ప్రజలు కోర్టుకొచ్చే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? | High Court orders state government | Sakshi

ప్రజలు కోర్టుకొచ్చే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు?

Jan 26 2025 5:18 AM | Updated on Jan 26 2025 5:18 AM

High Court orders state government

సుప్రీంకోర్టు తీర్పులను దేశంలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందే 

రిజిస్ట్రార్లు, సబ్‌ రిజ్రిస్టార్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు 

వేలంలో కొన్న ఆస్తికి మార్కెట్‌ విలువ ప్రకారం స్టాంప్‌ డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు వర్తించదు

ఆస్తి విలువ ఆధారంగానే స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు వసూలు చేయాలి 

అధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో కోకొల్లలుగా పిటిషన్లు దాఖలవుతున్నాయి 

రిజ్రిస్టార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు శిక్షణ తరగతులు నిర్వహించండి 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్టా­ర్ల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్య­క్తం చేసింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్ప­ష­­్టమైన తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా వ్యవహరి­స్తున్నారంటూ ఆక్షేపించింది.  చట్టాల విషయంలో అ­ధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో పిటిషన్లు వరద­లా దాఖలవుతున్నాయని, ప్రజలను కోర్టులకు వ­చ్చి తీరే పరిస్థితులు కల్పిస్తున్నారని స్పష్టం చేసింది. 

వే­లంలో కొన్న ఆస్తికి మార్కెట్‌ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు వసూలు చేయడాని­కి వీల్లేదని పునరుద్ఘాటించింది. ఇలాంటి­వి పునరావృ­త్తం కాకుండా ఉండాలంటే రిజ్రిస్టార్, సబ్‌ రిజ్రిసా­్టర్లకు న్యాయవ్యవస్థలో, చట్టాలలో వస్తున్న కొత్త మార్పులపై జ్ఞానోదయం కలిగించాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు, శిక్షణ తరగతులు నిర్వహించాలంది. 

ఇందుకోసం ఓ ‘లీగల్‌ మా­డ్యూల్‌’ని రూపొందించాలని ప్ర­భు­­త్వా­న్ని ఆదేశించింది. అప్పుడే స­మర్థవం­తమైన ఫలితాలు సాధ్యమవుతా­య­ని తెలిపింది. ఈ లీగల్‌ మా­డ్యూల్‌ రూపకల్పన విషయంలో అడ్వొకే­ట్‌ జనరల్‌తో సంప్రదించాలని రెవెన్యూ శా­ఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వా­రాల్లో ఈ లీగల్‌ మాడ్యూల్‌ని రూపొందించాలని తే­ల్చి చెప్పింది. అనంతరం శిక్షణ కార్యక్రమాలు ని­ర్వ­హించాలంది. 

తమ ఈ ఆదేశాల అమలు పురోగ­తికి సంబంధించిన వివరాలతో 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కే­సు­లో పి­టిషనర్లు వేలంలో కొన్న ఆస్తికి దాని విలువ ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు ఖరారు చే­యా­లని తిరుపతి సబ్‌ రిజ్రిస్టార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ కీలక తీర్పు వెలువరించారు. 

కేసు నేపథ్యమిదీ 
కడపకు చెందిన కొండపనేని మల్లికార్జున, లోకేశ్‌ కస్తూరి, హైదరాబాద్‌కు చెందిన స్వాతి కస్తూరి తిరుపతి కెనరా బ్యాంక్‌ నిర్వహించిన ఈృవేలంలో తిరుపతి సెంట్రల్‌ పార్క్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోని పలు షాపులను రూ.2.17 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ ఆస్తిని తమ పేర రిజిస్టర్‌ చేయాలంటూ తిరుపతి సబ్‌ రిజ్రిస్టార్‌ను మల్లికార్జున తదితరులు ఆశ్రయించారు. 

సదరు ఆస్తికి మార్కెట్‌ విలువ (రూ.3.65 కోట్లు) ఆధారంగా 6.5 శాతం స్టాంప్‌ డ్యూటీ, 1 శాతం రిజ్రిస్టేషన్‌ ఫీజు చెల్లించాలని సబ్‌ రిజ్రిస్టార్‌ స్పష్టం చేశారు. ఈ మొత్తం చెల్లిస్తేనే రిజ్రిస్టేషన్‌ చేస్తామని తేల్చి చెప్పారు. తాము వేలంలో ఈ ఆస్తిని కొన్నామని, అందువల్ల మార్కెట్‌ విలువ ప్రకారం కాకుండా ఆస్తి విలువ (రూ.2.17 కోట్లు) ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు చెల్లిస్తామని, నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయని మల్లికార్జున తదితరులు చెప్పారు. 

సబ్‌ రిజ్రిస్టార్‌ ఒప్పుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ విచారణ జరిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement