Independence day celebration
-
స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడిక భూమ్మీద అత్యధిక జనాభా గల దేశంగానూ అవతరించనుంది. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటోంది. ఈ సమ యంలో మనందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. స్వాతంత్య్రం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలను పరిరక్షించుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో వాటిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించాలి. ఎంతో ఉన్నతంగా రెపరెపలాడే జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్ చేసే ప్రతి భారతీయుడూ ఆ జెండాలోని మూడు రంగుల అంత రార్థాన్ని గ్రహించాలి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దేశ సమైక్యతను ప్రతిఫలించే ఆ మువ్వన్నెలే మన ప్రజాస్వామ్యాన్ని అవని మీదే ఉన్నతమైందిగా రూపొందించాయి. భారత ప్రజల ఈ సమైక్యతను దెబ్బతీసే విద్వేష ప్రచారాలను అడ్డు కోవాలి. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహంకార పూరితమైన నిరంకుశ అధికారం ఎప్పటికీ కబళించకుండా కాపాడుకోవాలి. ఈ చారిత్రక సందర్భంగా ఇలా చేస్తామని మనమందరం ప్రతిన పూనాలి. ఇదే జాతీయ పతాకానికి మనం అర్పించగల ఘన నివాళి. సమైక్యత మన సంపద వలస పాలన మృత్యు కౌగిలి నుంచి విముక్తమైన భారత్ నాడు తక్షణం జాతి సమైక్యతకు నడుం బిగించింది. చెల్లా చెదురుగా ఉన్న బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, సంస్థానాలను విలీనపరచి ఒక సమైక్య జాతిగా అవతరించింది. ఈ సమైక్యత రాత్రికి రాత్రే మంత్రం వేసినట్లు వచ్చింది కాదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం, విదేశీ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులందర్నీ ఏకం చేసింది. భాష, కులం, మతం, స్త్రీపురుష భేదం, సామాజిక అంతరాలు... వీటన్నిటికీ అతీతంగా భారతీయులను ఈ ఉద్యమం సమైక్యం చేసింది. ఈ సమైక్యత భారత్కు అమూల్య సంపద. కుల మత విభేదాలు, భాషా దురహంకారాలతో ఇది నాశనం కాకూడదు.ఇలాంటి కుట్రలతో భారతీయులను భారతీయుల మీదే ఉసిగొల్పి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందితే పొందవచ్చు. కానీ, ఒక గొప్ప జాతిగా ఈ దేశం ప్రయాణం సాగించే ప్రగతి బాట మీద ఇవి అగాథాలను సృష్టిస్తాయి. వలస పాలకులు మనల్ని నిలువునా దోచారు. వారి నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న మనం ఒక బీదదేశంగా కొత్త జీవితం ప్రారంభించాం. ఆ స్థాయి నుంచి నేడు ప్రపంచ అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగగలిగాం. 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం మన ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చింది. పేదరికం తగ్గింపు, ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ విధానానికి దిశానిర్దేశం అయ్యాయి. అందరి ఆర్థిక ప్రయోజనమే మనకు పరమావధి అయ్యింది. ఒకవైపు ఆర్థిక అంతరాలు పెరుగుతూ, మరోవైపు ఎంపిక చేసిన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలే సంపద ప్రయోజనాలను పొందడాన్ని మనం అనుమ తించకూడదు.వేర్పాటు రాజకీయాలు కూడదు! ఉపాధి లేని వృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ క్షేమం కాదు. సామాజిక అసంతృప్తికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న యువజనులకు విద్య, నైపుణ్యం, తగు ఉపాధి కల్పించాలి. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వాలి. తద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ధ్యేయంగా రానున్న 25 సంవత్సరాలకు బాటలు వేసుకోవాలి. ఇది సుసాధ్యం కావాలంటే విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు దేశం నలు మూలలకు స్వేచ్ఛగా వెళ్లగలగాలి. మతం, భాష వంటివి ఈ స్వేచ్ఛా గమనానికి అడ్డంకులు కాకూడదు. దేశ పారిశ్రామిక సారథులు అవరోధాల ప్రమాదాన్ని గుర్తించి జాతీయ సమైక్యతకు గళం విప్పాలి. విచ్ఛిన్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంటే వారు మౌన ప్రేక్షుల్లా ఉండిపోకూడదు. శాస్త్రీయ సంప్రదాయం నిలబెట్టాలి! స్వాతంత్య్రం తొలినాళ్ల నుంచీ దేశం శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి సాధనకు దాన్ని మార్గం చేసుకుంది. పురోగమన దృక్పథంతో నేషనల్ సైన్స్ పాలసీ రూపుదిద్దుకుంది. విజ్ఞానం, బోధన, పరిశోధనలకు గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు ప్రపంచ గుర్తింపు పొందాయి. వాటిలో చదివిన పలువురు విద్యావంతులు నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. అంతరిక్ష, సాగర, అణుశక్తి కార్య క్రమాలు మనల్ని అంతటి సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన నిలిపాయి. శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ గుర్తింపు పొందిన మన వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సారథ్య బాధ్యతల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తక్కువ ప్రతిభావంతులకు చోటు కల్పిస్తే అంతకు మించిన దురదృష్టం ఉండదు. ప్రాచీనకాలం నుంచీ మనకు గర్వించదగిన సాంప్రదాయిక విజ్ఞానం ఉంది. అయితే అది ఆధునిక విజ్ఞానాన్ని మసకబరచి మేటి శాస్త్రవేత్త లకు అపఖ్యాతి తేకూడదు.స్పష్టమైన విదేశీ విధానాలురెండు అధికార కూటములు ప్రపంచంపై పట్టు సాధించడానికి పోటీపడుతున్న సమయంలో... దేశాల మధ్య శాంతి సామరస్యాలు మెరుగుపరచడానికి మనం అవలంబించిన విలువలు, విధానాలు, మన అలీన ఉద్యమ నాయకత్వం భారత్కు ఎనలేని గౌరవం తెచ్చి పెట్టాయి. మన పొరుగున ఉన్న అత్యధిక దేశాలతో మనకు సహృద్భావ సంబంధాలు ఉండేవి. కొన్నిటితో ఘర్షణలు ఉన్నప్పటికీ శాంతి యుత సహజీవనానికి వీలుకల్పించేలా వాటితో అవగాహనా వార ధులను నిర్మించుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మదగిన గౌరవప్రదమైన మిత్రదేశంగా పరిగణించే స్థితి ఉండాలి. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఈ విశ్వాసం పొందాలి. కేవలం కెమెరాల మందు ఆప్యాయతా ప్రదర్శనలకు పరిమితమైతే మన విదేశాంగ విధానం బలహీనం అవుతుంది. సమర్థులయిన దౌత్యవేత్తల సహకారంతో విజ్ఞులైన నాయకులు సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి. యువత శ్రేయస్సు ముఖ్యం యువజనుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. మన చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బిడ్డల్ని కనే మహిళల్లో పోషణ లేమి, రక్తహీనత అధికంగా ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –5) తేల్చి చెప్పింది. కాబట్టి పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవ సరం ఉంది. అలాగే, మంచినీరు, పారి శుద్ధ్య రంగాల్లో కూడా సరైన చర్యలు, విధానాలు అమలు చేయాలి. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అనేక బలహీనతలను కోవిడ్ – 19 బట్టబయలు చేసింది. వ్యాధులపై నిఘా పెంచాలి. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వెయ్యాలి. వైద్య సేవల రంగాన్ని విస్తరించాలి. ఈ దిశగా పరిశీలిస్తే ఆ యా రాష్ట్రాల మధ్య ఆరోగ్య వ్యవస్థల పనితీరు, వాటి విస్తరణల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాష్ట్రాలు ఆరోగ్యం మీద మరిన్ని నిధులను వెచ్చించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్య సాధన కోసం రాష్ట్రాలకు ఇతోధికంగా మద్దతు అందించాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించడం సార్వత్రిక ఆరోగ్య సేవల కల్పన విధానాల లక్ష్యం కావాలి. దేశవ్యాప్తంగా సమరీతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి. పౌరుల బాధ్యతఅప్పట్లో నేను పధ్నాలుగేళ్ల కుర్రవాడిని. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనంద పారవశ్యంతో మునిగిపోయాను. అదే సమయంలో దేశ విభజన అంతులేని విషాదం మిగిల్చింది. అలాంటి దుఃస్థితి తిరిగి ఎప్పటికీ రాని దృఢమైన దేశంగా భారత్ ఎదగాలని ఆశించాను. ఇండియా ఇన్నేళ్లల్లో సాధించింది చూసి నేనిప్పుడు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశం భవిష్యత్తు పట్ల నాకు ఎన్నో ఆశలున్నాయి. సమాజంలో çసుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజల్ని విభజిస్తున్న వేర్పాటు నినాదాలు, మత విద్వేషాలు చూసి నేను ఆందోళన కూడా చెందుతున్నాను. మరో వంక, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించి తీరాల్సిన, సుపరిపాలన నియమ నిబంధనలను నిలబెట్టాల్సిన, ఎన్నికలకు ధనబలం, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు బలహీనమవటం కూడా జరుగుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను పరిరక్షించుకోవలసింది భారత పౌరులే! సగర్వంగా తల ఎత్తి మన జెండాకు వందనం చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవలసిన గురుతర బాధ్యత ఇది!డాక్టర్ మన్మోహన్ సింగ్ (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా 2022 ఆగస్ట్ 15న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాసిన వ్యాసం ఇది. ‘ది హిందూ’ సౌజన్యంతో.) -
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
పంద్రాగస్టు వేడుకలు : జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పంద్రాగస్టు వేడుకలు: జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024 -
హైదరాబాద్ : సగర్వంగా..‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
Har Ghar tiranga : ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
ఎర్రకోట : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ (ఫొటోలు)
-
పంచాయతీలకు ప్రభుత్వం ట్విస్ట్
-
Independence Day 2023: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
AP: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వానితులు, పాస్లు ఉన్నవారు మంగళవారం ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ విందు(ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. సీఎం జగన్, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వేడుకలకు ఏర్పాట్లు.. రాష్ట్ర హైకోర్టు, శాసన మండలి, శాసనసభ, సచివాలయ ప్రాంగణాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ దీపాలతో ఆ భవనాలను ముస్తాబు చేశారు. కాగా, మంగళవారం ఉదయం 7.45 గంటలకు శాసన మండలి వద్ద మండలి చైర్మన్ మోషేన్రాజు, ఉదయం 8.15 గంటలకు శాసనసభ వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉదయం 7.30 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే నేలపాడులోని హైకోర్టు వద్ద ఉదయం 10 గంటలకు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పాల్గొని.. మువ్వన్నెలజాతీయ జెండాను ఎగురవేస్తారు. -
ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని
సాక్షి, బళ్లారి: నేడు ఢిల్లీలోని ఎర్రకోటపై జరగనున్న 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఓ సామాన్య మహిళకు అవకాశం దక్కింది. కర్ణాటకలోని హావేరి జిల్లాకు చెందిన పుష్పావతి సోమప్ప అనే మహిళ రాణిబెన్నూరు తాలూకా చిక్కకురువత్తి గ్రామ పంచాయతీలో నీరుగంటి(వాటర్ఉమెన్)గా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. భర్త సోమప్ప గతంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో ఆ ఉద్యోగం భార్య పుష్పావతికి దక్కింది. పుష్పావతి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు బెంగళూరు కూడా చూడలేదన్నారు. ప్రస్తుతం విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు తనకు పిలుపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్తోపాటు హైదరాబాద్లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
పర్యాటక ప్రదేశాన్ని తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజీ...(ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రపంచ వ్యాప్తంగా మన జాతీయ జెండా రెపరెపలాడింది
-
ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద పోలీస్ పెరేడ్ రిహార్సిల్ దృశ్యాలు
-
వెయ్యి అడుగుల జాతీయ జెండా (ఫొటోలు)
-
తిరుపతి పురవీధుల్లో మార్మోగిన స్వతంత్ర నినాదం
-
'నయా భారత్ కా సప్నా' ప్రచారాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్
Karan Johar Launches Naye Bharat Ka Sapna Campaign: 'నయా భారత్ కా సప్నా' పేరిట స్వాతంత్ర్య దినోత్సవ ప్రచారాన్ని బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ ప్రారంభించారు. 'కూ యాప్' ద్వారా వాతావరణ మార్పులపై పోరాటం చేద్దామనే తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కరణ్ జోహార్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నయా భారత్ కా స్వప్నా అనే కార్యక్రమం సరికొత్త భారతదేశం కోసం సమిష్టి మార్పును తీసుకురావడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దూరంగా ఉంచడం, పునర్వినియోగం, తగ్గించడం, రీసైకిల్ చేయడం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా స్వతంత్ర భారతదేశపు 75 వ వార్షికోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవడానికి వినియోగదారులను సన్నద్ధం చేస్తోంది. ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలకు, కోవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. 'కూ యాప్ ప్రగతిశీల మార్పులు అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపిస్తోందని' ఆ యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ వెల్లడించారు. అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ, “ఈ వాతావరణ మార్పుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఈ నయా భారత్ కా సప్నా లో పాల్గొని, కూ యాప్ ద్వారా బహుభాషా వినియోగదారులతో సంభాషిస్తూ సమస్య గురించి అవగాహన కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ స్వాతంత్య్ర సంబురాల సమయంలో మనమందరం చేయి చేయి కలుపుదాం. మన భూమి, మన దేశం, మన ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అని పేర్కొన్నారు. Koo App One step for the nation. #nayebharatkasapna #swatantratasankalp View attached media content - Karan Johar (@karanjohar) 1 Aug 2022 -
వైఎస్ జగన్ పాలన దేశానికే మార్గదర్శకం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న పాలన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలను ఆదుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ..‘ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 80 శాతం మందికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరింది’ అని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా ఈ రోజు పేదలకు సంపూర్ణ స్వాతంత్య్రం లభించేదని.. కానీ టీడీపీ కుయుక్తుల వల్ల అది వాయిదా పడిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నేతలు ఎన్.పద్మజ, ఎ.నారాయణమూర్తి, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. -
ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
సాక్షి, విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్కు సంబంధించిన ఫైనల్ రిహార్సల్స్ని వీక్షించిన గౌతమ్ వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.ఆయన వెంట సీఎస్ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. -
‘వైట్ హౌజ్లో హిస్టరీ బుక్స్ లేవా?’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు చూస్తే స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అధ్యక్షుడే అంటే.. ఆయనకు పోటీగా వైట్ హౌస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకంటే.. ఈ నెల 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా గొప్పతనాన్ని చాటడం కోసం ట్రంప్ తన ప్రసంగంలో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికన్లు విద్యుత్తును ఉపయోగించుకున్నారు. అణువును విభజించారు. ప్రపంచానికి టెలిఫోన్, ఇంటర్నెట్ ఇచ్చారు. మేము వైల్డ్ వెస్ట్ను స్థిరపర్చాము. రెండు ప్రపంచ యుద్ధాలను గెలిచాము. అమెరికన్ వ్యోమగాములు చంద్రునిపై కాలు మోపారు. త్వరలోనే అంగారక గ్రహంపై మా జెండా ఎగర వేస్తాము’ అంటూ ట్రంప్ ప్రగల్భాలు పలికారు. (‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’) "Americans harnessed electricity, split the atom, and gave the world the telephone and the internet. We settled the Wild West, won two World Wars, landed American Astronauts on the Moon—and one day soon, we will plant our flag on Mars!" — President @realDonaldTrump — The White House (@WhiteHouse) July 6, 2020 అధ్యక్షుడే మిస్టేక్ చేశాడంటే.. వైట్ హౌస్ మరో అడుగు ముందుకు వేసి ట్రంప్ వ్యాఖ్యలను యథాతథంగా ట్వీట్ చేసింది. ఇంకేముంది నెటిజనులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘వైట్ హౌస్లో కనీసం చరిత్ర పుస్తకాలు కూడా లేవా’ అని ప్రశ్నిస్తున్నారు. ఇదేకాక కరోనా విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే అమెరికాలో ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు ట్రంప్. టెస్టుల సంఖ్య తగ్గిస్తే.. కేసులు కూడా తగ్గిపోతాయన్నారు. -
టెక్సాస్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
టెక్సాస్ : భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డల్లాస్లోని గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో జెండా పండుగలో పాల్గొన్నారు. మ్యూజిక్ టీచర్ స్వాతీ జాతీయ గీతాలాపన అనంతరం.. ఎంజీఎంఎన్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇర్వింగ్ నగర మేయర్ ప్రోటెం ఆస్కార్ వార్డ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. గోపాల్ పోనంగి, ఫ్రిస్కో ఐఎస్డీ బోర్డ్ ట్రస్టీ.. మనీష్ సేథి, కోపెల్ ఐఎస్డీ బోర్డు ట్రస్టీ.. వాస్త రామనాథన్, అలెన్ ఐఎస్డీ బోర్డు ట్రస్టీ రాజ్ మీనన్, కోలిన్ కమ్యూనిటీ కాలేజ్ డిస్ట్రిక్ట్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ టై బ్లెడ్సో, స్థానిక అధికారులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కాల్వ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ మెమోరియల్ప్లాజా నిర్మించేందుకు సహకరించిన ఇర్విన్ నగర అధికార యంత్రంగానికి కృతజ్ఞతలు తెలిపారు. 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వ నిర్ణయం చాలా సంతోషం కలిగించిందని ప్రసాద్ తోటకూర అన్నారు. ప్రోగ్రామ్ను ప్రసారం చేసిన టీవీ చానెళ్లకు ధన్యవాదాలు తెలిపారు. -
కిందపడిన పతకాన్ని తీసిచ్చిన సీఎం
సాక్షి, అమరావతి: ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్ చేసే సమయంలో ఆ పతకం పోలీస్ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఎల్కే అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ (91) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి ఏడాది ఆయన ఆగస్టు 15న తన నివాసంలో జెండా వందనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అద్వానీకి వైరల్ ఫీవర్ కారణంగా ఈసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. గత అయిదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలిపింది. -
అలరించిన కాలిఫోర్నియాలోని ‘రంగస్థలం’ కార్యక్రమం
కాలిఫోర్నియా : తత్వా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవ్యాలీ) ఆధ్వర్యంలో ‘రంగస్థలం’ కార్యక్రమం ఆగష్టు 3న కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఈవెంట్లో జాతిపిత మహత్మగాంధీ 150వ జన్మదిన వేడుకలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముందుగా సంగీత సాధన వారి ‘కూనపులి’, ‘ఓ బాపూ’, ‘జననీ’ గీతాల బృంద గానలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం లయన్స్ డాన్స్ స్కూల్ వారి ‘వందేమాతరం’ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నటరాజ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చేసిన ‘సుబ్రహ్మణ్య కౌతువం’ నాట్యం అందరిని అలరించింది. కాగా కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలోని ఆణిముత్యాల్లాంటి పాటలను అభినయించి ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశారు. తరువాత వైద్యామా? పైత్యామా? ‘ఆమ్రఫల ప్రహసనం’ నాటికలు అందర్నీ కడుపుబ్బ నవ్వించాయి. ఇంటింటి రామాయణం, జానపద నృత్యాలు ప్రేక్షకులను సాయంకాలం ఉత్సాహంగా గడిపేందుకు తోడ్పాడ్డాయి. కాలిఫోర్నియా బాలబాలికలకు వివిధ పాఠశాలల ద్వారా భారతీయ కళలను, తెలుగు భాషను బోధిస్తున్న గురువులకు తత్వ వారు ‘గురువందనం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అందించారు. అనంతరం రుచికరమైన విందు భోజనాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ జ్ఞాపికలు అందజేశారు. చివరగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రదర్శకులకు, అతిథులకు వాలంటీర్లకు, స్పాన్సర్లకు ‘తత్వా’ ఆధ్వర్యం ధన్యవాదాలు తెలియజేశారు. -
పంద్రాగస్టు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ
సాక్షి, విజయవాడ : పంద్రాగస్టు సందర్భంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కంటెంజెన్స్ నిర్శమించిన కవాతుల ట్రయల్ రన్ను స్వయంగా పర్యవేక్షించారు. స్వాతంత్యదినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.కంటెంజెన్ట్ల కవాతు ఆకట్టుకునేలా ఉందని, ఈసారి వేడుకల్లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో సాంఘీక,సంక్షేమ,గురుకుల పాఠశాల విద్యార్థులతో నిర్వహించనున్న పైప్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రత విషయంలో ఏపీకి ఎలాంటి ముప్పు లేదని, అయినా అప్రమత్తంగానే ఉంటామని తెలిపారు. ఆహ్లదకర వాతావరణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. -
విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణం): ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. 2015లో గత టీడీపీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎంవో ఆరా తీయడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అనువైన ప్రాంతాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఆర్కే బీచ్ రోడ్డు లేదా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కలెక్టర్ వినయ్చంద్ వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అయితే విశాఖలో ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్రాజ్ జెండాను ఎగుర వేసిన అనంతరం, స్వీట్లను పంపిణీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రొడ్డ కృష్ణ, నోముల జయపాల్రెడ్డి, కంతి చిరంజీవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మానెగల్ల మంజుల, మడంల మహిళా అధ్యక్షురాలు చెప్పాల వసంత, పట్టణ అధ్యక్షుడు చినపాగ వెంకటరత్నం, పట్టణ కార్యదర్శి కల్లెపు లక్ష్మి, నాయకులు మధు, శ్రీనివాస్ ఉన్నారు. -
అమిత్ షా జెండా వందనంలో అపశృతి
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తడబడ్డారు. దేశరాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో షా జెండా ఆవిష్కరిస్తుండగా.. జాతీయ పతాకం ఒక్కసారిగా నేలపై పడిపోయింది. దీంతో వెంటనే తేరుకున్న షా.. జెండా తాడును వేగంగా లాగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. జెండా ఆవిష్కరణ అనంతరం షా జాతీయ జెండాకు కాకుండా మరోవైపు తిరిగి సెల్యూట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. జాతీయ పతాకం కిందకు పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘జాతీయ జెండాను సరిగ్గా ఆవిష్కరించలేని వాళ్లు దేశాన్ని ఏం పాలిస్తారు? గత 50 ఏళ్లుగా జాతీయ జెండాను గుర్తించడానికి వారు తిరస్కరించి ఉండకపోతే.. ఇవాళ జాతీయ పతాకం ఇలా నేలపై పడిపోయేదే కాదు’ అని ట్వీట్ చేసింది. భారత మాత తన విచారాన్ని జెండా ద్వారా ప్రకటించిందని ఆప్ ట్వీట్ చేసింది. -
‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశం కోసం ఎంతోమంది వీరులు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాకు అనుగుణంగా ఆర్థిక వనరులు పెరగాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలని అన్నారు. ‘మహిళలపై అత్యాచారాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కక్షలు పెరిగిపోతున్నాయి. దేశ సంపద కొంత మంది చేతిలోనే ఉండిపోతోంది. స్వాతంత్ర ఫలాలు అందరికి చేరాలి. దోపిడిలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. రాజకీయ వ్యవస్థకు నూతన నిర్వచనాలు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి అన్నీ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం, విద్యకు మహానేత వైఎస్సార్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలి. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, రెహమాన్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, పుత్త ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సంగ్రామంలో కృష్ణా జిల్లా కీలక భూమిక దేశ స్వాతంత్ర్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ ఫలాలు అందరికీ అందడంలేదని పార్టీ నేత పార్థసారథి అన్నారు. 72 ఏళ్లు నిండినప్పటికి ఈ పరిస్థితి ఉండడం బాధకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కృష్ణా జిల్లా, విజయవాడ కీలక భూమిక పోషించాయని, మహాత్ముని స్ఫూర్తితో వైఎస్సార్సీపీ ముందుకెళుతుందని మల్లాది విఘ్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు పైలా సోమినాయుడు, బొప్పన భవన కుమార్, ఎమ్వీఆర్ చౌదరి, జానారెడ్డి, పుల్లారావు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన
ఆగస్టు 15 నుంచి మొదలు.. ఉదయం 8 గంటలకు షురూ ఇక ఎక్కడివారు అక్కడే సెల్యూట్ జమ్మికుంట(హుజూరాబాద్): స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పంద్రాగస్టును పురస్కరించుకొని జమ్మికుంట ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అలాగే, ఎక్కడి ప్రజలు అక్కడ సెల్యూట్ చేస్తారు. పట్టణ సీఐ ప్రశాంత్రెడ్డి ఆలోచనల్లోంచి ఈ కొత్త ఒరవడిని మంగళవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా జమ్మికుంటలో రోజూ ఉదయం 8 గంటలకు మొత్తం 11 చోట్ల ఏర్పాటు చేసిన మైకుల్లో ‘జనగణమణ’ వినిపిస్తారు. ఈ సమయంలో పట్టణ ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే సెల్యూట్ చేస్తూ.. జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇలా రోజూ ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపించి, సెల్యూట్ చేయడం దేశంలోనే తొలిసారిగా జమ్మికుంట వేదిక కానుంది. -
చండీగఢ్లో బాలికపై అత్యాచారం
పంద్రాగస్టు వేడుకలకు వెళ్తుండగా దారుణం చండీగఢ్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి, అత్యాచారం చేసిన సంఘటన చండీగఢ్లో చోటుచేసుకుంది. ఉదయం 8.15 గంటలకు బాధితురాలు(12) చిల్డ్రన్స్ పార్కు దాటుతుండగా 40 ఏళ్ల వ్యక్తి ఆమెను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చండీగఢ్ సీనియర్ ఎస్పీ ఈష్ సింఘాల్ చెప్పారు. జరిగినదంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశమంతా దట్టమైన పొదలతో నిండి ఉందని సింఘాల్ వెల్లడించారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక తన వాంగ్మూలాన్ని ఇచ్చిందని, నిందితుడితో తనకు పరిచయం లేదని పోలీసులకు చెప్పిం దని పేర్కొన్నారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. నిందితుడిని గుర్తించేందుకు సమీప ప్రాంతం లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తామని వెల్లడించారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. -
చాంద్ కా టుక్డా...
దేశభక్తి ప్రపంచ దేశాలలో భారతదేశమే చాంద్ కా టుక్డా. అద్భుత నైసర్గికతతో, అత్యంత అద్భుతమైన వనరులతో, అంత కంటే అద్భుతమైన సాంస్కృతిక మూలాలకు నిలయమైన మన దేశం... ప్రపంచ దేశాలకు మురిపెంగా కనిపించే దేశం... ముద్దొచ్చే దేశం. అందుకే కవి ఇక్బాల్ ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితాన్ హమారా’ అని మన దేశాన్ని కొనియాడాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ అక్కడి నుంచి మన దేశాన్ని చూస్తూ అదే ఉద్వేగంతో ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితాన్ హమారా’ అని పాడాడు. కాని కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. ఒడి దుడుకులు వచ్చాయి. సంస్కృతుల మధ్య స్పర్థలు వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు దాటి ముందుకు పోవడమే ఈ దేశం ఎప్పుడూ చేసింది. ఈ దేశంలో మతాల మధ్య ఉన్న సోదర భావం, అన్ని మతాలకూ ఈ దేశం పట్ల ఉన్న భక్తిభావం ఈ దేశాన్ని అచంచలంగా నిలబెడుతున్నాయి. ఈసారి ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని మతాల వాళ్లూ, అన్ని ప్రాంతాల వాళ్లూ మమేకమై జరుపుకున్న పండగ ఇది. ముస్లిం బాల బాలికలు పాల్గొన్న వేడుకలు చూపరులను మరింతగా ఆకట్టుకున్నాయి. అరచేతులో త్రివర్ణ పతాకాలతోపాటు బుగ్గలపై, అమ్మాయిల శిరో వస్త్రాలపై కూడా మూడు రంగులు రెపరెపలాడాయి. ఇది అందరి దేశం. అందరితో వెలిగే దేశం. అందరితోనే వెలగాల్సిన దేశం. మన భారతదేశం. -
కొత్త జిల్లాల్లో... జెండా ఎగరేసేదెవరు!
మంత్రులతో పాటు ఇద్దరు ఐఏఎస్లు, విప్లకు చాన్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన జిల్లాల సంఖ్యకు తగిన సంఖ్యలో రాష్ట్రంలో మంత్రులు అందుబాటులో లేరు. మొత్తం 31 జిల్లాలుంటే ముఖ్యమంత్రిసహా 18 మంది మంత్రులున్నారు. దీంతో మిగతా 13 జిల్లాలకు మంత్రులు అందుబాటులో లేకపోవటంతో జాతీయ జెండా ఎగురవేసే బాధ్యతలను ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రభుత్వ విప్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏయే జిల్లాలో ఎవరెవరు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపడతారనే వివరాలను ఇందులో పొందుపరిచారు. -
ఆగస్టు 15న కడుపులు మాడాయి...
రియో డి జనీరో: పంద్రాగస్టు సంబరాల సంగతేమో కానీ రియోలో భారత హాకీ క్రీడాకారులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి భారత దౌత్య కార్యాలయంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అథ్లెట్లను ఆహ్వానించారు. హాకీ క్రీడ ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వెళ్లారు. అక్కడ ఎలాగూ విందు ఏర్పాటు చేస్తారని, పసందైన భారత వంటకాల రుచి చూడవచ్చనే కోరికతో ఒలింపిక్ విలేజిలో తమ డిన్నర్ను రద్దు చేసుకున్నారు. అయితే కార్యక్రమంలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. వేడుక ముగిశాక కూల్ డ్రింక్స్, కాసిన్ని పల్లి గింజలు పెట్టేసరికి అంతా అవాక్కయ్యారు. దీంతో మాంచి ఆకలి మీదున్న ఆటగాళ్లు అధికారుల తీరుతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. రెండు బస్సులు మారి ఇంత దూరం వస్తే కనీసం భోజనాలు కూడా పెట్టకపోవడం దారుణమని ఓ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
ఇద్దరు ఎస్సైలకు అవార్డులు
హన్మకొండ అర్బన్ : వరంగల్ రూరల్ పోలీస్ విభాగం లో ఏఆర్ఎస్సై(6081)గా పనిచేస్తున్న ఎంఏ రఫీఖ్ ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. శనివారం హైద రాబాద్ గోల్కొండ కోటలో జరిగిన 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రఫీక్ ఈ అవార్డు అందుకున్నారు. ఏఆర్లో ఎస్సైగా విధులు నిర్వహించే రఫీక్ డ్రైవింగ్లో నిష్ణాతుడు. గతంలో పలుమారులు ఉన్నతాధికారులనుతన డ్రైవింగ్ నైపుణ్యం ద్వారా ప్రమాదాలనుంచి కాడాడారు. అదే విదంగా జిల్లాకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల పర్యటనల సమయంలో వాహనాన్ని ఎక్కువగా రఫీక్ నడిపేవారు. రఫీక్కు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది అభనందనలు తెలిపారు. కళ్లెం వాసికి గ్యాలంటరీ అవార్డు లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం గ్రామానికి చెందిన తాటిపాముల సురేష్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా జిల్లా టేకులపల్లి ఎస్సైగా పని చేస్తూ పోలీసుశాఖలో విశిష్ట సేవలు అందించినందుకు శనివారం హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చేతుల మీదుగా ప్రెసిడెంట్ ఆఫ్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు అందుకున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన తాటిపాముల వైకుంఠం, శశిరేఖల మూడో సంతానంగా సురేష్ జన్మించి ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందం గా ఉందని పలువురు గ్రామస్తులు అభినందించారు. -
‘మోడల్’ హాస్టళ్లు రెడీ!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మోడల్ స్కూళ్లలో చదువుతున్న బాలికల కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఒడిదుడుకులతో సాగిన హాస్టళ్ల నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పూర్తవుతాయి. అన్నీ అనుకున్నట్లు జరిగే ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయానికి హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మొ త్తం 33 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్ల సదుపాయం కల్పించాల్సి ఉంది. అయితే నిధుల లేమితో సమస్య మొదటికొచ్చింది. అబ్బాయిల హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా కేవలం అమ్మాయిల వాటికి మాత్రమే కేటాయించారు. ఒక్కో దానికి రూ. 1.28 కోట్లు ఆర్ఎంఎస్ఏ ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రూ. 5 లక్షల ఫర్నిచర్స్ కోసం కేటాయించాలి. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. వెంటనే పనులు మొదలు పెట్టిన ఏడాదిపాటు పనులు సాగుతూ వచ్చాయి. మే నెలలోనే పనులు పూర్తికావాల్సి ఉండగా దాదాపు రెండు నెలలు ఆలస్యంగానైనా పూర్తయాయి. జిల్లాలో 31 పాఠశాలల్లో హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డోన్, కొలిమిగుండ్ల పాఠశాలల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని కూడా వారం, పది రోజుల్లో పూర్తి చేస్తామని సర్వశిక్షా అభియాన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆయా హాస్టళ్లలో మంచినీటి సమస్య, కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నియామకం వేగవంతం: సీనియర్ అధ్యాపకులకు వార్డెన్లుగా ఇన్చార్జి ఇచ్చారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక కమాటీలు, కుక్లు, వాచ్మన్లు, ఇతర అధికారుల పోస్టులను భర్తీ చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ మోహన్ అనుమతి ఇచ్చారు. వారం రోజుల్లోగా ఔట్సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా నియమకాలు చేపట్టేందుకు చర్యలు వేగమంతమయ్యాయి. బాలికల కష్టాలు తొలగినట్లే ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో చదివే బాలికల కష్టాలు వర్ణనాతీతం. పాఠశాలకు వెళ్లాలంటే నరకం కనిపించేది. మండల కేంద్రాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలు ఉండడంతో వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రోడ్డు సదుపాయం లేని వాటికి ఆటోలు కూడా వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో అమ్మాయిలు కాలినడకన పాఠశాలలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వర్షాకాలంలో వానకు తడుస్తూ పోవాల్సిన పరిస్థితి ఉండేది. హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తవడంతో అమ్మాయిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీరనున్నాయని, హాస్టల్లో ఉండి బాగా చదువుకోవచ్చని పేర్కొంటున్నారు. -
ఎమ్మెల్యే మాధవనాయుడుపై శిక్ష తీర్పు అమలు
హైదరాబాద్ : జడ్జి, ఇతర న్యాయాధికారులతో దురుసుగా వ్యవహరించిన ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపూర్ శాసనసభ్యుడు బండారు మాధవ నాయుడు రాతపూర్వకంగా సమర్పించిన క్షమాపణలను హైకోర్టు మరోసారి తిరస్కరించింది. చేసిన పనికి ఆయనకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని, అందువల్ల ఆయనకు జరిమానా విధిస్తూ తాము విధించిన శిక్ష తాలుకు తీర్పు అమల్లోకి వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు వ్యాపారులు శాశ్వత ప్రతిపాదికన కోర్టు భవనాన్ని ఆనుకుని తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారని, వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పలువురు న్యాయవాదులు జిల్లా అదనపు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఆ తోపుడు బండ్లను అక్కడి నుంచి తొలగించేందుకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనుచరులతో అక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడు తనకు చెప్పకుండా ఎలా తోపుడు బండ్లను తొలగిస్తారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో జిల్లా జడ్జి ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ నివేదిక రూపంలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాధవ నాయుడు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు కోర్టు ధిక్కారం కింద విచారణ ప్రారంభించింది. సుదీర్ఘ విచారణ తరువాత, గత వారం తీర్పు వెలువరించిన ధర్మాసనం, జిల్లా జడ్జితో పాటు ఇతర న్యాయాధికారుల పట్ల మాధవనాయుడు దురుసుగా వ్యవహరించారని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపింది. అందుకు గాను మాధవనాయుడుకు రూ.1000 జరిమానా విధించింది. అయితే మాధవ నాయుడు భేషరతు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చిదంబరం చెప్పడంతో, ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ, భేషరతు క్షమాపణను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని, అప్పటి వరకు తమ ఆదేశాల అమలును నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా ఈ వ్యవహారం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాధవ నాయుడు సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించిన ధర్మాసనం, న్యాయాధికారులతో దురుసు ప్రవర్తనకు ఆయన ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని, అందువల్ల తాము జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. -
టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడిపై హైకోర్టు ఆగ్రహం
జడ్జితో అనుచిత ప్రవర్తన పట్ల మండిపాటు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ్యుడు బండారు మాధవనాయుడు ఓ జడ్జితో అనుచితంగా ప్రవర్తించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ఏర్పాట్ల గురించి నరసాపురం అదనపు జిల్లా జడ్జి అక్కడి న్యాయవాదుల సంఘం నేతలతో చర్చిస్తున్నారు. కొందరు వ్యాపారులు కోర్టు భవనానికి ఆనుకుని శాశ్వత ప్రతిపాదికన తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవటంతో ఏర్పడిన ఇబ్బందులను లాయర్లు జడ్జి దృష్టికి తెచ్చారు.వాటిని తొలగించాలని జడ్జి ఆదేశించారు... ఆ సమయంలో అక్కడికి తన అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే మాధవనాయుడు జడ్జితో వాగ్వాదానికి దిగారు. దీనిపై జిల్లా కోర్టు వివరణ కోరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోర్టుకు క్షమాపణ కోరటంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. అదనపు జిల్లా జడ్జి ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టుకు నివేదించారు. దీని ఆధారంగా రూపొందించిన కోర్టు ధిక్కరణ కేసును సీజే కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఇటువంటి కేసులో క్షమించే పరిధి కింది కోర్టుకు లేదని చెప్పింది. ఎమ్మెల్యే చర్యలను న్యాయవ్యవస్థపై దాడిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. -
'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేసిన ఆయన తన ప్రత్యేకత చాటారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఎటువంటి రక్షణ కవచం లేకుండా ఆయన ప్రసంగించడం విశేషం. మోడీ కంటే ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ అద్దం రక్షణ కవచం వెనుక నుంచి ప్రసంగించారు. అయితే మోడీ ఇది లేకుండానే తన శైలిలో ప్రసంగించారు. కాషాయ రంగు తలపాగా, క్రీమ్ కలర్ పైజామా, తెలుపు రంగు లాల్చీ ధరించి గుజరాతీ సంప్రదాయ ఆహార్యంతో పాటు తన ప్రసంగంతోనూ మోడీ అందరినీ ఆకట్టుకున్నారు. తొలి పంద్రాగసట్టు ప్రసంగంలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రసంగ పాఠాన్ని చదవకుండా ఆశువుగా ప్రసంగించారు. ఇక మోడీ తొలి పంద్రాగసట్టు ప్రసంగంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
దేశానికి ఎర్రకోట.. మనకు గోల్కొండ కోట
* చారిత్రక ప్రాంతంపై ఎగరనున్న జాతీయజెండా సాక్షి, హైదరాబాద్: దేశానికి ఎర్రకోట.. మనకు గోల్కొండ కోట.. పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటపై జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలనోట ప్రస్తుతం వినిపిస్తున్న మాటలివి.. కాకతీయుల కాలం నుంచి కుతుబ్షాహీల పాలన వరకు... మట్టికోట నుంచి మహా దుర్భేద్యమైన కోటగా మారిన గోల్కొండ కోటకు వేలసంవత్సరాల చరిత్ర ఉంది. చుట్టూ రక్షణ ప్రాకారాలు.. నలువైపులా ఎనిమిది ప్రధాన ద్వారాలు... అద్భుతమైన రాజప్రాసాదాలు... అందమైన ఉద్యానవనాలు... అంచెలంచెలుగా 87 బురుజులు... కుతుబ్షాహీల వైభవోపేతమైన పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట... మొఘలుల దాడులతో ప్రాభవాన్ని కోల్పోయినా అసఫ్జాహీల ఆదరణతో కొత్త వెలుగులద్దుకొంది. ఇప్పుడు ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో మరోసారి ఈ చారిత్రక కోట ప్రాచుర్యంలోకి వచ్చింది. -
గోల్కొండ కోటపైనే పంద్రాగస్టు
* పునరుద్ఘాటించిన సీఎం కేసీఆర్.. స్థల పరిశీలన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని చరిత్రాత్మక గోల్కొండ కోటలోనే నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. కోటలో రాణిమహల్ సమీపంలోని తారామతి మసీదు పైభాగం, బాలా-ఈ-హిస్సార్ కింది భాగం మధ్య ఉన్న ప్రాంతంలో పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. కోట లోపలే స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించడంతో పాటు అక్కడే పోలీసు గౌరవ వందనం స్వీకరించాలనే అభిప్రాయానికి వచ్చారు. సోమవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనాలతో కలిసి గోల్కొండ కోట, చుట్టుపక్కల ప్రాంతాలను 2 గంటల పాటు పరిశీలించారు. కోట లోపల కలియ తిరిగి పతాకావిష్కరణకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. తారామతి మసీదు ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో ఆహ్వానితులను కూర్చోపెట్టాలని సూచించారు. పతాకావిష్కరణ చేసే ప్రాంతంలో చుట్టుపక్కల బురుజులు, ఎత్తై కట్టడాలపై తెలంగాణ కళారూపాలు ప్రదర్శించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాల నిర్వహణకు మరో విశాల ప్రాంతం కావాల్సి ఉండటంతో పక్కనే ఉన్న ‘18 చిడిలు’గా పిలిచే ప్రాంతాన్ని పరిశీలించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, ఇతర రాష్ట్ర పండుగలు గోల్కొండ కోటలోనే ఘనంగా నిర్వహించేలా శాశ్వత ప్రాతిపదికన చర్యలకు ఆయన ఆదేశాలిచ్చారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఉత్సవం జరగాలని సీఎం ఆకాంక్షించారు. -
ఇక నుంచి గోల్కొండ కోటలోనే...
హైదరాబాద్: విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా గోల్కొండ కోటలోనే జెండా పండుగ నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు, గణతంత్ర దినోత్సవం, ఇతర రాష్ట్ర పండగలను కూడా ఇక నుంచి ఇక్కడే నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. పంద్రాగస్టున గోల్కొండ కోటలోని రాణిమహల్ సమీపంలో ఉన్న తారామతి మసీదుపై కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. పోలీసు వందనం స్వీకరించనున్నారు. గోల్కొండ కోటలో ఉన్న బురుజులపై తెలంగాణ కళారూపాలు ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. -
గోల్కొండలో జెండా పండుగ..!
* పూర్వ వైభవానికి మువ్వన్నెల శోభ * పరేడ్గ్రౌండ్స్కు బదులుగా కోటలో స్వాతంత్య్ర దినోత్సవం * నేడు ఏర్పాట్లను చూడనున్న సీఎస్, డీజీపీ, కొత్వాల్ * శకటాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాలి * సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన సాక్షి, హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డిలను ఆదేశించారు. సోమవారం ఉదయం వీరు చారిత్రక గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఢిల్లీలో ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహిస్తున్న మాదిరిగానే.. హైదరాబాద్కు ప్రఖ్యాతి తెచ్చిన గోల్కొండ కోటలో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై మేధావుల సూచనలు, సలహాలను కూడా ముఖ్యమంత్రి కోరారు. గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఓ చారిత్రాత్మక సన్నివేశంగా అభివర్ణిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసే శకటాలన్నీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్రదినోత్సవాలను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పరేడ్గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఈసారి అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి పాతబస్తీ ప్రాంతంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వే డుకలు నిర్వహించాలన్న ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే గోల్కొండ కోటకు వెళ్లే..రహదారి ఇరుకుగా ఉన్నందున..శకటాలు వెళ్లడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలన్న దానిపై అధికారులు దృష్టిపెట్టనున్నారు. శకటాల ప్రదర్శనలో ప్రధానంగా బతుకమ్మ, బోనాలతోపాటు చారిత్రాత్మక కట్టడాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోనున్నారు. -
గోల్కోండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చరిత్రలో నిలిచే పోయేలా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిచింది. చారిత్రక గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాలను ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఇప్పటివరకు నిర్వహిస్తూ వస్తున్నారు. గోల్కోండ కోట వద్ద నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శించేందుకు తెలంగాణ శకటాలు రెడీ అవుతున్నాయి.