సీఎం జగన్‌ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు | Modern Prosthetic Leg To The Disabled Person By Order Of CM Jagan - Sakshi

సీఎం జగన్‌ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు

Aug 29 2023 8:13 AM | Updated on Aug 29 2023 3:04 PM

Modern Prosthetic Leg The Disabled Person By Order Of Cm Jagan - Sakshi

సయ్యద్‌ ఖాజాకు కృత్రిమ కాలు అందిస్తున్న కలెక్టర్‌

సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్‌ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు.

అనంతపురం అర్బన్‌: సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్‌ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. గత నెల 8న సీఎం జగన్‌ కళ్యాణదుర్గం పర్యటనకు రాగా, హెలిప్యాడ్‌ వద్ద సీఎంను కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు.

స్పందించిన సీఎం బాధితు­డికి సాయం చేయాలని అనంతపురం కలెక్టర్‌ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌ గౌతమి ఖాజాకు కృత్రిమ కాలు అందించాలనుకున్నారు. అయితే మామూలు కాలిపర్స్‌ కాకుండా నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృత్రిమ కాలును సిద్ధం చేయించి  సోమవారం  బాధితుడికి అందించారు.
చదవండి: సీఎం జగన్‌ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement