![NABARD On Friday Released Rs 2234 Crores For Polavaram Project In AP - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2020/12/5/Polavaram-Project.jpg.webp?itok=lKM1ndjF)
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్మెంట్ కింద ఎన్డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమ చేయనుంది. కాగా 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి . ఇప్పటివరకు రూ.8,507 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇంకా రూ.1788 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment