
నేను చెప్పింది చేయాలి
అలా అయితేనే.. గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా
సంతబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులు
సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు షిప్పులొస్తాయి గానీ.. ఉద్యోగాలు రావని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంతబొమ్మాళి ప్రజలు తాను చెప్పింది చేయాలన్నారు. అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తానని బెదిరించారు.

సోమవారం సంతబొమ్మాళి సూర్యనారాయణస్వామి ఆలయ నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. వేట నిషేధ పరిహారాన్ని ఈనెల 15న మత్స్యకారుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు.