కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా! | Increase in number of coaches per train from 16 to 24: Vande Bharat | Sakshi
Sakshi News home page

కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా!

Published Tue, Sep 17 2024 5:32 AM | Last Updated on Tue, Sep 17 2024 5:57 AM

Increase in number of coaches per train from 16 to 24: Vande Bharat

వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల కాంట్రాక్టులో సవరణ

ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్య 16 నుంచి 24కు పెంపు

200 రైళ్లు

133కు తగ్గింపు

సాక్షి, అమరావతి: ప్రతిష్టా­త్మకంగా చేపట్టిన వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్య­ను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రా­క్టు­లో మార్పులు చేసింది. స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టే రూట్ల­ను కూ­డా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహి­స్తు­న్న చైర్‌ కార్‌ వందేభారత్‌ రైళ్లతోపాటు స్లీపర్‌ కోచ్‌లతో కూ­డిన వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రా­క్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూర­ప్రాంతాలకు స్లీపర్‌ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందు­కోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్‌ రైళ్లను ఏయే రూ­ట్లలో ప్రవేశపె­ట్టా­లనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణ­యానికి రాలేకపోయింది.

స్లీపర్‌ కో­చ్‌­ల నిర్వ­హ­ణ వ్య­యం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమ­తు­ల్యత లేక­పోవ­డంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్‌ వందే­భారత్‌ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్‌ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూ­ట్ల­లో స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పర­ంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్‌ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారు­తుందని అంచనాకు వచ్చింది.

దాంతో స్లీపర్‌ కోచ్‌లకు అధి­క డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్ల­ను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయా­న్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్‌ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలు­లో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రా­క్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌), భారతహెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)కు సవ­రించిన కాంట్రాక్టును ఖరారు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement