ధి చేయడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నెఫ్ (2011) పరిశోధనలు తేల్చాయి. సామాజిక గుర్తింపు..వ్యక్తిగత గుర్తింపుతో పాటు సామాజిక గుర్తింపు కూడా యవ్వనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే స్నేహ సమూహాలు, సాంస్కృతిక లేదా మత సంఘాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి సమూహాలతో గుర్తింపును కలిగి ఉండటం యువతలో భద్రత భావనను పెంచుతుంది. ఉదాహరణకు, 17 ఏళ్ల కరణ్ కుటుంబం ఉత్తర భారతం నుంచి హైదరాబాద్ వలస వచ్చింది. తమ కుటుంబ సంప్రదాయ విలువలను పాటించాలని ఇంట్లో నొక్కి చెప్పినా, కళాశాలలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండింటిలో దేన్నీ అతను వదులుకోలేడు. వాటి మధ్య రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతనికి సామాజిక గుర్తింపు ఏర్పడుతుంది. అంటే యవ్వనంలో చేసే తిక్క తిక్క పనులన్నీ గుర్తింపు నిర్మాణంలో భాగమేనని గుర్తించాలి.తల్లిదండ్రులు చేయాల్సినవి..– టీన్స్లో జరిగే మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, పిల్లలకు అండగా నిలబడినప్పుడు వారిలో సరైన గుర్తింపు ఏర్పడుతుంది. – పిల్లల ఆలోచనలు, భావాలు, సవాళ్లు పంచుకోవడానికి విమర్శలు లేని వాతావరణాన్ని సృష్టించాలి. – భిన్న ఆసక్తులు, స్నేహాలు అన్వేషించడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించాలి. వారి ఎంపికలను గౌరవించాలి.– స్వేచ్ఛంటే విచ్చలవిడితనం కాదని, సంపూర్ణ బాధ్యత అని చెప్పాలి. అవసరమైన నిబంధనలు విధించాలి. అవసరానుగుణంగా వాటిని సడలించాలి. – ఇతరులతో పోల్చకుండా, వారి బలాలను గుర్తించి, విజయాలను ప్రశంసించాలి.– వారి పరిశీలనను, సామాజిక సంబంధాలను ప్రోత్సహించాలి. – యువత తాము గమనిస్తున్న ప్రవర్తనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు మంచి రోల్ మోడల్స్గా ఉండాలి. -
కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.గుండెజబ్బులతో అకాల మరణాలు..ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.ముందుగా గుర్తించాలంటే?ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్స్టైల్తో సాధ్యమే!ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్స్టైల్ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.ఎలాంటి హెచ్చరిక ఉండదు..సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:– హఠాత్తుగా కుప్పకూలిపోవడం– నాడి అందకపోవడం– ఊపిరాడకపోవడం– స్పృహ కోల్పోవడంఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం– ఊపిరి తీసుకోవడం కష్టమవడం– నిస్సత్తువ– వేగంగా ఊపిరి తీసుకోవడం– గుండె లయ తప్పి కొట్టుకోవడం– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది. -
తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మోషన్ డిటెక్షన్, సౌండ్ టెక్నాలజీ..కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్ యాక్టివేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూం రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్గా కెమెరా యాక్టివేట్ అయి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్ అవుతుంది. ఒకసారి చార్్జచేస్తే రెజల్యూషన్ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి.స్పై కెమెరాలతో ప్రమాదాలు..స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఫ్లోర్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్రూమ్లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్ పెట్టాలి.మొబైల్స్తోనూ..స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ ప్లేస్ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్ని వాడుతున్నారు.ఎన్నో రకాలు..చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్లు, రిస్ట్ వాచీలు, ఫ్లవర్ వాజ్లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్లు, మొక్కలు, స్విచ్బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.అనేక రకాల పరీక్షలు..స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్ డ్రాప్ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్ డ్రాప్ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్ రూమ్స్లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్ చేసి, ఫ్లాష్ లైట్ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.గుర్తించడం ఎలా?స్మార్ట్ఫోన్లు వాడేవారికి గూగుల్ ఫ్లే స్టోర్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే యాప్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్ అప్లికేషన్లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్ డిటెక్టర్ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్ -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
ప్రెగ్నెన్సీ సమయంలో.. ఈ లక్షణాలు కనిపెట్టడమెలా?
నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్కి పంపి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంటప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్ని స్ట్రెయిట్గా ఉంచి కూర్చోవడం చేయాలి.మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజ్ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్ను కలవాలి.హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.న్యూయార్క్లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్నెస్ çసమిట్లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి! -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
Health: వైట్.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.మేలు చేసే తెల్లటి ఆహారాలివి..ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ్రపోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్ అని పిలిచే పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు! -
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
Health: అనీమియా వద్దు... ‘ఐరన్’ లేడీలా ఉందాం!
రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్ స్టడీస్ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.లక్షణాలు.. – అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...– శ్వాస కష్టంగా ఉండటం– కొద్దిపాటి నడకకే ఆయాసం– అలసట– చికాకు / చిరాకు / కోపం– మగత– తలనొప్పి– నిద్రపట్టకపోవడం– పాదాలలో నీరు చేరడం– ఆకలి తగ్గడం– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం– ఛాతీనొప్పి– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.జాగ్రత్తలు / చికిత్స..ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.కారణాలు..మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. -
Health: క్రానిక్... పానిక్.. వేడివేడిగా బాడీ రిపేర్!
దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్ఫ్లమేషన్ను ‘అక్యూట్ ఇన్ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.ఒక ఇన్ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్గా ఉన్నాయని అర్థం.ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్గా ఉంచుతాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్ఫ్లమేషన్స్తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం. -
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Health: మాయ ‘తెర’కు పరిమితులు..
‘చిన్నీ.... పడుకో...’‘ఫైవ్ మినిట్స్ మమ్మీ...’‘ఫైవ్ మినిట్స్ అంటావు....గంటలకొద్దీ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటావు. త్వరగా లేవడానికి మాత్రం ఏడుస్తుంటావు’.....ఇలాంటి మాటలు ఎన్నో ఇండ్లలో వినిపిస్తుంటాయి.సాధారణంగా పెద్దవాళ్లు ‘నిద్రలేమి’ సమస్యను ఎదుర్కుంటారు. అయితే స్వీడన్లో మాత్రం పిల్లలు కూడా ‘నిద్రలేమి’కి గురవుతున్నారు. దీనికి కారణం వారు ఎక్కువ సమయం డిజిటల్ మీడియా, టీవీల ముందు గడపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పిల్లల స్క్రీన్ టైమ్కు సంబంధించి తల్లిదండ్రులు పరిమితులు విధించాలని సూచించింది. రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు ఒక గంట, ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు గంట లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ‘స్క్రీన్టైమ్’ ఉండేలా చూసుకోవాలన్నారు.ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపం అనేది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్పై పరిమితులు విధించడం తప్పనిసరి అంటుంది స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ మార్గదర్శకాలు స్క్రీన్ టైమ్ తగ్గించడానికే కాదు పిల్లల అలవాట్లలో మార్పు తేవడానికి ఉద్దేశించినవి కూడా. ‘బెటర్ స్లీప్ హైజీన్’లో భాగంగా రాత్రి సమయంలో పిల్లల బెడ్రూమ్లో ఫోన్లు, ట్యాబ్లాంటివి దూరంగా పెట్టాలని ఏజెన్సీ తల్లిదండ్రులకు సూచించింది.స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు వారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఇంటక్షరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీలకు దూరం కావడమే కాదు ‘నిద్రలేమి’ ‘డిప్రెషన్’...మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం అనేది మన దేశంలోనూ పెద్ద సమస్యగా మారింది. ‘అధిక స్క్రీన్ టైమ్’ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. -
Health: బీ‘పీక్స్’ పోకముందే చెక్స్!
రక్తపోటు లేదా హైపర్టెన్షన్ అంటే అందరికీ తెలిసిందే. కానీ... వాస్తవానికి రక్తపోటు వచ్చేందుకు ముందు కొన్ని సూచనల ద్వారా శరీరం హెచ్చరికలు పంపుతుంటుంది. అవేమిటో జాగ్రత్తగా గ్రహిస్తే అసలు రక్తపోటు రాకుండానే చాలాకాలం పాటు ఆలస్యం చేయడమో, అదే క్రమశిక్షణ పాటిస్తే దాదాపుగా నివారించడమో సాధ్యమవుతుంది. దేహం అలా హెచ్చరికలు పంపే దశను ‘ప్రీ–హైపర్టెన్షన్’ దశగా పేర్కొంటారు. నిజానికి ప్రీ హైపర్టెన్షన్ దశలోనే జాగరూకతతో వ్యవహరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలూ, మూత్రపిండాలు, మెదడు లాంటి కీలకమైన ఎండ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా నివారించుకుకోవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్టెన్షన్’ ఏమిటో చూద్దాం.రక్తనాళాల్లో రక్తం నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి తాలూకు రక్తపోటు 120/80 ఉంటే అది పూర్తిగా నార్మల్ కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిలో ఈ నార్మల్ కొలత ఖచ్చితంగా ఉండక కొంత అటు ఇటుగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉండవచ్చు. అలాగే డయాస్టోలిక్ విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉండవచ్చు. 120 /80 కి బదులుగా పైన పేర్కొన్న ఆ కొలతలు ఉంటే ఆ దశను రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అలాగని అది నార్మల్ విలువ కూడా కాదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్టెన్షన్’ దశను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు ‘హైబీపీ’ రావచ్చు. అయితే హైబీపీ నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలనూ, అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకుని, కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.ప్రీ–హైపర్టెన్షన్లో బాధితులు వెంటనే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలి. ప్రీ–హైపర్టెన్షన్ దశలోనే తమ తమ వ్యక్తిగత జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్...అధిక రక్తపోటును (హైబీపీని) సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలు, నష్టాలు వెంటనే బయటకు కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం బాధితుడికి మొదట్లో తెలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల నష్టం జరుగుతూపోతూ... దీర్ఘకాలంలో ఏవైనా అవయవాలు దెబ్బతినప్పుడు, వాటికి సంబంధించిన లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం తెలియరాదు. కొన్నిసార్లు నష్టం జరిగిపోయాక మాత్రమే అప్పుడది హైబీపీ వల్ల జరిగిన అనర్థమని తెలుస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.హైబీపీకి కారణాలు.. హైబీపీకి నివారించలేనివీ, నివారించదగినవనే రెండు రకాల కారణాలుంటాయి.నివారించలేని కారణాలు:పెరుగుతున్న వయసు, కుటుంబంలో వంశపారంపర్యంగా హైబీపీ ఉన్న మెడికల్ హిస్టరీ వంటివి నివారించలేని కారణాలని చెప్పవచ్చు.నివారించదగిన కారణాలు:ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం (స్థూలకాయం), ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, పొగాకు నమలడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు నివారించదగిన కారణాలు. ఈ సూచనలు పాటించండి... – కేవలం ప్రీహైపర్టెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు నివారించదగిన కారణాలను తెలుసుకుని అవి ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలు పాటించాలి.– జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే సోడియమ్ మోతాదులు పెరగకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం.– ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం కంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం.– మాంసాహారంలో వేట మాంసం కంటే వైట్ మీట్ అయిన చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవడం.– అదనపు బరువును ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం.– ఎప్పుడూ కూర్చుని ఉండే పనుల్లో ఉండేవారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీ–హైపర్టెన్షన్ దశలోనే జాగ్రత్తవహిస్తే అధిక రక్తపోటును చాలాకాలం పాటు నివారించుకోవచ్చు. దాంతో గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చు. -
Health: నెక్ పెయిన్కు.. కొన్ని లైఫ్స్టైల్ అలవాట్లే కారణాలని తెలుసా!
సాధారణంగా మధ్యవయస్కుల్లో కనిపించే మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు టీనేజర్లలో అంతగా కనిపించకపోవచ్చు. కానీ వాళ్లలోనూ అవి కనిపించేందుకు అవకాశం లేకపోలేదు. ఇటీవల మాత్రం టీనేజర్లలో మెడనొప్పి కేసులు చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ ఒంచి మొబైల్ చూస్తూ ఉండటం, అదే కాకుండా ఆ వయసులోని పోష్చర్కు సంబంధించిన లైఫ్స్టైల్ అలవాట్లూ ఇందుకు కారణం. ఉదాహరణకు... స్కూళ్లూ / కాలేజీలలో చాలాసేపు మెడవంటి రాసుకుంటూ, చదువుకుంటూ కూర్చునే ఉండటం, సరైన భంగిమ(పోష్చర్)లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు వాళ్లలో మెడనొప్పికి కారణమవుతుంటాయి. ఆ సమస్యలనుంచి విముక్తి ఎలాగో తెలుసుకుందాం.కేవలం కూర్చునే పోష్చర్ లాంటి అలవాట్లే కాకుండా... కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెడనొప్పి రావచ్చు. ఉదాహరణకు చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వచ్చే అవకాశముంది.నివారణ కోసం...– స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో / తమ ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.కంప్యూటర్ల వాడకం లేదా వీడియో గేమ్స్లో పోష్చర్ సరిగా లేకుండా కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాలపై ఒత్తిడి సరిగా పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి.ఒకప్పుడు టీనేజీ పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసిపోయేలా ఆటలాడేవారు. కానీ ఇటీవల ఆటలాడటం తగ్గిపోయింది. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు తమ వర్కవుట్స్తో సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. తగినంత వ్యాయామం చేయడం లేదా బాగా ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... దాంతో వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలకు లేత ఎండ తగిలేందుకు ఆరుబయట ఆటలాడేలా తల్లిదండ్రులు చూడాలి. పోష్చర్ సరిచేసుకోవడం, ఆటలాడటం / వ్యాయామం తర్వాత కూడా మెడనొప్పి వస్తుంటే ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం మంచిది. -
Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి?
నా వయసు 41. ఎటువంటి మందులు వాడకుండానే గర్భం వచ్చింది. అనారోగ్య సమస్యలేమీ లేవు. కానీ అందరూ బాగా భయపెడుతున్నారు. ఇంటి దగ్గర్లోని చిన్నాచితకా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుకన్య, కరీంనగర్ఈ రోజుల్లో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో గర్భం దాల్చేవారు పదిమందిలో ఒకరుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. వందలో పదిమందికి హై బీపీ రావచ్చు. బీపీ అదుపు కాకపోతే‘ప్రీఎక్లాంప్సియా’ అనే సమస్య ప్రతి వందమందిలో ఇద్దరికి ఎదురవుతుంది. ఇది తల్లికి, బిడ్డకి ప్రమాదం.ఇలా బీపీ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం, ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ మూడవ నెల నుంచి తీసుకోవడం లాంటివి సహాయపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో డయాబెటిస్ రిస్క్ కూడా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువ ఉండొచ్చు. ఈ సమస్యను తొందరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే తల్లికి, బిడ్డకి ప్రమాదం. డయాబెటిస్ గుర్తించకుండా, దానికి చికిత్స తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో ఉండే లోపాలు 5వ నెల స్కాన్ తీసినప్పుడు బయటపడతాయి. నలభైల్లో వచ్చే గర్భంలో బీపీ, సుగర్, బరువు చూసి తగిన జాగ్రత్తలు అనుసరించాలి.రక్తసంబంధీకుల్లో సుగర్, బీపీ ఉన్న చరిత్ర గలవారు నలభైల్లో గర్భం దాల్చాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగానే అన్ని చెకప్లు చేయించుకుని ప్లాన్ చేసుకోవాలి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రెగ్నెన్సీలో ప్రమాదానికి దారి తీస్తుంది. గడ్డకట్టిన రక్తం బ్రేక్ అయితే అది రక్తప్రసరణలో కలసి ఊపిరితిత్తులు, గుండెలో అడ్డంకి ఏర్పడి ప్రాణానికి ప్రమాదం కలుగజేస్తుంది. దీనిని పల్మనరీ ఎంబ్రాలిజమ్ అంటారు. అయితే నలభైలో గర్భం దాల్చిన వారికి ఇది పదింతలు ప్రమాదం. అందుకే దీనిని అరికట్టడానికి ముందుగానే మందులు మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా ఒక నివారణే.కంప్రెషన్ స్టాకింగ్స్ తొడుక్కోవాలని సూచిస్తారు. ప్రమాద అంచనా అనేది గర్భధారణ సమయంలోనూ, ఆ తరువాత కూడా చేస్తారు. రోజుకి 6–8 గ్లాసుల నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. గుండె పట్టేసినట్టు, రక్తపు వాంతులు అవుతున్నా, ఆయాసం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల నలభైల్లో వచ్చే గర్భంలో బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. 6వ నెల నుంచి ప్రతి రెండు వారాలకి పొత్తికడుపు కొలతలను చూస్తారు. నెలకోసారి స్కాన్ చేసి, బిడ్డ ఎదుగుదలను అతి దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు.ఇంక ప్రసవ సమయం కూడా బిడ్డ ఎదుగుదలను బట్టి నిర్ణయిస్తారు. చాలాసార్లు 37 వారాలకే డెలివరీ చెయ్యాల్సి వస్తుంది. 37 వారాల తర్వాత బిడ్డ కడుపులోనే ఉంటే వెయ్యిలో ఇద్దరికి మనకు తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి. అందుకే డాక్టర్ సలహా మేరకు అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసులో నార్మల్ డెలివరీ చెయ్యాలా లేక సిజేరియన్కి వెళ్లాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. డెలివరీ సమయంలో ఎనస్థీషియా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం మంచిది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన డాక్టర్లు ఉన్న చోట డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి వాళ్లే చూసుకుంటారు.నియోనాటాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి. చాలాసార్లు ముందస్తుగా డెలివరీ అవ్వడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండే అవకాశాలుంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉండే ఆసుపత్రులను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేస్తారు. ఈ రోజుల్లో నలభై పైబడిన వారిలో కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు.హెల్త్ ట్రీట్: సీఫుడ్ రసాయనాలతో వంధ్యత్వం!సీఫుడ్లోని రసాయనాలతో వంధ్యత్వం సహా నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ‘పెర్ అండ్ పోలీఫ్లూరోఆల్కైల్ సబ్స్టన్సెస్ (పీఎఫ్ఏఎస్) అనే రకానికి చెందిన ఈ వందలాది రసాయనాలు ఎక్కువగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్ ద్వారా శరీరంలోకి చేరి, శాశ్వతంగా తిష్ట వేసుకుంటున్నాయని, వీటి కారణంగా మహిళల్లో వంధ్యత్వం, రకరకాల క్యాన్సర్లు, నవజాత శిశువుల్లో శారీరక లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని న్యూహాంప్షైర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.సీఫుడ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల పరిసరాల్లో కొళాయిల ద్వారా సరఫరా అయ్యే మంచినీటిలోను, వాటి పరిసరాల్లో పండే తిండిగింజల్లోను కూడా పీఎఫ్ఏఎస్ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఈ రసాయనాల మోతాదు మిగిలిన పదార్థాల కంటే సీఫుడ్లో మరింత ఎక్కువగా ఉంటున్నట్లు రుజువైంది. ముఖ్యంగా కాడ్, సాల్మన్, స్కాలప్, ట్యూనా వంటి చేపల్లోను, సముద్రపు రొయ్యల్లోను, పీతల్లోను పీఎఫ్ఏఎస్ రసాయనాలు ప్రమాదకరమైన పరిమాణంలో ఉంటున్నాయని, ఇకపై వీటిని తినే ముందు జనాలు కాస్త ఆలోచించుకోవాలని న్యూహాంప్షైర్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన మేగన్ రోమానో హెచ్చరిస్తున్నారు.పీఎఫ్ఏఎస్ పదార్థాలు మట్టిలో కలసిపోవాలంటేనే వేలాది సంవత్సరాలు పడుతుందని, అలాంటిది ఇవి శరీరంలోకి చేరితే, వాటి వల్ల తలెత్తే అనర్థాలను ఊహించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రపు రొయ్యలు, పీతల్లో అత్యధికంగా ప్రతి గ్రాములోను 1.74–3.30 నానోగ్రాముల మేరకు పీఎఫ్ఏఎస్ పదార్థాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు లాబొరేటరీ పరీక్షల్లో గుర్తించారు. ప్లాస్టిక్లోను, అగ్నిమాపక రసాయనాల్లోను ఎక్కువగా ఉండే పీఎఫ్ఏఎస్ రసాయన పదార్థాలు మానవ శరీరంలోకి మోతాదుకు మించి చేరుకుంటే, వంధ్యత్వం సహా నానా అనర్థాలు తప్పవని వారు చెబుతున్నారు.– డా. భావనా కాసుఇవి చదవండి: అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!? -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్గా, కంట్రోల్డ్గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్ఫుల్నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
Devotion: పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా?
పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? – డి. వరలక్ష్మి, హైదరాబాద్– కావాలని కుళ్లిన కొబ్బరికాయని మనం తేలేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మరో కొబ్బరికాయని తేగల అవకాశం అప్పుడుంటే సరే సరి. మరోసారి పూజకి కూర్చున్నప్పుడు ఈ కొబ్బరికాయకి బదులుగా మరో కొబ్బరికాయని కొడితే సరి. పూజ లోపానికీ కొబ్బరికాయ కుళ్లడానికీ సంబంధం లేదు.రాహుకాల దీపం గురించి చెప్పగలరు.. – అప్పారావు, సాలూరు– జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చెయ్యాలి.గృహంలో వాస్తుదోష పరిహారానికి ఏం చెయ్యాలి? – ఆర్. కౌసల్య, చిల్కమర్రి– వాస్తు దోష పరిహారం కోసం గృహప్రవేశం రోజున ‘వాస్తుహోమ’మంటూ ఒకదాన్ని చేస్తారు. దోషం తప్పనిసరిగా ఉన్న పక్షంలో మత్స్యయంత్రం, కూర్మయంత్రం వేస్తారు. ఏది వేసినా ఇంట్లో నిత్యపూజ జరిగితే దోషం ఏమీ చెయ్యదు. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు నిరూపించిన సత్యం.ప్రయాణంలో చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? – పార్వతి, హైదరాబాద్– ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది) అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు.మరణానంతరం నా శరీరాన్ని ఉచితంగా వైద్య కళాశాలకి ఈయదలిచాను. పిల్లలు అంగీకరించడం లేదు..? – ఒక పాఠకురాలు, హైదరాబాద్– మీరు జీవించినంతసేపే మీ శరీరం మీద మీకు హక్కు. మీ పిమ్మట ఆస్తిపాస్తులతోపాటు పార్థివ శరీరమ్మీద అధికారం కూడా పిల్లలకే ఉంటుంది. వాళ్లు అంగీకరించనప్పుడు ఇవ్వడం భావ్యం కాదు. చివరి కాలంలో పిల్లలతో విరోధించడమూ సరికాదు.60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా? – శ్రీనివాస్, విజయనగరం– ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభి్రపాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు.ఇవి చదవండి: సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి! -
Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్ ఆలోచనలతో నిండి, మైండ్ మొద్దుబారి, బ్లాంక్గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురంమీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.డిప్రెషన్ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండటీనేజ్లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్ డిజార్డర్ లేదా అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్! -
Health: ఇది సాధారణమే! చలికాలంలో తరచుగా జలుబు..
నాకు 5వ నెల. చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ మందులు వేసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? – మాధురి, జగ్గంపేటజలుబు అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సాధారణం. జలుబు, ఫ్లూ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మాములుగా జలుబుకి ఆవిరి తీసుకోవడం, పై పూతగా ఏమైనా రాసుకోవడం, పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ జలుబుతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఫ్లూ లక్షణాలు అని అర్థం. అప్పుడు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమంది గర్భిణీలకు వాతావరణంలోని మార్పులతో ఇబ్బందులు ఎదురవుతాయి. యాంటీ వైరల్ మాత్రలు కుడా వాడాల్సి వస్తుంది. త్వరగా చికిత్స అందకపోతే కొందరిలో అది న్యూమోనియాగా మారుతుంది. దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ మార్పుల వల్ల, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు.హై యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి వస్తుంది. ఫ్లూ కారణంగా ముందస్తు డెలివరీ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో మీరు ఉన్న పరిసరాల్లో ఎవరో ఒకరికి జలుబు, ఫ్లూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు నిరోధించడం చాలా కష్టం. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏ నెలలోనైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వారిలో ఫ్లూ తాలూకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిరూపణ అయ్యింది. సరైన పోషకాహారం, నిద్ర, రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ముక్కులో వేసుకునే ్రడాప్స్ మంచివి కావు. డీకంజెస్టంట్ (కఫం పోయేలా చేసే) ఉన్న మందులు కూడా వాడకూడదు.ఫ్లూ వచ్చినప్పుడు చేసే చికిత్సతో కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మీకు 5వ నెలలో చేసే టిఫా స్కాన్లో బిడ్డ ఎదుగుదల తెలుస్తుంది. ఒక వేళ ఫ్లూ ఎక్కువ ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే వెల్ బీయింగ్ స్కాన్ అదనంగా చేస్తారు. మీకు జలుబు మాత్రమే ఉంటే ఒకటి రెండువారాల్లో తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడినీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ముక్కు మూసుకుపోయి, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం లాంటివి ఉండి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి.మీకు షుగర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులున్నా, వాటి తాలూకు ఇబ్బందులు ఎదురైనా డాక్టర్ని కలసి, వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఒకటి రెండు వారాల వరకూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు. చేతులను ముక్కు, కళ్ల వద్ద పెట్టుకోకూడదు. చేతులను శు్రభంగా కడుక్కోవాలి. మాస్క్ వాడటం కూడా మంచిది. ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గదు. అందుకే రాకముందే ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫీవర్ ఉంటే డాక్టర్ని కలసి మందులు వాడాలి.హెల్త్ ట్రీట్.. పీసీఓఎస్తో తిండి సమస్యలు..?మహిళల్లో రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తిండి సమస్యలకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. పీసీఓఎస్తో బాధపడే మహిళలు బులీమియా (తిన్న తర్వాత బరువు పెరిగిపోతామన్న ఆందోళనతో బలవంతంగా వాంతి చేసుకోవడం), బింజ్ ఈటింగ్ (నియంత్రణ లేకుండా నిరంతరం తినడం) వంటి సమస్యలకు కూడా లోనవుతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. తొమ్మిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పీసీఓఎస్తో బాధపడే 28,922 మంది మహిళలపైన, ఈ సమస్య లేని 2,58,619 మంది మహిళలపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ అంశమై శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.ఈ పరిశోధన సారాంశాన్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ సంచికలో ప్రచురించారు. ఆహారం తినడంలో సమస్యలకు లోనయ్యే పీసీఓఎస్ మహిళలపై జరిపిన పరిశోధనల్లో మరికొన్ని అంశాలూ బయటపడ్డాయి. వీరిలో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి అసలే రాకపోవడం, అండాశయం పైపొరపై పూర్తిగా పరిపక్వం కాని అండాలు ఏర్పడటం, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే, పీసీఓఎస్తో బాధపడే మహిళల్లోనే ఆహారం తినే అంశంలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లోని కేలీ గయోర్ఫీ, అవా సానెత్ల ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. – డా. భావన కాసు -
చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్ చైల్డ్ హీలింగ్!
బాల్యం వ్యక్తిత్వానికి పునాదిలాంటిది. బాల్యంలో మన అనుభవాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు సానుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. మనం పెరిగి పెద్దయ్యాక దైనందిన జీవితంలోని సంక్లిష్టతలను చాకచాక్యంగా మేనేజ్ చేస్తున్నప్పటికీ, బాల్యంలో అనుభవించిన నిర్లక్ష్యం, తగిలిన గాయాలు, అనుకున్నవి నెరవేరని బాధ నేటికీ అలాగే ఉండవచ్చు. ఆ గాయాలను నయం చేయకపోతే అవి యుక్తవయసు ప్రవర్తన, ఎమోషనల్ రియాక్ష¯Œ ్స, మానసిక సమస్యలుగా వ్యక్తమవుతాయి.ఉదాహరణకు.. బాల్యంలో నిర్లక్ష్యం, నిరాదరణ, తిరస్కరణకు లోనయినట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటున్నారు, మీ సంబంధ బాంధవ్యాలను ఎంతవరకు నమ్మతున్నారనే దానిపై ప్రభావం చూపించవచ్చు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామితో, సహోద్యోగితో, ఉన్నతాధికారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.ఇలాంటి సందర్భాల్లోనే ఇన్నర్ చైల్డ్ వర్క్ లేదా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే థెరపీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ లోలోపల దాగి ఉన్న భావోద్వేగ గాయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు మరింత ఎమోషనల్ ఫ్రీడమ్తో ముందుకు సాగవచ్చు. కొంచెం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను మొదట సైకాలజిస్ట్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.ఇన్నర్ చైల్డ్ను గుర్తించడంమీ లోపల బాల్యం అలాగే ఉందని, అది అప్పుడప్పుడూ మాట్లాడుతూంటుందని, దాని మాటలు వినాలని గుర్తించడం మొదటి అడుగు. ఈ దశలో మీ బాల్యంలోని అనుభవాలను, భావోద్వేగాలను, అవసరాలను గుర్తించాలి.ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడంవిజువలైజేషన్ ఎక్సర్సైజ్లు, డైరీ రాయం, డైలాగ్ టెక్నిక్స్ ద్వారా మీ ఇన్నర్చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకు.. మీరు కళ్ళు మూసుకుని, చిన్నతనంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, నిర్దిష్ట జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేదా మీ బాల్యం ఎలా ఉందో, ఎలా ఫీలయ్యేవారో ఊహించుకోవచ్చు. మీరెంత కరుణతో అర్థంచేసుకున్నారో మీ ఇన్నర్ చైల్డ్కు ఒక లేఖ రాయవచ్చు.ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇలా...ఇన్నర్ చైల్డ్ చెప్పేది వినడం మీరు మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయిన తర్వాత, తన భావాలు, భయాలు, అవగాహనను వినాలి. మీ ఇన్నర్ చైల్డ్ను ఎన్నో ఏళ్లుగా మీరు పట్టించుకుని ఉండరు. అందువల్ల తను మాట్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తనను జడ్జ్ చేస్తారనే భయం లేకుండా తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే అంతర్గత వాతావరణాన్ని కల్పించాలి. ఇందుకు చాలా ఓపిక, సహానుభూతి అవసరం.హీలింగ్ అండ్ రీపేరెంటింగ్ మీ చిన్నతనంలో లోపించిన ప్రేమ, సంరక్షణ, మద్దతు మీ యవ్వనానికి అందించడం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లక్ష్యం. ‘రీపేరెంటింగ్’ అనే ఈ ప్రక్రియ.. మీరు మీ ఇన్నర్ చైల్డ్కు నచ్చిన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది. ‘నువ్వు సురక్షితంగా ఉన్నావు’, ‘నీకు నచ్చినట్టుగా నువ్వు ఫీలవ్వచ్చు’, ‘నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు’ అని మీ ఇన్నర్ చైల్డ్కు భరోసా ఇవ్వడం ద్వారా మీ బాల్యంలో అందుకోలేకపోయిన ధైర్యాన్ని, ప్రేమను, ప్రోత్సాహాన్ని అందించాలి.ఇన్నర్ చైల్డ్ని ఇంటిగ్రేట్ చేయడం..మీ ఇన్నర్ చైల్డ్ను అడల్ట్ సెల్ఫ్తో ఇంటిగ్రేట్ చేయడం చివరిదశ. అంటే మీ ఇన్నర్ చైల్డ్ మీలో ఒక భాగమని అంగీకరించడం. మీ బాల్యంలోని అనుభవాలు, భావోద్వేగాలు మీ ఇప్పటి ఐడెంటిటీని ప్రభావితం చేస్తున్నాయని, మీరిద్దరూ ఒకటేనని గుర్తించడం. ఇది సెల్ఫ్ కంపాషన్ను, ఎమోషనల్ బ్యాలెన్స్ను పెంచుతుంది. – సైకాలజిస్ట్ విశేష్ -
ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి.. ప్రత్యేకమైన 'హ్యాపీనెస్ టీమ్'ల ఏర్పాటు..
ప్రతి ఒక్కరం ఆనందకరమైన జీవనం కోసం తాపత్రయపడుతుంటాం. అందుకు, పగలు–రాత్రి తేడా లేకుండా శ్రమిస్తుంటాం. దానికి తగ్గట్టు ‘మనలో ఒత్తిడి కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఒత్తిడి ప్రభావం పనిపై పడకుండా ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి హ్యాపీనెస్ టీమ్ను ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు. దానిలో డెలాయిట్ ఒకటి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఐదు గుణగణాలు అలవరచుకుంటే సంతోషకరమైన జీవితం సాధ్యమని వివరిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ 70 ఏళ్లుగా తమ విద్యార్థుల జీవితాలను ట్రాక్ చేస్తూ ‘ఎవరు ఎంత ఆనందంగా ఉన్నారు’ అనే విషయం మీద ఇప్పటికీ రీసెర్చ్ చేస్తోంది. ఎవరి జీవితాలు సంతోషంగా ఉన్నాయని ఆ పరిశోధక బృందం పరిశీలిస్తే ఎవరయితే ఎక్కువ హ్యూమన్ నెట్వర్కింగ్ చేయగలుగుతున్నారో వారు ఆనందాన్ని సంపూర్ణంగా పొందుతున్నారని అర్థం చేసుకున్నారు. డబ్బు, హోదా అందం, తెలివితేటలు.. ఇవేవీ ఆనందానికి కొలమానం కావని తెలుసుకున్నారు.ఆనందాన్ని మర్చిపోతున్నామా?!ఏ వ్యక్తులు అయితే తమని తాము ప్రశాంతంగా ఉంచుకొని, తమ జీవిత లక్ష్యాలను తెలుసుకుంటూ ప్రయాణిస్తున్నారో ఈ కింద ఉదాహరించిన 5 గుణగణాలను కలిగి ఉంటారు. కార్పోరేట్ లేదా మరే రంగంలో పనిచేసేవారికైనా ఈ ఐదు గుణగణాలను అలవర్చుకుంటే చాలు. వాటిలో...శారీరకపరమైన ఆరోగ్యకరమైన అలవాట్లు: శరీరానికి కావల్సినవాటిని అందించడంలో లోపం ఏర్పడినా స్ట్రెస్ పెరుగుతుంది. ఫలితంగా పనితీరులో సంతృప్తి స్థాయి 20 శాతానికి పడిపోతుంది.తెలివితేటలు (ఇంటెలెక్చువల్): ఒక అంశాన్ని ఎంత బాగా విశ్లేషిస్తున్నాం, ఎంత క్రియేటివ్గా వర్క్ చేస్తున్నాం .. అనేది మన బ్రెయిన్పైన ఆధారపడి ఉంటుంది. అస్తమానం మొబైల్లోని స్టఫ్ని చూస్తూ అదే ఆనందం అనుకుంటే మరో 20 శాతం పనితీరు పడిపోతుంది.భావోద్వేగాల అదుపు: ఎదుటివారిని మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి అనే ధ్యాస చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా తమ భావోద్వేగ పరిస్థితి పట్ల అవగాహన లేక అదుపే ఆనందాన్నిస్తుంది అనుకుంటారు. భావోద్వేగాల సమతుల్యతను ΄ాటిస్తూ వెళ్లే వారు తమ పనితీరు సామర్థ్యాన్ని 20 శాతం పెంచుకుంటారు.ఆధ్యాత్మికత: ప్రతి ఒక్కరూ ‘నా ఈ జీవితానికి అర్థం ఏంటి?’ అనుకుంటూ శోధించేవారు హాయిగా తమ జీవన గమనాన్ని సాగించగలుగుతారు. అందుకు దైవాన్ని ఆలంబనగా చేసుకుంటూ తమ కలలకు తగిన పనులు చేస్తూ మరో 20 శాతం సంతృప్తిని పెంచుకుంటారు.ప్రతికూలత: తెల్లవారి లేస్తే ఎన్నో అనుకోని సమస్యలు ఉంటాయి. భావోద్వేగాల పరంగా కింద పడిపోతాం. కానీ, మట్టి ముద్దలాగా అలాగే ఉండకుండా తిరిగి ఎలా లేచి నిలబడతామనేది సవాల్గా తీసుకోవాలి. దీని వల్ల మరొక 20 శాతం ఆనందంగా ఉంటాం. ‘ఇలా ఒక్కో గుణం నుంచి 20 శాతం ఆనందాన్ని పెంచుకుంటూ ప్రయాణించేవాళ్లు నూటికి నూరు శాతం సంతృప్తికరమైన జీవనం గడుపుతారు’ అని క్లినికల్ సైకాలజిస్ట్ రాధికా ఆచార్య తెలియజేస్తున్నారు. అంచనాలు భారీగా ఉంటాయి.‘డబ్బుతో కొనలేని ఆనందంలో ఉత్పాదకత, సంతృప్తి, శ్రేయస్సు ఉంటాయి. ఒకసారి ఈ పోస్ట్కు కమిట్ అయ్యామంటే అంచనాలు కూడా భారీగా ఉంటాయి’ అంటారు చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్. డెలాయిట్ కంపెనీలో ఇటీవల మొదటిసారి కొత్త హోదాలో పది మంది సభ్యులతో ఉన్న బృందానికి నాయకత్వం వహిస్తున్నారు ఈ చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్. – నిర్మలారెడ్డిహ్యాపీనెస్ సన్ ఫ్లవర్..మేం ఉద్యోగుల ఆనందంపై దృష్టి పెడుతున్నామనే విషయం సంస్థలో ప్రతి ఒక్కరికీ తెలియపరిచాం. సంస్థలో టాలెంట్ ఫంక్షన్లు జరుపుతాం. జిమ్, యోగా వంటి క్లాసులు ఉంటాయి. ఎవరైనా వారి సమస్య గురించి చెప్పినప్పుడు ముందు వాటిని అర్థం చేసుకుంటాం. ‘హ్యాపీనెస్ సన్ఫ్లవర్’ ద్వారా సరైన పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తాం. మేం రూపొందించిన ‘΄÷ద్దు తిరుగుడు పువ్వు’కు ఆరు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆరు పూలరేకల్లో ప్రతి రేకా ప్రత్యేక పనితీరుతో ఉంటుంది. ప్రయోజనం, అనుసంధానం, విశ్రాంతి, వైవిధ్యం– సమానత్వం, మానసిక, శారీరక ఆరోగ్యం వంటి ఆరు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అంతేకాదు అనుకూలత, ఫెయిర్నెస్, ధైర్యం, చురుకుదనం వంటి సూత్రాలతో సన్ఫ్లవర్ వికసిస్తుంది. అభిరుచితో జీవించడానికి, ఒక శక్తివంతమైన, ఆరోగ్యకరమైన కార్యాలయాన్ని సృష్టించడం మా హ్యాపీనెస్ టీమ్ లక్ష్యం. – సరస్వతి కస్తూరి రంగన్, డెలాయిట్ చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్వాస్తవంలోనే ఆనందం..మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన మాట, ప్రవర్తన ΄ాజిటివ్గానూ, వాస్తవికంగానూ ఉండాలి. వర్చువల్ అనేది తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రకృతి నుంచి లభించేవీ, మనం చేసే పనుల మంచి ఫలితాలే ఆనందాన్నిస్తాయి. కాలక్షేపం కోసం చేసే కొన్ని పనులు జీవితంలో నష్టం చేసేవిగానే ఉంటాయి. – రాధికా ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్, స్టూడెంట్ కౌన్సెలర్ -
Health: నేను నాలా లేను..!?
నాకు ఈ మధ్యనే డెలివరీ అయ్యింది. ఆసుపత్రిలో నాతో పాటు డెలివరీ అయిన వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు మాత్రం చాలా బాధగా, ఒంటరిగా ఉన్నానని అనిపిస్తోంది. నేనెందుకు నాలాగ ఉండలేకపోతున్నానో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. – ప్రభారాణి, అమీన్పూర్డెలివరీ అనేది చాలా ముఖ్యమైన దశ. చాలామందికి ఉత్తేజంగా, ఆనందంగా, ఒక సవాలుగా ఉంటుంది. కొంతమందికి తల్లిని కాబోతున్నాను అనే ఆనందంతో పాటు కొంత ఆందోళన, ఒత్తిడి, దిగులు ఉంటాయి. ఇది సర్వసాధారణం. అయితే కొంతమందికి ఈ మార్పులు తట్టుకోవడం కష్టం కావచ్చు. ఇలాంటి వారికి అధిక సంరక్షణ అవసరం. మీలోని భావాలను ఇంకొకరితో పంచుకుంటే మంచిది. బ్లాగ్స్, న్యూస్పేపర్, సోషల్మీడియాలో కూడా వ్యక్తపరచవచ్చు.ఎవరికీ చెప్పకుండా, మీలోని మార్పులకి కారణం తెలియక ఇబ్బంది పడకూడదు. మీ గైనకాలజిస్ట్తో వ్యక్తిగతంగా సమస్యను వివరించడం మంచిది. అలా కుదరనప్పుడు కుటుంబసభ్యులతో గాని, మీకు బాగా దగ్గరి వ్యక్తులతో గాని పంచుకోండి. మీరు కొంత సమయం మీ కోసం కేటాయించుకుని విశ్రాంతి తీసుకోండి. మీరు రోజూ చేసే పనులు కూడా చెయ్యలేక ఇబ్బంది పడుతుంటే వెంటనే డాక్టర్ని కలవండి. కొందరిలో ఏ కారణం లేకుండానే ఏడవటం, వెంటనే సంతోషంగా అనిపించడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. డెలివరీ సమయంలో అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది.డెలివరీ అయిన వారం రోజుల్లోనే పుట్టిన బిడ్డతో అనుబంధం ఏర్పడటం చాలా అరుదు. నెమ్మదిగా పాలు ఇవ్వడం అలవాటు అయిన తర్వాత ఆ అనుబంధం బలపడుతుంది. మీ బిడ్డను చూసుకోవడంలో అనుభవం ఉన్న వాళ్లకు లేదా ఇంట్లో పెద్దవాళ్లకు మీ సమస్యను వివరించి వారి సాయం తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన అందరికీ ఒకే రీతిలో ఉండకపోవచ్చు. తలనొప్పి, మెడనొప్పి, మగత, కడుపునొప్పి, రాత్రులు చెమటలు పట్టడంలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. చాలామందికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నా, ఎవరితోనైనా చెబితే ఏమనుకుంటారో అని చెప్పరు. పదిమందిలో ఒకరికి ఇలా ఉంటుంది. ప్రసవానంతరం ఇలాంటి ఒత్తిడులు చాలామందిలో ఉంటాయి. కొంతమంది కౌన్సెలింగ్ లేదా మందులతో మామూలుగా అవుతారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
హెల్దీ డైట్: సగ్గుబియ్యం పొంగనాలు..
పోషకాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం వంటి విటమిన్స్ ఆరోగ్యానికి పుష్కలంగా దొరికే వంటకం ఇది. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం..కావలసినవి..సగ్గుబియ్యం – అర కప్పు (గంట సేపు నానబెట్టాలి);పనీర్ తురుము – 75 గ్రాములు;వేరుశనగపప్పుల పొడి– 3 టేబుల్ స్పూన్లు;క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు;బంగాళదుంప – 1 (ఉడికించి తొక్క తీసి చిదమాలి);జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి– టీ స్పూన్;మిప్రో్పడి– టీ స్పూన్;ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;క్యాబేజ్ తరుగు – ము΄్పావు కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు (రెడ్, గ్రీన్ క్యాప్సికమ్);చీజ్ తురుము – 50 గ్రాములు (12 భాగాలు చేసుకోవాలి);నూనె – టీ స్పూన్.తయారీ..– ఒక పాత్రలో క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.– ఆ తర్వాత ఇందులో నూనె, చీజ్ మినహా మిగిలినవన్నీ వేసి బాగా కలిపి పన్నెండు భాగాలుగా చేయాలి.– ఒక్కో భాగంలో చీజ్ స్టఫ్ చేస్తూ గోళీలాగా చేయాలి.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో ఒక్కో చుక్క నూనె రుద్ది పొంగనాన్ని పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.– ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు కాల్చాలి.పోషకాలు (ఒక్కో పొంగనంలో)..– కేలరీలు 63;– ప్రోటీన్ – 2.5 – 3 గ్రాములు;– కార్బోహైడ్రేట్లు – 8–9 గ్రాములు;– ఫ్యాట్ – 2–3 గ్రాములు;– ఫైబర్– గ్రాము;– క్యాల్షియం – 40–50 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్స్టా్రగామ్ ఫాలోవర్స్తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్ను లేదా ఫ్రిస్బీ ప్లేట్ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
health: ఒంట్లో వేడి ఆవిర్లు తగ్గాలంటే ఏం చేయాలి?
నాకు నెలసరి ఆగి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ మూడ్ స్వింగ్స్, ఒంట్లో వేడి ఆవిర్లతో సఫర్ అవుతున్నాను. వెజైనల్ ఇచ్చింగ్ కూడా సివియర్గా ఉంది. నేను వర్కింగ్ ఉమన్ని అవడం వల్ల వీటితో చాలా ఇబ్బంది పడుతున్నాను. పరిష్కారానికి డాక్టర్ని కలవడం తప్పనిసరి అంటారా? – రాజేశ్వరి, జగ్గంపేటశరీరంలో వచ్చే మెనోపాజ్ మార్పులను తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ మొదలుపెడితే ఇంత ఇబ్బంది ఉండదు. దీని మీద ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. ప్రీ మెనోపాజ్ వచ్చినవారు కూడా ఈ దశను దాటి హ్యాపీగా ఉంటున్నారు. మెనోపాజ్ టైమ్లో శారీరకంగా, మానసికంగా, సెక్సువల్గా మార్పులు చాలా ఉంటాయి. మీరు వర్కింగ్ ఉమన్ కాబట్టి ఆ మార్పులను ఎదుర్కొంటూ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం. మీరే కాదు చాలామంది ఇలాంటి సమస్యలను గుంభనంగా భరిస్తూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించడానికి ఇబ్బందిపడుతుంటారు.కానీ ఈ ప్రాబ్లమ్స్కి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెనోపాజ్ దశ దాటిన తరువాత ఓవరీస్ పనిచేయవు. అందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల వెజైనా ప్రాంతం పొడిబారిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడతారు. 50 శాతం మందిలో ఈ మార్పు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. యూరిన్, యూటరస్, వెజైనల్ స్వాబ్స్ తీసి ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. ఇప్పుడు ఇలాంటి వాటినే ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ‘మెనోపాజ్ క్లినిక్స్’ వచ్చాయి. ఇబ్బందిపడకుండా డాక్టర్ని సంప్రదిస్తే సమస్య త్వరగా నయమవుతుంది. -
రికవరీ ఎలా ఉంటుంది?
వారం కిందట నాకు నార్మల్ డెలివరీ అయింది. ఎన్ని రోజుల్లో మళ్లీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తాను? ఈలోపు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే.. ఎలాంటి సమస్యకు హాస్పిటల్కి వెళ్లాలి? – యోగిత, దేవరకొండడెలివరీ అయిన తరువాత తల్లికి, బిడ్డకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు వారాల తరువాత ఇద్దరినీ చెకప్కి తీసుకువెళ్ళాలి. కొన్ని హై రిస్క్ కేసుల్లో ఐదవ రోజే చెకప్కి వెళ్ళాలి. బేబీకి సరిగ్గా పాలు ఇవ్వడం, నిద్ర పుచ్చటం, టైమ్కి మల్టీ విటమిన్ డ్రాప్స్ వేయడం లాంటివి చేయాలి. జాండీస్ చెకింగ్ గురించి కూడా డిశ్చార్జ్ టైమ్లో చెప్తారు. బేబీ ఎక్కువగా ఏడుస్తున్నా, యూరిన్, మోషన్ పాస్ చెయ్యకపోయినా, బరువు తగ్గిపోతున్నా, చర్మం పసుపు రంగులోకి మారినా వెంటనే డాక్టర్ని కలవాలి. మీరు సరైన పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.మొదటి వారంలో మీకు ఫీవర్, బాడీ పెయిన్స్ ఉన్నాయా అని చూస్తారు. బిడ్డకి పాలు పట్టించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేస్తారు. యూటరస్ పెయిన్ చాలా కామన్గా ఉంటుంది. అది యూటరస్ నార్మల్ సైజు అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ మాత్రమే! నార్మల్గా బ్లీడింగ్ 12 వారాల వరకు ఉంటుంది. ఒకవేళ మీకు హై టెంపరేచర్, తట్టుకోలేని పొట్టనొప్పి, బ్రెస్ట్ పెయిన్, హెవీ బ్లీడింగ్, క్లాట్స్, వెజైనా పెయిన్, ఫౌల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటే అవి ప్రమాదం. వెంటనే డాక్టర్ని కలవాలి. తల తిరుగుతున్నట్లు, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించినా, కాళ్లలో రక్తం గడ్డకట్టినా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే బ్రెస్ట్లో నొప్పి పుట్టించే గడ్డలు వచ్చినా డాక్టర్ని కలవాలి. కొంత యాంగై్జటీ, భయం అందరికీ ఉంటాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా మాట్లాడవచ్చు.బిడ్డకు పాలు ఇచ్చే సందేహాల మీద ఇంటి నుంచే సలహాలు తీసుకోవచ్చు. మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యమైనది. హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రోజూ కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకొని మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు వెజైనా వద్ద కుట్లు వేసుంటే రెండు వారాల్లో మానిపోతాయి. కొన్నిసార్లు పెయిన్కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడాల్సివస్తుంది. డెలివరీ అయిన వెంటనే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు ప్రారంభించాలి. దీనికి సంబంధించి డిశ్చార్జ్కి ముందే డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. మలబద్ధకం చాలామందికి ఉంటుంది. మైల్డ్ లాక్సాటివ్స్ వాడాలి. ఒకటి రెండు వారాల్లో ఎక్సర్సైజులు, డైట్తో నార్మల్ అవుతుంది. ప్రమాదకరమైన మార్పులు లేనప్పుడు రెండు వారాల తరువాత డాక్టర్ని కలవాలి. ప్రతి నెలా బేబీకి చెకప్స్ ఉంటాయి. -
Neha Bhasin: ఇదీ నా వేదన..!
‘నేను ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, తీవ్రమైన కండరాల నొప్పితో బాధించే ఫైబ్రోమయాల్జియా రుగ్మతలతో బాధ పడుతున్నాను. నా వేదన మీకు చైతన్యం కలిగించాలి’ అంది నేహా భాసిన్. బాలీవుడ్లో ఎన్నో ఎన్నో హిట్ ట్రాక్స్ పాడిన గాయని నేహా ఇటీవల ఇన్స్టాలో రాసుకున్న పోస్ట్ స్త్రీల ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది. ఆమె ఏం రాసింది?‘‘నేను చెప్పాల్సింది చాలా ఉంది. అయితే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టి, ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. నేను అనుభవిస్తున్న నరకాన్ని ఎలా ఏకరువు పెట్టాలో అర్థం కావడం లేదు. నా హెల్త్ రిపోర్టుల మీద రెండేళ్ల నుంచి అని రాసి ఉన్నప్పటికీ ఈ వేదనాపర్వం నా 20వ ఏటి నుంచి కొనసాగుతోంది. ఒంటరిగా ఉండకుండా నలుగురితో... అందునా నాకిష్టమైన, నేను ప్రేమించే వ్యక్తులను కలుస్తూ, పత్రికలకు వ్యాసాలు రాస్తూ నా ఇబ్బందులను ఎంతోకొంత అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నెలనెలా వేధించే నా ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ నన్ను కొత్త చీకట్లలోకి విసిరేస్తోంది. ‘ఇది నీ వైఫల్యమేనా?’ అంటూ నా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ నన్ను వెక్కిరిస్తూ ప్రశ్నిస్తోంది. ఫైబ్రోమయాల్జియా అంటూ డాక్టర్లు చెబుతున్న ఆ సమస్య నాలో వేదనాగ్ని జ్వాలల్ని రగిలిస్తోంది. ఏళ్ల తరబడి నేను వాటిని లెక్కచేయకుండా నిన్నమొన్నటివరకూ ప్రదర్శనలిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా డాక్టర్ ‘ఇంక మీరేమీ చేయకుండి. హాయిగా విశ్రాంతి తీసుకోండి’ అంటున్నాడు.నేనిలా విశ్రాంతి తీసుకోవడం నాకే నచ్చడం లేదు. దశాబ్దాల తరబడి లెక్కచేయకుండా నెట్టుకొస్తున్న నా వేదనలు నన్ను బాధిస్తున్నప్పటికీ... నా కలలను శ్వాసిస్తూ, నా కలలకు రూపం కల్పించే సంకల్పంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను. ఇవ్వాళ నేనో వృద్ధుణ్ణి చూశాను. ఒక చేత్తో ఓ పెద్ద బరువైన పెట్టెను మోస్తూ, మరో చేతిలో గొడుగుతో కుస్తీపడుతూ ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా అతికష్టమ్మీద నా వ్యాయామశాల సోపానాల చివరి మెట్టును అధిగమించాక నన్ను చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. అతడి ఆ నవ్వు ఎలా ఉందంటే... ‘ఈ వయసుకు తీవ్రమైన నొప్పులతో నేనూ బాధపడుతున్నా. వేదనా తరంగాల దొంతరల్లో ఈదులాడుతున్నా. నేనే ఇలా ఉన్నానంటే... నీకింకా ఏమీ ముగిసిపోలేదు. జీవితానికి కృతజ్ఞురాలివై ధైర్యంగా ఉండు. నీకంటే ఎక్కువ బాధపడుతున్నవారు ఇంకా ఎందరో ఉన్నారు’ అంటూ ఉద్బోధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.అందుకే... నా బాధలూ, నా వెతలూ, నా ఆవేదనలన్నీ నా జీవితాన్ని సవాల్ చేస్తున్నప్పుడు మీ ప్రేమతో పాటు నేను రాసుకుంటున్న ఈ కొన్ని మాటల్ని సాంత్వననిచ్చే ఓ మలాముగా పులుముకుంటున్నా’’ అంటూ ముగించింది నేహా.ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్..కొందరు యువతుల్లో నెలసరి ముందుగా తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) అంటారు. అందులోని అత్యంత బాధకరమైన ఒక రకం ‘ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్’. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో డాక్టర్లు దీనికి చికిత్స అందిస్తుంటారు.అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్..పూర్తి పర్ఫెక్షన్ రాలేదంటూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ, ఎంతకీ సంతృప్తి లేక దాన్నే కొనసాగిస్తూ విసుగు కలిగించే మానసిక వ్యాధి ఇది. దీని బారిన పడితే ఆలోచనలూ, పనులూ అలా అనియంత్రితంగా సాగుతూ ఎంతకీ పని పూర్తి చేయనివ్వక బాధిస్తుంటాయి. దీనికి మానసిక చికిత్స అవసరం.ఫైబ్రోమయాల్జియా..కండరాల, ఎముకల నొప్పితో తీవ్రమైన ఒళ్లు నొప్పులతో, స్పర్శ సున్నితంగా మారి ఒంటిని ముట్టుకోనివ్వనంతగా తీవ్రమైన వేదన కలిగిస్తుందిది. మానసిక ఆందోళనలు, యాంగై్జటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ వంటి సమస్యల కారణంగా మరింత పెచ్చరిల్లే ఈ నొప్పులకు సరైన చికిత్స అవసరం. -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ప్రెగ్నెన్సీలో.. సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య!
నాకు ఐదవ నెల ప్రెగ్నెన్సీ. ప్రతిరోజు మోషన్ ఫ్రీగా రాక ఇబ్బంది పడుతున్నాను. ఏ మందులూ పని చెయ్యడం లేదు.ప్రెగ్నెన్సీలో ఇది చాలా సాధారణ సమస్య. హార్డ్ మోషన్తో పాటు పెయిన్ఫుల్గా కూడా ఉండొచ్చు. దీని వల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, క్రాంప్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం అసలు కారణం. హార్మోనల్ చేంజెస్తో బొవల్ మూవ్మెంట్ కూడా బాగా తగ్గుతుంది. నీళ్లు సరిగ్గా తాగక బొవల్ మూవ్మెంట్ స్పీడ్ తగ్గి మోషన్ గట్టిపడటంతో మలబద్ధ్దకం మొదలవుతుంది.తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉన్నా, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకున్నా, స్టూల్ బల్క్ తగ్గి కూడా మోషన్ హార్డ్ అవుతుంది. ఎక్సర్సైజెస్, యోగా చేసిన వారిలో టమ్మీ మజిల్స్ స్టిములేట్ అవుతాయి. దానితో మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. మీరు రోజుకు నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం.. బీన్స్, ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా అయ్యే లాక్సాటివ్ సిరప్స్ తీసుకోవాలి. వీటిలో స్టిములేటింగ్ లాక్సాటివ్స్ అంటే బొవల్ ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్టు చేసేవి వాడాలి. కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.మీరు అవి గుర్తించి డాక్టర్కి చెప్పాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఇస్తారు. వారంలో కనీసం మూడుసార్లు కూడా మోషన్కి వెళ్ళకపోతే మలబద్ధకంగా పరిగణించాలి. థైరాయిడ్ డిసీజ్, ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్లాంటి కండిషన్స్ ఉన్న వారిలో ఇంకా ఎక్కవ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఐదుగురిలో ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నా కొంతమందిలో ఎందుకు మలబద్ధకం వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, లాక్సాటివ్స్తో ట్రీట్మెంట్ ఇస్తాము.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఈ సమస్యను.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు! ఇదీ..
నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడమీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.ఇద్దరికీ ట్రీట్మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్కి ఏ ఇన్ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్కి ట్రీట్మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్!
ఓట్స్, పొటాటోలు కలిపి తయారుచేసే చీజ్ బాల్స్ వంటకంతో ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఈ వంటకంలో పుష్కలమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. ఇక వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..కావలసినవి..ఉడికించి చిదిమిన బంగాళాదుంప – 2 కప్పులు;ఓట్స్ – కప్పు;చీజ్ తురుము – కప్పు;ఉల్లిపాయ తరుగు – పావు కప్పు;కొత్తిమీర – పావు కప్పు (తరగాలి);మిరప్పొడి– అర టీ స్పూన్;చాట్ మసాలా– అర టీ స్పూన్;ఉప్పు – రుచికి తగినంత;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– ఓట్స్ను బాణలిలో నూనె లేకుండా మీడియం మంట మీద ఒక మోస్తరుగా వేయించి, పొడి చేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో చిదిమిన బంగాళాదుంప, ఓట్స్ పొడి, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరప్పొడి, ఉప్పు వేసి కలపాలి.– మొత్తం చపాతీ పిండిలా ముద్దగా తయారవుతుంది. ఈ ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో బాల్స్ చేసుకోవాలి.– ఒక్కో బాల్ని అరచేతిలో వేసి కొద్దిగా ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో వత్తాలి.– ఆపం పెనం లేదా కొంచెం గుంటగా ఉన్న పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాసి ఒక్కో బాల్ని పెనం మీద అమర్చి మంటను మీడియంలో పెట్టాలి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత మెల్లగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.– ఈ చీజ్ బాల్స్ని వేడిగా ఉన్నప్పుడే కెచప్ లేదా సాస్లతో వడ్డించాలి.గమనిక: పిండిలో కలిపిన చీజ్ కరిగి బయటకు వస్తుంది. కాబట్టి నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. పెనం మాడుతున్నట్లనిపిస్తే చీజ్ బాల్స్ కాలుతున్నప్పుడు పై నుంచి కొద్ది చుక్కలు నూనె వేయవచ్చు.పోషకాలు: పై కొలతలతో చేసిన చీజ్ బాల్స్లో 150 కేలరీలుంటాయి. కార్బొహైడ్రేట్లు 25 గ్రాములు, ప్రోటీన్లు– 6 గ్రాములు, ఫ్యాట్– 7 గ్రాములు, ఫైబర –3 గ్రాములు, క్యాల్షియం– 100 మిల్లీ గ్రాములు, ఐరన్– 1.5 మిల్లీ గ్రాములు– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్, వెల్నెస్ కోచ్ -
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు.. ఇదేమైనా సమస్యా?
నాకు 38 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు. ఇంతకుముందేమో హెవీ సైకిల్స్ ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే పీరియడ్స్ రాకపోవడం రిలీఫ్గానే ఉంది. కానీ మా ఫ్రెండ్సేమో ఇంత చిన్న వయసులో అలా పీరియడ్స్ ఆగిపోవడం కరెక్ట్ కాదు, డాక్టర్ని కన్సల్ట్ అవమని చెప్తున్నారు. ఇంతముందుగా మెనోపాజ్ వస్తుందా? – కె. పల్లవి, హైదరాబాద్ఎర్లీ లేదా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే 40–45 ఏళ్ల మధ్య నెలసరి పూర్తిగా ఆగిపోవడం. వీళ్లకి మెనోపాజ్ సింప్టమ్స్ అయిన హాట్ ఫ్లషెస్, చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్ వంటివీ ఉంటాయి. కానీ కొంతమందికి హఠాత్తుగా కొన్ని నెలలపాటు పీరియడ్స్ ఆగిపోతాయి. భవిష్యత్లో మళ్లీ స్టార్ట్ అవచ్చు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 40 ఏళ్లలోపు కనపడుతుంది.దీనిని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషన్సీ అంటారు. అంటే అండాశయాల నుంచి అండాలు విడుదల కాకుండా, బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. దీనికి సరైన కారణమేంటో తెలీదు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్తో బాధపడుతున్న వారిలోనూ కనిపిస్తుంది. జన్యుపరమైన కారణమూ ఉండొచ్చు. కొంతమందికి మంప్స్, టీబీ, మలేరియా తరువాత ఇలా పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది.మెనోపాజల్ సింప్టమ్స్తోపాటు జుట్టు ఊడిపోవడం, ఎముకలు బలహీనపడటం, బోన్ లాస్ వంటివీ ఉంటాయి. ఆస్ట్రియో పొరాసిస్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ బాడీలో ఈస్ట్రజన్ హార్మోన్స్ తగ్గటం వలన తలెత్తుతాయి. ఎప్పుడైనా వరుసగా మూడునెలలు పీరియడ్స్ మిస్ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కారణమేంటో త్వరగా కనుక్కొని వెంటనే చికిత్సను అందిస్తారు. ఒత్తిడి, డైట్లో మార్పులు, ఎక్సర్సైజ్ హాబిట్స్ వల్ల కూడా కొంత పీరియడ్ సైకిల్లో మార్పులు వస్తాయి.థైరాయిడ్, ఎఫ్ఎస్హెచ్ టెస్ట్లు, బోన్ స్కాన్ చేస్తారు. దేహానికి హార్మోన్స్ అవసరం చాలా ఉంటుంది. అలాంటిది చిన్న వయసులోనే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే రిస్క్ ఎక్కువవుతుంది. కాబట్టి కొంతమంది పేషంట్స్కి డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. 51 ఏళ్లకి సహజంగానే మెనోపాజ్ వస్తుంది కాబట్టి ఆ సమయం వరకు జాగ్రత్తగా చెకప్ చేయించుకుంటూండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
పెయిన్కిల్లర్స్ అబ్యూజ్..! పెయిన్ తగ్గించడమా? ప్రాణసంకటమా?
మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్ కిల్లర్స్ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్ అప్సెట్), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్ అల్సర్స్) రావచ్చు.అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.హైపర్టెన్షన్ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్ కిల్లర్స్ వల్ల రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.కిడ్నీలపైన: కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్కిల్లర్ టాబ్లెట్స్లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్కిల్లర్స్ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్ వంటì వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం – చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్కు తెలపాలి.దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... – పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. – అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. – కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి. – పెయిన్ కిల్లర్స్ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు -
Health: దాని కోసం.. ప్లాన్ చేస్తున్నాం! కానీ..
నాకిప్పుడు 35 ఏళ్లు. ఏడాదిగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం. అయినా రాలేదు. ప్రెగ్నెన్సీ కోసం ఏయే టెస్ట్లు చేయించుకోవాలో సజెస్ట్ చేయగలరా? – జయంతి శ్రీరాం, తునిప్రెగ్నెన్సీ కోసం ఏడాది ప్లాన్ చేసుకుంటే సాధారణంగా పదిమందిలో ఎనిమిది మందికి సక్సెస్ అవుతుంది. మీ వయసు 35 ఏళ్లు అంటున్నారు కాబట్టి కొన్ని టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది.. అంతా బాగానే ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం. టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే వారానికి 2–3 సార్లు .. నెల మధ్యలో అంటే మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత 11వ రోజు నుంచి 25వ రోజు వరకు భార్యాభర్తలిద్దరూ కలవాలి. మీ బీఎమ్ఐ (మీ హైట్, వెయిట్ రేషియో) 30 దాటినా, అధిక బరువున్నా.రిపీటెడ్ యాంటీబయాటిక్స్ , స్టెరాయిడ్స్ లాంటివి వాడినా, సర్వైకల్ లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గర్భధారణ ఆలస్యమవుతుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మూడు నెలల ముందు నుంచే వాడటం మొదలుపెట్టాలి. పాప్స్మియర్, రుబెల్లా టెస్ట్లు చేయించుకోవాలి. మీకు, మీవారికి మెడికల్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్, బీపీ, సుగర్ లాంటివి ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచాలి. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే మీకు, మీవారికి ఏయే టెస్ట్లు అవసరమో చెప్తారు.అన్నీ నార్మల్గానే ఉంటే పిల్లల కోసం ఆరు నెలల నుంచి ఏడాది ప్రయత్నించమని సూచిస్తారు. ఒకవేళ సెమెన్ అనాలిసిస్లో ఏదైనా సమస్య ఉన్నా, మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి నుంచి మూడు నెలలలోపు అన్నీ సర్దుకుంటాయి. ట్రాన్స్వెజైనల్ స్కాన్ ద్వారా మీ గర్భసంచి, అండాశయాలు ఎలా ఉన్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేవా? ఫాలోపియన్ ట్యూబ్స్ తెరుచుకునే ఉన్నాయా లేవా? అని చూస్తారు. కొంతమందికి అన్నీ నార్మల్గానే ఉన్నా రెండేళ్లలో గనుక ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. 36 ఏళ్ల వయసు దాటుతున్నప్పుడు ఐయూఐ లేదా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ 5 ఎక్సర్సైజ్లతో.. మీ ఓవర్ థింకింగ్కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్సైజ్లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్సైజ్లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..ఇలా చేయండి..– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.– ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి.. -
ఈ తరానికి అవసరమైన సప్తపది..
‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి’... అనే పాట ఒకప్పుడు చాలా పాపులర్. ఈతరం ఒక్కసారి కూడా విని ఉండదు. ఈ పాటలాగే పెళ్లి కూడా పాతబడిపోతోంది. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ పెళ్లి స్వరూపం మారిపోతోందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి స్థానంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేస్తోంది. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండే జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇది ఎక్కడకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పెళ్లయినా, లివ్ ఇన్ అయినా మరెలాంటి బంధమైనా నిలబడాలంటే ఏడు సూత్రాలు పాటించాలని ‘ఫ్యామిలీ జర్నల్’ జరిపిన సైకాలజికల్ రీసెర్చ్లో వెల్లడైంది. ఈ ఏడు సూత్రాలు పాటించడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుందని ఆ అధ్యయనం చెబుతోంది. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.లోపాలను బలాలుగా మార్చుకోగల సామర్థ్యం..పెళ్లంటే చాలా సవాళ్లు ఉంటాయి. భార్యాభర్తల్లో లోపాలుంటాయి, దిగులుపడే సందర్భాలు ఉంటాయి. ఆ సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటారు, వారి లోపాలను ఎలా మార్చుకుంటారనేదే వారి బంధంలోని బలాన్ని నిర్ణయిస్తుం దని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కష్టసమయాల్లో ఒకరికొకరు ఓదార్పు, మద్దతు, ప్రోత్సాహం అందిస్తూ కలిసి సమస్యలు ఎదుర్కోవడమే తొలిమెట్టు.కలిసి పంచుకోవడం కీలకం..‘నా స్పేస్ నాకు కావాలి’ అంటూ గొడవపడే జంటలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. పెళ్లంటేనే కలిసి జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరూ కలిసి ఆనందించే చర్యల ద్వారా తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం అవసరమని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఇలా చేయడం జంట మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అందువల్ల తరచుగా కలిసి నడవడం, వంటచేయడం, పరస్పర హాబీలను ప్రోత్సహించుకోవడం లాంటి పనులు చేయాలి.విభేదాలు, మార్పును సహించడం..పెళ్లంటే భిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడం. అంటే వారిద్దరి మధ్య విభేదాలు సహజం. వాటిని అంగీకరించడం, సహించడం అవసరం. అలాగే బంధంలో, భాగస్వామిలో వచ్చే మార్పును ముప్పుగా భావించకుండా, దాన్ని పరిణామానికి ఒక అవకాశంగా చూడాలి. విభేదాలతో విడిపోకుండా, అవి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికి అమూల్యమైన అవకాశాలుగా వినియోగించుకోవాలి.రాజీతోనే విభేదాలు పరిష్కారం..వైవాహిక జీవితంలో విభేదాలు సహజం. తప్పెవరిదైనా విభేదాలను పరిష్కరించు కోవడానికి రాజీ పడటం అవసరం. అలా రాజీపడి విభేదాలను పరిష్కరించుకోగల జంటలు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారని అధ్యయనం చెబుతోంది. అందువల్ల లోపాల గురించి విమర్శించుకునే బదులు బలాలు, సానుకూల లక్షణాలను ప్రశంసించడంపై దృష్టి పెట్టండి. ఒకరిపట్ల మరొకరికి అవగాహన, కృతజ్ఞత కలిగి ఉండటం సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.అప్పుడప్పుడైనా మెచ్చుకోవాలి..భార్య వంట చేస్తే లొట్టలేసుకుంటూ తినడం, భర్త బంగారం కొనిస్తే తీసుకోవడమే కాదు.. వారికెప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చిన్న చిన్న విషయాలకు కూడా థాంక్స్ చెప్పడం అవసరమని అధ్యయనం నొక్కి చెబుతుంది. అలా చేయడం జంట మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే మీ పార్ట్నర్ సహకారాన్ని, లవ్ సిగ్నల్స్ను గుర్తించి అభినందించేందుకు ప్రయత్నించండి.బంధంలో నిబద్ధత..భారతదేశంలో పెళ్లంటేనే జీవితకాల బంధం. అది విజయవంతం కావాలంటే నిబద్ధత కీలకం. జీవితంలో వచ్చే చెడు కాలాలను దాటి బంధం నిలబడాలంటే జంటలో అంకితభావం, పట్టుదల అవసరం. అన్నింటికంటే వైవాహిక బంధమే ముఖ్యమైనదని గుర్తించి, దాన్ని కాపాడుకోవడానికి సమయం వెచ్చించాలి. అలా కాల పరీక్షను తట్టుకుని నిలబడే ప్రేమ, విశ్వాసాలకు పునాదిని నిర్మించుకోవచ్చు.తనను తాను గౌరవించుకోవాలి..ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆత్మగౌరవం ఆధారం. అది మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన ఆత్మగౌరవం ఉన్నవారు సంతృప్తికరమైన సంబంధాలను కొనసాగించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారని అధ్యయనం సూచిస్తోంది. ఆత్మగౌరవం లేనివారు చిన్నచిన్న విషయాలకు కూడా నొచ్చుకుని గొడవపడుతుంటారు. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. అది మీ వైవాహిక బంధానికి పునాదిగా నిలుస్తుంది.ఇవి చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!! -
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్లో బ్లాక్స్తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు..
రేచల్ చురుకైన విద్యార్థిని. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటుంది. స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే గత ఏడాదిగా తన ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. 15ఏళ్ల టీనేజర్లో ఉండే చురుకుదనం కనిపించడంలేదు. టీచర్లు గుర్తించి అడిగారు, ఏమీ చెప్పలేదు. దాంతో పేరెంట్స్ను పిలిపించి చెప్పారు. వాళ్లు అడిగినా ఏమీ చెప్పలేదు. మరోవైపు టెస్టుల్లో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు.రేచల్ ఆందోళగా కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వడంలేదు. వినిపించీ వినిపించకుండా మాట్లాడుతోంది. నెమ్మదిగా తనను మాటల్లో పెట్టాను. ఫాదర్కు ట్రాన్స్ఫర్ కావడంతో రెండేళ్ల కిందటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చామని చెప్పింది. సిటీకి రావడం మొదట్లో తనకు ఉత్సాహంగా ఉన్నా పాత స్నేహితులకు, సుపరిచితమైన వాతావరణానికి దూరంకావడం తనకు బాధగా ఉందని, తరచుగా కడుపునొప్పి కూడా వస్తోందని చెప్పింది. అది యాంగ్జయిటీ వల్ల వచ్చే సొమాటిక్ సింప్టమ్ అని అర్థమైంది. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె తీవ్ర ఆందోళన, డిప్రెషన్తో బాధపడుతోందని నిర్ధారణైంది.కొత్త స్కూల్లో ఒక బ్యాచ్ తన మాటలు, ఉచ్చారణ, డ్రెస్సుల గురించి ఎగతాళి చేస్తోందని ఆ తరువాతి సెషన్లో చెప్పింది. ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, తన సోషల్ మీడియా పోస్టులను అపహాస్యం చేస్తున్నారని చెప్పింది. ఇటీవల నేరుగానే బెదిరిస్తున్నారని, ఏం చేయాలో అర్థం కావడంలేదని కంటనీరు పెట్టుకుంది. రేచెల్లానే దాదాపు 20 శాతం మంది విద్యార్థులు, విద్యార్థినులు బుల్లీయింగ్ బాధితులవుతున్నారు. అది వారిని మానసికంగా, విద్యాపరంగా చాలా దెబ్బతీస్తుంది. కొన్ని సెషన్ల థెరపీ అనంతరం రేచల్ బుల్లీయింగ్ నుంచి బయటపడి, తిరిగి తన సంతోషాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది.ఎలా ఎదుర్కోవాలి?బుల్లీయింగ్ ఎదురైనప్పుడు పిల్లలు కొన్ని చిట్కాలు పాటించాలి. పేరెంట్స్ అండగా నిలవాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. – మీ బలాలు, ప్రతిభను గుర్తించండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ను ప్రాక్టీస్ చేయండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. – ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకునేందుకు బ్రీతింగ్, రిలాక్సేషన్, మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయండి. – మీ భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకోండి. – మీకు మద్దతుగా ఉండే స్నేహితుల సహాయం తీసుకోండి. – బుల్లీయింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులకు దూరంగా ఉండండి. – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.పేరెంట్స్ ఏం చేయాలి?– మీ పిల్లలు అన్ని ఫీలింగ్స్, అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడేలా, పంచుకునేలా ప్రోత్సహించండి.– శారీరక, మౌఖిక, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి. – బుల్లీయింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. – కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ టెక్నిక్ట్స్ ప్రాక్టీస్ చేయించండి. – తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. – బుల్లీయింగ్ గురించి టీచర్స్తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. – బుల్లీయింగ్ వల్ల మీ బిడ్డ ఎమోషనల్గా బాధపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఫ్యామిలీ థెరపీ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయం చేస్తారు.ఎందుకు బెదిరిస్తారు? ప్రతి వ్యక్తీ గుర్తింపును కోరుకుంటారు. ఆటలు, మాటలు, పాటలు, ప్రవర్తన లేదా ప్రతిభ ద్వారా గుర్తింపును సాధించుకుంటారు. అవేమీ లేనివారు ఇతరులను ఏడిపించడం ద్వారా గుర్తింపును సాధించాలనుకుంటారు. అయితే ఎవ్వరూ అలా పుట్టరు. రెండు మూడేళ్ల వయసులో పిల్లల దూకుడు ప్రవర్తనను నియంత్రించకపోతే వారు పెద్దయ్యాక ఇతరులను బెదిరించేవారిగా మారవచ్చు. వారిని అలాగే వదిలేస్తే వారిలో నేరప్రవృత్తి పెరిగి భార్యాపిల్లలను కొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పిల్లలకు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం.ఎందుకు ఆపరు?బుల్లీయింగ్ను చాలామంది గమనించినా ఆపే ప్రయత్నం చేయరు. ఆపితే తమను కూడా టార్గెట్ చేస్తారని భయపడతారు. కొందరు తాము చేయలేనిదాన్ని వాళ్లు చేస్తున్నారని చూసి ఆనందిస్తారు. మరికొందరు దాన్ని ఫన్లా తీసుకుని నవ్వుతారు. ఈ మౌనం, నవ్వు ఎగతాళి చేసేవారికి ప్రోత్సాహకంగా మారుతుంది. ఇక సైబర్ బుల్లీయింగ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రోల్ చేయడమే ప్రధానంగా సోషల్ మీడియా పేజీలు, వీడియోలు రావడం, వాటిని పలువురు షేర్ చేయడం గమనించవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
విపరీతమైన నడుము నొప్పా? సరైన ట్రీట్మెంట్ కోసం..
-
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ప్రెగ్నెన్సీలో.. గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా?
నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సివియర్ గ్యాస్ట్రైటిస్తో డాక్టర్ దగ్గరకి వెళితే Hiatus Hernia అని డయాగ్నోస్ చేశారు. నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దీనివల్ల ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువవుతాయా? మందులు వాడకూడదు అంటారు కదా.. మరి ప్రెగ్నెన్సీలో గ్యాస్ ట్రీట్మెంట్ ఎలా? – పేరు, ఊరు రాయలేదు.Hiatus Hernia అనేది చాలా కామన్. మామూలుగా పొట్టకి, ఆహారనాళానికి మధ్య డయాఫ్రమ్ అనే రెస్పిరేటరీ కండరం.. జంక్షన్ని టైట్గా క్లోజ్ చేసి పెడుతుంది. ఈ గ్యాప్ వదులైనప్పుడు పొట్టలోని యాసిడ్స్ ఆహారనాళంలో పైకి వచ్చి గ్యాస్, ఎసిడిటీ, వాంతులను ప్రేరేపిస్తాయి. అధిక బరువు, ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్లో ఈ గ్యాప్ ఎక్కువై గ్యాస్ ప్రాబ్లమ్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది వీక్ కూడా కావచ్చు.ప్రెగ్నెన్సీలో యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఇప్పటి నుంచే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీని మేనేజ్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో మందులు వాడే అవసరం తగ్గించుకోవాలి. ఎసిడిటీని పెంచే ఆహారం అంటే ఆరేంజ్ జ్యూస్, టొమాటో సాస్, సోడా వంటివి అవాయిడ్ చేయాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, వెనిగర్, చాక్లెట్స్, కాఫీలు తగ్గించాలి. కొంచెం కొంచెం ఆహారాన్ని నెమ్మదిగా.. ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకుండా.. మూడు నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తల కింద ఎత్తు పెట్టుకుని పడుకోవాలి. రాత్రి భోజనం పెందరాళే ముగించాలి. స్కాన్ చేసి.. హెర్నియా పెద్దగా ఉందని కనుక చెబితే.. కొంతమందికి డాక్టర్లు సర్జరీని సూచిస్తారు. లాపరోస్కోప్ ద్వారా చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో గుండెలో మంట, ఎసిడిటీ ఎక్కువుంటే సురక్షితమైన కొన్ని సిరప్లు, జెల్స్, మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు.మొదటి మూడునెలల్లో వీటి అవసరం ఎక్కువుంటుంది. యాంటాసిడ్ జెల్స్ చాలావరకు రిలీఫ్నిస్తాయి. జీవనశైలి మార్పులతోనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. నెలలు నిండే కొద్ది ముఖ్యంగా చివరి మూడు నెలల్లో బిడ్డ బరువుతో ఈ ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీకి ఇబ్బంది కలగొచ్చు. అలాంటప్పుడు భోజన వేళలను సర్దుబాటు చేసుకోవడంతో పాటు డైటీషియన్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెల్ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.‘మా పాపకు ఇన్స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.‘స్కూల్కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్ ఫిర్యాదు.‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్ఫోన్లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.సోషల్ మీడియాతోనే చిక్కు..పిల్లల మీద స్మార్ట్ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.సమస్య ఎక్కడ మొదలైంది?ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్ఫోన్ వలలో చిక్కుకుపోయారు.మారకపోతే ప్రమాదమే..ప్రస్తుతం స్మార్ట్ఫోన్లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.ఐదు అంచెల్లో పరిష్కారం..1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది.2. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్ఫోన్దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్ఫోన్ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.4. స్మార్ట్ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ల కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.5. పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.– సైకాలజిస్ట్ విశేష్ -
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలిప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.అవి శరీరంలోకి ఇన్సర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్ను విడుదల చేస్తూ బ్లీడింగ్ని తగ్గిస్తుంది.ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్ను సూచిస్తారు. అవుట్ పేషంట్గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, హైదారాబాద్ -
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రీషియన్, హైదారాబాద్ -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్తోనే డ్రెస్సింగ్ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్ను స్కూల్కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్కు వెళ్ళారు. పేరెంట్స్తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి మాత్రల ద్వారా హార్మోన్స్ను రీప్లేస్ చేయవచ్చా? – జి. సోనీ, సిద్ధిపేటమెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు.ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు.ఒకవేళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్ను సింగిల్ డోస్గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు, బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా.ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??
నాకు 35 ఏళ్లు. చాలా రోజులుగా లోయర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? ఎక్సర్సైజెస్తో మేనేజ్ చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి.. ఎలాంటివి చేయకూడదు? – వి. శుభదా, హైదరాబాద్లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఆలస్యం చేయడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. స్పైన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్, జాయింట్స్, మజిల్స్ ఉండి.. దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కదలికలతోనే స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి పూర్తిగా విశ్రాంతి ఇస్తే కదలికలు తగ్గి ఇంకా పెయిన్ పెరిగే ప్రమాదం ఉంటుంది.రెండు రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. స్పెషలిస్ట్ని సంప్రదించి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మొబిలిటి పెరిగే వ్యాయామాలు చేయాలి. జాయింట్స్ బిగుసుకుపోకుండా చూసుకోవాలి. జాయింట్స్ స్టిఫ్గా అయిపోతే బ్యాక్ పెయిన్ మరింత ఎక్కువవుతుంది. యాక్టివ్గా ఉంటే కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్ వంటివి చేయొచ్చు. Knee రోలింగ్, Knee to Chest, పెల్విక్ టిల్ట్స్ వంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి.ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో ప్రయత్నించాలి. కొంచెం నొప్పి తగ్గాక బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్ల కిందిభాగంలో రెండు పిల్లోస్ని, బోర్లా పడుకునే అలవాటున్నవారు పొట్టకింద రెండు పిల్లోస్, పక్కకు తిరిగి పడుకునేవారు రెండు మోకాళ్ల మధ్యలో ఒక పిల్లోను సపోర్ట్గా పెట్టుకోవాలి. అలాగే కూర్చుని ఉన్నప్పుడు నడుము వెనకభాగంలో పిల్లోని సపోర్ట్గా పెట్టుకోవాలి. లోయర్ బ్యాక్ పెయిన్ సూచనలు కనిపించగానే వెంటనే సంబంధిత డాక్టర్ని సంప్రదించాలి.మూత్ర విసర్జన కష్టమవుతున్నా, మలమూత్రాల మీద నియంత్రణ తప్పినా, మల ద్వారం దగ్గర నంబ్నెస్ ఉన్నా.. కాళ్లు నిస్సత్తువగా అనిపించినా.. తిమ్మిర్లున్నా, బాలెన్స్ తప్పుతున్నా, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉన్నా దగ్గర్లోని ఫిజీషియన్ని లేదా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. అవసరమైన టెస్ట్లు చేస్తారు. పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఇంట్లో ఎలాంటి చిట్కా వైద్యాలు చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.ఇవి చదవండి: విడిపోతామని భయంగా ఉంది! అసలు కారణమేంటి? -
Pariksha Pe Charcha 2024: అర నిమిషంలో నిద్రపోతా
న్యూఢిల్లీ: అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోతే అది మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థులను ప్రధాని మోదీ సున్నితంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఏడో విడత ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. వర్చువల్గా పాల్గొన్న కోట్లాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మోదీ విద్యార్థులకు చేసిన పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే.. అవసరం మేరకే ఫోన్ వాడతా ‘ జీవనశైలి సక్రమంగా ఉండాలంటే ఏదీ అతిగా ఉండొద్దు. అతి స్క్రీన్ టైమ్, రీల్స్ చూడటం మీ నిద్రాకాలాన్ని మింగేస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం నిద్ర అనేది అత్యంత కీలకం. అలాంటి నిద్ర తక్కువకాకుండా చూసుకోండి. నేనైతే అవసరమైన మేరకే ఫోన్ వాడతా. నిద్రకు ఉపక్రమించిన కేవలం 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకుంటా. రోజూ కొద్దిసేపు ఎండలో గడపండి. ఫోన్కు చార్జింగ్ లాగే పిల్లలకు పౌష్టికాహారం ముఖ్యం. ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉండండి. అప్పుడే చక్కగా చదవగలరు’’ అని అన్నారు. అలాంటి వారితో స్నేహం చేయండి ‘‘ చదువుల్లో బాగా కష్టపడుతూ, తెలివితేటలు ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయండి. అప్పుడే వారి నుంచి స్ఫూర్తి పొందగలరు. పేరెంట్స్కు నాదో సూచన. పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ మీకు విజిటింగ్ కార్డ్ కాదు. మీరు వెళ్లినచోట మీ పిల్లల చదువుసంధ్యల గురించి అతిగా మాట్లాడకండి. ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చి చూపకండి. ఇది మంచి పద్ధతి కాదు. పూజ చేసి కొత్త యూనిఫాం, స్టేషనరీ కొని పరీక్ష రోజును ప్రత్యేకమైన దినంగా మార్చేయకండి’’ అని చెప్పారు. చిన్న లక్ష్యాలతో మొదలెట్టండి ‘‘పిల్లలను మూడు ఒత్తిళ్లు ఇబ్బందిపెడతాయి. ఏకాగ్రత, తల్లిదండ్రుల ఒత్తిడి, ఆత్మవిశ్వాస లేమి. పరీక్షలకు ముందు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధిస్తూ మీ లక్ష్యాలను పెంచుకుంటూ పొండి. పరీక్షలు వచ్చేటప్పటికి సంసిద్ధమౌపోతారు. టీచర్–స్టూడెంట్ బంధం సిలబస్ పాఠాలకు అతీతమైనది. సిలబస్ చెబుతూనే సబ్జెక్ట్ పట్ల వారిలో భయాన్ని పొగొట్టండి. పిల్లలు బెరుకులేకుండా సందేహాలు అడిగేలా సౌమ్యంగా మెలగండి. బోధనను ఒక వృత్తిగా కాకుండా విద్యార్థుల భవతను తీర్చిదిద్దే యజ్ఞంగా భావించండి’’ అని అన్నారు. నాక్కూడా పరీక్ష లాంటిది ‘‘పరీక్ష పే చర్చా నాకూ ఓ పరీక్ష. ఎందుకంటే నేటితరం విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఎక్కువయ్యాయి. వినూత్నంగా ప్రధాని ఈసారి ఏం చెప్తారా? అనుకునే విద్యార్థులకు తగ్గట్లు నేనూ ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రావాలికదా’’ అన్నారు. ఇంట్లో నో గాడ్జెట్ జోన్ ‘‘ తల్లిదండ్రులకు నాదో సలహా. టెక్నాలజీ నుంచి దూరం జరగలేం. అలాగని అతక్కుపోవడమూ సబబు కాదు. భోజనం చేసేటపుడు గాడ్జెట్ వాడొద్దనే నియమం పెట్టండి. ఏ యాప్ వాడినా స్క్రీన్ టైమ్ పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చారు. ఈ ఏడాది 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం. -
Lok Sabha elections 2024: మేనిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పొందిన సలహాలు, సూచనలకు అనుగుణంగా ఈసారి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధంచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు పంపాల్సిన ఈమెయిల్, వెబ్సైట్లను బుధవారం ఆవిష్కరించింది. awaazbharatki.in వెబ్సైట్కు ఓటర్లు తమ సూచనలను పంపొచ్చు. awaazbharatki@inc.in. మెయిల్ ఐడీకి సైతం దేశ ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చు. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఛైర్మన్గా ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇలా సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, సమూహాలు, సంస్థల నుంచి సలహాలు సూచనలను కోరుతోంది. ‘ప్రజాభీష్టానికి అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది’’ అని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ దేవ్ స్పష్టంచేశారు. -
జమిలి ఎన్నికలు... కోవింద్ కమిటీకి 5,000 సూచనలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. -
One Nation, One Election: జమిలి ఎన్నికలపై సూచనలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలివ్వాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ కమిటీ ప్రజలను కోరింది. దేశంలో లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్ట పరమైన పరిపాలనా ఫ్రేమ్వర్క్లో చేపట్టాల్సిన మార్పులను తెలపాలని పిలుపునిచ్చింది. జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలను పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. సూచనలను onoe.gov.in వెబ్సైట్లో పోస్టు చేయాలని సూచించింది. లేదా sc& hlc@gov.in కి మెయిల్ చేయవచ్చని వివరించింది. ఈ నోటీసును ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు పంపినట్లు తెలిపింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామంది. -
వర్షాభావ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటలు రైతులకు సూచనలు..
-
స్నాప్చాట్ వాడుతున్నారా?తస్మాత్ జాగ్రత్తా! లేదంటే..
స్నాప్చాట్ అనేది ఈ రోజుల్లో టీనేజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న మోడర్న్ మెసేజింగ్ యాప్. ఇందులో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్నాప్లుగా వర్చుకుంటారు. మన ఫ్రెండ్స్ జాబితాలోని వారు వాటిని చూసిన తర్వాత అవి అదృశ్యమవుతాయి. స్నేహితులతో కనెక్ట్ అవడం, గేమ్స్, న్యూస్, వినోదం, క్విజ్లు, వినూత్న ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వివిధ ఫీచర్లను ఇది అందిస్తుంది. ఈ ఫీచర్లు, దాని ఇంటరాక్టివ్ నేచర్, సృజనాత్మకత కారణంగా స్నాప్చాట్ వినియోగదారులను... ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. స్నాప్చాట్ అకౌంట్.. హ్యాకింగ్, సెక్సార్షన్, సైబర్ బెదిరింపు, మోసం వంటి వివిధ సైబర్ నేరాలకు అవకాశం ఇచ్చేలా ఉంది. ఇవి యూజర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి. స్నాప్చాట్ సురక్షితంగా ఉండటానికి, వినియోగదారులు పటిష్టమైన భద్రతా పద్ధతులను అమలుచేయోలి. గోప్యతా సెట్టింగ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే, కంటెంట్ను షేర్ చేసేటప్పుడు, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే స్నాప్చాట్ సంబంధిత అధికారులకు నివేదించాలి. తరచూ జరిగే నేరాలు ఇది వర్చువల్ దండయాత్రగా చెప్పుకోవచ్చు. స్నాప్చాట్ అకౌంట్ హ్యాకింగ్ అనేది ప్రధానంగా ఉన్న సైబర్నేరం. దీనివల్ల బాధితులు వివిధ రకాల దోపిడీకి గురవుతారు. హ్యాకర్లు యూజర్ ఖాతాలకు అనధికారక యాక్సెస్ను పొందడానికి ఫిషింగ్, కీ లాగింగ్ లేదా బ్రూట్ ఫోర్స్ దాడులు వంటి అనేక రకాల టెక్నాలజీలను ఉయోగిస్తారు. ఒకసారి రాజీ పడితే హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. హానికరమైన సందేశాలను పంపవచ్చు. లేదా తదుపరి నేరాలకు పాల్పడేందుకు యూజర్లా నటించవచ్చు. సెక్స్టార్షన్ అనేది ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం. సైబర్ నేరగాళ్లు అభ్యంతరకరమైన కంటెంట్ను పంపేలా బలవంతం చేయడం ద్వారా బాధితుల నమ్మకాన్ని దోపిడీ చేస్తారు. ఇక్కడ నుంచి తరచుగా ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే విషయాన్ని బహిరంగంగా విడుదల చేస్తామని లేదా బాధితుడి పరిచయాలకు షేర్ చేస్తామని బెదిరిస్తారు. దీంతో బాధితులు తీవ్ర ఒత్తిడితో కూడిన పరిణామాలను ఎదుర్కొంటారు. స్నాప్చాట్ మెసేజ్ల ద్వారా సైబర్ బెదిరింపుల నుంచి విముక్తి లభించదు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వేధించే, బెదిరించే లేదా ద్వేషపూరిత కంటెంట్ను వ్యాప్తి చేసే హానికరమైన వినియోగదారులకు ఈ ప్లాట్ఫారమ్ బ్రీడింగ్ గ్రౌండ్గా పనిచేస్తుంది. స్నాప్చాట్ సైబర్ బెదిరింపు తీవ్రమైన వనసిక క్షోభకు దారి తీస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తుల నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడానికి స్నాప్చాట్ సులువుగా అనుమతిస్తుంది. దీనిని సాధారణంగా క్యాట్ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ మోసగాళ్లు యూజర్లను తప్పుడు సంబంధాలు లేదా స్నేహాలలోకి ఆకర్షిస్తారు. కల్పిత కథలు, దొంగిలించిన చిత్రాలతో మోసగిస్తారు. ఈ విధానాల వల్ల తీవ్ర ఒత్తిడితో అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ∙స్నాప్చాట్ మెసేజ్లు వెంటనే అదృశ్యమై, అభద్రతా భావాన్ని సృష్టించగలదు. ఈ విషయంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. స్క్రీన్షాట్లు, అనధికారిక అప్లికేషన్లు, వ్యక్తిగత కంటెంట్ను క్యాప్చర్ చేయగలవు. ఒకసారి లీక్ అయితే, ఆ వ్యక్తి ప్రతిష్టకు తన వ్యక్తిగత జీవితానికి కోలుకోలేని నష్టం కలిగిస్తుంది. కొన్ని భద్రతా చిట్కాలు ∙మీ కంఫర్ట్ లెవల్కు అనుగుణంగా ఉండే సెట్టింగ్లను ఎంచుకోండి. నమ్మదగిన స్నేహితులకు మాత్రమే యాక్సెస్ని పరిమితం చేయండి. నిజజీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులను మాత్రమే అనుమతించండి. హాని కలిగించే అపరిచితుల రిక్వెస్ట్ను యాడ్ చేయడం మానుకోండి. లైంగికపరమైన కంటెంట్ను షేర్ చేయడాన్ని నివారించండి. ∙మీ సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున మీ పూర్తి పేరు, చిరునావ, ఫోన్ నంబర్ లేదా ఆర్థిక వివరాలను స్నాప్చాట్లో షేర్ చేయవద్దు. స్నాప్చాట్ నుండి ఎవరినైనా కలవాలని నిర్ణయించుకుంటే పబ్లిక్ లొకేషన్ను మాత్రమే ఎంచుకోండి. ∙తెలియని షార్ట్ లింక్లపై క్లిక్ చేయడం లేదా అనుచిత మెసేజ్లకు ప్రతిస్పందిస్త వ్యక్తిగత సవచారాన్ని అందించడం మానుకోండి. స్నాప్ చాట్ లేదా చట్టబద్ధమైన కంపెనీలు... యాప్ ద్వారా మీ లాగిన్ ఆధారాలను లేదా వ్యక్తిగత వివరాలను ఎన్నటికీ అడగవు. స్నాప్చాట్ రీసెంట్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. దీని ద్వారా దోపిడీ ప్రమాదాన్ని నివారించవచ్చు. స్నాప్ మ్యాప్ ఫీచర్ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది మీరున్న ప్లేస్ను అకౌంట్లోని స్నేహితులకు చపుతుంది. అందుకుని మ్యాప్ ఫీచర్ను స్టాప్ చేయండి. స్పాప్చాట్ ద్వారా సైబర్నేరానికి గురైతే వెంటనే.. https://help.snapchat.com/hc/en-us/articles/7012399221652-How-to-Report-Abuse-on-Snapchat పోర్ట్ చేయాలి. అదేవిధంగా, సమస్య పరిష్కారానికిhttps://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌఫౌండేషన్ (చదవండి: ఓ నది హఠాత్తుగా నీలం, నారింజ రంగులో మారిపోయింది! ఎక్కడంటే) -
‘ఉమ్మడి’పై న్యాయ కమిషన్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై 22వ న్యాయ కమిషన్ బుధవారం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. ప్రజలతోపాటు గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను సేకరిస్తోంది. 21వ న్యాయ కమిషన్ గతంలో సంప్రదింపులు జరిపింది. ఈ కమిషన్ కాలపరిమితి 2018 ఆగస్టులో ముగిసింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది అత్యంత సున్నితమైన అంశం కావడంతో తాజాగా మరోసారి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్ని నిర్ణయానికి 22వ న్యాయ కమిషన్ వచ్చింది. -
రూ. కోటి ఉంది, నెలకు లక్ష రూపాయలు కావాలంటే ఎలా?
నేను మరో 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను. రూ.2.5 - 3 కోట్ల బడ్జెట్లో ఇల్లు కొనాలన్నది నా ఆలోచన. గృహ రుణం తీసుకునే విషయంలో నా వంతు డౌన్ పేమెంట్ను సమకూర్చుకోవాలి కదా. వచ్చే 10 - 15 ఏళ్లలో గృహ రుణం డౌన్ పేమెంట్ను సమకూర్చుకునేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? టాటా స్మాల్ క్యాప్ లేదా, మిరే అస్సెట్ మిడ్క్యాప్ ఫండ్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్క్యాప్ ఫండ్ పథకాలు నా డౌన్ పేమెంట్కు అనుకూలమైనా..? – ఆదిత్య బి 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేద్దామన్న నిర్ణయం సరైన దారిలోనే ఉంది. మీ పెట్టుబడులు వృద్ధి చెందడానికి సరిపడా సమయం మీ చేతుల్లో ఉంది. ఈ కాలంలో ఈక్విటీ పథకాల నుంచి సహేతుక రాబడులు వస్తాయని ఆశించొచ్చు. తద్వారా గృహ కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ను సమకూర్చుకోవచ్చు. మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొనుగోలు చేద్దామనుకుంటున్న ఇంటి బడ్జెట్ రూ.2.5 - 3 కోట్లు అని చెప్పారు కదా. ఇది నేటి ధరల ఆధారంగా అంచనా వేశారా? అయితే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. అప్పుడు 10 - 15 ఏళ్ల తర్వాత ఇల్లు కొనుగోలుకు అసలు ఎంత అవుతుందన్న వాస్తవ అంచనాకు రావడానికి ఉంటుంది. ఆ తర్వాత నెలవారీ సిప్ మొత్తాన్ని రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి నుంచి రెండు వరకు మిడ్, స్మాల్క్యాప్ పథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే మిడ్, స్మాల్క్యాప్ అన్నవి మొత్తం పోర్ట్ఫోలియోలో 25 - 30 శాతం మించి ఉండకూడదు. మీ పోర్ట్ఫోలియోలో ఏ పథకాలు ఉండాలన్నది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఈక్విటీ పెట్టుబడుల్లో మీకున్న అనుభవం కీలకంగా మారతాయి. ఇల్లు కొనుగోలు చేయడం అన్నది ఆర్థికంగా అతిపెద్ద నిర్ణయం. కనుక చాలా జాగ్రత్తగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చాలా కేసుల్లో నివాసం ఉండేట్టు అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం న్యాయమే అవుతుంది. గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే రుణ బాధ్యత. అలాగే, గృహ రుణానికి మీరు చెల్లించే ఈఎంఐ అన్నది నెలవారీ నికరంగా చేతికి అందుకునే మొత్తంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. పెట్టుబడి కోణంలో అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాబోదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ తక్కువ. కొనుగోలు, విక్రయం వేగంగా సాధ్యపడదు. డబ్బులు కావాలంటే వెంటనే అడిగిన రేటుకు విక్రయించాల్సి వస్తుంది. అధిక విలువ కలిగిన ఇంటిని అమ్మడం అంత సులభమైన విషయం కాదు. నా వయసు 59 ఏళ్లు. వచ్చే నెలలో పదవీ విరమణ తీసుకోబుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత నా వద్ద రూ.కోటి నిధి ఉంటుంది. నెలవారీ ఖర్చులు రూ.లక్ష వరకు ఉంటాయి. కనుక నా వద్ద ఉండే రూ.కోటిని నెలనెలా రూ.లక్ష వచ్చేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో సూచించగలరు. – భానుప్రకాశ్ మీరు రూ.కోటి పెట్టుబడిపై ప్రతి నెలా రూ.లక్ష ఆదాయం కోరుకుంటున్నారు. అంటే వార్షిక రాబడి 12 శాతం ఉండాలి. ఈ స్థాయి రాబడి అన్నది ఈక్విటీలలో, అదీ దీర్ఘకాలంలోనే (ఏడేళ్లకు మించి) సాధ్యపడతాయి. ఏటా ఇదే స్థాయిలో ఈక్విటీలు కూడా రాబడులు ఇస్తాయని గ్యారంటీ ఉండదు. అలాగే, ఒక ఏడాదిలో వచ్చిన రాబడులన్నింటినీ వినియోగించుకోకూడదు. మీ పెట్టుబడి నిధి ద్రవ్యోల్బణ ప్రభావం (5 - 6 శాతం) మేర ఏటా వృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే కావాల్సినంత మొత్తం సమకూర్చుకోగలరు. ఉదాహరణకు మీ రూ.కోటి నిధి.. ఐదు, ఏడేళ్ల తర్వాత కూడా అక్కడే ఉంటే.. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల అప్పటికి నెలవారీగా రూ.లక్ష ఆదాయం సరిపోదు. పెరిగే ధరలకు అనుగుణంగా మీకు మరింత మొత్తం ఆదాయం వచ్చేంత నిధి ఉండాలి. కనుక మీ పెట్టుబడిపై వచ్చే రాబడిలో కొంత మొత్తాన్ని అక్కడే వృద్ధి చెందేందుకు వీలుగా ఉంచేయాలి. మీ విషయంలో మీరు ఆశించే రాబడి రేటు ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించుకోండి. మీరు కోరుకున్నట్టు ప్రతి నెలా రూ.లక్ష చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే.. మీ వద్దనున్న పొదుపు నిధి కూడా తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణం అధిగమించి నిధి వృద్ధి చెందాలంటే.. పెట్టుబడి నుంచి రాబడి 6 శాతానికి మించి ఉపసంహరించుకోకూడదు. అంటే రూ.కోటి నిధిపై ఏటా రూ.6 లక్షల వరకే ఉపసంహరించుకోవాలి. పెట్టుబడి నిధిలో మూడింట ఒక వంతును ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన రెండు భాగాలకు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించుకోవాలి. ప్రభుత్వ హామీ ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవో ఎంఐఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎం వీవీవై) పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో పీఎం వీవీవై, ఎస్సీఎస్ఎస్ 8 శాతం రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో పీఎం వీవీవై ఈ ఏడాది మార్చితో ముగియనుంది. ఈ పథకాలకు కేటాయించుకోగా మిగిలే మొత్తాన్ని అధిక నాణ్యత కలిగిన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్ స్పీడే.. దూసుకుపోతుందంతే..!
ప్రతీ గ్రాడ్యుయేట్కు ఒక లెక్క ఉంటుంది.. 4 సంవత్సరాల ప్రిపరేషన్, పరీక్షల తర్వాత, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి కెరీర్ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాబ్ మార్కెట్ను ఛేదించే సామర్థ్యం తమకు ఉందని నమ్ముతారు. కానీ ప్రస్తుత వాతావరణంలో ’ఫ్రెషర్’ లేబుల్ చాలా మంది గ్రాడ్యుయేట్లకు అడ్డంకి మారుతోంది. ఫ్రెషర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా సంస్థల యాజమాన్యాలు అప్పటికే నిరూపితమైన ట్రాక్ రికార్డ్లు కలిగిన సిబ్బందిని కోరుకుంటాయి. ఎందుకంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఫ్రెషర్ల వల్ల అయ్యే తక్కువ నియామక ఖర్చుల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు తరగతి గదిలో సంస్థాగత గత విధులు నేర్చుకోలేరు. అది అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. అందుకే గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్ అస్థిరత అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో పోస్ట్–పాండమిక్ జాబ్ మార్కెట్ లో కష్టతరమైన పరిస్థితులను ఫ్రెషర్లు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తమ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నాయి లేదా కొత్త, మరింత కఠినమైన నియామక పద్ధతుల నేపథ్యంలో తమ రిక్రూట్మెంట్ను ఆలస్యం చేస్తున్నాయి, దీనివల్ల వీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్యమే.. విజయం.. ఫ్రెషర్లు కెరీర్ వేటలో ఉన్నప్పుడే మరింత ఎక్కువ నైపుణ్యత సాధించి, పోటీని దూరం చేయవచ్చు, ఆకర్షణీయమైన సామర్ధ్యాల పోర్ట్ఫోలియోను రూపొందించడం ద్వారా అడ్డంకులను దాటవేయవచ్చు. గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం పెంచుకోవడంలో వ్యయ ప్రయాసలను పెట్టుబడి పెట్టే వారు తోటివారి కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ ఇంక్రిమెంట్లను పొందుతారు. మిగతా వారి కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్య్రం పొందుతారు. ఆధునిక జాబ్ మార్కెట్ నైపుణ్యం రీస్కిల్లింగ్ను చాలా ముఖ్యంగా పరిగణిస్తుంది. ఎంపిక జాగ్రత్త.. వ్యక్తిగత సామర్ధ్యాల గురించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఫైనాన్స్ టెక్నాలజీ పరిశ్రమలు అధిక జీతాలను అందించేవిగా పరిగణించబడుతున్నాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్తో, ముఖ్యంగా డేటా సైన్స్, బ్లాక్చెయిన్ టెక్నాలజీ హాటెస్ట్ సెక్టార్లలో ఒకటిగా ఉద్భవించింది. గత 2022లో, డేటా సైన్స్లో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల 2040 నాటికి వారి జీతం 57.9 ఎల్పిఎకి.. నైపుణ్యం లేని వారి తోటివారి కంటే 3 రెట్లకు చేరుకునే అవకాశం ఉందని గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా, 2022లో నైపుణ్యం పెంచుకునే మార్కెటింగ్ ప్రొఫెషనల్ 10 సంవత్సరాల వ్యవధిలో వారి తోటివారి కంటే 100 శాతం ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఆధునిక–యుగపు నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిపుణుడు తోటివారి కంటే 4రెట్ల వరకు సంపాదించగలరు. నైపుణ్యం లేని ఒక ప్రొఫెషనల్ వారి పదవీ విరమణ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం 60 సంవత్సరాల ఆగాల్సి వస్తే... నైపుణ్యం కలిగిన నిపుణులు 50 సంవత్సరాల వయస్సులోపే వారి పదవీ విరమణ నిధిని కూడబెట్టుకుంటారు. పేపర్ పులి కావద్దు... కేవలం కాగితంపై స్కిల్స్ థృవీకరణ పొందడం కంటే వాస్తవిక సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సమయం, డబ్బుపై సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సాధించడానికి, పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అందించే ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం చాలా అవసరం. ఈ ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. నియామక కంపెనీలతో అనేక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్లు కనెక్షన్లను కలిగి ఉన్నాయి. నెట్వర్క్ పెంచుకోండి.. సామాజిక వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడం అవసరం. ఇది అప్స్కిల్లింగ్లో తరచుగా చాలా మంది పట్టించుకోని అంశం. పరిశ్రమ డొమైన్లో అభ్యర్థి తమ నైపుణ్యం సెట్లను అప్డేట్ చేసిన తర్వాత, తదుపరి దశలో తోటి అభ్యాసకుల ద్వారా పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం అలాగే ఉపాధి–కేంద్రీకృత ఆన్లైన్ ప్లాట్ఫామ్లను తరచుగా పరిశీలించాలి. అలాగే సృజనాత్మకతను, వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడే సోషల్ నెట్వర్క్ను రూపొందించుకోవాలి. ఒకే రకపు ఆలోచన కలిగిన నిపుణులతో పరస్పర చర్చలు చేయాలి. నైపుణ్యాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోకపోవచ్చు; వాటిని ప్రదర్శించాలి ఎందుకు మీరు అర్హత పొందారో చూపించాలి: అందుబాటులో ఉన్న టూల్స్ ను నేర్చుకోవడం ద్వారా వాటి ప్రయోజనాన్ని పొందాలి. గ్రూపులు ఫోరమ్లలో చేరాలి. అలాగే వివిధ ఈవెంట్లలో పాల్గొనాలి. సుస్థిరమైన సభ్యుల గ్లోబల్ నెట్వర్క్తో కనెక్ట్ కావాలి. పరిశ్రమకు సంబంధించిన ప్రోగ్రామ్లు, హ్యాకథాన్లు సమ్మిట్ల వంటి లైవ్ ప్రాజెక్ట్లలో పాల్గొనడం ద్వారా నెట్వర్కింగ్ను బలోపేతం చేసుకోవాలి. పోర్ట్ఫోలియో... ఓ గుర్తింపు. పోర్ట్ఫోలియో అనేది మీ గుర్తింపు, మీరు వ్యక్తిగతంగా కాబోయే యజమానిని కలిసే ముందు అది మీ గురించి చెబుతుంది. అలాగే, ఆధునిక, సమకాలీనమైన మీ ప్రతిభ సామర్థ్యాలపై అంతర్గత వీక్షణను అందించగల నిర్దిష్ట డాక్యుమెంటు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ అనుభవాలను వివరించాలి. మీ విజయాలను ప్రదర్శించడానికి వెనుకాడకండి. ప్రాజెక్ట్లలో మీరు చూపించిన డైరెక్ట్ రిజల్టులను హైలైట్ చేయండి, పురోగతి భావాన్ని, విజయం సాధించాలనే ఆరాటాన్ని ప్రదర్శించండి. మీరు ఎంచుకున్న నైపుణ్యాలతో సివిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. –హరికృష్ణన్ నాయర్, కో ఫౌండర్, గ్రేట్ లెర్నింగ్ -
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. కీలక సూచనలివే!
సాక్షి, అమరావతి: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.03 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. అవి.. ► అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. ► అభ్యర్థులను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు. ► ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. ► మొబైల్ ఫోన్/సెల్యూలార్ ఫోన్, ట్యాబ్/ల్యాప్టాప్, పెన్డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు/రికార్డింగ్ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షకేంద్రం వద్దకు తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. ► అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి. ► హాల్టికెట్, బ్లూ/బ్లాక్ బాల్పాయింట్ పెన్ తీసుకురావాలి. -
FRAI: చిన్న వర్తకుల పొట్ట గొడుతున్న నకిలీలు
గువహటి: చిన్న వర్తుకుల పొట్టగొడుతూ, ప్రభుత్వాల పన్ను ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. రోజువా రీ వినియోగించే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరింది. 2023–24 బడ్జెట్కు ముందు ఈ మేరకు తన డిమాండ్లను తెలియజేసింది. ఈ సమాఖ్య పరిధిలో 42 రిటైలర్స్ అసోసియేషన్లు భాగంగా ఉన్నాయి. వీటి పరిధిలో 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి రిటైల్ వర్తకులు సభ్యులుగా ఉన్నారు. నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు అక్రమ వాణిజ్యానికి వీలు కల్పిస్తున్నట్టు ఈ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రిటైల్ వర్తకులు ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసే నేరస్థులతో పోరాడాల్సి వస్తోందని ఎఫ్ఆర్ఏఐ పేర్కొంది. ‘‘80 లక్షల మంది రిటైల్ వర్తకుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. ఈ వర్తకులు అందరూ బిస్క ట్లు, సాఫ్ డ్రింక్లు, మినరల్ వాటర్, కన్ఫెక్షనరీలు, సిగరెట్లు తదితర వస్తువుల విక్రయంతో జీవనోపాధి పొందుతున్న వారే’’అని సమాఖ్య తెలిపింది. 25–30 శాతం నకిలీలే.. ‘‘చిన్న వర్తకులు కరోనా మహమ్మారికి ముందు నెలవారీగా రూ.6,000–12,000 సంపాదించే వారు. కొంచెం పెద్ద వర్తకులు, మధ్యస్థాయి రిటైలర్లు రోజువారీ ఆదాయం రూ.400–500 వరకు ఉండేది. సూక్ష్మ వర్తకుల ఆదాయం రోజుకు రూ.200గా ఉండేది. కానీ, కొంత కాలంగా మా వర్తకులు విక్రయించే ఉత్పత్తులు పోలిన నకిలీ ఉత్పత్తులు, అక్రమంగా రవాణా (పన్నులు కట్టని) అయినవి మార్కెట్లో పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి సులభంగా లభిస్తున్నాయి. వీటి వాటా 25–30 శాతంగా ఉంటుంది’’అని ఎఫ్ఆర్ఏఐ ప్రెసిడెంట్ రామ్ అస్రే మిశ్రా తెలిపారు. ఎఫ్ఆర్ఐఏలో సభ్యులుగా ఉన్న వర్తకుల్లో ఎక్కువ మంది చదువుకోని వారేనని, ఆర్థికంగా దిగువ స్థాయిలోని వారిగా పేర్కొంది. ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు వివరించింది. వారి కుటుంబాలకు ఇదే జీవనాధారమని పేర్కొంటూ.. నేరగాళ్లు అక్రమ, నకిలీ ఉత్పత్తులతో తమ ఉపాధికి గండి కొట్టడమే కాకుండా, ప్రభుత్వానికి పన్ను రాకుండా చేస్తున్నట్టు సమాఖ్య తన వినతిపత్రంలో పేర్కొంది. చిన్న వర్తకులు నకిలీ, అక్రమార్కులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. మనదేశంలో తయారైన నిత్యావసర వినియోగ వస్తువలపై అధిక పన్నులే అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నందున.. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా చిన్న వర్తకులను ఆదుకోవాలని కోరింది. ఖజానా ఆదాయానికి గండి.. ‘‘అక్రమార్గాల్లో తీసుకొచ్చిన, నకిలీ ఉత్పత్తులు పూర్తిగా పన్నులు ఎగ్గొట్టేవి. అవి చట్టబద్ధమైన ఉత్పత్తులతో పోలిస్తే సగం ధరకే లేదంటే మూడింట ఒక వంతు ధరకే లభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయం రాకుండా పోతోంది’’అని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు సిగరెట్లను ప్రస్తావించింది. 84ఎంఎం పొడువు ఉండే 20 సిగరెట్ల ప్యాకెట్ చట్టబద్ధమైన ధర రూ.300 అయితే, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన ఇదే మాదిరి ఉత్పత్తి రూ.80–150 ధరకే వినియోగదారులకు లభిస్తోందని తెలిపింది. -
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్లోని ఉదయపూర్లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
పన్నులపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో తగు సూచనలు చేయాలంటూ పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ అసోసియేషన్లను కోరింది. డిమాండ్లతో పాటు వాటి వెనుక గల హేతుబద్ధతను కూడా వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. సుంకాల స్వరూపం, పన్నుల రేట్లు మొదలైన వాటిల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సిఫార్సులను పంపేందుకు నవంబర్ 5 ఆఖరు తేదీ. ప్రత్యక్ష పన్నుల రేట్లను క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, డిడక్షన్లు, మినహాయింపులు మొదలైనవి దశలవారీగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్పై ఆసక్తి నెలకొంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
దేశంలో పెరిగిపోతున్న చెక్ బౌన్స్ కేసులు, కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు దేశంలో భారీగా పెరిగిపోతుండడంపై దీనిని కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం, చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాలు ఈ మేరకు తెలిపిన సమాచారం ప్రకారం, ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణుల నుంచి పలు ప్రతిపాదనలు, సూచనలు అందాయి. వీటిలో ప్రధానమైనవి చూస్తే... ► చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇన్స్ట్రుమెంట్కు సంబంధించి అకౌంట్లో నిధులు తక్కువగా ఉన్నట్లయితే అతని లేదా ఆమె మరొక ఖాతా నుండి చెక్ అమౌంట్ డెబిట్ చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఒకటి. ► అలాగే నేరస్తులు కొత్త ఖాతాలను తెరవడాన్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందాయి. ► చెక్ బౌన్స్ను రుణ డిఫాల్ట్గా పరిగణించడం, నేరస్తుని స్కోర్ను అవసరమైనమేర డౌన్గ్రేడ్ చేయడం కోసం ఈ సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించడం కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ సూచనలను ఆమోదించే ముందు తగిన చట్టపరమైన సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా చర్యలు, బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా చెక్ బౌన్స్ కేసులను సమర్థవంతంగా తగ్గించవచ్చన్నది నిపుణుల సూచన. దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి. -
Sankranti: ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త.. ఈ విషయం మరిచారో అంతే..!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు వెళ్లే ఆయా కాలనీ, అపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో సంక్రాంతి సెలవుల్లో జరిగిన దొంగతనాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో గానీ, లాకర్లు లేని వారు వాటిని తమ బంధువుల ఇళ్ళలో భద్రపరుచుకోవాలి. అదే విధంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ ఊరికి ప్రయాణం కట్టిన పరిస్థితుల్లో తెలిసిన వారిని తమ ఇళ్లల్లో రాత్రివేళ పడుకునేలా చర్యలు తీసుకోవాలి. చదవండి: నుమాయిష్కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’ ఊరికి వెళుతున్న విషయాన్ని ప్రచారం చేసుకోకుండా ఉండటం మంచిది. కొందరు తమ వెంట బ్యాగుల్లో బంగారు ఆభరణాలతో బస్సుల్లో ప్రయాణం తలపెడతారు అటువంటి సమయంలో బస్సుల్లో కూడా దొంగతనాలు జరిగే అవకాశం సంఘటనలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికి వెళ్లే ముందు కిటికీలు, తలుపుల బోల్ట్లు, తాళాలు సరిగా వేసింది లేనిది మహిళలు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుంటే మంచిది. ఆర్ధిక స్థోమత ఉన్న వారు అలారం ఏర్పాటు చేసుకోవటంతో పాటు సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకుంటే మంచిది. సీసీ కెమెరాలు ఉన్నవారు ఆన్చేసి వెళ్లాలి. ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు ఈ పండుగ సెలవులు ముగిసే వరకు కొందరు యువకులతో రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చు. అపార్ట్మెంట్ల్లో సెక్యురిటీని పెంచుకోవాలి. వాటిలోకి వచ్చి పోయే వారి పేర్లు తప్పనిసరిగా నమోదు చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, గ్యాస్ స్టవ్ రిపేర్ పేరిట అపార్ట్మెంట్లకు వచ్చే కొత్త వ్యక్తులను అనుమతించ కూడదు. ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లే వారు పోలీస్స్టేషన్కు సమాచారం అందజేస్తే దొంగతనాలు జరగకుండా ఆయా గల్లీల్లో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టి గట్టి నిఘా ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ సూచనలు, సలహాలను సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊరుకు వెళ్లే ప్రతి ఒక్కరు పాటిస్తే మంచిది. ►ఊరు వెళ్లాల్సివస్తే విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. ►సెలవుల్లో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ, అలారం మోషన్ సెన్సార్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. ►తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వండి. ►కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. లేదా 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. ►వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయటంతో పాటు వీలైతే చక్రాలకు కూడా చైన్స్తో కూడిన తాళం వేయటం మర్చిపోవద్దు. ►ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ►సంక్రాంతి సెలవుల్లో ఊరుకు వెళుతున్న వారు ఇంటి బయట, ఇంటిలో కనీసం 1, 2 లైట్లు వేసి వుంటే మంచిది. ►ఇంటికి ఇరువైపులా నమ్మకమైన వారు ఉంటే మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లటం మంచిది. జాగ్రత్తలు పాటించాలి సంక్రాంతి సెలవుల్లో తమ స్వంత ఊరుకు వెళ్లే వారు ఇంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ఇరుగు పొరుగు వారికి తమ ఇంటిపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా దొంగతనాలను అరికట్టేందుకు ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలను పంపిణీ చేయటంతో పాటు కాలనీ అసోసియేషన్ సంక్షేమ సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నాం. –కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు -
జీవిత బీమా పాలసీకి ఈ నాలుగూ ఎంతో కీలకం
ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమాది కీలకపాత్ర. ఇతర ఆర్థిక సాధనాలు, పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు దీనికి ప్రాధాన్యమివ్వాలి. కరోనా వైరస్ మహమ్మారిపరంగా ఏదైనా మంచి జరిగిందంటే.. అది చాలా మంది తమ ఆర్థిక ప్రణాళికలు, జీవిత బీమా ప్రాధాన్యతలను గుర్తించడమే. వైవిధ్యభరితమైన ఆర్థిక సాధనంగా.. జీవితంలో వివిధ దశల్లో లక్ష్యాలను సాధించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతగానో అక్కరకొస్తుంది. జీవిత బీమా పాలసీలను ఆన్లైన్లో కూడా సులభతరంగా కొనుగోలు చేయడానికి వీలున్న ప్రస్తుత తరుణంలో.. పాలసీ ఎంపికలో గుర్తుంచుకోతగిన అంశాలు నాలుగు ఉన్నాయి. అవేంటంటే.. అంచనా వేసుకోవడం మీ జీవితంలో ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆకాంక్షలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉండవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు కావచ్చు.. రుణాలను తీర్చివేసేందుకు లోన్ తీసుకోవడం కావచ్చు, వైద్య చికిత్స ఖర్చులు.. రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు.. అవసరాలు అనేకం ఉండవచ్చు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు, మీ మీద ఆధారపడిన వారి భవిష్యత్తును సురక్షితంగా కాపాడేందుకు వీలుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ కావాలనుకుంటే టర్మ్ పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. అలాగే యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో పెట్టుబడులు పెట్టడం లేదా క్రమానుగత ఆదాయం కోసం రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవడం వంటివి పరిశీలించవచ్చు. అధ్యయనం చేయడం నిర్దిష్ట ప్లాన్ను ఎంచుకునే ముందు మార్కెట్లో ఉన్న వివిధ పథకాలను అధ్యయనం చేయండి. పాలసీ రకాలు, అవి అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి. ఉదాహరణకు టర్మ్ ప్లాన్ తీసుకుంటే రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడేది కాగా.. పిల్లల భవిష్యత్తును భద్రపర్చేదిగా చైల్డ్ ప్లాన్ పనికి వస్తుంది. ఇక ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే ఇటు జీవిత బీమా, అటు పొదుపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఎంత కవరేజీ సరైన పథకం ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. తగినంత స్థాయిలో సమ్ అష్యూర్డ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలసీదారు ఆర్థిక స్థితిగతులు బట్టి కవరేజీని లెక్కించడానికి వీలవుతుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, తీర్చాల్సిన రుణాలు, జీవితంలో వివిధ దశలకు సంబంధించి ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ అష్యూర్డ్ ఎంతకు తీసుకోవాలన్న దానికి ప్రామాణికమైన అంకె ఏమీ లేదు. కానీ వార్షిక జీతానికి కనీసం 15 రెట్లు అయినా ఎక్కువగా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. పాలసీ ల్యాప్స్ కానివ్వొద్దు టర్మ్ పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లింపులను కొనసాగించాలి. ల్యాప్స్ కానివ్వకుండా చూసుకోవాలి. అప్పుడే పాలసీ ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకుంటే, పాలసీ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి.. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఆర్థికమైన భరోసా లభించగలదు. - సంజయ్ తివారి, డైరెక్టర్ (స్ట్రాటజీ), ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదవండి:జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..? -
చూసి ‘టిక్’ పెట్టు కాలేజీ సీట్లపై గురి పెట్టు
సాక్షి, హైదరాబాద్: కొత్త సీట్లు వచ్చాయి.. ఫస్ట్ కౌన్సెలింగ్లో కేటాయించిన సీట్లు ఖాళీ అవుతున్నాయి.. రెండో కౌన్సెలింగ్లో కోరుకున్న కాలేజీలో, కోరుకున్న సీటు గ్యారెంటీ అని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. అయితే ఈ కౌన్సెలింగ్ను అంత తేలికగా తీసుకోవద్దని సాంకేతిక విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మొదటి కౌన్సెలింగ్ కన్నా, ఈ సారి మరింత ఎక్సర్సైజ్ చేయాలని సూచిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెల 6 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలవుతుంది. 9వ తేదీ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోర్సుకు ప్రాధాన్యమా..? కాలేజీకా అన్న విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్ ట్రెండ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. అంత కష్టమేం కాదు ‘రెండో కౌన్సెలింగ్పై కాస్త కసరత్తు చేస్తే మంచి కాలేజీలో సీటు పొందే వీలుంది. ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిరుచే కాదు.. మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా బ్రాంచ్ ఎంచుకోవాలి. కోరుకున్న స్థాయిలో ర్యాంకు లేనప్పుడు మాత్రమే రెండో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. మొదటి కౌన్సెలింగ్ కన్నా రెండో కౌన్సెలింగే కీలకమని గుర్తించాలి. –తుమ్మల పాపిరెడ్డి,ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ వీటిని పరిశీలించాలి మొదటి కౌన్సెలింగ్లో ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు ఏ బ్రాంచ్లో సీటు వచ్చింది? ఈ వివరాలన్నీ ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మీకు 12 వేల ర్యాంకు వచ్చి ఉండొచ్చు. మీరు దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆ కాలేజీలో సీఎస్ఈ సీటు 13 వేల ర్యాంకు వచ్చిన వారికి రావొచ్చు. ఆ ర్యాంకు వచ్చిన వ్యక్తికి అంతకన్నా మంచి కాలేజీలో సీటు వస్తుందా? లేదా అనేది పరిశీలించాలి. ఆ వ్యక్తికి సీటు రాకపోతే కాలేజీ మారే అవకాశం లేదని గుర్తించాలి. మొదటి 5 వేల ర్యాంకుల వరకు చాలామేర మార్పుచేర్పులు ఉండొచ్చు. జాతీయ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారు ఈ ర్యాంకుల్లోనే ఉంటారు. కాబట్టి ఈ సీట్లు ఖాళీ అయితే మీకే వస్తాయని మొదటి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఎందు కంటే తర్వాత ర్యాంకులో వేరే బ్రాంచ్లో సీటు వచ్చిన వారు కూడా మీరు కోరుకునే బ్రాంచ్లోకి రెండో కౌన్సెలింగ్లో పోటీ పడే వీలుంది. మీకు వచ్చే ర్యాంకును బట్టి అటు ఇటుగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. మంచి కాలేజీగా భావిస్తే మొదటి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అదికూడా మీ ర్యాంకుకు దగ్గర్లో ఉంటేనే.. బ్రాంచ్ విషయంలోనూ ముందుగా ఫస్ట్ కౌన్సెలింగ్ జాబితాతో పాటు, గత రెండేళ్లు కాలేజీ ర్యాంకును పరిశీలించి ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త సీట్ల విషయంలో జాగ్రత్త టాప్ టెన్ కాలేజీల్లోనే ఈసారి కంప్యూటర్, దాని అనుబంధ బ్రాంచీల సీట్లు పెరిగాయి. ఇతర కాలేజీల్లో ఉన్న వారు టాప్టెన్ కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల్లోకి ప్రయత్నించే వీలుంది. కాబట్టి మీ ర్యాంకు సమీపంలో ఉన్న కాలేజీలను ఎంచుకుంటే సీటు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కాలేజీల్లో పూర్తిగా పెద్ద మొత్తంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ సీట్లు పెరిగాయి. కాబట్టి ఏయే ర్యాంకుల వారికి ఆ కాలేజీ లో సీటు వచ్చే వీలుందనేది ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ల ఎంపిక ఆధారంగా గుర్తించాలి. -
ఈ మెలుకువలు పాటిస్తే ‘ఇంటర్’ యమ ఈజీ
సాక్షి, హైదరాబాద్: ఫలితం గురించి పక్కనపెడితే.. ఇంటర్ పరీక్షల మానసిక ఒత్తిడిని తేలికగా జయించవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫస్టియర్ పరీక్షలు మొదలవుతున్న వేళ... విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా సైకియాట్రిస్ట్లను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ల ద్వారా వారిని సంప్రదించే ఏర్పాట్లు చేసింది. గత రెండు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో వారికి ఫోన్కాల్స్ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా సరిగా వినలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రం పోటీ పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్ పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న భయం, ఆందోళనను పారద్రోలేందుకు సైకియాట్రిస్ట్లు అనేక సూచనలు చేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ పరీక్షలు గుర్తున్నది రాస్తే చాలు పాస్ గ్యారెంటీ ‘కరోనా కారణంగా చాలా రోజులుగా మేం పల్లెటూళ్లోనే ఉన్నాం. ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేదు. పరీక్షలు రాయగలమా? అనే ఆందోళన వెంటాడుతోంది’అని నిజామాబాద్ జిల్లా మారుమూల పల్లెకు చెందిన గోవింద్ కాల్ చేశాడు. అతని మానసిక స్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ కొన్ని ప్రశ్నలు వేశాడు. తను చదివిన చాప్టర్స్లో అతను ఎంత పట్టు కలిగి ఉన్నాడో తెలిసిపోయింది. వాస్తవానికి ఇప్పుడా చాప్టర్లు మళ్లీ మననం చేసుకుంటే పాస్ గ్యారెంటీ. ఈ వాస్తవాన్ని చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. తమకు వస్తున్న కాల్స్లో ఇలాంటివి చాలా ఉంటున్నాయని ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిజానికి విద్యార్థులు ఆన్లైన్లో నేర్చుకున్న చాప్టర్లనే రివిజన్ చేసుకుంటే పాస్ మార్కులొస్తాయని వారు అంటున్నారు. ఇలా కాకుండా చదువుకొని పాఠాల కోసం హైరానా పడొద్దని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ స్కోరెలా? ‘పరీక్షలే ఉండవనుకున్నాం. ఇప్పుడు రాయాల్సి వస్తోంది. ఇంత సమయంలో ఎలా?’అనేది సైకియాట్రిస్ట్లకు వచ్చే ఫోన్కాల్స్లో రెండో తరహా ప్రశ్న. ‘చదివిన చాప్టర్లలో ఎక్కువగా గుర్తుండిపోయే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆన్లైన్ క్లాసుల్లో బాగా అర్థమైన వాటిల్లోంచి ప్రశ్నలు ఎంచుకోవాలి. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్తో వీటిని పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాత స్నేహితులు, లెక్చరర్లతో సాదాసీదా సంభాషణలో చర్చించిన చాప్టర్లను మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమరు వేసుకోవాలి. సమయం ఉంటే స్నేహితులతో వీటిపై మళ్లీ చర్చించాలి’అని మానసిక నిపుణులు చెబుతున్నారు. వెన్నుతడితే పరీక్షల్లో విజయం తేలికే.. ఇంటర్ పరీక్షను విద్యార్థి చాలా తేలికగా తీసుకునే వాతావరణం తల్లిదండ్రులే కలి్పంచాలన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. రోజూ తల్లిదండ్రుల నుంచి 50 కాల్స్ వస్తున్నాయని ఓ సైకియాట్రిస్ట్ తెలిపారు. ఇందులో మధ్యతరగతి ఉద్యోగ వర్గాల వారివే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ‘అనివార్యంగానే ఇంటర్ పరీక్షలు పెడుతున్నట్లు అధికారులే చెప్పారు. దీన్ని జయించే మార్గాలనూ ఇంటర్ బోర్డు విద్యార్థుల ముందుంచింది. వీటిని అనుసరిస్తే చాలనే భావన తల్లిదండ్రులూ కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురవుతుంటే.. సరైన రీతిలో దాన్ని దూరం చేసే బంధువులు, స్నేహితుల సలహా తీసుకుంటే సరి. ఎక్కువ మార్కులు టార్గెట్గా పెట్టకుండా, తెలిసినంత వరకూ రాయమని పిల్లలను ప్రోత్సహిస్తే... ఊహించినదానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలుంటుంది’అని సైకియాట్రిస్టులు వెల్లడిస్తున్నారు. మానసిక నిపుణుల సూచనలు.. ► ప్రతికూల భావజాలంతో పాటు.. సానుకూల వాతావరణాన్ని సమకూర్చుకోవాలి. దీనివల్ల మనిషిలోని గ్రంథుల ద్వారా పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. పరీక్ష సమయంలో సులువగా రాసేందుకు వీలు కల్పింస్తుంది. ►పరీక్ష రాసే విద్యారి్థపై ఆక్సిజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ గంటకు ఐదు నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో సమృద్ధిగా మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. మెదడు ఎప్పటికప్పుడు సరికొత్త శక్తి నింపుకుని పనిచేస్తుంది. చదివేది తేలికగా మెమొరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ►రాత్రింబవళ్లు చదివే విధానం అనుసరించకూడదు. కనీసం రాత్రి పూట 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. మెదడులో ఉండే గదుల్లో వేడి తగ్గడమే కాకుండా, సమాచారం ఆయా గదుల్లో నిక్షిప్తమవుతుంది. మర్నాడు తేలికగా చదివింది గుర్తు చేసుకునే వీలుంటుంది. ►రోజూ కనీసం 5 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలి. దీంతో శరీరం లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్) చూసుకోవచ్చు. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒకేసారి కాకుండా ప్రతీ అరగంటకు కొన్ని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►పరీక్షకు వెళ్లేప్పుడు అంతకు ముందు రాసిన పరీక్ష గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. కొంత గ్యాప్ ఇచ్చి.. మరుసటి పరీక్ష మీద దృష్టి పెట్టాలి. దీంతో గతంలో చదివింది మెదడులో స్లీపింగ్ మోడ్లోకి వెళ్తుంది. రేపు రాయాల్సిన పరీక్షకు సమాచారం ఆన్ మోడ్లో ఉంటుంది. ఆత్మస్థైర్యమే విజయ రహస్యం ఇప్పటివరకూ వందల్లో ఫోన్కాల్స్ వచ్చాయి. సమస్య చెప్పేటప్పుడు వాళ్లల్లో ఆందోళన కన్పించేది. కౌన్సెలింగ్ తర్వాత ధైర్యం వచ్చేది. ఇంటర్ పరీక్షలను రాయగల శక్తి ప్రతీ ఒక్కరికీ ఉంది. ఫలితం ఏ విధంగా వస్తుందో.. అనే అనవసర సందేహాన్ని రానివ్వకుండా ఉంటే మంచి మార్కులు ఖాయం. ఇదే విషయాన్ని చెప్పాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేస్తున్నాం. చాలామంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే వాతావరణమే ఈసారి కని్పస్తోంది. – డాక్టర్ అనుపమ (ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్ట్) -
వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు
సాక్షి, పాలంపేట(వరంగల్): రుద్రేశ్వరాలయం అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ రామప్ప అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు అంశం చివరి అంకానికి చేరుకుంది. అయితే రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలా, వద్దా? అనేది జులై 25న తేలనుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్లను గుర్తించేందుకు చైనాలో యునెస్కో జులై 16 నుంచి 31 వరకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. యూనెస్కో సూచనలు ఇప్పటికే రామప్ప ఆలయానికి సంబంధించిన నివేదికను పరిశీలించిన యునెస్కో బృందం పలు సందేహాలు లేవనెత్తి వాటికి సంబంధించి కీలక సూచనలు చేసింది. వీటికి అనుగుణంగా రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామం పేరు మీదుగా పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాథికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పాటు యూనెస్కో చేసిన పలు సూచనలకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యునెస్కో సూచనలో మరికొన్ని కీలక అంశాలు, అడిగిన అదనపు సమాచారం ► రామప్ప ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలు, కట్టడాలు, రామప్ప సరస్సు, మంచి నీటి పంపిణీ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చట్టపరమైన హక్కులు కల్పించాలి. ► రామప్ప ఆలయం, సరస్సు పరిధిలో జరిగే ఇతర అభివృద్ధి పనులకు హెరిటేజ్ పరిధిలోకి తీసుకురావాలి. ► గతంలో విప్పదీసిన కామేశ్వరాలయం పునర్ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలి ► రామప్ప ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తుల వల్ల ఆలయ నిర్మాణానికి నష్టం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► శిథిలమవుతున్న ఆలయ ప్రహారి గోడల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆలయ పరిరక్షణలో స్థానికులు, ఆయల పూజారులలకు భాగస్వామ్యం కల్పించాలి ► ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కాపాడటానికి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ► జాతరలు, పండుగల సమయంలో ఆలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా చేపట్టే చర్యలు, పర్యాటకుల పర్యటనలకు సంబంధించి సమీకృత ప్లాను , ఎటునుండి రావాలి, ఎక్కడ ఎం చూడాలి, సూచిక బోర్డు లాంటి వివరాలు, విదేశీ భాషలలో ఆలయ వివరాలు ► కట్టడానికి సమీపంలో భవిష్యత్ లో చేప్పట్టనున్న ప్రాజెక్టుల వివరాలు అద్భుతాల నెలవు రామప్ప ఆలయం అద్భుతాలకు నెలవు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శిల్ప కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం. -
పెట్టుబడుల లక్ష్యాలపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న పెట్టుబడి వ్యయాల (కేపెక్స్) లక్ష్యాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ శాఖల వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అనంతరం ఎకానమీకి పునరుజ్జీవం కల్పించాలంటే మరింతగా వ్యయం చేయడం కీలకమని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటించిన ప్రతిపాదనల అమలు పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం వివిధ శాఖల సీనియర్ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ సూచనలు చేశారు. లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) బాకీల చెల్లింపు జూలై 31లోగా పూర్తయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), శాఖలకు మంత్రి సూచించారు. ఇక లాభసాటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని మరింతగా దృష్టి పెట్టాలని కూడా సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులకు సంస్కరణల దన్ను: సీఈఏ కేవీ సుబ్రమణియన్ సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం సహా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా తీసుకున్న అనేక సంస్కరణలతో పెట్టుబడులకు మరింత ఊతం లభించగలదని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వర్ధమాన దేశాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 50 శాతం మేర పడిపోయినప్పటికీ.. భారత్లోకి మాత్రం రికార్డు స్థాయిలో రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెట్టుబడుల నివేదిక 2021 అంశంపై ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ (ఐఎస్ఐడీ) నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా సుబ్రమణియన్ ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన పెద్ద దేశం భారత్ మాత్రమేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా సరఫరాపరమైన సమస్యలను తొలగించేందుకు ఉద్దేశించిన సంస్కరణలతో.. పెట్టుబడుల రాకకు మార్గం సుగమమైందని సుబ్రమణియన్ వివరించారు. కార్మిక చట్టాలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, లఘు పరిశ్రమల నిర్వచనం మార్చడం మొదలైనవి కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) నివేదిక ప్రకారం 2020లో భారత్లోకి 64 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఎఫ్డీఐలు అత్యధికంగా అందుకున్న దేశాల జాబితాలో భారత్ అయిదో స్థానంలో నిల్చింది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) రంగంలోకి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. చదవండి: చిన్న నగరాలకు రిటైల్ బ్రాండ్ల క్యూ... -
సంతోషంగా ఉండటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సంతోషం.. మానవ జీవితంలో ఓ ముఖ్యమైన సానుకూల భావన. సంతోషంగా ఉండే వ్యక్తులు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటే వీరికి ఎక్కువగా సామాజిక మద్దతు లభిస్తుంది. అలాగే ఆనందంగా ఉండేవారు తక్కువ ఒత్తిళ్లకు గురవుతారు. అధిక సృజనాత్మకతను, మరింత ఉదారతను కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యంతో ఇతరులతో పోల్చుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారని మానసిక నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సంతోషంగా ఉన్నామనే భావనే జీవితంలో అనేక ప్రయత్నాలను, చొరవల్ని విజయపథం వైపు నడిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భయం, ఆందోళన, వైరాగ్యం నుంచి బయటపడి సాధ్యమైనంతగా సంతోషంతో జీవించడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మనుషులపై సంతోషం, సంతృప్తి, అసంతృప్తి వంటి అంశాలు చూపే ప్రభావం, వాటితో ముడిపడిన విషయాలపై సైకియాట్రిస్ట్లు డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, డాక్టర్ నిషాంత్ వేమన, సీనియర్ సైకాలజిస్ట్ సి.వీరేందర్ల వివరణ వారి మాటల్లోనే... ఆరోగ్యం, విద్య అత్యంత కీలకం ఆస్తులున్నా ఆనందంగా ఉండలేరు. అదే సమయంలో ఏమీలేని వారు కూడా ఉన్నదాంట్లోనే సంతోషంగా గడుపుతుంటారు. సంతోషంగా ఉండడానికి ఆరోగ్యం, విద్య అనేవి చాలా ప్రధానమైనవి. నెలకు రూ. కోటి సంపాదించే వారికి, నెలకు రూ.లక్ష సంపాదించే వారికి హ్యాపీనెస్లో పెద్దగా తేడాలుండవు. అత్యంత సంపన్నులుగా ఉన్న వారు సైతం ఆరోగ్యం సరిగా లేకపోతే, సరిగా నడవలేకపోతే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే సంతోషంగా ఉండలేరు. అదే సమయంలో కుటుంబంతో, ఒక వర్గంతో, సామాజిక సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు ఆనందంగా ఉంటారు. సంబందిత కార్యకలాపాలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సొసైటీ, ఇతరుల అంచనాలను చేరుకోకపోవడంతో అసంతృప్తి ఏర్పడుతుంది. నేటి యువతరంతో పాటు కాలేజీ విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతూ ఫేస్బుక్లోనో, ఇన్స్ట్రాగామ్లోనో తాము పెట్టే పోస్టులకు తగిన లైకింగ్లు రాలేదనో, తమకంటే ఇతరులు అందంగా ఉన్నారనో ఇలా అసంతృప్తికి గురవుతున్నారు. మనకు కావాల్సినవన్నీ సమకూరుతున్నా, పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ అది దొరకకపోతే నిరాశ, నిస్పృహలకు గురవుతున్న వారు కూడా ఉన్నారు. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్షైన్ ఆసుపత్రి సమాజమూ సంతోషపడేలా చేయాలి జీవితంలో ఏది ముఖ్యమనే ప్రశ్నకు సంతోషంగా ఉండడమేననే సమాధానమే వస్తుంది. ప్రపంచంలో ఎవరు కూడా నాకు ఆనందంగా ఉండడం ఇష్టం లేదని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఆనందం కానీ సంతోషం కాని ఎలా వస్తుందనేది ముఖ్యం. అసలు సంతోషమంటే ఏమిటి? మనసులో కలిగే ఓ మధుర భావన, ఒక కదలిక. ప్రత్యేక ఆహార పదార్థాలు, నచ్చిన సువాసనలు, అందమై దృశ్యాలు, వినసొంపైన సంగీతం, తదితరాలు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకుంటే, ఏదైనా విషయంలో విజయం సాధిస్తే అది సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఇవి ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం తదితర ప్రభావాలకు అనుగుణంగా మారిపోతుంటాయి. అయితే వ్యక్తిగత స్థాయి హ్యాపీనెస్ కంటే కూడా సమూహ సమిష్టి ఆనందం ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి్త, ఆనందం అనేవి కేవలం మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా జీవితానికి ఒక సార్థకత, అర్థం ఏర్పడుతుంది. అదే సమయంలో అçపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలతో సతమతమవుతుండటం కూడా మంచిది కాదు. కోరికలను నియంత్రించుకుంటే అంచనాలు తగ్గి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డైరెక్డర్, ఆశా హాస్పిటల్స్ అవసరాలు పూర్తి చేసుకోవడంలోనే ఆనందం ప్రముఖ అమెరికా సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో 1970లలో చేసిన సైద్ధాంతీకరణ ప్రకారం.. మనిషి జీవితం ప్రధానంగా ఐదు ముఖ్యమైన అవసరాలను పూర్తి చేసుకోవడంలోనే ముగుస్తుంది. ఆహారం, నీళ్లు, శృంగారం, నిద్ర వంటి శారీరక అవసరాలు.. శారీరక భద్రత, ఉద్యోగ, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత.. ప్రేమ, తనదనే భావన, లైంగిక పరమైన దగ్గరితనం.. ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం.. స్వీయ వాస్తవికత (సెల్ఫ్ యాక్చువలైజేషన్), నైతికత..వీటిలోనే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు ముడివడి ఉన్నట్టుగా మాస్లో సూత్రీకరించాడు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది శారీరకంగా ఆకలి, సెక్స్, ఆహారం తదితరాల లభ్యతకు సంబంధించిన అవకాశాలు, సామాజికంగా తెలిసిన వారితో ప్రేమ, స్నేహసంబంధాలు, బంధుత్వాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటి సాధనతోనే సంతోషపడి సంతృప్తి పడతారు. ఎప్పుడైతే ఈ రెండు తీరతాయో అప్పుడు ఒక వర్గానికో, ఒక గ్రూపుకో నాయకత్వం వహించాలని కోరుకుంటారు. లీడర్గా ఒకస్థాయికి చేరుకున్నాక ఇతరులకు మంచిచేయడం, ఇతరుల కోసం కృషి చేయడంలో సంతోషం, ఆనందం పొందడం జరుగుతుంది. ప్రస్తుత సమాజం చాలా వేగంగా మారడం, ఇందులో.. అందంగా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నం, ఆలోచించగలగడం వంటివి జరుగుతున్నాయి. అందువల్లే తమ ముందుతరంతో పోల్చితే యంగర్ జనరేషన్ తెలివిగా, నూతనంగా ఆలోచిస్తుంటుంది. కొత్త పోకడలతో సృజనాత్మకంగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంటుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
కరోనా : ఇలా కూడా నిర్థారణ చేసుకోవచ్చు!
వెల్లింగ్టన్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా వైరస్ సోకని ప్రాంతం లేదు. కొంతమందిలో లక్షణాలు కనిపిస్తుంటే మరికొంత మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అవుతుంది. చాలా మందికి తమకి కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోంది. కానీ ప్రస్తుతం వస్తున్న రద్దీ లేదా ఇతర కారణాల వల్ల కావొచ్చు, ఆసుపత్రులకు వెళ్లి ఎలా పరీక్షలు చేయించుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం న్యూజీల్యాండ్లోని ఆక్ల్యాండ్కు చెందిన జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సంధ్యా రామనాథన్ మంచి చిట్కాలు, కొన్ని సలహాల ఇచ్చారు. కరోనా సోకిందా లేదా నిర్థారణ కోసం ఉపయోగపడే పరికరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బహుళ ప్రచారంలోకి వచ్చింది. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానంగా ఉంటే ఒక చిన్న పరికరంతో తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. ఆ పరికరం పేరు పల్స్ ఆక్సీ మీటర్. ఈ మిషన్లో మన చూపుడు వేలును ఉంచితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఎంత మేరకు ఉందో తెలియజేస్తుంది. చూపుడు వేలుకి ఆక్సీమీటర్ పెట్టిన తర్వాత మిషన్లో 95 నుంచి 100 మధ్యలో రీడింగ్ చూపిస్తే ఈ రక్తంలో ఆక్సీజన్ తగినంతగా ఉన్నట్టు లెక్క. అంతకంటే తక్కువ చూపిస్తే లేదా 93 కన్నా తక్కువ చూపించిన పక్షంలో వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ రామనాథన్ చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా కరోనా వైరస్ బారిన పడితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గుతుంది. అందుకే పల్స్ ఆక్సీ మీటర్తో పరీక్షించినప్పుడు రేటింగ్ తక్కువ వస్తే వైద్యులను సంప్రదించాలి. (వైరస్ సోకకుండా పుతిన్కు భారీ టన్నెల్) మరో విధంగా కూడా మన కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని నిర్థారణ చేసుకోవచ్చు. దీని కోసం మీకు కావల్సింది రెండు పెద్ద బెలూన్లు. వీటిలోకి గాలి ఊదటం ద్వారా మీరు ఎంతవరకు శ్వాసను ఎంత వరకు ఆపగలుగుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ సోకితే మనం శ్వాసను ఎక్కువసేపు పట్టి ఉంచలేం. ఇకపోతే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరం. దాని కోసం ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను తీసుకోవాలి. ప్రతి రోజు తినే ఆహారంలో జింక్, విటమిన్ డి, విటమిన్ సి తప్పని సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించాలి. బయటకు వెళ్లినపుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్లు ధరిస్తూ, తరచూ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంచుకోవాలి. (మనం కరోనా వైరస్ను తిప్పికొట్టగలం) ఇక కరోనా వైరస్ సోకిన వారు దాని నుంచి కోలుకోవాలంటే తరుచూ వేడి నీటితో పుక్కిళ్లించి ఉమ్ముతూ ఉండాలి. అదే విధంగా నాజిల్ స్స్ర్పేని ఉపయోగించాలి. కరోనా వైరస్ ఊపిరితిత్తుల గోడలో చివరి భాగన అతుక్కొని ఉంటుంది. దానిని బయటకు తీసుకురావడానికి శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ సోకినా తొందరగా దాని నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలి అనేది డాక్టర్ సంధ్య రామ్నాథన్ వీడియోలో చూపించారు. పైన చెప్పినవన్నీ చేయడం ద్వారా కరోనావైరస్ సోకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. (ఈ పరికరంతో కరోనా వైరస్.. మటాష్) -
ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడాలి: యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ట్విటర్లో విమర్శించారు. ఆయన ట్విటర్ వేదికగా స్వందిస్తూ.. వలస కార్మికులు, పేద ప్రజల సమస్యలు ప్రభుత్వానికి కనబడడం, వినబడడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. విపక్ష పార్టీలు కేవలం సలహాలు ఇవ్వడానికే పరమితమవుతున్నాయని.. సమస్యలు పరిష్కారానికి అన్ని పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. వలస కూలీలను స్వస్ధలాలకు పంపేందుకు వారికి సాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్ చేస్తూ మే 18న యశ్వంత్ సిన్హా నిరసనకు దిగారు. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై యశ్వంత్ సిన్హా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీని మోసపూరిత ప్యాకేజీగా యశ్వంత్ సిన్హా అభివర్ణించిన విషయం విదితమే. చదవండి: లేదంటే జనాల్లో నమ్మకం కోల్పోతారు : యశ్వత్ సిన్హా Opposition parties shd hit the streets instead of petitioning the govt which is deaf and blind to the suffering of the poor. Mere statementbazi will not suffice any more. — Yashwant Sinha (@YashwantSinha) May 23, 2020 -
ఆత్మవిశ్వాసం నింపాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి, సుదీర్ఘ లాక్డౌన్ నేపథ్యంలో వివిధ వయసుల్లోని పిల్లలు, టీనేజర్లపట్ల తల్లి దండ్రులు జాగ్రత్త వహించాలని సైకాలజిస్ట్లు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు, వాటి వల్ల ఎదురుకాబోయే పరిణామాల గురించి శాస్త్రీయంగా అవగాహన కల్పించాలని, పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెం పొందించే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. స్కూళ్లు మూతపడటం, బయట ఆడుకునేందుకు అవకాశం లేకపోవడం, స్నేహితులను కలుసుకోలేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పిల్లలు మానసిక కుంగుబాటుకు గురి కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’తో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే... ప్రేమ చూపాలి.. పిల్లలపై ముఖ్యంగా టీనేజర్లపై తల్లి దండ్రులు ప్రేమ చూపాలి. వారంటే తమకెంత ముఖ్యమో వివరిం చాలి. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా వ్యవహరించాలి. తామెందుకు బయటకు వెళ్లి, ఆడుకోలేకపోతున్నామనే బాధలో ఉన్న పిల్లలకు ప్రస్తుత పరిస్థితులు వివరించాలి. జాగ్రత్తలు చెప్పాలి. పెద్దలు, పిల్లలు ఒక షెడ్యూల్ను నిర్ణయించుకొని ఉదయం నిద్రలేవడం మొదలు, కాలక్షేపం, టిఫిన్, భోజన సమయాలు వంటి వాటిని రూపొందించుకొని వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. కొందరు పిల్లల్లో గణితం లేదా సైన్స్ ఇతర సబ్జెక్టులంటే భయం ఉంటుంది. ఈ సమయంలో అటువంటి వాటి పట్ల భయం పొగొట్టేలా చర్యలు తీసుకోవాలి. టీనేజర్లకు వారి వ్యక్తిగత స్పేస్ దొరికేలా చూడాలి. పిల్లలతో శాంతంగా వ్యవహరిస్తూ సంభాషణ కొనసాగించాలి. భవిష్యత్తులో ఆర్థికపరంగా, విద్యాపరంగా ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి విపత్కర సమస్య వచ్చినా తగిన పరిష్కారాలుంటాయని వారికి వివరించాలి. గతంలో కూడా వివిధ మహమ్మారులు వచ్చినా ప్రపంచం, దేశం నిలదొక్కుకుందని, పిల్లలపై వాటి ప్రభావాలు పడలేదని, ఆ తర్వాత కూడా అందరూ ఆనందంగా ఉన్నారన్న అవగాహనను కల్పించాలి. – స్కూల్ సైకాలజిస్ట్ కళై అముధ అవగాహన కల్పించాలి... లాక్డౌన్ ఎత్తేశాక తలెత్తే పరిస్థితులు, జీవితంపై పడబోయే ప్రభావాలను తల్లితండ్రులు పిల్లలకు వివరించాలి. ఈ పరిణామాల తర్వాత ఏర్పడబోయే జీవితాన్ని కొత్తగా చూసేలా అవగాహన కల్పించాలి. భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కోగలిగే మనోస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి. జీవితం నుంచి నేర్చుకొనే లర్నింగ్ ప్రాసెస్కు సిద్ధం చేయాలి. పరిస్థితులు చక్కబడిన అనంతరం ఉత్సాహంగా సమయాన్ని గడిపేలా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిం చాలి. ప్రస్తుతం పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలో తల్లితండ్రులకు సరైన అవగాహన లేక సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లి దండ్రులు మొబైళ్లు, ల్యాప్టాప్లు, టీవీలతోనే మొత్తం సమయం గడపకుండా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటా యించి అది అమలయ్యేలా చూడాలి. పిల్లలతో కూర్చొని ఆయా అంశాలపై చర్చించడంతోపాటు స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాక ఎలా వ్యవహరించాల్సి ఉంటుం దన్న విషయమై అవగాహన కల్పించాలి. – సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ -
ప్రజల కోసం దీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ప్రచారం కోసం, అధిష్టానం మెప్పుకోసం కార్యక్రమాలు చేయడం మాని, ప్రజల కోసం దీక్షలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. పసుపు బోర్డు కోసమో, కాళేశ్వరానికి జాతీయ హోదా కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో, పంటల మద్దతు ధర కోటా పెంపు కోసమో దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారన్నారు. సీఎం కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారన్నారు. బీజేపీ నేతలు ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం నుంచి మూడు రూపాయలు తెచ్చారా? ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి సాధించిన ఒక్క పనైనా చూపాలన్నారు. -
2020 భారత్లో...2021 ఆస్ట్రేలియాలో...
ముంబై: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు విదేశీయులను తమ గడ్డపైకి అనుమతించడం లేదు. ఆ తర్వాత మిగిలే తక్కువ సమయంలో ప్రపంచకప్ నిర్వహించడం చాలా కష్టమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. అందుకు ప్రత్యామ్నాయంగా వేదికను భారత్కు మార్చవచ్చని ఆయన సూచించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ జరగడం అంత సులువు కాదని అర్థమవుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం 2021లో టి20 వరల్డ్కప్ భారత్లో జరగాలి. ఇప్పుడు ఈ రెండు బోర్డులు గనక చర్చించుకొని ఒక ఒప్పందానికి వస్తే వరల్డ్కప్ నిర్వహణను పరస్పరం మార్చుకోవచ్చు. భారత్లో కరోనా తీవ్రత తగ్గి పరిస్థితులు మెరుగుపడితే ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో టోర్నీ జరపవచ్చు. సరిగ్గా సంవత్సరం తర్వాత దాదాపు ఇదే తేదీల్లో ఆసీస్ గడ్డపై టోర్నీ నిర్వహించవచ్చు’ అని సన్నీ అభిప్రాయపడ్డారు. తాను చెబుతున్న విధంగా జరిపితే సెప్టెంబర్లో ఐపీఎల్ నిర్వహించడం చాలా బాగుంటుందని, వరల్డ్కప్కు సరైన సన్నాహకంగా ఉంటుందని కూడా ఆయన అన్నారు. -
కరోనా: మరో రెండేళ్లు ఇదే కథ
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేత, పాక్షికంగా ఆంక్షల సడలింపు ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా అందరూ కరోనా నుంచి రక్షణకు సుదీర్ఘకాలం పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఈ మహమ్మారి నుంచి సురక్షితులమని, తమకు మినహాయింపు ఉంటుందని ఎవరూ భావించొద్దు.. ప్రతి ఒక్కరూ అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాల్సిందే. మాసు్కలు కట్టుకోవడం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, మనుషుల మధ్య దూరం పాటించడం వంటివి కనీసం ఏడాది పాటు కొనసాగించాల్సిందే. సాధారణ జలుగు, దగ్గు రూపంలో మామూలు ఫ్లూ మాదిరిగా సోకినా ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా కనీసం మనకు సోకిందని తెలియకుండా ఈ వైరస్ వెళ్లిపోయేందుకు, దానికి అందరూ అలవాటు పడటానికి మరికొంత కాలం (మరో సంవత్సరం) పడుతుంది. కరోనా మహమ్మారి గురించి నిష్ణాతులైన వైద్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడమే కాకుండా పలు హెచ్చరికలు కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా కేన్సర్, కిడ్నీ, ఇతర రోగులు ఎలాంటి పద్ధతులు పాటించి సురక్షితంగా ఉండాలన్న దానిపై వివిధ రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసింది. వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్లు ఇచ్చిన సలహాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. షుగరున్న వారికి సమస్యలు ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్తో పాటు గుండె, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. వేళకు మందులు వేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. మనుషుల మధ్య దూరాన్ని పాటిస్తూ, పరిశుభ్రత పాటించాలి. లాక్డౌన్తో 60 ఏళ్లకు పైబడిన వారు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇళ్లలోనే కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వారిలో కాంప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర పశి్చమ దేశాల్లోని డయాబెటిస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న పెద్ద వయసు్కల్లో ఈ వైరస్ ఎక్కువ మందికి సోకినట్లు, ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తేలింది. – బెట్రైస్ ఆనీ, నిమ్స్ హెచ్వోడీ, ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిస్ మరో రెండేళ్లు ఇదే పరిస్థితి ‘మరో రెండేళ్ల దాకా ఏదో ఒక రూపంలో ఈ వైరస్ బయటపడుతూనే ఉండే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ రావడానికి ఏడాది, ఏడాదిన్నర పట్టొచ్చు. అందరూ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. లాక్డౌన్ ఎత్తేశాక కూడా సినిమా హాళ్లు, మాల్స్ వంటివి ఉండవు కాబట్టి మతపరమైన అంశాలతో పాటు సమూహాలు ఒక్కచోట గుమికూడకుండా, విదేశీయాత్రలు, విహార యాత్రలకు వెళ్లకుండా, పెళ్లిళ్లలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూసుకోవాలి. యువత, ఆరోగ్యవంతులైన వారి ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తున్నందున వారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. వారిపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా వారి ఇళ్లలో, బయటా పెద్ద వయసున్న వారు, ఏదైనా జబ్బు బారిన వారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.’ – డా.యలమంచిలి రవీంద్రనాథ్, జనరల్ సర్జన్ (ఖమ్మం) కిడ్నీ పేషెంట్లు బయటకు రావొద్దు ‘కిడ్నీ పేషెంట్లు ఎవరూ అస్సలు బయటకు రావొద్దు. మందులు అస్సలు మానేయొద్దు. ఇళ్లలోనూ క్వారంటైన్ పాటించాలి. ఎవ్వరినీ కలవొద్దు. జలుబు, దగ్గు, విరేచనాలు వంటివి ఉన్నా, వైరస్ సోకడంపై ఏ మాత్రం అనుమానం అనిపించినా బ్లడ్టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్ను సంప్రదించాలి. మాసు్కలు, శానిటైజర్లు వాడుతూ.. పరిశుభ్రంగా ఉండాలి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ మారి్పడి చేయించుకున్న వారు.. డాక్టర్ల సూచనల మేరకు తమకు సూచించిన ఆహారాన్ని, పండ్లను, కూరగాయలు, నాన్వెజ్, పండ్ల రసాలు తీసుకోవాలి.’ – డా.భూషణ్రాజు, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ కళ్ల కలక వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ‘కంజెక్టివిటీస్/మద్రాస్ ఐ వంటి కళ్ల కలక ఎవరికి వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. దగ్గు, జలుబుతో పాటు కంటి ఇన్ఫెక్షన్లు, జ్వరంతో పాటు కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలతో కూడా ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. కళ్ల కలక వచి్చన వారు వెంటనే ఐసోలేషన్ పాటించాలి. చేతులతో కళ్లను తాకినప్పుడు, ఎదుటివారి తుంపరలు (డ్రాప్లెట్లు) పడినప్పుడు, అప్రయత్నంగా కళ్లు నలుపుకున్నపుడు చాలా వేగంగా ఇది వ్యాపిస్తుంది. అయితే దీని నుంచి రికవరీ కూడా బాగానే ఉంది. దీని వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు కూడా దోహదం చేస్తున్నందున, వర్షాకాలంలో ఇది మరింత తీవ్రరూపం తీసుకోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం తర్వాత చలికాలం కూడా దీని విజృంభణకు తోడ్పాటునిచ్చే అవకాశాలున్నందున అందరూ కచి్చతమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.’ –డా. దీప, కంటి వైద్య నిపుణురాలు ఒక్కరోజు కూడా మందులు మానొద్దు గుండె జబ్బున్న వారు ముఖ్యంగా స్టెంట్ వేసిన వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వారు రొటీన్గా వేసుకునే మందులు ఒక్కరోజు కూడా గ్యాప్ రానివ్వొద్దు. స్టెంట్ పడిన వారు ఒక్కరోజు మందులు మానినా దాని ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇళ్లలోనే ఉండటం వల్ల కాలక్షేపానికి ఏదో ఒకటి తినడం, వ్యాయామం చేయకపోవడం కూడా ప్రభావం చూ పే అవకాశాలున్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, పండ్లు, తాజా కూరగాయాలు వంటివి తీసుకోవాలి. యాంగ్జయిటీ, డిప్రెషన్కు గురికాకూడదు. ధ్యానం, మంచి సంగీతం వినాలి. గుండెనొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫోన్ లేదా టెలీ మెడిసిన్ ద్వారా డాక్టర్ల సలహా ప్రకారం మందులు మార్చడం, డోస్ను పెంచడం చేయాలే తప్ప సొంతంగా డోస్ పెంచుకోవద్దు. – డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ గర్భిణులకు 4 విజిట్స్ చాలు ‘వైరస్ సొకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు నాలుగు విజిట్లకు వస్తే సరిపోతుంది. ఇంట్లో కూడా వారు మనుషుల మధ్య 4 అడుగుల దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఆన్ లౌన్, బయటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇళ్లలో వండిన వేడి వేడి ఆహారాన్నే తీసుకోవాలి. ప్రతి అర గంటకు ఒకసారి చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇళ్లలోని డోర్ నాబ్ లను స్పిరిట్తో శుభ్రం చేస్తుండాలి. మ హిళలు, వృద్ధులు, మధుమేహం, హైపర్ టెన్ష న్ ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.’ – డా.కృష్ణవేణి, గైనకాలజిస్ట్ కేన్సర్ రోగులూ.. ఫ్రిడ్జ్లోనివి తినవద్దు ‘కేన్సర్ పేషెంట్లు చల్లటి పదార్థాలు ముఖ్యంగా ఫ్రిజ్లో ఉంచిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. వేళకు వేడి వేడి సూప్లు, ప్రోటీన్లున్న తాజా ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు 3,4 సార్లు బట్టలు మార్చుకోవాలి. వారి బట్టలను ఉతికాక ఎండలో ఆరేలా చూడాలి. ఈ వైరస్ వ్యాప్తి గురించి అనవసర భయాందోళనలకు గురికావొద్దు. వేడి నీటితో తరచుగా పుక్కిలించాలి. ప్రతిరోజూ శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. వీరికి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. మా ఆస్పత్రిలో ఇన్పేషంట్లకు ప్రతిరోజూ చెకప్లు నిర్వహించి ఏ కొంచెం అనుమానమున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం.’ – డా.జయలత, ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ చదవండి: కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో.. చైనా పీపీఈ కిట్లు నాసిరకం! -
అధికారంలోకి తెచ్చే మందులు నా వద్ద ఉన్నాయి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే మందులు తన వద్ద ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీల బలాలు, బలహీన తలు తనకు తెలుసని, ఆ పార్టీలను నియంత్రించగల నైపుణ్యం తన వద్ద ఉందని చెప్పారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సోనియా, రాహుల్గాంధీ అడుగుజాడల్లో పనిచేస్తానని, ఎలాంటి పదవిని ఆశించకుండా పార్టీని నడిపిస్తానన్నారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. ఉత్తమ్కుమార్రెడ్డిని మారిస్తే తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మొదటి నుంచీ అడుగుతున్నానని చెప్పారు. ఈ మేరకు పార్టీ చీఫ్ సోనియాతోపాటు రాహుల్గాంధీ, ప్రియాంక, కుంతియా, అహ్మద్పటేల్, గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్లకు తన దరఖాస్తును రిజిస్టర్ పోస్టు ద్వారా పంపినట్లు తెలిపారు. త్వరలోనే సోనియా, రాహుల్లను వ్యక్తిగతంగా కలసి అధ్యక్ష పదవి కోరుతానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ప్రజాసమస్యల పరిష్కారం సాధ్యమన్న జగ్గారెడ్డి.. ఏదైనా సమస్య ఉంటే సీఎం కేసీఆర్ను నిలదీసే శక్తి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉందా అని ప్రశ్నించారు. -
పంద్రాగస్టుకు సూచనలు కోరిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాను చేసే ప్రసంగానికి సంబంధించి ఆలోచనలు, సూచనలు ఇవ్వాల్సిందిగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రకోట బురుజుపై నుంచి తాను చేసే ప్రసంగం ద్వారా మీ ఆలోచనలను 130 కోట్ల మంది వింటారని ఆయన అన్నారు. నమో యాప్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ ఫోరానికి సలహాలు, అభిప్రాయాలు పంపాలని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా పంద్రాగస్టు ప్రసంగానికి సూచనలు కోరుతున్న సంగతి తెలిసిందే. తాజా లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మోదీ పాల్గొననున్న మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇవే. -
‘సిప్’లు ఆగటం లేదు!
స్టాక్మార్కెట్ సూచీలిపుడు గరిష్ట స్థాయిలకు 5–6% దూరంలో ఉన్నాయి. అలాగని షేర్లూ అదే స్థాయిలో ఉన్నాయని చెప్పలేం. బ్లూచిప్లతో సహా మిడ్, స్మాల్ క్యాప్... ఇలా చాలా షేర్లు వాటి ఏడాది కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. కొన్నయితే జీవితకాల కనిష్ట స్థాయిల్లోనూ ఉన్నా యి. మరి ఇలాంటపుడు మ్యూచ్వల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితేంటి? వాళ్ల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదంటారు కార్వీ స్టాక్ బ్రోకింగ్ థర్డ్ పార్టీ ఉత్పత్తుల హెడ్ డి.జయంత్ కుమార్. ‘‘ఫండ్ల పనితీరు... ఆ మార్కెట్ను బట్టేకదా ఉంటుంది? కాకపోతే నేరుగా ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసినవారు మరింత ఎక్కువగా నష్టపోయి ఉంటారు. ఫండ్ల ఇన్వెస్టర్లకు పరిమిత నష్టాలొచ్చాయి’’ అన్నారు . ఒకటి రెండేళ్లుగా సిప్ ఇన్వెస్టర్లూ నష్టాలు చూస్తుండటం నిజమేనని, డెట్ ఫండ్లు కూడా నష్టాలిచ్చాయని అంగీకరించారు. ‘‘గత రెండేళ్లుగా మార్కెట్లలో ఇండెక్స్ ఆధారిత కొన్ని షేర్లు పెరుగుతున్నాయి తప్ప విస్తృత స్థాయిలో మార్కెట్ పెరగటమనేది లేదు. అందుకే సిప్ ఇన్వెస్టర్లూ నష్టాలు చూస్తున్నారు’’ అని చెప్పారాయన. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివిధ అంశాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే... – సాక్షి, బిజినెస్ ప్రతినిధి ఒకప్పటితో పోలిస్తే సిప్ ఇన్వెస్టర్లలో పరిణితి పెరిగింది. గతంలో మార్కెట్లు పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్ చేయటం... తగ్గుతున్నపుడు ఆపేయటం చేసేవారు. ఇపుడు అలాకాదు. తగ్గుతున్నపుడు చేస్తేనే తరవాత మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే వారిపుడు సిప్ను కొనసాగిస్తున్నారు. కార్వీ పరిధిలోనైతే దాదాపు 15 లక్షల ఎంఎఫ్ ఖాతాలున్నాయి. కాకపోతే అందులో క్రియాశీలకంగా ఉండేవి 3 లక్షల వరకూ ఉంటాయి. మాకు 260 బ్రాంచీలు ఉండటంతో ఆయా ఖాతాల్ని ఫాలో అప్ చేయటం, సిప్ పద్ధతిని ఎంచుకోమని సలహా ఇవ్వటం వంటివి చేస్తున్నాం. కార్పొరేట్ క్లయింట్లకు ఇన్వెస్టర్ ఎడ్యుకేష¯Œ సదస్సులూ నిర్వహిస్తున్నాం. కార్వీని ఎంచుకున్న వారికి... నిజానికి బ్యాంకులతో సహా పలు సంస్థలు మ్యూచ్వల్ ఫండ్లలో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. కాకపోతే కొన్ని సంస్థలు కొన్ని ఫండ్లనే సూచించటం జరుగుతోంది. మేం థర్డ్ పార్టీ కనక అన్ని ఫండ్లనూ ప్రమోట్ చేస్తాం. పైపెచ్చు మా సంస్థకున్న పటిష్ఠమైన రీసెర్చ్ విభాగం, ఫండ్ మేనేజర్లతో టచ్లో ఉండి వాటి మంచిచెడులు తెలుసుకోవటం మా కస్టమర్లకు ఉపయోగపడతాయి. ఆయా ఫండ్లు వివిధ కంపెనీల్లో ఏ మేర ఇన్వెస్ట్ చేశాయో తెలుస్తుంది కనక.. అది మా కస్టమర్లకు కలిసి వస్తుంది. డైరెక్ట్ ఫండ్లతో పోలిస్తే... థర్డ్ పార్టీ ద్వారా కాకుండా నేరుగా ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి రెండు ఫండ్లు ఎంచుకుని వాటిలో 10–15 ఏళ్లు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫండ్స్ పనితీరు ఆధారంగా మార్పులు చేసుకోవాలనుకునే వారికి ఇది కరెక్ట్ కాదు. మా ఇన్వెస్టర్ల వరకూ వస్తే... మేం 6 నెలలు లేదా ఏడాదికోసారి సమీక్షిస్తాం. వారి వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్ చూసి.. వారితో మాట్లాడతాం. తగు సూచనలు చేస్తాం. క్వాలిఫైడ్ సలహాదారుల అవసరం ఉంది... ప్రస్తుతం దేశంలో ఇన్వెస్టర్లు మెల్లగా పెరుగుతున్నారు. కాకపోతే వారికి సరైన సూచనలిచ్చే క్వాలిఫైడ్ అడ్వయిజర్ల అవసరం చాలా ఉంది. ఎందుకంటే మ్యూచ్వల్ ఫండ్ల వరకూ వచ్చేసరికి రీసెర్చ్ చేసి ఏ ఫండ్ బాగుంటుందో సూచించే సంస్థలున్నాయి. కానీ ఈ రీసెర్చ్లో పోస్ట్మార్టం మాత్రమే ఉంటుంది. అంటే గత పనితీరు ఆధారంగానే వీళ్లొక అంచనాకు వస్తారు. మళ్లీ గత పనితీరు భవిష్యత్తుకు కొలమానం కాదని కూడా చెబుతారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే వ్యవస్థ లేదు. ఈక్విటీలా అలాంటి వ్యవస్థ రావాలి. బ్రోకింగ్ ఖాతాలకూ సూచనలు!! ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే తమ బ్రోకింగ్ ఖాతాదారులకు ప్రత్యేక సూచనలిస్తున్నట్లు కార్వీ ప్రయారిటీ ప్రొడక్ట్ హెడ్ రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘వీటిలో ఎఫ్అండ్ఓ, ఇంట్రాడే, మార్జిన్ ట్రేడింగ్ వంటివి మేం సిఫారసు చెయ్యటం లేదు. ఖాతాల్లో డైవర్సిఫికేషన్ సూచిస్తున్నాం. వ్యాపారం బాగుండి, సహేతుకమైన స్థాయిలో డెట్ టు ఈక్విటీ ఉండే కంపెనీలను సూచిస్తున్నాం. మార్కెట్లు మరీ దారుణంగా ఉంటే ఏడాదిలో గరిష్టంగా 15% వరకూ రిస్క్ ఉంటుందని చెబుతున్నాం. ఆ రిస్క్కు సిద్ధపడిన వారికే ఈ సేవలు అందిస్తున్నాం. కస్టమర్ల రిస్క్ ప్రొఫైల్ను బట్టే ఈ బ్రోకింగ్ ఖాతాలను హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ కూడా కార్వీకి ఉన్న పటిష్ఠమైన రీసెర్చ్ విభాగం మా కస్టమర్లకు ఉపయోగపడుతుంది’’ అని ఆయన వివరించారు. -
దేశాభివృద్ధికి సలహాలు, సూచనలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రతి పౌరుడు, అన్ని వర్గాల ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. భవిష్యత్లో మన దేశం అభివృద్ధిలో మరింతగా పురోగమించేందుకు ‘భారత్ కే మన్ కీ భాత్.. మోదీకే సాథ్’పేరిట దేశ పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. వాటన్నింటిని క్రోడీకరించి మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన పలు సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు, ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అవసరమైన అభిప్రాయ సేకరణ కోసం దేశవ్యాప్తంగా 7 వేల డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు తమ అభిప్రాయాలు రాసి వాటిల్లో వేయాలని, అనంతరం వాటిని తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు 300 ఐటీ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. మిస్డ్ కాల్ ద్వారా కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం 6357171717 నంబర్ను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. యూపీఏ 11.. ఎన్డీయే 6.. యూపీఏ హయాంలో ప్రపంచ ఆర్థిక రంగంలో దేశం 11వ స్థానంలో ఉంటే మోదీ ప్రభుత్వం ఆరో స్థానానికి చేరుకుందన్నారు. 30 కోట్ల మందికి పింఛన్లు, 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రూ.6 వేల సాయం వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 మే 26 వరకు దేశంలో 6.2 కోట్ల గ్రామీణ ప్రాంత టాయిలెట్లు నిర్మిస్తే మోదీ హయాంలో 10 కోట్ల టాయిలెట్స్ నిర్మించామన్నారు. దేశ రక్షణ, నల్లధనం విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా బ్యాంకుల ద్వారా రుణాల పేరిట దోచిపెట్టాయని, తమ ప్రభు త్వం బకాయిలను రాబట్టే పనిలో పడిందని వెల్లడించారు. మాల్యాకు చెందిన రూ.13 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపారు. 2019లో ఎన్డీయే 300 స్థానాలను సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. రఫేల్ విషయంలో మోదీ పట్ల రాహుల్ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రఫేల్పై కమీషన్లు రావనే.. 2001లో రఫేల్ ఒప్పందం చేసుకున్నా కమీషన్లు రావనే ఉద్దేశంతో కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. యూపీఏ కంటే 9 శాతం తక్కువ ధరకు విమానాలను, వెపన్స్ లోడింగ్లో 20 శాతం తక్కువ ధరలకే కొనుగోలు చేసిందన్నారు. సుప్రీం కోర్టు కూడా రఫేల్ కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని చెప్పిందన్నారు. ఎకనమిక్ టైమ్స్ కూడా రఫేల్ సీఈవో ఎరిక్ను ఇంటర్వూ్య చేసిందని, అందులో యూపీఏ కంటే మోదీ ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేసిందని చెప్పారు. చంద్రబాబు నైజం అదే.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పేరుతో మోదీకి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు వైఖరి కొత్తేమీ కాదు. పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి గెలవడం. తర్వాత వారిపైనే విమర్శలు చేయడం చంద్రబాబు నైజం. వాజ్పేయితోనూ చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన అనంతరం చంద్రబాబు వాజ్పేయిని ఆశ్రయించి పొత్తు పెట్టుకుని అప్పటి ఎన్నికల్లో గెలిచారు. 2014లో మోదీకి దేశంలో ప్రజాదరణ పెరగ్గానే ఆయన పంచన చేరి ఆనాడు ఎన్నికల్లో గెలిచారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడేమో మోదీపై విమర్శలు చేస్తున్నారు’అని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ మీరే!
మన కుటుంబం ఎప్పుడూ దాడులకు గురవుతూనే ఉంటుంది. బ్యాక్టీరియాలూ, వైరస్లు, మాన్సూన్ మార్పులూ, వ్యాధులతో ఎటాక్ మీద ఎటాక్ మీద ఎటాక్ జరుగుతూనే ఉంటుంది. రాబోయే 2019లో కుటుంబానికి రక్షణ మీరే. కుటుంబాన్ని ఆరోగ్యంగా కొత్త ఏడాదిలోకి తీసుకెళ్లడానికి మీ కోసం ఈ సూచనలు. చాలా రకాల జబ్బుల్ని చిన్న చిన్న నివారణ మార్గాలతోనే రాకుండా చేసుకోవచ్చు. జబ్బు కంటే నివారణ ఎప్పుడూ మంచిదే కదా! ఇక్కడ కొన్ని సాధారణ జబ్బులకు నివారణ మార్గాలు... ఆర్థరైటిస్ నివారణకు... ఆర్థరైటిస్ సమస్యను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అవి... బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజులు 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే వ్యాయాయం చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్ను తగ్గించచాలి. (దానికి బదులు వేగంగా నడవడం, ఈదడం మంచిది). కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు డాక్టర్ను తప్పక సంప్రదించాలి. కిడ్నీల్లోని రాళ్ల నివారణ... ∙సమ్మర్లో మనం తాగే నీళ్లు పెరిగినా ఒంట్లో నీళ్లు తగ్గుతాయి. ఈ పరిస్థితి వల్ల ఏర్పడే అనర్థాల్లో ప్రధానమైనది మూత్రపిండాల్లో రాళ్లు. ఈ పరిస్థితిని నివారించడానికి నీటిని ఎక్కువగా తాగాలి. మనం సగటున రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ∙ఆహారంలో ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి. ∙రాళ్లు వచ్చేందుకు కారణమయ్యే ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ∙క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ∙ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్కు దారి తీస్తుంది. దాంతో క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. అందుకే ఆల్కహాల్ చాలా పరిమితంగా తీసుకోవాలి. మానేస్తే ఇంకా మంచిది. ∙కూల్డ్రింకులను అస్సలు తాగకూడదు. గౌట్ బొటనవేలు బిగుసుకుపోయినట్లు కావడం, కీళ్ల మధ్య రాయిలా మారడంతో కనిపించే వ్యాధి గౌట్. గతంలో మాంసాహారం తీసుకునే సంపన్న వర్గాల్లో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మారిన ఆహార అలవాట్ల వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మాంసాహారం, మద్యంలో పూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పోషకాల్లాగానే ఇవి కూడా శారీరక కార్యకలాపాల్లో పాలుపంచుకుని కణంలోకి పూర్తిగా శిథిలమైపోవాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే రక్తంలోకి కొన్ని వ్యర్థాలు విడుదల అవుతాయి. అందులో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. కొందరిలో యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్)లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బతీస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి వస్తుంది. అలా కీళ్లలో తీవ్రమైన బాధ కలిగిస్తుంది ఈ గౌట్. గౌట్ నివారణ కోసం ఆహార నియమాలు... ∙మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్ మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. ∙ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ∙స్వీట్స్, సాఫ్ట్డ్రింక్స్, ఆలూ (పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ∙పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని విరివిగా తీసుకోవాలి. తలనొప్పి నివారణ కోసం... తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. కంప్యూటర్ వర్క్ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించాలి. ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవాలి. కంప్యూటర్పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు... అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తూ కంటిని ఒత్తిడికి గురి చేసేవారు మన పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం. ∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ∙నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ∙పడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి. ∙ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి. ∙కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్ చేయడం అవసరం. ∙ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి చేయడం సరికాదు. ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు. ∙రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు. జలుబు సాధారణ జలుబును కలగజేసే వైరస్ జన్యుస్వరూపం వెంటవెంటనే మారిపోతుంటుంది కాబట్టి దీని నివారణకు మందు రూపొందించడం సాధ్యం కాదు. అయితే దీనివల్ల ఎలాంటి ముప్పూ లేకపోయినా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీని నివారణ అవసరం. మిగతా వైరల్ రోగాలలాగే జలుబుకి ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను అనుసరించి మందులు వాడాలి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకూడదు. పారాసిటమాల్ వంటి జ్వరం తగ్గించే మందులు వాడాలి. ∙ఈ వ్యాధి సంక్రమించినవారు సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు దూరంగా ఉండాలి. ∙జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. గమనిక: మిజిల్స్, మంప్స్, రూబెల్లా, పోలియో లాంటివి కూడా వైరస్ల వల్ల వచ్చే జబ్బులే. అయితే వీటికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టీకాతోనే వాటి పూర్తిస్థాయి నివారణ సాధ్యం. క్యాన్సర్ నివారణ... సింపుల్ మార్గాలు! క్యాన్సర్ అంటేనే చాలా మంది వణికిపోతుంటారు. కానీ అంతగా భయపెట్టే వ్యాధికి కూడా కొన్ని నివారణలు ఉంటాయి. ముదురు రంగు (డార్క్) చాక్లెట్లు: కోకో ఎక్కువగా ఉండే ముదురు రంగు చాక్లెట్లు క్యాన్సర్ను నిరోధిస్తాయి. వీటిలోని పెంటామెర్ అనే ఫ్లేవనాయిడ్స్కు క్యాన్సర్ను హరించే గుణం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ను తీసుకోకపోవడం: పిజ్జాలు, బర్గర్లు, పఫ్ల వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్తో పాటు చక్కెర ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ను తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు వీలుగా వాడే నూనెల వంటి పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువ. అదే సంప్రదాయ వంటకాలతోక్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ∙కార్సినోజెన్స్కు దూరంగా ఉండటం: కార్సినోజెన్ అంటే క్యాన్సర్ను కలిగించేది అని అర్థం. సిగరెట్ పొగలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు (కార్సినోజెన్స్) చాలా ఎక్కువ. అలాగే మద్యం ఎక్కువ మోతాదుల్లో తీసుకోవడం కూడా దీర్ఘకాలంలో క్యాన్సర్కు కారణం కావచ్చు. ఇక పొగాకు, గుట్కా వంటివి కూడా క్యాన్సర్ కారణాలని స్పష్టంగా తెలుసు. వాటికి దూరంగా ఉండటం తప్పనిసరి. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అది కార్సినోజెన్ అవుతుందని గుర్తించాలి. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ వాడకూడదు. ∙వ్యాయామం చేయడం: శరీరానికి కదలికలు లేకుండా ఉండే జీవనశైలి క్యాన్సర్కు కారణాల్లో చాలా ప్రధానమైనది. వ్యాయామం మనలోని వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అందుకే వ్యాయామాన్ని తప్పనిసరిగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల మనలో కొన్ని ఆరోగ్యకరమైన ఎంజైములు, రసాయనాలు ఊరి అవి మనలో వ్యాధినిరోధకశక్తిని మరింత శక్తిమంతం చేస్తాయి. ∙కంటి నిండా నిద్ర: అలసిన అన్ని కండరాలూ పూర్తి శక్తిని పుంజుకోవాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. క్రమం తప్పకుండా ఒకేవేళకు పడుకుని ఒకేవేళకు లేచే మంచి అలవాటు, కంటికి నిండైన నిద్ర... మనలోని అంతర్గత ఎంజైములు స్రవించే ‘ఎండోక్రైన్ వ్యవస్థ’ను మరింత ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మన ఆరోగ్యకరమైన ఎండోక్రైన్ వ్యవస్థ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతో అన్ని రకాల క్యాన్సర్లు దూరంగా ఉంటాయి. ∙వెల్లుల్లి: ఘాటైన వాసన వచ్చే వెల్లుల్లిలో క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. వెల్లుల్లి మన రోగనిరోధక వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. అందుకే వెల్లుల్లితో తీసుకోదగిన ప్రతి వంటపదార్థంలోనూ వాటిని బాగా వాడేలా చూసుకోండి. ప్రధానంగా అది జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక (ముఖ్యంగా పొట్ట, పెద్దపేగు) క్యాన్సర్లను నివారిస్తుంది. ∙బ్రకోలీ: ఇప్పుడు మన సూపర్మార్కెట్లలో దొరికే బ్రకోలీ అనే ఆకుకూర కూడా క్యాన్సర్ల నివారణకు బాగా తోడ్పడుతుంది. అందుకే దాన్ని సూపర్ఫుడ్ అని అభివర్ణిస్తుంటారు. అయితే దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో వండితే అందులోని క్యాన్సర్తో పోరాడే ఫ్లేవనాయిడ్స్ నశిస్తాయి. అందుకే దీన్ని ఉడికించి తినడం లేదా వీలైతే కొత్తిమీరలా పచ్చిగా తినడం కూడా చాలా మేలు చేస్తుంది. ∙తాజాపండ్లు: దానిమ్మ, నేరేడు వంటి పండ్లను తినడం క్యాన్సర్లను నిరోధిస్తుంది. ఏ సీజన్లో లభ్యమయ్యే పండ్లను ఆయా సీజన్లలో తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరిగి క్యాన్సర్లను నివారిస్తుంది. ∙మధ్యధరా తీరవాసుల జీవనశైలి: యూరప్లోని మధ్యధరా తీరవాసుల జీవనశైలి ప్రపంచంలోనే చాలా చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిగా పేరొందింది. మధ్యధరా తీరంలో ఉండే దేశాలన్నింటినీ కలిపి ‘ప్రపంచపు పండ్లబుట్ట’గా చెబుతారు. మధ్యధరా సముద్రపు చుట్టుపక్కల ఉండే అన్ని దేశవాసులు తమ ఆహారంలో పండ్లను చాలా ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఆ ప్రాంతానికా పేరు. పళ్లతో పాటు వాళ్లు ఆకుకూరలు, చేపలు, ఆలివ్ ఆయిల్, పొట్టుతో ఉండే ధాన్యాలు, బీన్స్ వంటి లెగ్యూమ్స్, నట్స్ వంటివి వాళ్ల ఆహారంలో ఎక్కువ. ఈ తరహా ఆహారపు అలవాట్లు ఉండి, పొగాకు వాడకానికి దూరంగా ఉంటే చాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 60 శాతం పడిపోతాయని చెబుతున్నారు ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్కు చెందిన పరిశోధకుడు డాక్టర్ లొరెంజో కోహెన్. ∙బరువు తగ్గించుకోవడం: ప్రపంచవ్యాప్తంగా సంభవించే క్యాన్సర్ మరణాల్లో అత్యధికం బరువు ఎక్కువగా ఉండేవారిలోనే అన్నది నిజం. మహిళలు బరువు పెరుగుతున్నకొద్దీ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ పెరుగుదలకు దారితీస్తుంది. ఈస్ట్రోజెన్ పెరగడం రొమ్ముక్యాన్సర్, యుటిరైన్ క్యాన్సర్కు దోహదం చేస్తుంది. అందుకే తమ బరువును అదుపులో ఉంచేలా ప్రతిఒక్కరూ వ్యాయామాలు చేయడం అవసరం. ∙నోరు పరీక్షించుకుంటూ ఉండటం: ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ చేత నోటిని పరీక్షింపజేసుకుంటూ ఉండటం అవసరం. ∙మహిళలు సొంతంగా రొమ్ము పరీక్షించుకుంటూ ఉండటం: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. కాబట్టి ప్రతిసారీ రుతుస్రావం ముందర తామే సొంతంగా రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. వాటిల్లో తేడాలేమైనా ఉంటే గమనించే ఈ పరీక్షను సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్బీఈ) అంటారు. రొమ్ముల్లో గడ్డలుగానీ, నొప్పి లేదా సలపరంగానీ, నిపుల్ లోపలకు ముడుచుకుపోయినట్లుండటం గానీ లేదా నిపుల్ నుంచి ఏమైనా స్రావాలు వస్తుంటే మాత్రం వెంటనే వైద్యనిపుణులను కలవాలి. ∙హెపటైటిస్–బి వ్యాధి ఆ తర్వాతి కాలంలో కాలేయ క్యాన్సర్గా మారే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవితాంతం ఆ వ్యాధి నుంచి రక్షణ దొరుకుతుంది. ∙మహిళల్లో హెచ్పీవీ వైరస్ వల్ల గర్భాశయముఖద్వార క్యాన్సర్ (సర్విక్స్ క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్లలో దీనికి టీకా అందుబాటులో ఉంది. వైవాహిక సంబంధాల్లోకి వెళ్లని ప్రతి మహిళా ఈ వ్యాక్సిన్ను తీసుకుంటే అది సర్విక్స్ క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ∙వుంచి సవుతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి విటమిన్–డి అందేలా జాగ్రత్తపడాలి. ∙కొవ#్వ పదార్థాలు (యానివుల్ఫ్యాట్, నెయ్యి) వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ∙బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి పోషకాలు శరీరానికి అందేలా క్యారెట్, టమోటా వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ∙పొగతాగడానికి, వుద్యపానానికి దూరంగా ఉండాలి. మలబద్దకం నివారణ ∙పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముడిబియ్యం (దంపుడు బియ్యం), ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకునే వారిలో మలబద్దకం సమస్య చాలా తక్కువ. బియ్యం తవుడు, గోధుమ తవుడులలో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీ స్పూన్ల తవుడు తీసుకుంటుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు. ∙ప్రతిరోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నమలకుండా మింగాలి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మృదు విరేచనకారిగా పని చేస్తుంది. ∙బొప్పాయి, బత్తాయి, నారింజ, పనస... మొదలైన పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ∙వ్యాయామం కూడ మలబద్దకం నివారణకు తోడ్పడుతుంది. అన్ని కండరాల్లాగే పేగుకండరాలకూ చురుకుదనం సమకూరి మలబద్దకం నివారణ జరుగుతుంది. -
ఆ సమయంలో బరువు.. నొప్పి...!
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ని. గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి తెలియజేయగలరు. అలాగే ఈ కాలంలో ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది? – బి.రుక్మిణి, ఆదిలాబాద్ వర్షాకాలంలో జరిగే మార్పులకు అనుగుణంగా గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దాహం ఎక్కువగా ఉండదు. అయినా కానీ గుర్తుపెట్టుకొని రోజుకి కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల ఫిల్టర్ వాటర్ను తాగాలి. అలాగే కొద్దిగా చెమట పట్టడం ఉంటుంది. కాబట్టి లూజుగా ఉండి, బాగా గాలి ఆడే కాటన్ బట్టలు వేసుకోవాలి. పాలిస్టర్, సింథటిక్ లాంటి ఒంటికి అంటుకునే బట్టలు వేసుకోకపోవడం మంచిది. అలాగే జారిపడిపోకుండా ఉండే చెప్పులను వేసుకోవాలి. తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఈ సమయంలో జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే వేరేవాళ్లకి ఉండే జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్స్ తొందరగా సోకే అవకాశాలు ఉన్నాయి. పచ్చి కూరగాయలు, సలాడ్స్ తీసుకోకపోవడం మంచిది. బాగా ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. లేదంటే కూరగాయలపైన ఉన్న క్రిములు, నులిపురుగుల గుడ్లు వంటివి ఒంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మాంసాహారం కూడా బాగా ఉడకబెట్టిన తర్వాతే తీసుకోవాలి. బయటి ఆహారం ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవడం మంచిది. తాజా పండ్లను గోరువెచ్చని నీటిలో కడిగి తినాలి. పండ్లను ముక్కలుగా చేస్తే మటుకు వెంటనే తినేయాలి. లేకపోతే వాటిపై త్వరగా బ్యాక్టీరియా వంటి క్రిములు చేరే అవకాశాలు ఎక్కువ. గర్భిణీగా ఉన్న సమయంలో రోగనిరోధక శక్తి మిగతా వాళ్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏ రూపంలో అయినా త్వరగా సోకే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొద్దింకలు, క్రిములు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఐరన్ డెఫీషియన్సీ వల్ల‘హెవీ పీరియడ్స్’ సమస్య ఎదురవుతుందని చదివాను. భవిష్యత్లో ఈ సమస్య ఎదురుకాకుండా ఉండడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థలుతీసుకోవాలనుకుంటున్నాను.ఏఆహారపదార్థాలలో‘ఐరన్’ఎక్కువగాఉంటుందోతెలియజేయగలరు. - మణి,తిరుపతి హెవీ పీరియడ్స్ అనేది ఐరన్ డెఫీషియన్సీ వల్ల రాదు. హెవీ పీరియడ్స్ వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయి, రక్తహీనత ఏర్పడి ఐరన్ డెఫీషియన్సీ ఏర్పడుతుంది. ఐరన్ ఖనిజం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి శరీరంలో రక్తం పెరుగుతుంది. ఐరన్ ఎక్కువగా పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, పప్పులు, బఠాణీలు, జీడిపప్పు, బాదం, కర్జూరం, అంజీర వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. మాంసం, లివర్, గుడ్లు, చేపలు వంటి మాంసాహారంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఐరన్ రక్తంలోకి తొందరగా, ఎక్కువ మోతాదులో ఇముడుతుంది. కాబట్టి మీరు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, పల్లీపట్టీలు, క్యారెట్, బీట్రూట్, పండ్లు, పండ్ల రసాలు, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల ఐరన్ రక్తంలో కలిసి హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. ఈ ఆహారం తీసుకునేటప్పుడు కాఫీ, టీ వంటివి తీసుకోకుండా ఉండటమే మంచిది. ఇవి ఐరన్ను రక్తంలోకి ఇమడకుండా చేస్తాయి. తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే ఐరన్ కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే రక్తంలోకి ఇముడుతుంది. రక్తహీనత కేవలం ఆహారంతో తగ్గాలంటే చాలా నెలలు పడుతుంది. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు ఐరన్ మాత్రలు వాడటం మంచిది. నా వయసు 22 ఏళ్లు. నాకు పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయి. కానీ ఆ సమయంలో వక్షోజాలు కాస్తంత బరువుగా, నొప్పిగా అనిపిస్తాయి. అలాగే వాటి సైజు కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. దీనికి గల కారణాలను తెలపండి. అలాగే వీటికి ఏదైనా చికిత్స ఉంటుందా? ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తెలియజేయగలరు. – మాధవి, హైదరాబాద్ పీరియడ్స్ టైమ్లో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొందరిలో వక్షోజాలంలో నీరు చేరడం జరుగుతుంది. దానివల్ల రొమ్ములు బరువుగా, కొద్దిగా నొప్పిగా, అలాగే వక్షోజాల పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. పీరియడ్స్ అయిపోయిన తర్వాత నీరు తగ్గిపోయి రొమ్ములు మళ్లీ సాధారణ పరిమాణానికి చేరుతాయి. ఇది చాలామందిలో పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ సమయంలో జరిగే మార్పు. దీనినే"Premenstrual Mastalgia' అంటారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే లక్షణాల తీవ్రత పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తే, డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే మందులు వాడుకోవచ్చు. వీటిలో మొదటిగా విటమిన్–ఇ, మెగ్నీషియం, మల్టీవిటమిన్స్, ప్రిమ్రోజ్ ఆయిల్ వంటివి కలిసి ఉన్న ట్యాబ్లెట్స్ ఆరు నెలల వరకు వాడుకోవచ్చు. ఆ సమయంలో ఆహారం తీసుకునేటప్పుడు తక్కువ మసాలాలు, తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోవాలి. అలాగే కొద్దిగా నడక, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ ,బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ ,హైదరాబాద్ -
వచ్చే వారం నుంచి తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. వచ్చే వారం నుంచి ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇకనుంచి పలుచోట్ల 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని వెల్లడించింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. వడగాడ్పుల తీవ్రత పెరిగితే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పలు సూచనలు చేసింది. తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారడం, మత్తు నిద్ర, వాంతులు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉండటం వంటివి వడదెబ్బ లక్షణాలుగా వివరించింది. చేయకూడని పనులు.. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. ఎండవేడిలో ఎక్కువ సేపు పనిచేయకూడదు. మధ్యమధ్యలో చల్లని ప్రదేశంలో సేద తీరుతూ ఉండాలి. తగిన జాగ్రత్తల్లేని నిల్వ ఉంచిన ఆహారం అధిక వేడితో చెడిపోతాయి. వాటిని తినొద్దు. తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదముంది. వడదెబ్బ తగిలిన వారిని వేడి నీటిలో తడిపిన గుడ్డతో తుడవకూడదు. వడదెబ్బ తగిలిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయకూడదు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీరు తాగుతూ బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు తీసుకెళ్లాలి. నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటివి తాగుతూ ఉండాలి. తెలుపు లేదా లేత వర్ణం కలిగిన పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. పలుచటి మజ్జిగ, గ్లూకోజ్ నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బ తగిలిన వారిని చల్లని నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. చంటి పిల్లలు, గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, వడగాడ్పులకు గురికాకుండా కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
వాట్సప్ ‘గురు’..!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి...విధి నిర్వహణలో తీరిక లేని పనులు...దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన కమిషనరేట్కు బాస్ కావడంతో నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉండాల్సిన పరిస్థితి...అయినా దేశంలో అత్యున్నతమైన పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గురువు అవతారమెత్తారు. సివిల్స్ పరీక్షలో కీలకమైన ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలను వాట్సాప్ గ్రూప్ల ఏర్పాటు ద్వారా అందించారు. ఇప్పటికే ‘సివిల్స్ గురు’గా అవతారమెత్తిన మహేష్ భగవత్ మార్గదర్శనంలో తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) విడుదలైన ఫలితాల్లో దాదాపు పది మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులకు ఆయన సలహాలు అందించారు. ఇందులో పాటిల్ సుమిత్కుమార్ సుభాష్ రావు(7వ స్థానం), కాజోల్ పాటిల్ (11), ఆనంద్రెడ్డి (41), తవల్నిఖిల్ దశరథ్ (46), జాదవ్ సుదర్శన్ (47), కస్తూరి ప్రశాంత్ (56), శ్వేత (70), షిండే అమిత్ లక్ష్మణ్ (73), సతీశ్ ఆశోక్ (79), మానే శశాంక్ సుధీర్ (100) విజేతలుగా నిలిచారు. సివిల్స్ ఫలితాల్లో 84 మంది... మహేష్ భగవత్ సలహాలను పాటించిన 300 మందిలో 84 మంది గతేడాది సివిల్స్ ఫలితాల్లో అర్హత సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో ఆయన లోగడ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమేగాక సందేహాలను నివృత్తి చేశారు. ఆయన సలహాలు పొందిన వారిలో పుణేకు చెందిన వైశ్ణవి గౌడ్ 11వ ర్యాంక్ సాధించడం విశేషం. తొలి 100 ర్యాంకుల జాబితాలో ఆరుగురు స్థానం పొందారు. ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ తనయుడు ముజామిల్ ఖాన్ (22), ఒంగోలుకు చెందిన రిజ్వాన్ భాషా షేక్ (48), స్వప్పిల్ పాటిల్ (55), అన్వేష్ రెడ్డి (80), పర్జీత్ నాయర్ (87), శోడిశెట్టి మాధవి (104), పోలుమెట్ల అభిషేక్ (373), కపిల్ జీబీ గేడ్(401), శరత్చంద్ర ఆర్రోజు (425), వాసగిరి శిల్ప (547), రంజిత్ (555), మధుసూదన్రావు (588), కుమార్ చింత (608), పిన్నని సందీప్కుమార్ (732), నర్ర చైతన్య (733), బి.రవితేజ (741), కాపల పవన్కుమార్ (799), నరేశ్ మన్నే (979), ప్రేమ్ ప్రకాశ్ (1015), శాలిని (1047) వీరిలో ఉన్నారు. భవిష్యత్లోనూ అండగా... గతేడాది మొత్తం 1099 మంది సివిల్స్ ఎంపిౖకైతే వారిలో నేను సలహాలిచ్చిన 84 మందికి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో నా మార్గదర్శనంలో సలహాలు, సూచనలు అందుకున్న పది మంది అభ్యర్థులు విజేతలుగా నిలవడం గర్వంగా భావిస్తున్నా. భవిష్యత్లోనూ వాట్సాప్ గ్రూప్ల ద్వారా మరెంతో మంది అధికారులను వెలుగులోకి తెస్తా. అండగా ఉంటా. – మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం
చెన్నై:తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షోమంకోసం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అనేక అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళని స్వామి పరిపాలనలో, కార్యనిర్వహణలో దూకుడును ప్రదర్శిస్తున్నారు.అమ్మ బాటలోనే తాను పయనిస్తున్నానంటూ ప్రజా సంక్షేమం కోసం ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన పళనిస్వామి ఇపుడు ఉద్యోగుల సంక్షేమం దృష్టిపెట్టారు. ఈ క్రమంలో 7వ కేంద్ర వేతన కమిషన్ సిఫారసులపై ఒక కమిటీ వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ మేరకు అధికారుల సంఘానికి నిర్దేశించారు. పే కమిషన్ సిఫారసుల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ పునశ్చరణ కోసం ఓ కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. అదనపు చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) కె షణ్ముగం నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్యానెల్ నియమించినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ హోం కార్యదర్శి అపూర్వ వర్మతో ఇతర సభ్యులుగా ఉన్న ఈ కమిటీని 7 వ వేతన సంఘం చేసిన సవరించిన వేతన స్కేలు సిఫార్సులపై అధ్యయనం చేయాల్సిందిగా కోరినట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కేల్ పై కేంద్ర ప్రభుత్వం సిఫారసులపై కూడా అధ్యయనం చేసిన తగిన సూచనలు సలహాలన అందించాలని కోరినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు వివిధ అలవెన్సులను సమీక్షించి సంబంధిత సలహాలను అందించాల్సింది నిర్దేశించామన్నారు. ప్యానెల్ తన నివేదికను సమర్పించడానికి జూన్ 30దాకా గడువు ఇచ్చినట్టు చెప్పారు. -
‘ట్రాన్స్ జెండర్’ బిల్లుపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణకు సంబంధించిన చట్ట రూపకల్పనపై పార్లమెంటరీ కమిటి ప్రజల నుంచి సూచనలు కోరింది. ట్రాన్స్జెండర్లపై వివక్ష, హక్కుల పరిరక్షణపై బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటి ఈ మేరకు చట్టంపై ప్రజలు, ఎన్జీవోల నుంచి సూచనలు కోరినట్లు లోక్సభ కార్యాలయం తెలిపింది. ట్రాన్స్జెండర్లు సాంఘిక బహిష్కరణ, వివక్షకు గురవుతుండటం, విద్య, వైద్య, నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటుండటంతో వారి హక్కుల పరిరక్షణకు కేంద్రం బిల్లు రూపకల్పన చేసింది. వీరిపై వివక్ష చూపినా, హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారికి రెండేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించే దిశగా కేంద్రం చట్టం తయారు చేసింది. -
ప్రోత్సాహకాలు, మినహాయింపులకు ఇక చెల్లు
భారత్ పరిశ్రమకు ఆర్థికమంత్రి స్పష్టీకరణ న్యూఢిల్లీ: భారత పరిశ్రమకు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కీలక సూచనలు చేశారు. ప్రోత్సాహకాలు, మినహాయింపులకు కాలం తీరిపోతోందని పేర్కొన్న ఆయన వ్యాపార నమూనాల్ని పటిష్టతను మెరుగుపరచుకోవాలని, తద్వారా పోటీ తత్వాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి బుధవారం నాడు ఇక్కడ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ఇన్వెస్టర్స్ 2016 సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపార విధానాల్లో సమర్థవంతమైన మార్పుల ద్వారా అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని పరిశ్రమకు సూచించారు. -
జిల్లాల ఏర్పాటుపై 1282 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి గురువారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొ త్తం 1282 అప్పీళ్లు అందాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్తజిల్లాలకు సంబంధిం చి అప్పీళ్లను పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు. ఈ విధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్లో సౌకర్యం కల్పించారు. ఇందు కోసం www.newdistricts formation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు అందజేయాలి. చేతిరాతతో రాసిన కాగి తం కానీ, డీటీపీ ద్వారా తయారు చేసి న డాక్యుమెంట్ స్కాన్ చేసి అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పీల్ ఫైల్ అయినట్లు దరఖాస్తుదారు సెల్కు సమాచారం వస్తుంది. -
'జాగ్రత్త.. కాస్త సున్నితంగా ఉండండి'
న్యూఢిల్లీ: చుట్టూ ఉండే వాతావరణం, పరిసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. కాస్తంతా సున్నితంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనను ఎలాంటి భయం లేకుండా ప్రతి ఐఏఎస్ అధికారి సంప్రదించవచ్చని అన్నారు. కొత్తగా విధుల్లోకి చేరుతున్న 2014 బ్యాచ్ ఐఏఎస్ లను కలిసిన సందర్భంగా వారితో ప్రధాని మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ పాలనలో భాగస్వాములవ్వాలని చెప్పారు. తొలుత అసిస్టెంట్ సెక్రటరీలుగా వ్యవహరించే మీరంతా సీనియర్ అధికారులను సంప్రదించే విషయంలో, అనుభవం నేర్చుకునే విషయంలో రాజీపడొద్దని, పెద్దవారనే భ్రమలో ఇరుక్కోవద్దని సూచించారు. -
ఇదీ మా పనితీరు.. మీ సూచనలేంటి?
♦ సలహాలు, సూచనలు ఆహ్వానించిన సీఎం ♦ లేఖ రాసినా పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడి ♦ గవర్నర్ సూచనలతో ప్రత్యేక సభ ♦ సాక్షి కార్టూనిస్ట్ శంకర్ సహా 64 మందికి సన్మానం సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది గా వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేదిక మీదుగా ఈ మేరకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పరేడ్ మైదానంలో ప్రధాన ఘట్టం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హెచ్ఐసీసీలో కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ సీఎం, గవర్నర్ నరసింహన్ తదితరులు మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చారు. ఆ తర్వాత సభ మొదలైంది. వివిధ జిల్లాల నుంచి మూడు వేల మంది ఇందులో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ కోసం చేస్తున్న పనితీరును సీఎం సభికుల ముందుంచారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి ఫలితాలను వివరించారు. ఇంకేచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ కోరారు. లేఖ రాసినా తాను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. ఇది తనకు గవర్నర్ నరసింహన్ ఇచ్చిన సలహా అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆ తర్వాత గవర్నర్ కూడా ఈ కార్యక్రమం తన సూచన మేరకే జరిగిందన్నారు. 64 మందికి సన్మానం.. అంతకుముందు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 64 మందికి రూ.లక్ష నూటపదహార్ల నగదు పురస్కారం, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. పాత్రికేయ విభాగంలో ‘సాక్షి’ పత్రిక కార్టూనిస్టు శంకర్ను సీఎం, గవర్నర్ సత్కరించారు. సన్మాన గ్రహీతలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడంతో ప్రాంగణం కళకళలాడింది. ఇటీవల లాస్వేగాస్లో జరిగిన యూఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన నగర యువతి సయదా ఫలక్కు రూ.50 లక్షల పురస్కారం అందించి సత్కరించారు. అంతకు ముందు సాంస్కృతిక సారథి బృందం సభ్యులు నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. సభ మొదలయ్యాక సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్తోపాటు ప్రభుత్వ సంగీత కళాశాల ఆచార్యులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. 64 మందికి సన్మానం తర్వాత కాస్త గందరగోళం నెలకొంది. కరాటే ఛాంపియన్ సయదా ఫలక్ను అప్పటికి వేదికపైకి ఆహ్వానించకపోవటంతో సీఎం కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను పిలిపించి దీనిపై ప్రశ్నించారు. అప్పటి వరకు సన్మాన గ్రహీతలను ఆహ్వానించిన దేశపతి శ్రీనివాస్ సభికుల్లోకి వచ్చి కూర్చోవటంతో గందరగోళం నెలకొంది. ఇదే కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చివర్లో అందరికీ అక్కడే పసందైన విందు ఏర్పాటు చేశారు. -
సెల్ఫీ తీసుకోవాలా.. ఇవి పాటించండి..
మాస్కో: ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోన్న ట్రెండ్ ‘సెల్ఫీ’. యువతలో అయితే దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేయడం.. తర్వాత వాటికి వచ్చే లైక్లు, కామెంట్ల కోసం ఎదురుచూసే ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందరిలా మామూలుగా సెల్ఫీలు తీసుకుంటే కిక్ ఏముంది అనుకొని కొందరు తమ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకర, వింత ప్రదేశాల్లో విభిన్న రీతిలో సెల్ఫీలు తీసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనేక మంది గాయపడుతున్నారు. మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సెల్ఫీ జాడ్యం వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. రష్యాలో సెల్ఫీల మోజులో పడి అక్కడి యువత ఎక్కువగా గాయాలు పాలవుతోంది. ఇలా సెల్ఫీ ప్రమాదాలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం సెల్ఫీలు తీసుకోవడంపై ప్రజలకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో సేఫ్ సెల్ఫీల కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవి. సెల్ఫీ తీసుకునే ప్రదేశం సురక్షితమైనదో కాదో చూడాలి. ఎత్తై ప్రదేశాలు, భవనాల అంచులకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించకూడదు. జంతుప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం చేయొద్దు. ఆ సమయంలో జంతువులు దాడి చేసే అవకాశముంది. రోడ్డు మధ్యలో, రైలు పట్టాల మధ్యలో నిలబడి వెనుక వాహనాలు, రైలు వస్తున్నప్పుడు సెల్ఫీ కోసం ప్రయత్నించొద్దు. ఇది ప్రమాదకరం. కదులుతున్న వాహనాలపై నిలబడి కూడా సెల్ఫీ తీసుకోవద్దు. అలాగే విద్యుత్ వైర్లు తగిలే ప్రదేశాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర ఆయుధాలు చేతబట్టి వాటితో సరదాగా సెల్ఫీలు తీసుకోవడం కూడా ఎక్కువైంది. అయితే ఈ సమయంలో కొన్ని సార్లు పొరపాట్ల వల్ల గాయాలపాలవుతున్నారు. అందుకే ఇలాంటి సెల్ఫీలకు ప్రయత్నించకూడదు. జలపాతాల దిగువన, నదుల మధ్యలో సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరం. -
డ్రగ్స్ నిర్మూలనపై సలహాలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో మాదక ద్రవ్యాల బెడదను పరిష్కరించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ దిశగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని దాన్నుంచి బయట పడేసే దిశగా చేసిన పోరాటంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను తనతో పంచుకోవాలని కోరారు. తన తదుపరి ఆకాశవాణి ప్రసంగంలో మాదక ద్రవ్యాల బానిసత్వంపై ప్రసంగించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ఆదివారం ప్రసారమైన తన ఆకాశవాణి కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఈ అంశాన్ని సృ్పజించడాన్ని ఆయనీ సందర్భంగా తెలిపారు. మాదక ద్రవ్యాల బెడద గురించి అనేకమంది స్నేహితులు తనకు లేఖరాసిన విషయాన్ని చెబుతూ.. తదుపరి కార్యక్రమంలో ఇదే అంశాన్ని తీసుకుంటానని పేర్కొన్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నా. మీరు కనుక ఈ దిశగా పనిచేస్తున్నట్లయితే.. దయచేసి మీ అనుభవాలను నాతో పంచుకోండి’’ అని ఆయన తన ట్వీట్ ద్వారా ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను కోరారు. ఝడజౌఠి వెబ్సైట్ ద్వారా వీటిని తెలియజేయాలని తెలిపారు. ఎవరైనా ఈ విషయంలో వ్యక్తిగత అనుభవాలను బహిరంగంగా పంచుకోవడానికి ఇష్టపడని పక్షంలో తనకు నేరుగా లేఖ రాయవచ్చని ప్రధాని సూచించారు. తన తదుపరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ అంశంపై ప్రసంగిస్తానని హామీనిచ్చారు. దాదాపు నెలరోజుల తరువాత ఇది ప్రసారమవుతుందని భావిస్తున్నారు. -
మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు...
కళాశాల చిత్రకళ అనేది వంశపారంపర్యంగానో, పుట్టుకతోనో వచ్చే కళ కాదు. సాధనతో వికసించే కళ. ఎంతోమంది యువ చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. మీలో కూడా ఒక చిత్రకారుడు కచ్చితంగా ఉంటాడు. ఇలా చేసి చూడండి... బాపుగారు చెబుతుంటారు జేబులో స్కెచ్బుక్ లాంటిది ఎప్పుడూ ఉండాలని. మీరు బస్స్టాప్లో ఉన్నా, థియేటర్ దగ్గర ఉన్నా కనిపించిన దృశ్యాన్ని గీయండి. వారం పది రోజుల్లోనే చిత్రం పరిపూర్ణంగా రాకపోవచ్చు. అయితే కాలం గడుస్తున్న కొద్ది మీ రేఖల్లో పరిణతి కచ్చితంగా కనిపిస్తుంది. సృజనకు తొలిమెట్టు అనుకరణ అంటారు. మొదట్లో ప్రసిద్ధుల చిత్రాలను చూసి సాధన చేసినా, అంతిమంగా మాత్రం మీదైన ప్రత్యేక శైలిని ఎంచుకొని దాని మీద సాధన చేయండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉండాలి. ‘ప్రకృతికి సంబంధించిన చిత్రాలను నేను బాగా గీయగలను’ అనే నమ్మకం ఉన్నప్పుడు ముందు ఆ సబ్జెక్ట్ పైనే కృషి చేయండి. ఒక ఫొటోను ఎంచుకొని భిన్న మాధ్యమాల్లో చిత్రించడానికి ప్రయత్నించండి. పెయింట్, పెన్సిల్, అబ్స్ట్రాక్ట్, రియలిజం... ఇలా విధానంలోనైనా సరే ప్రయత్నించి చూడండి. కేవలం బొమ్మలు వేస్తుంటే సరిపోదు. పుస్తక అధ్యయనం కూడా ముఖ్యమే. కళ, చారిత్రక, సాంస్కృతిక పుస్తకాల అధ్యయన ప్రభావం మీ చిత్రకళలో కొత్త కాంతిని నింపుతుంది. ప్రతి రంగుకూ ఒక ధర్మం, లక్షణం ఉంటుంది. సాధన చేసే క్రమంలో, పెద్ద చిత్రకారులను అడిగి, పుస్తకాలను చదివి రంగుల గురించి లోతైన అవగాహన పెంచుకోండి. మీరు గీసిన బొమ్మలను కుటుంబసభ్యులు, స్నేహితులకు చూపించి వారి అభిప్రాయం తీసుకోండి. భారీ పొగడ్తలకు, అతి విమర్శకు దూరంగా ఉండండి. వాస్తవికమైన విమర్శను స్వీకరించండి. మీ కంటే నైపుణ్యంతో గీసే వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోండి. -
రకం ఏదైనా మెలకువలు పాటించాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు బీటీ పత్తి సాగు పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం రైతులు వేలంవెర్రిగా కేవలం రెండు మూడు రకాల విత్తనాల కోసమే ఎగబడడం పరిపాటిగా మారుతోంది. వారు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే వంగడం ఏదైనా తొలి దశ నుంచే సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు, ఆదాయం లభిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రాంతానికి అనువైన హైబ్రిడ్ రకాన్ని రైతులు ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి కింద సాగు చేసే వారు మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలి. వర్షాధారంగా వేసే వారు త్వరగా పూతకు, కాపుకు వచ్చే స్వల్పకాలిక రకాల్ని ఎంచుకోవాలి. ఈ నేపథ్యంలో పత్తి సాగుపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు... ఈ నేలలు అనువైనవి ముంపుకు గురికాని నల్లరేగడి నేలలు, ఆరుతడి సదుపాయం కలిగిన సారవంతమైన ఎర్ర నేలలు పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, ఇసుక నేలలు, ముంపుకు గురయ్యే నేలలు, వరికి అనువైన మాగాణి భూములు పత్తి పంటకు పనికిరావు. ఎప్పుడు-ఎలా విత్తాలి? జూన్-జూలై నెలల్లో 75-100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే మొలక శాతం బాగుంటుంది. మంచి దిగుబడులు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమంటే బీటీ పత్తితో పాటు బీటీ జన్యువు లేని అదే రకం పత్తిని... అంటే రెఫ్యూజియా (ఎర పంట)ను పొలం చుట్టూ నాలుగైదు వరుసలుగా వేసుకోవాలి. సాధారణ రకం పత్తి మొక్కతో పోలిస్తే బీటీ పత్తి మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి నేల స్వభావం, నీటి వసతిని బట్టి వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలి (వరుసల మధ్య 90-120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45-60 సెంటీమీటర్ల దూ రం పాటించాలి). దీనివల్ల చేలో మొక్కల సాం ద్రత పెరుగుతుంది. ఎలుకల బెడదను నివారించాలంటే పదును మీదే విత్తనాలు వేయాలి. ఎరువుల యాజమాన్యం పత్తికి పంటకాలంలో ఎకరానికి 54 కిలోల నత్రజని (మూడు బస్తాల యూరియా), 24 కిలోల భాస్వరం (మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్), 24 కిలోల పొటాష్ (40 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. భాస్వరం మోతాదు మొత్తాన్నీ చివరి దుక్కిలోనే వేసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్ ఎరువుల్ని నీటి వసతి/వర్షపాతాన్ని బట్టి విత్తిన 20, 40, 60, 80 రోజులప్పుడు దఫదఫాలుగా వేయాలి. కలుపు నివారణ కోసం... బీటీ పత్తిలో కలుపు నివారణకు విత్తనాలు విత్తిన ఒకటి రెండు రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలిపి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25-30, 50-55 రోజులప్పుడు గొర్రు/గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు అంతరకృషి సాధ్యంకాదు. అలాంటప్పుడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ 24% కలిపి పైరుపై పడకుండా వరుసల మధ్య కలుపుపై మాత్రమే పడేలా పిచికారీ చేసుకోవాలి. సమగ్ర చర్యలు తప్పనిసరి బీటీ పత్తి రకాల మధ్య జన్యు వైవిధ్యం తక్కువగా ఉంటుంది. పంటకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే ఏ వంగడమైనా దిగుబడి, నాణ్యత ఒకే రకంగా ఉంటాయి. రాష్ట్రంలో సాగు చేస్తున్న బీటీ పత్తి రకాలపై గుంటూరు లాం ఫారం గతంలో పరిశోధనలు చేసింది. బీటీ రకాల్ని సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో విత్తనాలు విత్తిన 120 రోజుల వరకూ ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా పంట తీరును పరిశీలించారు. ఏ ఒక్క వంగడం కూడా రసం పీల్చే పురుగుల్ని తట్టుకోలేకపోతోందని ఆ పరిశీలనలో తేలింది. కాబట్టి సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపడితే ఏ బీటీ రకమైనా మంచి దిగుబడినే అందిస్తుంది. ఈ పురుగులతోనే ప్రమాదం పత్తి విత్తనాలు వేసిన 50-60 రోజుల వరకు రసం పీల్చే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటిలో పేనుబంక, పచ్చదోమ పురుగుల బెడద పంట చివరి వరకు ఉంటోంది. ఇక పైరు పూత మీద ఉన్నప్పుడు పొగాకు లద్దె పురుగులు, గులాబీ రంగు పురుగులు దాడి చేస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పచ్చ, తెల్ల దోమల్ని తట్టుకునే రకాన్ని ఎంచుకోవడం మంచిది. కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/4 గ్రాముల థయోమిథాక్సామ్తో పాటు తగినంత జిగురు కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలు వేసిన 30-40 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద తప్పుతుంది. కిలో విత్తనాలకు 40-50 గ్రాముల కార్బోసల్ఫాన్ పట్టించి, విత్తుకుంటే రసం పీల్చే పురుగుల నుంచి 30 రోజుల వరకు పైరుకు రక్షణ లభిస్తుంది. మోనోక్రొటోఫాస్, నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి, ఆ ద్రావణాన్ని బ్రష్తో మొక్క లేత కాండానికి పూసినట్లయితే (విత్తిన 20, 40, 60 రోజులప్పుడు) రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. ఈ పద్ధతి వల్ల వాతావరణ కాలుష్యమూ తగ్గుతుంది. చివరిగా అవసరమైతే క్రిమిసంహారక మందులు పిచికారీ చేసుకోవాలి. -
కొత్త రాజధానిపై సూచనలు చేయండి
{పజలు, సంస్థలకు కేంద్రం వినతి 30లోగా సలహాలు ఈ-మెయిల్ ద్వారా పంపాలని వెల్లడి హదరాబాద్: సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. కొత్త రాజధాని ఎంపికకు నియమించిన కె.సి.శివరామకృష్ణన్ కమిటీకి సలహాలు, సూచనలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం కోరింది. ఈ నెల 30 లోగా ్ఛ్ఠఞఛిౌఝ్టఃఝజ్చి.జౌఠి.జీ మెయిల్కు వీటిని పంపాలని తెలిపింది. రాజ్భవన్, అసెంబ్లీ, శాసన మండలి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయ భవనాలు, అతిథి గృహాలు, ఆస్పత్రులు, హోటళ్లు, స్కూళ్లు. కళాశాలలు తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రాజధాని ఎంపిక కసరత్తు చేయాలని నిపుణుల కమిటీకి ఇచ్చిన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. ప్రస్తుత ఉమ్మడి రాజధానికి, కొత్త రాజధానికి మధ్య రైలు, రోడ్డు మార్గాలను, కొత్త రాజధానికి ఆ ప్రాంతంలోని జిల్లాలకు రోడ్డు మార్గాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. కొత్త రాజధాని ఎంపికలో వీలైనంత తక్కువగా వ్యవసాయ భూమి అవసరం ఉండేలా చూడాలని, నీటి వసతి, వరదలు, తుఫానులను దృష్టిలో ఉంచుకోవాలని, వీలైనంత తక్కువ నిర్మాణాలు, భూసేకరణ ఉండేలాగ చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ ఆగస్టు 31కల్లా కేంద్రానికి నివేదిక ఇవ్వాలి. -
పొడుగ్గా కనిపించాలా!
మీ ఎత్తు 5 అడుగులు... అంతకన్నా తక్కువగా ఉందా! అయితే డ్రెస్ డిజైనర్స్ చెబుతున్న ఈ సూచనలు మీకోసమే! ధరించే దుస్తులు మీ శరీరాన్ని కప్పేసేలా ఉండకూడదు. దీని వల్ల మరింత పొట్టిగా కనిపిస్తారు. ఎప్పుడూ ఫిట్గా ఉండే కాస్త కురచ దుస్తులను ఎంచుకోవాలి. టాప్, బాటమ్.. ఒకే రంగు గల డ్రెస్సు ధరిస్తే మరింత చిన్నగా కనిపించడం ఖాయం. అందుకే డ్రెస్సింగ్లో విభిన్నతను చూపించండి. ఎప్పుడూ ముదురు రంగులను ఎంచుకోవడమే ఉత్తమం. లేత రంగులు, బరువైన ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే చూడ డానికి గాడీగా ఉంటుంది. ఎత్తు తక్కువగా కనిపిస్తారు. పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, గాడీ డిజైన్లు కాకుండా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న డ్రెస్సులను ఎంచుకోండి. చెక్స్ ఉన్న దుస్తులు తీసుకునేవారు నిలువు చారల దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు చాలామంది అనుకోకుండా నడుము, భుజాలు వంచుతుంటారు. నిల్చున్నా, కూర్చున్నా వీపుభాగం నిటారుగా, భుజాలు విశాలంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం ఎదుటివారికి ఎత్తుగా ఉండేలా కనిపిస్తుంది. వంగిపోయి ఉంటే మీలోని ఆత్మన్యూనత మరింత పొట్టిగా చూపిస్తుంది. మీ అభద్రతతో సహా! -
మొదటికాన్పు... బిడ్డకు పాలుపట్టడం ఎలా?
నా వయసు 22. నాకిది మొదటికాన్పు. నెల రోజుల తర్వాత ప్రవసం కానుంది. నవజాత శిశువునకు తల్లిపాలు పట్టడం ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం తాగించాలి? అవి సమృద్ధిగా రాకపోతే బయటిపాలలో ఏవి మంచివి? నాకు మంచి సలహా ఇవ్వగలరు. - విమల, వనస్థలిపురం ప్రసవసమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం గుర్తుంచుకోవాలి. జన్మించిన పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతినివ్వాలి. ఏమీ తాగించనవసరం లేదు. అనంతరం శిశువు ఆరోగ్యం బాగుందని నిర్ధారణ చేసిన పిదప తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా పాలు తాగగలగడం శిశువునకు సంక్రమించే సహజసిద్ధమైన ప్రక్రియ. తల్లి సంతోషంతో శిశువును చూడటం, తాకడం, స్తనాన్ని నోటికి అందించడం ‘స్తన్యం’ స్రవించడం సఫలమవుతుంది. తనకెంత కావాలో శిశువుకి తెలుసు. అనంతరం తల్లి ప్రయత్నించినా తాగడు. అది గుర్తించి బలవంతంగా తాగించవద్దు. శిశువు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ‘ఆకలి’ కూడా ఒకటి. ముర్రుపాలు (కొలొస్ట్రమ్) శిశువుకు చాలా మంచిది. బలకరం. విరేచనం సాఫీగా అయ్యేట్టు చేస్తాయి. బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చేవరకు స్తన్యం తాగించాలి. ఆరవనెలలో ఫలప్రాశన, పదవ నెలలో అన్నప్రాశన తప్పనిసరి. ఇతర పోషకవిలువలు బిడ్డకందించడానికి ఇది చాలా అవసరం. సరియైన ఫలాలు లభించకపోతే ఆరవనెలలోనే అన్నప్రాశన చేయాల్యల్సి ఉంటుంది. ఇది సుశ్రుతాచార్యులు చెప్పిన విషయం. శిశువులో రోగనిరోధక శక్తి పరిపుష్టమవడానికి, శారీరక, మానసిక వికాసానికి, ఆయుఃవృద్ధికి, సంపూర్ణ ఆరోగ్యానికి స్తన్యపానం అత్యంతావశ్యకమని ఆయుర్వేద గ్రంథాలన్నీ నొక్కివక్కాణించాయి. దీనినే ‘ఓజోవర్థనం’ అంటారు. తల్లిపాలు తక్కువయిన పక్షంలో ‘ఆవుపాలు, మేకపాలు’ శ్రేష్ఠమని ఆయుర్వేదోక్తం. వీటిలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు పసుపువేసి మరిగించి, చల్లార్చి, చక్కెర కలిపి తాగించవచ్చు. శతావరీ చూర్ణం (5 గ్రాములు), పాలతో కలిపి, రెండుపూటలా తల్లి సేవిస్తే, తల్లికి సమృద్ధిగా స్తన్యం ఉత్పత్తి అవుతుంది. తల్లికి జ్వరం గాని, రొమ్ముపై స్థానికంగా రోగాలుగాని ఉన్నప్పుడు తాత్కాలికంగా బిడ్డకు స్తన్యపానాన్ని ఆపాల్సి ఉంటుంది. ఒక నెల వయసు దాటిన అనంతరం బిడ్డకు ఒకటి లేదా రెండు చుక్కల గాడిదపాలు తాగిస్తే చాలా జబ్బులను నివారించే రోగనిరోధకశక్తి కలుగుతుందని శాస్త్రోక్తం. ప్యాకెట్ పాలుగాని, డబ్బాపాలు గాని తెచ్చుకోవడం అనివార్యమైతే అవి ‘కల్తీ’ లేనివని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, తాజాఫలాలు, పాలు’ సేవిస్తే తల్లికి స్తన్యోత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. సాత్వికాలోచన, సంతోషం స్తనకరం. శోకం, దుఃఖం, చింత, అసూయ వంటి ప్రతికూల ఉద్వేగాలు స్తన్యనాశనకరం.