పంద్రాగస్టు వేడుకలు: జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్‌ జగన్‌ | Independence Day Celebration At Ysrcp Central Office Updates | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకలు: జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్‌ జగన్‌

Aug 15 2024 8:18 AM | Updated on Aug 15 2024 12:04 PM

Independence Day Celebration At Ysrcp Central Office Updates

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘ప్రతి భారతీయుడి హృద‌యం గ‌ర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ 78వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement