NABARD
-
నాబార్డ్ పంట రుణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాల జారీలో రాష్ట్రస్థాయి బ్యాంకులే కాక... జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) కూడా చిన్నచూపే చూస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండగా, రైతుకు ఇచ్చే రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు లక్ష్యాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025–26 సంవత్సరానికి నాబార్డు విడుదల చేసిన ఫోకస్ పేపర్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. 2025–26 సంవత్సరానికి తెలంగాణలో రుణాల లక్ష్యం రూ.3.86 లక్షల కోట్లుగా పేర్కొన్నప్పటికీ... ఇందులో కేవలం పంటలకు సంబంధించి పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం కేటాయించిన నిధులు రూ. 87,149 కోట్లు మాత్రమే. ఈ మొత్తం 2024–25లో పెట్టుకున్న రూ.90,794 కోట్ల లక్ష్యం కంటే రూ.3,645 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ఐదేళ్లుగా లక్ష్యానికి దూరంగా రుణాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024–25 లక్ష్యానికన్నా రూ.3,645 కోట్లు తక్కువగా రుణ అంచనాను ప్రకటించిన నాబార్డ్ అంతకుముందు మూడేళ్లు కూడా పంటలకు ఇచ్చే రుణాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేదు. 2021–22లో పంట రుణాల కింద రూ. 59,440 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 42,854 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. 2022–23లో రూ.67,764 కోట్ల లక్ష్యాలకు గాను రూ. 59,060 కోట్ల వరకే ఇచ్చిoది. 2023–24లో అత్యధికంగా రూ.10వేల కోట్ల లోటు కనిపించింది. ఆ ఏడాది రూ. 73,437 కోట్ల లక్ష్యానికి గాను రూ. 64,940 కోట్లు మాత్రమే పంట రుణాలుగా ఇవ్వగలిగారు. రుణాలు, పెట్టుబడి 1.39 లక్షల కోట్లు పంటకు సంబంధించి రుణాలు 87,149 కోట్లు కా గా నీటి వనరులు, యాంత్రీకరణ, ప్లాంటేషన్, హార్టికల్చర్, అటవీ, బీడు భూముల వినియోగంతో పాటు పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి టర్మ్లోన్లు, పెట్టుబడి కలిపి 2025–26 సంవత్సరానికి నాబార్డ్ రూ.1.39 లక్షల కోట్ల రుణ అంచనా వేసింది. ఇందులో యాంత్రీకరణకు రూ. 5,608 కోట్లు, నీటి వనరులకు రూ.2,613 కోట్లు, అటవీ, బీడు భూముల సాగుకు రూ. 793 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకానికి రూ.16వేల కోట్ల వరకు కేటాయించారు. 53 శాతం నిధులు ఎంఎస్ఎంఈలకే.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు నాబార్డు అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బడ్జెట్లో 53 శాతం. వ్యవసాయ టర్మ్ లోన్లు 12 శాతం కాగా, వ్యవసాయ మౌలిక వసతులకు కేవలం 2 శాతం కేటాయించారు. -
మళ్లీ పొలంబాట..!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ కుటుంబాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ... గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పొలంబాట పట్టే కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. నాబార్డు 2016–17 సంవత్సరంలో నిర్వహించిన రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా... 2021–22లో నిర్వహించిన సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాలు 57 శాతానికి పెరిగాయి.దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు 9 శాతం పెరిగినట్లు ఈ సర్వే స్పష్టంచేసింది. ఇటీవల నాబార్డు ఆ సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీతో సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉండగా... 2021–22లో ఏకంగా 53 శాతానికి పెరిగాయి. మన రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, బిహార్, సిక్కిం, త్రిపుర, పంజాబ్, మిజోరాం, మణిపూర్లలోను వ్యవసాయేతర కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. -
వ్యవసాయ కుటుంబాల.. భూపరిమాణం తగ్గుతోంది
సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణం ఏటా తగ్గిపోతోంది. 2016–17లో ఇది 1.1 హెక్టార్లుండగా 2021–22లో అది 0.7కు పడిపోయింది. ఈ విషయాన్ని నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021–22 వెల్లడించింది. వ్యవసాయ గృహాల సాగు సామర్థ్యం, ఉత్పత్తి భూమి పరిమాణం గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో దేశంలోను వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణాన్ని ఐదు తరగతులుగా వర్గీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక దేశంలో 38 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్లలోపే భూమి ఉంది.33 శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.41 హెక్టార్ల నుంచి 1.0 హెక్టార్ వరకు ఉంది. 15 శాతం వ్యవసాయ కుటుంబాలకు 1.01 హెక్టార్ల నుంచి 2.0 హెక్టార్ల వరకు భూమి ఉంది. 8 శాతం కుటుంబాలకు 2.1 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంది. ఆరు శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.01 హెక్టార్లలోపే భూమి ఉంది. ఇలా దేశంలోని వ్యవసాయ కుటుంబాలు కలిగి ఉన్న సగటు భూమి పరిమాణం రాష్ట్రాల మధ్య విస్తృత వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. ఎనిమిది రాష్ట్రాల్లో ఒక హెక్టారు కన్నా ఎక్కువ.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబానికి సగటు భూమి ఒక హెక్టార్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఒక హెక్టార్ కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లు పేర్కొంది. మరో పది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలకు సగటు భూమి 0.4 హెక్టార్లలోపే ఉందని నివేదిక తెలిపింది. అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో చిన్న భూ పరిమాణమే ఉందని సర్వే స్పష్టం చేసింది. -
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
దేశంలో కుటుంబ సగటు పరిమాణం 4.3
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గుతోంది. 2016–17తో పోల్చితే 2021–22లో గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గినట్లు ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ సర్వే 2021–22 వెల్లడించింది. 2016–17లో గ్రామీణ భారతంలో 4.5 ఉండగా 2021–22లో 4.3 ఉందని సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల పరిమాణం, కుటుంబ పెద్ద విద్యార్హతలపై నిర్వహించిన సర్వేను నాబార్డు విడుదల చేసింది. 2021–22లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాల సగటు పరిమాణం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. వ్యవసాయేతర కుటుంబాల్లో 4.0గా ఉండగా వ్యవసాయ కుటుంబాల్లో 4.5గా ఉంది. రాష్ట్రాల మధ్య గృహ పరిమాణాలలో వైవిధ్యాలను సూచిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మహారాష్ట్ర, సిక్కిం, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కుటుంబానికి సగటున నలుగురు కంటే తక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 2016–17తో పోల్చితే 2021–22లో స్వల్పంగా పెరిగింది. ఏపీలో 2016–17లో 3.5 ఉండగా 2021–22లో 3.7గా ఉంది. ఇక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల్లో 30 శాతం పెద్దలు నిరక్షరాస్యులుగా ఉండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 28 శాతం ఉన్నట్లు సర్వే తెలిపింది. -
వరి విత్తనాలు వేసే డ్రోన్ వచ్చేసింది!
డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్ను రూపొందించింది. పేటెంట్ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్ఎయు, నాబార్డ్ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్ డ్రోన్స్ విశేష కృషి చేస్తోంది. ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్ డ్రోన్స్ స్టార్టప్ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.ప్రొ. జయశకంర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), అగ్రిహబ్, నాబార్డ్ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్(ఎస్.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.వరి పంటపై పురుగుల మందు పిచికారీ..ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్ ప్రొటోటైప్ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్పిఓ లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.– ప్రేమ్ కుమార్ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్ డ్రోన్స్డ్రోన్ విత్తనాలు వెద పెట్టేది ఇలా..వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సహాయంతో సీడ్ డ్రిల్తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్ సీడర్ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్లాంటి సీడ్ డిస్పెన్సింగ్ డివైస్ను అమర్చుతారు. ఆ డివైస్కు డ్రోన్కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.హెక్టారుకు రూ.5 వేలు ఆదా..వెద వరి (డైరెక్ట్ సీడిండ్ రైస్– డిఎస్ఆర్) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ అంచనా. డ్రోన్ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.700 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ..మారుత్ డ్రోన్స్ పిజెటిఎస్ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్ లైసెన్స్ వస్తుంది. వ్యవసాయ సీజన్లో డ్రోన్ పైలట్కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్ వివరించారు. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పేదల ఇళ్లకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. -
ఏపీలో పంట సాగుదారుల హక్కు చట్టం భేష్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం–2019 బాగుందని నాబార్డు ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది. భూ యజమాని హక్కులకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా, వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదపడతోందని పేర్కొంది. భూ యజమాని అనుమతితో పంటసాగు హక్కు పత్రాలు(సీసీఆర్సీ) జారీ చేసి కౌలుదారులకు పంట రుణాలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుండటం హర్షణీయమంది. రాష్ట్రంలో సీసీఆర్సీ చట్టం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ముంబైలోని నాబార్డు మేనేజర్లు బెంజమిన్ థామస్, అరవింద్కుమార్, నాబార్డు కన్సల్టెంట్ ప్రణవ్ఖాత్రిల సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు శ్రీకారం చుట్టింది. తొలిరోజు గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి భూ యజమానులు, కౌలు రైతులతో ముఖాముఖిలో పాల్గొంది. చట్టం అమలు తీరుపై అధ్యయనం చేసింది. పకడ్బందీగా అమలు చేస్తే మరింత మేలు సీసీఆర్సీ కార్డుల జారీ, రుణాలతో పాటు సంక్షేమ ఫలాల అమల్లో ఎదురయ్యే ఇబ్బందులను బృందం సభ్యులు తెలుసుకున్నారు. ఈ చట్టం వల్ల తమకెన్నో ప్రయోజనాలున్నాయని, అయితే అంగీకార పత్రాలపై సంతకాలు చేయడానికి భూయజమానులు వెనుకంజవేస్తున్నారని కౌలు రైతులు నాబార్డు బృందం దృష్టికి తెచ్చారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి పంట రుణాల మంజూరులో కొంత మంది బ్యాంకర్లు ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. మరోవైపు, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తే భవిష్యత్లో లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన తమకుందని భూ యజమానులు చెప్పారు. సీసీఆర్సీ చట్టం రూపకల్పన చాలా బాగుందంటూ నాబార్డు బృందం సభ్యులు ప్రశంసించారు. చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే మెజార్టీ కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. చట్టంపై కౌలు రైతులతో పాటు భూ యజమానులకూ అర్థమయ్యే రీతిలో మరింత అవగాహన కచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రీతిలో కౌలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండే రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే మంచి ఫలితాలొస్తాయని అభిప్రాయపడ్డారు. 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులిచ్చామని అధికారులు వివరించారు. 14.13 లక్షల మందికి బ్యాంకర్ల ద్వారా రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయించగలిగినట్టు తెలిపారు. అత్యధికంగా ఈ ఏడాది 8.31 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా, వీరిలో 5.48 లక్షల మందికి రూ.1908 కోట్ల రుణాలు మంజూరైనట్టు తెలిపారు. పంట రుణాలే కాదు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పరిహారం, పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొంతమంది బ్యాంకర్లు చూపే సాంకేతిక కారణాలతో నూరు శాతం కార్డుదారులకు రుణాలు మంజూరు చేయలేకపోతున్నామని వివరించారు. పర్యటనలో నాబార్డు ఏపీ ఏజీఎం స్మారక్ మోహంతి, డీడీఎం అనిల్కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్లోన్ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది. బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్ తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్రావు రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్బీఐ జీఎం, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు విద్య రూ.2706.50 కోట్లు గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు ఇతర రంగాలు రూ.2283.51 -
రూ.242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. -
ధాన్యం దిగుబడిలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: హెక్టార్కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. మొదటి స్థానంలో పంజాబ్ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2022–23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్కు ధాన్యం దిగుబడిపై నాబార్డు నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్కు ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సస్య రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పైర్లపై వచ్చే వివిధ చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి, వాటి వలన పంటలకు ఏ విధమైన నష్టమూ వాటిల్లకుండా.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు ఆర్బీకేలు తోడుగా నిలుస్తున్నాయి. నిరోధక శక్తిగల వరి రకాలను ఎంచుకునేలాగ రైతులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విత్తన శుద్ధి పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నారు మడిలో సస్యరక్షణను పాటింపజేయడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. అలాగే నత్రజని ఎరువును సిఫారసుకు తగినట్టే వినియోగించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏ తెగుళ్లు సోకితే ఎంత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలో కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, దిగుబడిని పెంచే ఇన్పుట్లు మొదలైనవి రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో విత్తనం నుంచి పంట కోసి, విక్రయం వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తోంది. దీంతో హెక్టార్కు ధాన్యం దిగుబడిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. -
మన మహిళ పొదుపులో అగ్రగామి
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా నాలుగేళ్లుగా అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. మన స్వయం సహాయక సంఘాలు పొదుపు విషయంలో, క్రెడిట్ లింకేజీలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, పొదుపు సంఘాల పనితీరుపై నాబార్డు 2022 – 23 వార్షిక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల పొదుపు నమోదైందని, ఈ విషయంలో రాష్ట్ర పొదుపు సంఘాలు అగ్రగామిగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు కూడా ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గాడిన పడ్డ సంఘాలు చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో గత నాలుగేళ్లుగా ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2022 – 23 మార్చి నాటికి) రూ.58,892.68 కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా పొదుపు సంఘాల పొదుపు రూ.28,968.44 కోట్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల పొదుపు రూ.18,606.18 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో అన్ని రాష్ట్రాల సంఘాల పొదుపులో ఏపీ స్వయం సహాయక సంఘాల పొదుపే 31 శాతం కావడం విశేషం. 2021–22తో పోలిస్తే 2022–23లో ఏపీ పొదుపు సంఘాల పొదుపు రూ.6,938 కోట్లు పెరగడం గమనార్హం. 2021–22 నాటికి రాష్ట్ర పొదుపు సంఘాల పొదుపు రూ.11,668 కోట్లు కాగా ఇప్పుడు రూ.18,606 కోట్లకు పెరిగింది. పరపతి పెరిగింది చంద్రబాబు పాలనలో రుణమాఫీ దగాతో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి క్షీణించింది. స్వయం సహాయక సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనకాడాయి. దీంతో సంఘాలు సి, డి గ్రేడ్లకు పడిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాలకు ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు చెల్లించారు. అంతేకాకుండా చంద్రబాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని కూడా పునరుద్ధరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగి ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా నిలిచాయి. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉండగా ఇప్పుడు 89 శాతం సాధించడం గమనార్హం. వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉంది. 2022–23లో వాణిజ్య, రీజనల్ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కలిపి ఏపీ పొదుపు సంఘాలకు దేశంలోనే అత్యధికంగా రూ.40,230.63 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం 2022–23లో దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కో సంఘం సగటు పొదుపు అత్యధికంగా రూ.1,72,124 కాగా తెలంగాణలో రూ.85 వేలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022–23లో ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.43,940 నుంచి రూ.30 వేలకు పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. భారీగా తగ్గిన నిరర్థక ఆస్తులు నాడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసగించడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా వాటి నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయి. ఇప్పుడు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. పొదుపు సంఘాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో 5.86 శాతం నిరర్థక ఆస్తులుండగా 2022 – 23 నాటికి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.41 శాతానికి, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో 0.25 శాతానికే పరిమితమైనట్లు నివేదిక తెలిపింది. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం సకాలంలో రుణాలను చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీని రీయింబర్స్మెంట్ చేయడంతో పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని పేర్కొంది. పొదుపు మహిళల జీవనోపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రస్తావించింది. ఆసరా ద్వారా అందిస్తున్న డబ్బులతో వ్యాపారాలు నిర్వహిస్తూ పొదుపు సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలను చేసుకుని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్లెట్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
దేశంలో పెరిగిన పాల ధర
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది. 30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సకాలంలో టీకాలు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది. -
రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 అని నాబార్డు తేల్చింది. 2012–13లో ఇది రూ.6,426 కాగా, 2018–19 నాటికి రూ.10,084కు పెరిగిందని తెలిపింది. అయితే సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయం మాత్రం అంతగా లేదని పేర్కొంది. ఈ మేరకు పరిశోధనాత్మక అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది. పంటలు, పశు సంపద, వ్యవసాయేతర వ్యాపారం వంటి అంశాలను కూడా అధ్యయనంలో పరిశీలించారు. ‘మొత్తంగా పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయం వాటా 38 శాతం కాగా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం వాటా 16 శాతంగా ఉంది. వ్యవసాయేతర రంగాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. కాగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణాతో పాటు జార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం అత్యధికంగా ఉంది. భూ పరిమాణం పెరిగినప్పుడు, వ్యవసాయ కార్యకలాపాల (పంటల ఉత్పత్తి, జంతువుల పెంపకం) ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. పెద్ద రైతులకు అంటే 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 91 శాతం, కాగా చిన్న సన్నకారు రైతులకు ఇలా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. ఈ విధంగా రైతు భూ పరిమాణాన్ని బట్టి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓబీసీ, ఇతర వర్గాల ఆదాయంతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాల ఆదాయం తక్కువగా ఉంది..’అని నాబార్డు నివేదిక వెల్లడించింది. భవిష్యత్ తరాలు వ్యవసాయానికి దూరం ‘భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 63 శాతం మంది రైతులు తమ భవిష్యత్ తరం వ్యవసాయంలో ఉండాలని కోరుకోవడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదని భావిస్తున్నారు. అందుకే కొత్త తరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం చేయడం రిస్్కగా వారు భావిస్తున్నారు. వ్యవసాయ భూపరిమాణం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగ డం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కీలకమైన కూలీల కొరత కూడా అనాసక్తికి కారణంగా ఉంది. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కూడా భవిష్యత్ తరం వ్యవసాయానికి దూరంగా ఉండటానికి కారణంగా కన్పిస్తోంది. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు గౌరవం, సామాజిక హోదా కూడా ఉండటం లేదు..’అని పేర్కొంది. లాభదాయకం కాదనే భావన.. ‘వ్యవసాయం లాభదాయకం కాదని రైతులు భావిస్తున్నారు. మార్కెటింగ్ సహా పటిష్టమైన సేకరణ వ్యవస్థ లేకపోవడం, మద్దతు ధరలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంపై అనాసక్తి చూపిస్తున్నారు. 62 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరకు స్థానిక విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 50 ఏళ్ల వయస్సున్న రైతుల్లో 70 శాతం మంది వరి సాగును కొనసాగిస్తున్నందున పంటల సాగులో వైవిధ్యం ఉండటం లేదు. కూరగాయలు, పండ్ల సాగు ద్వారా రైతుల్లో ఆదాయ ఉత్పత్తి గత 30 సంవత్సరాలలో తక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది..’అని నాబార్డు తెలిపింది. -
‘సూక్ష్మ’సాగే బాగు
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) రైతన్నలకు ఎంతో లాభదాయకమని నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ నాబ్కాన్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అవసరమైన చోట్ల మాత్రమే మొక్కలకు నీరు అందడం వల్ల కలుపు, చీడపీడల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. సూక్ష్మ సేద్యం ద్వారా కేవలం నీరు మాత్రమే కాకుండా విద్యుత్తు, కూలీల వ్యయంలో పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. తద్వారా అన్నదాతలకు సాగు వ్యయం, అనవసర ఖర్చులు తగ్గిపోయి అదనపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ అధ్యయనంతో తేలిందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం విధానంలో హెక్టార్కు గంటకు 1,553 కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. యూనిట్ విద్యుత్కు రూ.4 చొప్పున ఆదా అవుతుందని నాబ్కాన్స్ నివేదిక తెలిపింది. హెక్టార్కు 52 పనిదినాల కూలీల వ్యయం తగ్గుతుంది. రోజు కూలీ రూ.245 చొప్పున ఆదా అవుతుంది. హెక్టార్కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుండగా అదనపు ఆదాయం రూ.1,15,000 సమకూరుతుంది. సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు రైతులకు బహుళ ప్రయోజనాలను అందించే కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎం కేఎస్వై) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీపై బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 11.91 లక్షల మంది రైతులు 13.41 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అనుసరిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది 75,000 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 60,500 హెక్టార్లకుపైగా ఈ పరిధిలోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరో 2,38,070 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల్లో 2.02 లక్షల రైతులు నమోదు చేసుకున్నట్లు సర్వే పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో 70 శాతం సూక్ష్మ సేద్యం చేయడం ద్వారా ఎంత మేరకు నీరు, విద్యుత్, కూలీల వ్యయం తగ్గుతుంది? సాగు ఖర్చులు ఎంత తగ్గుతాయి? రైతులకు అదనపు ఆదాయం ఎంత లభిస్తుందనే అంశాలపై నాబ్కాన్స్ గణాంకాలు రూపొందించినట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నీటి కొరతను అధిగమించేందుకు సూక్ష్మ సేద్యాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని నాబ్కాన్స్ నివేదిక సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యం విస్తీర్ణంలో 70 శాతం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉందని వెల్లడించింది. మిగతా రాష్ట్రాల్లోనూ సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
కూరగాయలకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: దేశంలో కూరగాయలకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2030 నాటికి దేశంలో కూరగాయల కొరత ఏర్పడుతుందని, దేశంలో అవసరాలకు తగినంతగా ఉత్పత్తి ఉండదని జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే మాంసం, పండ్లకు కూడా స్వల్పంగా కొరత ఏర్పడుతుందని పేర్కొంది. 2030 నాటికి దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లు కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తి పెరుగుతుందా లేదా అనే అంశంపై నాబార్డు అంచనా వేసింది. పంట తరువాత వృథాను కూడా తీసివేసిన తరువాత డిమాండ్, లభ్యతను లెక్కగట్టింది. 2030వ సంవత్సరానికి దేశంలో కూరగాయల డిమాండ్ 192 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, అయితే లభ్యత 160 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా 32 మిలియన్ టన్నుల కూరగాయల కొరత ఉంటుంది. అప్పటికి దేశంలో 103 మిలియన్ టన్నుల పండ్లు అవసరమైతే 93.1 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతాయని తెలిపింది. 9.9 మిలియన్ టన్నుల పండ్ల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో 5.54 శాతం వాటాతో భారతదేశం రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఎగుమతులు చేసినప్పటికీ, చేపల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని చెప్పింది. 2030 నాటికి చేపల డిమాండ్ 11.1 మిలియన్ టన్నులు ఉంటుందని, ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువగా 11.9 మిలియన్ టన్నులు ఉంటుందని వెల్లడించింది. గుడ్లు 5.8 మిలియన్ టన్నులు డిమాండ్ ఉండగా లభ్యత 5.9 మిలియన్ టన్నులు ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా పాలకు కొరత ఉండదని, అవసరానికంటే పాల ఉత్పత్తి ఎక్కువే ఉంటుందని వివరించింది. మాంసం అవసరానికంటే లభ్యత 1.2 మిలియన్ టన్నులు తక్కువ ఉంటుందని నివేదిక తెలిపింది. రైతులు పండించిన పంటలకు రవాణా వ్యయం తగ్గించేందుకు మార్కెటింగ్లో సమష్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. సన్న, చిన్న కారు రైతులతో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులకు మంచి ధరలకు హామీ లభిస్తుందని నివేదిక పేర్కొంది. వివిధ సమస్యలను అధిగమించేలా ఒప్పంద వ్యవసాయం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. -
మిల్లెట్స్ వాల్ క్యాలెండర్
2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ’ మిల్లెట్స్పై ఓ వాల్ క్యాలెండర్ను ప్రచురించింది. నాబార్డ్ సహాయంతో ఆర్.ఆర్.ఎ. నెట్వర్క్తో కలసి సహజ సమృద్ధ ఈ క్యాలెండర్ను ఆంగ్లం, తెలుగు, కన్నడ తదితరప్రాంతీయ భాషల్లోనూ రూపొందించింది. ఈ క్యాలెండర్లో వర్షాధార వ్యవసాయ పరంగా చిరుధాన్యాలప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు.. పౌష్టికాహార లోపాన్ని పారదోలే అద్భుత చిరుధాన్య వంటకాలను తయారు చేసుకునే పద్ధతులను,ప్రాసెసింగ్ యంత్రాల సమాచారాన్ని సైతం ఇందులో సచిత్రంగా వివరించారు. మిల్లెట్లను పునరుద్ధరించడంలో, సాంప్రదాయ మిల్లెట్ ఆహార వ్యవస్థను సజీవంగా ఉంచడంలో రైతులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నిర్వహిస్తున్న పాత్రను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తుంది. ఈ 24 పేజీల క్యాలెండర్. క్యాలెండర్ ధర రూ.150 (కొరియర్ ఖర్చుతో సహా). ఇతర వివరాల కోసం... 99720 77998 నంబరుకు కాల్ చేయవచ్చు. -
Andhra Pradesh కోవిడ్లో దున్నేసింది!
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని అధిగ మించి మరీ వ్యవపాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా 2019–20తో పోల్చితే 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీగా 20.75 శాతం మేర వృద్ధి నమోదైనట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఏపీ నుంచి 2020–21లో భారీగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తరువాత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కోవిడ్ విసిరిన సవాళ్ల మధ్య కూడా 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి నమోదు కావటాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 2019–20లో దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ.2.53 లక్షల కోట్లు ఉండగా కోవిడ్ మహమ్మారిని అధిగమించి 2020–21లో రూ.3.05 లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి. పది దేశాలకే అత్యధికం భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, సౌదీ ఆరేబియా, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, మలేషియా అది పెద్ద మార్కెట్గా నిలిచాయని, మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ దేశాలదే 52.2 శాతం వాటా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020–21లో దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల వాటా 21.4 శాతంగా ఉంది. తరువాత సముద్ర ఉత్పత్తులు 14.5 శాతం, సుగంధ ద్రవ్యాలు 9.7 శాతం, గేదె మాంసం 7.7 శాతం, చక్కెర 6.8 శాతంగా ఉంది. ప్రధానంగా ఈ ఐదు ఎగుమతుల వాటా 60.10 శాతంగా ఉన్నట్లు నివేదిక విశ్లేషించింది. తొలిసారిగా రాష్ట్రానికి 4వ స్థానం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం 2020–21లో రూ.23,505.2 కోట్ల విలువైన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. అయితే గత సర్కారు హయాంలో ఏ ఒక్క ఆర్థిక ఏడాదిలోనూ రూ.9,000 కోట్ల మేర కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగలేదు. టీడీపీ హయాంలో 2028–19లో ఏపీ నుంచి రూ.8,929.5 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏడు రాష్ట్రాల వాటా 88 శాతం ఉన్నట్లు తెలిపింది. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్డౌన్తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ కార్యక్రమాలు అద్భుతం
సాక్షి, అమరావతి: నాబార్డ్ సాయంతో విద్యారంగంలో చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నాబార్డ్ చైర్మన్తో పాటు.. ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా నాబార్డ్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం వివరించారు. ఏపీలో 3 ఏళ్లలో మూడురెట్లు పెరిగిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో మూడు రెట్లు వ్యాపారం పెరగడం నిజంగా గొప్ప విషయమన్నారు. మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమ్మేళనం(బ్యాంకర్స్ కాంక్లేవ్)కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రూ.10 వేల కోట్ల టర్నోవర్ దాటిన తొలి బ్యాంక్గా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాంక్ను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాంకులు కూడా మారుమూల ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే రుణాల్లో కనీసం 40 శాతం సహకార బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పాడి, పశుపోషణ, మత్స్య అనుబంధ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు గ్రామాలకొకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఎసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాబార్డ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీలు పడవని, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అంతరాయం ఏర్పడదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీలో సహకార బ్యాంకులు సీడీ రేషియో 140 శాతం సాధించడం పట్ల ఎంపీ బాలశౌరి బ్యాంకర్స్కు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం: నాబార్డ్ చైర్మన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోందని, ఇందుకు కారణం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజి పేర్కొన్నారు. విజయవాడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడకి రావడానికి ముందు మచిలీపట్నం వెళ్లాను. ఆప్కాబ్ ఈ ఏడాదిలో మూడు రెట్లు పెంచుకోవడం అభినందనీయం. ఏపీ జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. సహకార రంగాల బలోపేతం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను డీడీటీ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది బ్యాంకింగ్ రంగానికి ఎంతో మేలు చేస్తోంది’ అని అన్నారు. సీఎం జగన్ను కలిసిన నాబార్డ్ ప్రతినిధుల బృందం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజితో పాటు నాబార్డ్ ప్రతినిధుల బృందం కూడా కలిసింది. సీఎం జగన్తో నాబార్డ్ బృందం సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నారు. నాబార్డ్ చైర్మన్ కీవీ షాజిని శాలువా కప్పి సత్కరించిన సీఎం జగన్.. వెంకటేశ్వరుని ప్రతిమను కూడా అందజేశారు. -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.85 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటించింది. ఈ మేరకు 2023–24కు సంబంధించిన ఫోకస్ పేపర్ను గురువారం విడుదల చేసింది. మొత్తం ప్రాధాన్యత రంగాల్లో రూ. 1,85,327 కోట్ల రుణ లక్ష్యం కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 1,12,762 కోట్లుగా లెక్కగట్టింది. వ్యవసాయ రుణాల్లో కీలకమైన పంట రుణాలకు రూ. 73,436 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. రుణ లక్ష్య ఫోకస్ పేపర్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. 2022–23 రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1,66,257 కోట్లు కాగా, అందులో వ్యవసాయ, అనుబంధాల రుణ లక్ష్యం రూ. 1.01 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది కంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 19,070 కోట్లు ఎక్కువగా ఉంది. సాగులో దేశానికే రోల్మోడల్ తెలంగాణ: మంత్రి హరీశ్ రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి రోల్ మోడల్గా మారిందని, దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగుభూమి, పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19 శాతంగా ఉందన్నారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాటా కేవలం 3.5 శాతమేనని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 10 శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3 శాతంగానే ఉందని వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ భారీగా నిధులను వెచ్చించిందన్నారు. ఆయిల్పాం సాగుకు చేయుత ఇవ్వాలి... నాబార్డు మూడు అంశాలపై దృష్టిపెట్టి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తోందని, ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరిసాగులో నాట్లకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలు అందించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డును కోరారు. సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి త్వరగా అనుమతి ఇవ్వా లని నాబార్డు సీజీఎం సుశీల చింతలను కోరారు. తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలు: సీఎస్ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.75 లక్షలుగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు సమయానికి ఇప్పటికీ ఇది రెట్టింపు అయిందన్నారు. జీఎస్డీపీ దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామకృష్ణారావు, రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. -
నాబార్డ్ చైర్మన్గా షాజి కేవీ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నాబార్డ్ చైర్మన్గా షాజి కేవీ ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్కు తెలియజేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సుచీంద్ర మిశ్రా అదనపు బాధ్యతల కింద చూస్తుండగా, ఆయన నుంచి స్వీకరించినట్టు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు ఇచ్చారు. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కరోనా తర్వాత, 2020 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకులు రూ.12 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 86,996 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏటీఎంలలో మోసాలు 2019-20లో రూ.116 కోట్ల మేర ఉంటే, 2020-21లో రూ.76 కోట్లకు తగ్గినట్టు చెప్పారు. ఇవీ చదవండి: టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్టెక్ ప్లాట్ఫాం వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్! ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
చిరుధాన్యాలతోనే విరుగుడు
సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది. ఇటీవల రాయచూర్లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్–సవాళ్లు స్టార్టప్ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది. చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది. ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. రైతులకు లాభసాటిగా చేయాలి చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది. విజయనగరంలో మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ ఇక ఆంధ్రప్రదేశ్లో మిల్లెట్స్ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది. మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎఫ్పీఓతో కలిసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది. చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే.. ► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి. ► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి. ► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ► అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి. ► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది. ► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి. ► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి. ► సాంకేతికత సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్ పరికరాలను ఏర్పాటుచేయాలి. -
పంజాబ్ను మించి ఏపీ.. నాబార్డు అధ్యయన నివేదిక ఏం చెప్పిందంటే?
సాక్షి, అమరావతి: గత దశాబ్ద కాలంలో దేశంలో వ్యవసాయ రుణాల పంపిణీ మూడు రెట్లు పెరిగినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. 2011–12లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల పంపిణీ రూ.5.11 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి మూడు రెట్లు పెరిగి రూ.15.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్లలో 11.9 శాతం వృద్ధి నమోదైంది. పంజాబ్ను మించి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రుణ లభ్యత మెరుగ్గా ఉండటం గమనార్హం. నాబార్డు నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు.. ♦2011–12 నుంచి స్వల్పకాలిక పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక టర్మ్ రుణాలు పెరిగాయి. 2017–18లో దీర్ఘకాలిక టర్మ్ రుణాల పంపిణీలో వృద్ధి 9.9 శాతం ఉండగా 2020–21 నాటికి 43.17 శాతానికిచేరింది. ♦వ్యవసాయ యాంత్రీకరణ, పంపు సెట్లు, నీటి పారుదల నిర్మాణాలు, తోటల అభివృద్ధి, ఫామ్ పాండ్లు, మైక్రో ఇరిగేషన్, పొలంలో ఉత్పాదక సామర్థ్యం పెంపు తదితరాలకు నాబార్డు, బ్యాంకులు దీర్ఘకాలిక టర్మ్ రుణాలను మంజూరు చేస్తున్నాయి. ♦బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి లభించినా బ్యాంకు రుణాల మంజూరులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయి. ♦దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయ రుణాల పంపిణీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో హెక్టార్కు రుణ లభ్యత మెరుగ్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల హెక్టార్కు రుణ లభ్యత రూ.లక్ష లోపే ఉంది. ♦2019 – 20లో ఆంధ్రప్రదేశ్లో హెక్టార్కు రూ.1.29 లక్షలు, పంజాబ్లో రూ.లక్షకు పైగా రుణ లభ్యత ఉంది. ♦వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంలో కిసాన్ క్రెడిట్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2019 మార్చి 31 నాటికి 1,896 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరయ్యాయి. ♦2011–12లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు రూ.3.96 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి రూ.8.85 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక టర్మ్ రుణాలు ఇదే సమయంలో రూ.1.14 లక్షల కోట్ల నుంచి రూ.6.73 లక్షల కోట్లకు పెరిగాయి. -
భారత్లో పాలు, మాంసానికి భారీ డిమాండ్.. నివేదికలో కీలక అంశాలు!
సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది. పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది. ఆహార అలవాట్లలో మార్పు 1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది. -
నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు. తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్ఆర్బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది. -
మహిళా సంఘాలకు సీఎం జగన్ పాలనలో కొండంత అండ
-
పుష్కలంగా ఆహారం.. అయినా పోషకాహార లోపం..
సాక్షి, అమరావతి: దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. తిండి కొరతవల్ల కాకుండా ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువమంది ఈ లోపం బారిన పడుతున్నారు. నిజానికి.. దేశంలో తలసరి ఆహార ఉత్పత్తి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 1980 ప్రారంభంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక కిలోకంటే కొంత ఎక్కువగాను.. ఇటీవల కాలంలో 1.73 కిలోల ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య, పోషకాహార సూచికలు పేలవంగా ఉన్నాయని.. ఈ సూచికల క్షీణత ఆందోళన కలిగిస్తోందని నాబార్డు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2021 వెల్లడించింది. నివేదికలో పొందుపర్చిన సూచనలు, ఇతర ముఖ్యాంశాలివీ.. ► దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► 15–49 ఏళ్లలోపు మహిళల్లోని 57 శాతం మందిని కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. 2015–16తో పోలిస్తే పిల్లల్లోనూ, మహిళల్లోనూ ఇది పెరగడం ఆందోళన కలిగించే అంశం. ► ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధాన కారణం. ► పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లు కారణంగా ఈ లోపాలబారిన పడుతున్నారు. ► ఎక్కువగా కారం, నూనె, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడమే కారణం. ► ఈ లోపానికి పూర్తిగా కొనుగోలు సామర్థ్యం తక్కువగా ఉండటం కారణం కాదు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల వారిలో కూడా ఈ లోపాలున్నాయి. ► ఈ లోపంతో పిల్లలు బరువు తక్కువగా ఉండటం చాలా సాధారణమైంది. ► శరీరం పోషకాలను గ్రహించడం కూడా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. ► ఆరోగ్య సూచికలను మెరుగుపరచడానికి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ► ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి. ► రసాయన అవశేషాల వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి. -
జాతీయ ఆదాయంలో.. ‘వ్యవసాయం’ వాటా తగ్గుతోంది
సాక్షి, అమరావతి: జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గిపోతోందని, అదే సమయంలో దేశంలో సాగుచేసే వారి సంఖ్య పెరుగుతోందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే, ఇతర దేశాలతో పోలిస్తే వ్యవసాయ కూలీల సంఖ్య దేశంలో ఆశించిన స్థాయిలో తగ్గలేదని, రైతుల ఆదాయం కూడా పెరగడంలేదని ఆ నివేదిక పేర్కొంది. 21వ శతాబ్దంలో.. వ్యవసాయ రంగంలో సవాళ్లు–అనుసరించాల్సిన విధానాలపై నాబార్డు అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. నివేదిక ముఖ్యాంశాలు ఇవీ.. ► జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 1991లో 27.3 శాతం ఉండగా 2019 నాటికి 16.7 శాతానికి తగ్గిపోయింది. ► అయితే, ఇతర దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఉద్యోగుల సంఖ్య బాగా క్షీణించినప్పటికీ దేశంలో మాత్రం ఆ తగ్గుదల చాలా తక్కువగా ఉంది. ► 1993–94 ఆర్థిక సంవత్సరంలో సాగుచేసే వారి సంఖ్య దేశంలో 138 మిలియన్లుండగా 2019–20 నాటికి 166 మిలియన్లకు పెరిగింది. పురుషులతో పాటు మహిళా సాగుదారుల సంఖ్య కూడా పెరిగింది. ► సాగు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో రైతుల ఆదాయం పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. రైతుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిసారించాలి. వేగవంతమైన రేటుతో రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయోత్పత్తిలో మార్పు అవసరం. ► ఉత్పాదకత పెరుగుదల, సగటు వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరల కల్పించడం, విస్తరణ వంటి బహుముఖ వ్యూహం ద్వారా మార్కెటింగ్ అనుబంధ కార్యకలాపాలను చేపట్టాలి. ► అలాగే.. రైతులను వ్యవసాయేతర వృత్తుల వైపు మార్చడంపైన దృష్టిసారించాలి. ► ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం దేశంలో ఇంకా చాలామంది కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అయితే, ఇతర దేశాల్లో ఈ రంగంపై ఆధారపడిన కూలీల సంఖ్య బాగా తగ్గింది. ► వ్యవసాయం నుంచి శ్రామిక శక్తిని పారిశ్రామిక రంగం వైపు మళ్లించడంలో ఆ రంగం వైఫల్యాలే కారణం. అందుకే దేశంలో అత్యధిక సంఖ్యలో కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం నుండి తయారీ, సేవల వరకు అవకాశాలను కల్పించేందుకు అన్వేషించాలి. ► వ్యవసాయం, వ్యవసాయేతర ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడంపై ఆలోచన చేయాలి. సవాళ్లపై దృష్టిపెట్టాలి ఇక 21వ శతాబ్దంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారించడంతో పాటు అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని నాబార్డు నివేదిక సూచించింది. అలాగే, కొన్ని దశల్లో వ్యవసాయంలో అధిక వృద్ధిరేటు.. దేశంలో ఆహార పదార్థాల వాస్తవ ధరలను తగ్గించలేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడానికి నైపుణ్యం అవసరమని.. ఇందులో భాగంగా, గ్రీన్హౌస్ సాగు, పాలీ హౌసెస్, టిష్యూ కల్చర్ విధానాలు అనుసరించడం ద్వారా సగటు వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచుతుందని నివేదిక తెలిపింది. ప్రజల ప్రాధాన్యతలను, రైతుల ఆదాయాన్ని పెంచే జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పద్ధతులను అనుసరించాలని వివరించింది. -
Kakani Govardhan Reddy: ఏపీ వైపు దేశం చూపు..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఏపీని మోడల్గా తీసుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు నాబార్డు అందిస్తోన్న చేయూత ప్రశంసనీయమన్నారు. ఇదేబాటలో మిగిలిన బ్యాంకులన్నీ సహకరించాలని కోరారు. విజయవాడలో సోమవారం జరిగిన నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2021–22 సీజన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం రూ.39,708 కోట్ల రుణాలు నాబార్డు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి రైతుకు పీఎంఎఫ్బీవై వర్తింపజేయాలని సూచిస్తే పట్టించుకోకుండా.. వెబ్ల్యాండ్ ఆధారంగా అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతోనే ఆ పథకం నుంచి వైదొలిగామన్నారు. నాబార్డు సహకారం వలనే 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయగలిగామని, మిగిలిన చెల్లింపుల కోసం సోమవారం మరో రూ.1,600 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ (ఆర్సీఎస్) అహ్మద్బాబు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, ఎస్బీఐ జీఏం ఓం.నారాయణ్ శర్మ తదితరులు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధి, విధాన రూపకల్పనలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నాబార్డు సీజీఎం ఎం.ఆర్ గోపాల్ మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో ప్రారంభమైన నాబార్డు నేడు రూ.7.6లక్షల కోట్ల టర్నోవర్కు చేరిందన్నారు. నాబార్డు జీఎంలు బి.ఉదయభాస్కర్, ఎన్ఎస్ మూర్తి, ఆప్కాబ్ ఎండీ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
AP: సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. దేశంలో వ్యవసాయ సాంకేతికతపై నాబార్డు పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూక్ష్మ సేద్యంలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఏపీలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం ఈ తరహా సేద్యమే చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అదే కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్ర 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్లో 22 శాతం సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక భూగర్భ జలాలు బాగా అడుగంటిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యం సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉండటంపట్ల నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పంజాబ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం కేవలం ఒక శాతమే ఉండగా.. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో పది శాతమే ఉంది. నిజానికి.. ఈ రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని, ఆయినా సరే నీటిని ఆదాచేసే మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీని వినియోగించడంలో ఇవి బాగా వెనుకబడి ఉన్నట్లు నివేదిక వ్యాఖ్యానించింది. అయితే, ఇక్కడ వరి సాగు ఎక్కువగా ఉండటం కూడా మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని వివరించింది. సూక్ష్మ సేద్యంలో వరిసాగుపై పరిశోధనలు మరోవైపు.. వరి సాగులో మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నాబార్డు నివేదిక తెలిపింది. సూక్ష్మ సేద్యంలో నీటి ఆదాతో పాటు పంటల ఉత్పాదకత బాగా పెరుగుతుందని.. అలాగే, విద్యుత్, కూలీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని పలు సర్వేల్లో వెల్లడైందని అందులో ప్రస్తావించింది. నీరు ఆదా కావడమే కాకుండా ఉత్పాదకత గణనీయంగా పెరిగినట్లు ఈ తరహా సాగు చేస్తున్న 60 శాతం రైతులు వెల్లడించారని నివేదిక పేర్కొంది. ప్రధానంగా అరటి, వేరుశనగ, పత్తి పంటల సాగులో మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకత పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలిందని వివరించింది. -
వేగంగా కొత్త వంతెనల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నదులు, కాలువలు, వాగులు దాటడానికి పడవలు, బల్లకట్లు, పుట్టిలు వంటి ప్రమాదకర ప్రయాణాల నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన, మైనర్ వంతెనల నిర్మాణాన్ని కూడా వేగంగా చేపడుతోంది. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (నిడా) రెండో దశ కింద రూ.262.36 కోట్లతో 25 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒక్కోవంతెనతో కనీసం లక్ష మంది ప్రజలకు నదులు, వాగుల మీదుగా రాకపోకలు సులభంగా సాగించొచ్చు. రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 16, జిల్లా ప్రధాన రహదారుల్లో 7, ఇతర రోడ్లపై రెండు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 8 వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. మిగిలిన 17 వంతెనల పనుల కోసం ఆర్ అండ్ బి శాఖ త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించనుంది. ► రాష్ట్ర ప్రధాన రహదారుల్లో రూ.87.22 కోట్లతో 16 వంతెనల నిర్మాణాన్ని ఆర్ అండ్ బి చేపట్టింది. వాటిలో ఆరు వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు మిగతా 10 వంతెనల పనులను ఏడాదిలోగా పూర్తి చేయనున్నారు. ► జిల్లా ప్రధాన రహదారుల్లో రూ.162.95 కోట్లతో ఏడు వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో రెండు వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మిగతా ఐదింటి పనులను ఆర్ అండ్ బి శాఖ త్వరలో ప్రారంభించనుంది. ► ఇతర రహదారుల్లో రూ.12.19 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పనకు 2021–22 బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం రూ.11,477 కోట్లు కేటాయించినట్లు నాబార్డు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఈ రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులపై నాబార్డు వార్షిక నివేదిక విశ్లేషించింది. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల కేటాయింపులు తిరోగమనంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏపీలో వ్యవసాయ రంగంలో స్టోరేజి, వేర్హౌసింగ్, సాగునీరు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల మౌలిక వసతులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగానే రైతులు పండించిన పంటల నిల్వ కోసం అవసరమైన గోదాములను సైతం నిర్మిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరిస్తున్న విషయం తెలిసిందే. రూ.2,269.30 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 10,315 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 2,287 భవనాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 1,948 భవనాలు తుది దశలో ఉన్నాయి. మొత్తం నిర్మాణాలను ఈ ఏడాది సెపె్టంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అలాగే, పాడి రైతుల కోసం రూ.399.01 కోట్ల వ్యయంతో తొలి దశలో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. -
మత్స్యకారులకు మంచి రోజులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి. మత్స్య సంపదను మార్కెట్కు తరలించే సందర్భంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు ఐస్ ప్లాంట్లు, హేచరీలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో ఇటీవలే సాత్వా, ఢిల్లీ నుంచి అవస్థాపన బృంద సభ్యులు దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లోని పలు తీర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో నాబార్డు నిధులతో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. మత్స్య సంపదే కీలకం కృష్ణా జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో మత్స్య సంపదపైనా ఆధారపడి 1,12,977 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో 111 కిలోమీటర్ల మేర సముద్రంలో చేపల వేట సాగుతోంది. 2020–21 నివేదిక ప్రకారం కృష్ణా జిల్లా నుంచి 13.83 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తీరప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు నాబార్డుకు అనుబంధంగా పనిచేస్తున్న సాత్వా, ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) బృందాల సభ్యులు దివిసీమలోని తీర గ్రామాలైన నాగాయలంక, కోడూరు మండలాల్లో ఇటీవల పర్యటించారు. నాబార్డు, సాత్వా బృంద సభ్యులు నీల్, అభిషేక్, పీఎంఎఫ్ఎంఈకి సంబంధించి కార్తికేయరెడ్డితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం కోడూరు మండలం బసవానిపాలెం, పాలకాయతిప్ప, నాగాయలంక మండలం జింకపాలెం, నాచుగుంట్ల గ్రామాల్లో పర్యటించింది. తొలగనున్న సమస్యలు 35 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించేందుకు నాబార్డు ముందుకొచ్చినట్టు బృంద సభ్యులు చెప్పారు. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, హేచరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అవనిగడ్డతోపాటు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోనూ వీటి అమలుకు చర్యలు తీసుకుంటామని బృందాల ప్రతినిధులు చెప్పారు. ఇవి కార్యరూపం దాలిస్తే జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. -
చిన్న పరిశ్రమలకు సాయం చేద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనా కష్ట సమయంలో రీచార్జ్ ప్యాకేజితో పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. ఎంఎస్ఎంఈల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నాబార్డు కూడా దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. రాష్ట్రంలో 2022 –23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.52,468.55 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇందులో మూల ధనం కింద రూ.18,400.93 కోట్లు, పెట్టుబడి రుణం కింద రూ.34,067.62 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపింది. పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహాయం అందించాలని చెప్పింది. మూత పడిన యూనిట్ల పునరుద్ధరణకు బ్యాంకులు ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వైఎస్సార్ నవోదయం పేరిట వన్టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ పత్రంలో నాబార్డు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపింది. వ్యవసాయ రంగంలో రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
ఆర్బీకేలకు నాబార్డు చేయూత
సాక్షి, అమరావతి: ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సహకార సొసైటీల పరిధిలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ తీసుకురావడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ఆర్బీకే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను తీసుకు రావడం శుభపరిణామం అని చెప్పారు. సహకార రుణ పరపతి పునర్ వ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్పర్సన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్ క్యాపిటల్ కావాలంటే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఎంత కావాలంటే అంత సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫెషనల్గా తయారవుతాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60 వస్తుంటే, ప్రాసెస్ చేసి మార్కెట్లో రూ.200కు పైగా అమ్ముతున్నారని చెప్పారు. ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వాల్యూఎడిషన్ చేయడం అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూ చైన్ ఫైనాన్స్ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మనమిచ్చేది రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58 వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ పథకం 100% రీ పేమెంట్ జరుగుతోందన్నారు. అదే రీతిలో కౌలు రైతులను జాయింట్ లయబులిటి గ్రూప్స్ (జేఎల్జీ)గా ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చన్నారు. డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి, సహకార బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆప్కాబ్కు రూ.100 కోట్లు, డీసీసీబీలకు రూ.190 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్ఆర్ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఆర్బీకే–పీఏసీఎస్లను అనుసంధానించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా.. లేదా అనే అంశం పై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. మండలానికో బ్రాంచ్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంన్నారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. -
AP: ‘అగ్రి’లో నంబర్ వన్
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చాం. దీన్ని మరో మెట్టు పైకి తీసుకెళుతూ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉపకరణాల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. వీటికి మీ సహకారం కావాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనే వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలతో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు)ల అనుసంధానం, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నియామకంతో సహకార బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగేలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తద్వారా రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాలకు రక్షిత మంచి నీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ నాబార్డు, బ్యాంకులు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో వివిధ రంగాల్లో రుణ ఆవశ్యకత అంచనాలతో నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పత్రాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సుస్థిర ఆర్థిక ప్రగతికి రుణాలు దోహదం ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది. 2022 ఫిబ్రవరి 11 నాటికి దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.115 లక్షల కోట్లు. ఈ విషయంలో ఏటా 7.86 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం. ఈ విషయంలో కొత్త వ్యూహాల దిశగా అడుగులు వేయాలి. ► కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం, దాని అనుంధ రంగాలు 4.16 శాతం ప్రగతిని సాధించాయి. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు మంచి సహకారం అందించినందుకు ధన్యవాదాలు. తద్వారా రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నాం. సాగు రంగంలో ఆర్బీకేలు కీలక పాత్ర ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం రైతు భరోసా, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని పంట రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తోంది. ► ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ఇ–క్రాప్ చేస్తున్నాం. ఇదో విప్లవాత్మక చర్య. గతంలో కొంత మంది మాత్రమే చేసుకునే వారు. చేసుకోలేని వారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున నష్టపోయేవారు. ఇలా జరగకూడదని రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ► సబ్సిడీ మీద వ్యవసాయ ఉప కరణాలను రైతులకు వ్యక్తిగతంగా సరఫరా చేయడంతో పాటు సీహెచ్సీల(కస్టమ్ హైరింగ్ సెంటర్స్) ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 10,700 ఆర్బీకేలు సాగు రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ► ఆర్బీకేలు రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ చేదోడుగా నిలుస్తున్నాయి. రూరల్ నియోజకవర్గాల స్థాయిలో (147 నియోజకవర్గాలు) అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. బ్యాంకులతో కలిసి కార్యాచరణ ► సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం. ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు.. బ్యాంకులు, సొసైటీలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించాను. ► ఫుడ్ ప్రాసెసింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టి పెట్టాం. ఆర్బీకే, ఇ –క్రాపింగ్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తో పాటు 542 సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం. ► బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. రుణ సదుపాయం కల్పనలో ఆర్బీకేలు సంధానకర్తలుగా ఉండాలి. అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణం అందాలి. ఈ మేరకు అమలు చేసేందుకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాళిక, ఎస్ఓపీ తయారు చేయాలి. ► ఇప్పుడు మనం నానోఫెర్టిలైజర్స్ వంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్న ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు రావాలని, వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామ స్థాయిలోనే అభివృద్ధి చేయాలనే నాబార్డ్ చైర్మన్ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. దాన్ని అందుకునే దిశగా వ్యవసాయ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై కూడా దృష్టి పెడతాం. విద్య, వైద్య రంగంలో వాస్తవిక సంస్కరణలు ► నాడు–నేడు ద్వారా విద్య, వైద్య రంగంలో వాస్తవిక సంస్కరణలు చేపట్టాం. 16 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 27 మెడికల్ కాలేజీలు వస్తాయి. ► నాడు–నేడు కింద స్కూళ్లలో నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. మంచి నీరు, శుభ్రమైన బాత్రూమ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, బ్లాక్ బోర్డ్స్, స్కూల్ అంతా మంచి పెయింటింగ్ వంటివి చేపట్టాం. ► ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నాం. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బైలింగువల్ పాఠ్యపుస్తకాలను ముద్రించాం. భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా అభివృద్ధి చెందుతారు. ► తద్వారా గ్రామ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఫ్లోరోసిస్ సమస్యను అధిగమించాలి ► ఫ్లోరోసిస్ సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని చోట్ల నీటి కొరత అధికంగా ఉండడం వల్ల రవాణాకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్ధితి. వీరికి రక్షిత తాగు నీటిని అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇలా ఎంపిక చేసిన చోట్ల బ్యాంకులు మరింత ముందుకొచ్చి సాయం చేయాల్సి ఉంది. ► మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వలస వెళ్లకుండా రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం. ► కరువు నివారణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్రాలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ► ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పనితీరు ప్రశంసనీయం నాబార్డ్ అధికారులుగానీ, రిజర్వ్ బ్యాంకు అధికారులు గానీ రాష్ట్రాలకు వెళ్లి చర్చిస్తున్నప్పుడు క్రెడిట్ రేషియోను చూసి పనితీరు బాగోలేదంటూ చర్చను ప్రారంభించాల్సి వస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా భిన్నం. రాష్ట్రంలో క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 140 శాతం నుంచి 150 శాతం దాకా ఉంది. ఇది గర్వపడాల్సిన విషయం. భూ రికార్డుల డిజిటలైజేషన్ గురించి వివిధ రాష్ట్రాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు వెళ్లి చూడండని చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయడమే కాకుండా, దాన్ని బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయడం గొప్ప విషయం. ఇది దేశం మొత్తం జరగాలి. రైతులందరికీ రుణాలు లభించాలి. వ్యవసాయం సహా అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. ఆర్బీకేల విషయంలో రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్నాను. సీఎం జగన్ పట్టుదలతో పని చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక సమావేశంలో వీటి గురించి నాకు గొప్పగా చెప్పారు. వీటిని ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. – డాక్టర్ చింతల గోవిందరాజులు, నాబార్డ్ చైర్మన్ -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం విన్నూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారని నాబార్డ్ చైర్మన్ ప్రశంసించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అనేక అంశాలను ప్రస్తావించారని జీఆర్ చింతల అన్నారు. గత ఏడాది కంటే నాబార్డ్ సహకారం మరింతగా ఉంటుందని ఆయన చెప్పారు. సహకార బ్యాంకుల సేవలను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేయమని సీఎం జగన్ చెప్పారు. రూ.16వేల కోట్లతో ప్రతి గ్రామంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. చంద్రబాబుకి వారసత్వంగా లోకేష్, అచ్చెన్నాయుడు ఓ వైపు ఇవన్నీ జరుగుతుంటే నాబార్డ్ చైర్మన్ వస్తున్నారని తెలిసి టీడీపీ బ్యాచ్ సిద్ధమైంది. రైతు సదస్సు పేరుతో సీఎంపై బురద జల్లడానికి అచ్చెన్నాయుడు ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఎక్కడ ప్రకటించారో చూపించాలి. ఆనాడు వాళ్లు క్రాప్ హాలిడే ఇస్తే రైతులు ఆందోళనను పోలీసులతో అనగదొక్కించారు. చంద్రబాబుకి వారసత్వంగా లోకేష్, అచ్చెన్నాయుడు తయారయ్యారు. అచ్చెన్నాయుడు అబద్దాల్లో పుట్టిపెరిగినట్లుంది. ఆయన సీఎంపై మాట్లాడుతున్న బాష ఏమిటి..?. మూర్కుడు పరిపాలిస్తున్నాడు అంటారా..?. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన ఎలాంటి వారో ప్రజలకి తెలుసు. చంద్రబాబు ఎలా ఉంటే అందరూ అలా ఉంటారనుకుంటే ఎలా..?. అధికారంలో ఉంటే చంద్రబాబు నమస్కారం పెట్టినా ప్రతినమస్కారం పెట్టడని మీ పార్టీ వారే చెప్తున్నారు. 160 సీట్లొస్తాయని చెప్పుకుంటున్నారు. వాటిని పగటి కలలు మాత్రమే అంటారు. ఈ మధ్య మేమొస్తాం.. మీ సంగతి తెలుస్తాం అని బాగా చెప్పుకుంటున్నారు. చదవండి: (అందుకే వివేకా అల్లుడు ఆదినారాయణరెడ్డితో స్నేహం చేశాడు: తోపుదుర్తి) వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రగామి దేశంలో ఏపీ వ్యవసాయంలో అగ్రగామిగా ఉందని కేంద్రమే చెప్తోంది. మీరెన్ని సోకాలు పెట్టినా వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రగామి అయ్యి తీరుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వ్యక్తిగత పనిముట్లు ఇవ్వనున్నాం. త్వరలో రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రైతులకు అందించనున్నాం. వచ్చే ఏడాది నుంచి మార్కెట్ యార్డులను నాడు- నేడు కింద అబివృద్ది చేయనున్నాం. రాబోయే రోజుల్లో మీ ఊహకందని రీతిలో వ్యవసాయ రంగం అబివృద్ది చెందుతుంది. ఒక్క టీడీపీ మాత్రమే ఏ వర్గం సుఖంగా ఉండకూడదు అని కోరుకుంటుంది. ఉద్యోగుల వల్ల 2019లో ఓడిపోయాం అని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఉద్యోగ సంఘాలు మాపై మాట్లాడితే ఆహా అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ఉద్యోగులను తిడతారు. రాత్రికి రాత్రి గుడారం ఎత్తేశారు మూడు రాజధానులు ఉపసంహరించుకున్నాక ఎవరైనా రాజధాని అమరావతి అంటారు. కొన్ని కారణాల వల్ల ఆ బిల్లును ఉపసంహరించుకున్నాం. కేంద్రం రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా దీనిపై చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. అమరావతి భూములపై ఎవరికి శ్రద్ధ ఉందో దేశమంతా తెలుసు. రాత్రికి రాత్రి గుడారం ఎత్తి ఇక్కడకు వచ్చి ఒక్క రోడ్డేసిన పాపాన పోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతిలో చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన తరుణంలో అప్పులు అనివార్యంగా చేయాల్సి వచ్చింది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మీరేం సాధించారు. మీరు తెచ్చిన అప్పులతో ఒక్కరికైనా లబ్ది చేకూర్చారా..? చదవండి: (వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్) దీన్నే దమ్మున్న నాయకత్వం అంటారు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వను అని అన్న పెద్దమనిషి ఎవరు. ఇప్పుడు ఎవరూ డిమాండ్ చేయకముందే ఆ కేసును మేము సీబీఐకి రెఫర్ చేశాం. దీన్నే దమ్మున్న నాయకత్వం అని అంటారు. మీకు సీబీఐ గురించి మాట్లాడే అర్హత ఉందా..?. వాళ్లిచ్చిన లీకులను పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేసుకొని మీరెలా మాట్లాడతారు. ఏ రోజైనా సీబీఐ విచారణ అపమని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా..?. అంతర్వేది సంఘటనను కూడా సీబీఐ విచారణ చేయాలని కోరాము. మీరు బంతిని నెలకేసి కొడితే ఎలా లేస్తుందో జగన్ అలానే లేస్తాడు. జగన్ను తగ్గించాలని చూసిన ప్రతి ప్రయత్నంలో ఆయన పైకి లేచారు' అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. -
రైతుల కోసం అగ్రిల్యాబ్స్:సీఎం జగన్
-
నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్చేసి, పారదర్శకంగా చేస్తున్నాం ► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం ► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి ► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం ► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య: ►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం ► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం ►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం ► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి ► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ ►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం ►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం ►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు ►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను ►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం ► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం ►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం ►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం ►16 కొత్త మెడికల్కాలేజీలను నిర్మిస్తున్నాం ►ఇప్పటికే ఉన్న 11 మెడికల్కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం ►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం.. ► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం ►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు ►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు ►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం ►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం ►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి ►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది ►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం చదవండి: గోదావరి గట్టెక్కింది -
సాగు రుణాలు రూ.లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్స రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల న్నింటికీ కలిపి రూ. 1,01,173 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్దేశించింది. ఇందులో పంట రుణాలను రూ. 67,863 కోట్లుగా పేర్కొంది. మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళికను రూ. 1,66,384.90 కోట్లుగా ఖరారు చేసింది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫోకస్ పేపర్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునం దన్రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం వైకే రావు, ఎస్ఎల్బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొందరు, మరికొందరు నేరుగా పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలి: మంత్రి నిరంజన్రెడ్డి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రం గానికి రుణ పరపతి పెంచాలని బ్యాంకర్లను కోరారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని, నాబార్డు సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఈ పథకాల వల్ల తెలంగాణవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని, పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోందన్నారు. అయితే సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి పంటల వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని నిరంజన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ధి రంగాల్లో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌలిక సదుపాయాలతోపాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలన్నారు. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా... రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ స్టేట్ ఫోకస్ పేపర్లో వ్యవసాయం, ఆయిల్పామ్ సాగు, ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్లో సాంకేతిక ఆవిష్కరణల వంటి అంశాలపై దృష్టిసారించినట్లు నాబార్డు తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి పాడిపరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ కార్యకలాపాలు అందించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని సూచించింది. ఒక జిల్లా–ఒక పంట పథకం కింద ఉద్యాన పంటల క్లస్టర్ ఆధారిత ఉత్పత్తిని ప్రోత్సహించాలని నాబార్డు భావిస్తోంది. 2024–25 నాటికి తొమ్మిది జిల్లాల్లో 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ చేపట్టింది. దానికి అవసరమైన ఊతం ఇవ్వాలని నాబార్డు బ్యాంకర్లకు సూచించింది. కాగా, 2021–22లో వ్యవసాయ రుణాలు రూ. 83,368 కోట్లు ఉండగా 2022–23లో అవి రూ. లక్ష కోట్లు దాటనుండటం విశేషం. -
మౌలిక వసతుల కల్పనకు రూ.1,392 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు నాబార్డు చేయూతనిచ్చింది. వైఎస్సార్, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన బోధనాస్పత్రుల నిర్మాణానికి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డు రూ.1,392.23 కోట్ల రుణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ వెల్లడించారు. నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) కింద ఈ సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ► వైఎస్సార్, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు కానున్న మూడు బోధనాస్పత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపీడీలు, డయాలసిస్, బర్న్ వార్డు, క్యాజువాలిటీ వార్డు, స్పెషలైజ్డ్ క్లినికల్ కమ్ సర్జికల్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్.. వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాబార్డు సీజీఎం తెలిపారు. వైద్య విద్యకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ► మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ కన్సల్టేషన్ రూమ్లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూమ్, డయాలసిస్ వార్డు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఓటీ కాంప్లెక్స్, ఓపీడీ, జనరల్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు తదితర సౌకర్యాలు అందుబాటులోకొస్తాయని చెప్పారు. ► రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నాబార్డు తగిన తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. ► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా 3 వేల 92 కోట్ల రూపాయల సాయం అందించామని, ఈ నిధులతో 25 వేల 648 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం, మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించినట్టు చెప్పారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకూ నాబార్డు సాయం అందించినట్టు సీజీఎం సుధీర్కుమార్ జన్నావర్ వివరించారు. -
10,778 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: సహజ సేద్యాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల్లో 10,778 ప్రత్యేక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారని తెలిపారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. వ్యవసాయ, ఇతర ప్రాధాన్య రంగాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మంచి పనితీరు కనపరిచిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈ సెక్టార్కు మరింత ప్రాధాన్యం కల్పించాల్సి ఉందన్నారు. కోవిడ్ కారణంగా విద్యా, గృహ రుణాల పరిమితి కొంత మందకొడిగా ఉందని, వీటిపై కూడా మరింత దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ జన్నావర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆదాయం రెట్టింపే లక్ష్యం
శృంగవరపుకోట రూరల్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. వ్యవసాయ రుణాలు, పరికరాల కొనుగోళ్ల కోసం నాబార్డు నుంచి రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నాబ్ కిసాన్–నాబ్ సంరక్షణ్లో భాగంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)లకు క్రెడిట్ గ్యారంటీ కింద రూ.1,200 కోట్లు కేటాయించామన్నారు. ఎఫ్పీవోలకు రుణాలిచ్చే బ్యాంకులకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొడ్డవర గ్రామంలో సేంద్రియ రైతు ఎం.రవీంద్రప్రసాద్ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్పీవోల కింద రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో 340 ఎఫ్పీవోలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు కాండ్రేగుల సన్యాసినాయుడు, చెల్లయ్య, కె.జయవిష్ణు తదితరులతో నాబార్డు చైర్మన్ మాట్లాడారు. కార్యక్రమంలో నాబార్డు సీజీఎం జె.సుధీర్కుమార్, జీఎం ఎన్ఎస్ మూర్తి, డీజీఎం నాగేష్, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్కు చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేస్తున్న 26 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక చేయూతనివ్వాలని నాబార్డుకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య విజ్ఞప్తి చేశారు. ముంబైలోని నాబార్డు ప్రధాన కార్యాలయంలో సీజీఎం బి.రఘునాథ్తో గురువారం ఆమె సమావేశమయ్యారు. స్థానికంగా సాగు అయ్యే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. వీరికి కావాల్సిన ముడిసరుకు(పంట)ను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు. వాటికొచ్చే లాభాల్లో కూడా రైతులకు కొంత భాగం ఇచ్చేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసిందన్నారు. స్థలాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, అవసరమైన ఆర్థిక చేయూతనందించాలని కోరారు. నాబార్డు సీజీఎం రఘునాథ్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నాబార్డు బృందం ఏపీలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) పెద్దపీట వేస్తోందని బ్యాంక్ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు. 324 ఎఫ్పీవోలకు ప్రోత్సాహం... రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్ అంతా ఎఫ్పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. 200 వాటర్ షెడ్ పథకాలను ప్రోత్సహిస్తున్నాం. -
ఆర్థిక అవకతవకలకు ఆస్కారమివ్వొద్దు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సహకార వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్(నాబ్కాన్స్) కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. డీసీసీబీలు, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారందరికీ ఒకే రీతిలో జీతభత్యాలు ఉండాలన్న ఆలోచనతో హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు ఆస్కారమివ్వొద్దని ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్లకు సూచించారు. ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) 59వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీలు పారదర్శకంగా పని చేయాలని సూచించారు. ప్రతి రూపాయి రైతుల కష్టార్జితమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మొహమాటానికో, తెలిసిన వారి కోసమో నిబంధనలను అతిక్రమించవద్దని చైర్మన్లకు హితవు పలికారు. నిబంధనలు పాటిస్తూ రైతులను ఆదుకునేందుకు ఉదారంగా రుణాలివ్వాలని ఆదేశించారు. బ్యాంకింగ్తో పాటు ఇతర సేవలందించడంపైనా ఆలోచన చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రూ.7,500 కోట్లతో మొదలైన ఆప్కాబ్ గతేడాదిలో రూ.21 వేల కోట్ల టర్నోవర్తో దేశంలోనే నంబర్ 1 సహకార బ్యాంక్గా నిలిచిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. ఆప్కాబ్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ మాట్లాడుతూ.. రైతులకు మరింత చేరువగా ఆప్కాబ్ను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్తో పాటు రీజనల్ స్థాయిలో ప్రతిభ చూపిన విజయనగరం, గుంటూరు, కర్నూలు డీసీసీబీలకు అవార్డులను ప్రదానం చేశారు. శ్రీ రామలింగేశ్వర (తూర్పు గోదావరి), నందమూరి(కృష్ణా), కరవాడి (ప్రకాశం) పీఏసీఎస్లకు అవార్డులిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపర్చిన ఆప్కాబ్ ఉద్యోగులకు కూడా అవార్డులను బహూకరించారు. కార్యక్రమంలో సహకార మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ, నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్ఎస్ రెడ్డి, సీజీఎం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
'ఆర్బీకేలు' దేశానికే ఆదర్శం
(ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి, అమరావతి) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) వ్యవస్థ దేశానికే ఆదర్శమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకాలను రైతు ఇంటి ముంగిటే అందించడం దేశంలోనే సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్బీకేలను రైతులు సక్రమంగా ఉపయోగించుకుని ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన 50 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల జీవనరేఖలతో పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాగు వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తానీ విషయాన్ని చెప్పానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర వ్యవసాయ విధానానికి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నాబార్డ్ సంపూర్తిగా సహకరిస్తుందని, నిధులు సమకూర్చేందుకు వెనుకాడబోనని హామీ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్బీకేల పనితీరు బాగుంది ఆ మధ్య రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు నేనొక ఆర్బీకేను, రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్పీవోను) స్వయంగా పరిశీలించా. అక్కడి రైతులు చెప్పిన దాన్నిబట్టి ఆర్బీకేల ప్రయోగం చాలా సక్సెస్ అయినట్టే. ఇప్పటికే రైతులు ఈ కేంద్రాల నుంచి లక్షలాది ఆర్డర్లు పెడుతున్నారు. ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలు తమ గ్రామానికి తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ఇలా జరగడమంటే రైతుకు చాలా వ్యయప్రయాసలు తప్పినట్టు. నాణ్యమైన ఉత్పాదకాలను 72 గంటల్లోగా రాబట్టడమే వ్యవసాయంలో కీలకం. అందుకే ఆర్బీకేల వ్యవస్థ ఆదర్శనీయం అంటున్నా. కాలాన్నిబట్టి రైతులు మారాలి మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులూ మారాల్సిన అవసరం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొద్దిమంది చేతుల్లో ఎక్కువ భూమి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 14 కోట్ల మంది రైతుల్లో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ తరహా రైతులు నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక్క పంట వేస్తే సరిపోదు. ఉన్న భూమిని పలు రకాలుగా వినియోగించుకోవాలి. ఆ భూమిలోనే ఆహారధాన్యాలు, పండ్లతోట, కూరగాయలు సాగుచేస్తూ.. కోళ్లు, పశువుల పెంపకం చేపట్టాలి. అప్పుడే రైతు సుస్థిరత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక పంట పోయినా మరొకటి ఆదాయాన్నిస్తుంది. అందువల్ల పంటల సరళి, ఆలోచనా ధోరణి మారాలి. వ్యవసాయ శాఖ, యూనివర్శిటీల కృషి పెరగాలి.. రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలన్న దానిపై ప్రధాన బాధ్యత వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలది. ఈ విభాగాల్లో ఉండే వాళ్ల కృషి ప్రధానం. ప్రస్తుతం కావాల్సింది ఉత్పత్తి కాదు. రైతు సాధికారత. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. ఏంచేస్తే రైతు ఆదాయం పెరుగుతుందో, పండించిన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఎలాగో రైతులకు చెప్పాలి. కమతాలు చిన్నవైన ప్రస్తుత తరుణంలో ఉన్న భూమిపై అదనపు ఆదాయం ఎలా సాధించవచ్చో చూపాలి. మాగాణిలోను నూనెగింజలు సాగుచేయవచ్చు వ్యవసాయ రంగంలో ఇప్పుడు హరిత, నీలి, వైట్, రెడ్ విప్లవాలు నడుస్తున్నా.. కావాల్సింది మాత్రం బ్రౌన్ విప్లవమే. నూనెగింజల్ని పండించడమే బ్రౌన్ విప్లవం. సుమారు రూ.1.10 కోట్ల విలువైన వంటనూనెల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ స్థాయిలో మన నూనెగింజల దిగుబడులు లేవు. రైతుకు అదనపు ఆదాయం రావాలంటే నూనెగింజల సాగు చేపట్టాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. నాబార్డ్ కూడా సహకారం అందిస్తుంది. ఏపీలో మాగాణి భూముల్లో కూడా నూనెగింజల్ని సాగు చేయవచ్చు. దీనిపై రైతులు దృష్టి సారించాలి. ఏయే రకాలు అనువైనవో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలదే భవిష్యత్.. సన్న, చిన్న, మధ్యతరహా రైతుల ప్రధాన సమస్య మార్కెటింగ్. వీళ్లకు బేరసారాలు చేసే శక్తి తక్కువ. అందువల్ల వీళ్లు సంఘటితం కావడం ఒక్కటే మార్గం. 10 మందికి తగ్గకుండా అన్నదాతలు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్పీవోను) ఏర్పాటు చేసుకుంటే నాబార్డ్ సహకరిస్తుంది. ఈ సంఘం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించవచ్చు. ప్రాథమికంగా శుద్ధిచేసి నాణ్యత పెంచవచ్చు. వినియోగదారులను ఆకర్షించేలా ప్యాకింగ్ వంటివి చేయవచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇందుకు కావాల్సిన నైపుణ్య శిక్షణ కోసం సమీపంలోని నాబార్డ్ అధికారులను సంప్రదించవచ్చు. విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఉంది. రానున్న ఐదేళ్లలో కనీసం 4 వేల ఎఫ్పీవోలను ఏర్పాటు చేయాలన్నది నాబార్డ్ లక్ష్యం. నాబార్డ్ సంరక్షణ్ పథకం కింద సుమారు రూ.వెయ్యి కోట్లను ఎఫ్పీవోలకు రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రైతులు వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులను తీర్చిదిద్దుకోవాలన్నదే నా సలహా. వ్యవసాయ బిల్లులపై జరుగుతున్న ఆందోళనపై త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ ఉంది. ఆ బిల్లులను రద్దుచేసే అవకాశం ఉండకపోవచ్చనేది నా వ్యక్తిగత అభిప్రాయం. -
ఆంధ్రప్రదేశ్లో మోడరన్ బ్యాం‘కింగ్
సాక్షి, అమరావతి: ఒకప్పుడు నగదు విత్ డ్రా చేయాలన్నా.. నగదు జమ చేయాలన్నా గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. పనులన్నీ మానుకొని.. టోకెన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారో అని కాచుకొని కూర్చోవాల్సి వచ్చేది. అదే ఏ అర్ధరాత్రో, అపరాత్రో డబ్బులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల స్థానాన్ని వెనక్కి నెడుతూ.. పనులు వేగంగా, సులువుగా, సజావుగా జరిగేలా మోడరన్ బ్యాంకింగ్ దూసుకువచ్చింది. వీధివీధికి ఏటీఎంలు వెలిశాయి. యాప్ల రూపంలో చేతుల్లోకే బ్యాంకు సేవలు వచ్చేశాయి. చిటికెలో పనులు పూర్తయిపోతున్నాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఏటీఎం, క్యూఆర్ కోడ్ తదితరాల ద్వారా పొందే ఆధునిక బ్యాంకింగ్ సేవలను రాష్ట్ర గ్రామీణ ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విషయం నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే(ఎన్ఏఎఫ్ఐఎస్)లో వెల్లడైంది. మోడరన్ బ్యాంకింగ్, సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంతో పాటు ఎన్ఏఎఫ్ ఇండెక్స్లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్ కనబరిచింది. రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్తో ముందుకు.. ఎన్ఏఎఫ్ ఇండెక్స్లో దేశవ్యాప్త సగటు 0.337 పాయింట్లుగా ఉంటే ఏపీ మాత్రం 0.473 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. మోడరన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ విభాగాల్లో 1, 2, 3 స్థానాల్లో ఉన్నది గోవా, మణిపూర్, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలే. పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టేనని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ లేదా, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించడంతో పాటు రూపే కార్డులు, ఆధార్తో అనుసంధానం, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. వారంతా ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,92,293 జన్ధన్ ఖాతాలుండగా.. అందులో 79 శాతం ఖాతాలకు రూపే కార్డులిచ్చారు. 89.15 శాతం ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేశారు. ఇక సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంలో ఏపీ 0.424 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, గోవా, హిమాచల్ప్రదేశ్లున్నాయి. పూర్తి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత వైఎస్సార్ జిల్లాను 100 శాతం డిజిటల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 31,83,960 సేవింగ్ ఖాతాలుండగా.. అందులో ఇప్పటి వరకు 88 శాతం ఖాతాలకు రూపే కార్డులు మంజూరు చేశారు. 24 శాతం మందికి నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందించగా.. 38 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. -
నెలాఖరులోగా ధాన్యం బకాయిలు చెల్లిస్తాం
సాక్షి, అమరావతి: ధాన్యం బకాయిల కింద కేంద్రం నుంచి రూ.5,056 కోట్లు రావల్సి ఉందని.. ఈ నెలాఖరులోగా రైతులకు బకాయిలు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. ఈనెల మూడో వారంలో రూ.1,600కోట్లు చెల్లిస్తామని చెబుతున్నారని ఆయనన్నారు. అలాగే, నాబార్డు నుంచి మరో రూ.1,600 కోట్లు రెండు, మూడ్రోజుల్లో (మంగళ, బుధవారాలు) రానున్నాయని.. ఇవన్నీ రాగానే రైతులకు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. తమది ప్రతిపైసా కచ్చితంగా చెల్లించే ప్రభుత్వమని.. 21 రోజుల్లోపే బకాయిలు చెల్లించాన్నది సీఎం జగన్ తనకు తాను విధించుకున్న విధానమన్నారు. 2018లో చంద్రబాబు నాటి బకాయిలను రైతులకు ఎగ్గొట్టి అధికారం నుంచి దిగిపోయిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో రూ.32వేల కోట్ల చెల్లింపు చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ధాన్యం కొనుగోళ్ల కింద రైతులకు ఏటా చెల్లించిన సగటు మొత్తం రూ.8,500 కోట్లు మాత్రమేనని కొడాలి నాని అన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక, ఈ రెండేళ్లలో ఏటా రూ.16 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.32 వేల కోట్లు చెల్లించామన్నారు. తాము రైతుల డబ్బు వాడుకున్నామని బాబు, కొందరు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. అలాగే, చంద్రబాబు హయాంలో (2014–2019 వరకు) ఏటా సగటున 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఏటా 83 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం సేకరించామని చెప్పారు. జగన్ పాలనలో పండే పంటతోపాటు కొనుగోళ్లు కూడా పెరిగాయన్నారు. రికార్డు స్థాయిలో పదవులు నామినేటెడ్ పదవుల భర్తీపై కొడాలి నాని స్పందిస్తూ.. ఒకేసారి 137 కార్పొరేషన్ పదవులు భర్తీచేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు ఏనాడూ ఒకేసారి ఇలా కార్పొరేషన్ పదవులు ప్రకటించలేదన్నారు. సామాజిక న్యాయం అంటే, బాబు కేవలం తన సామాజికవర్గానికే న్యాయం చేశారని ఎద్దేవా చేశారు. బాబుకు 2024లో విపక్ష హోదా కూడా రాదని.. అందుకే బిజేపీతో జత కట్టాలని చూస్తున్నారన్నారు. టీడీపీని బీజేపీలో కలిపేస్తే సరి అని నాని వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ నేతలు అర్ధంపర్ధంలేని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. ఆ పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్ కూడా రాదన్నారు. రాష్ట్రంలో ఓ మంత్రికి రూ.3 కోట్లతో కొందరు ఇల్లు కట్టించి ఇచ్చారంటున్నారని, ఆ వివరాలు చెబితే, ప్రభుత్వమే దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దు రైతులకు మొత్తం రూ.3,393 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 21 రోజులు దాటిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.1,204 కోట్లు మాత్రమేనన్నారు. రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి–సంక్షేమంతో ముందుకు సాగుతుంటే, రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలేదని చంద్రబాబు అర్థంపర్థంలేని విమర్శ చేస్తున్నారని నాని మండిపడ్డారు. బాబు తానా అంటే ఆయన అనుకూల మీడియా తందనా అంటూ విషప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. తన పార్టీ నేతలనే రైతులుగా చూపిస్తూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నెలాఖరులోగా రైతుల బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రి స్పష్టంచేశారు. -
పొదుపులో ఏపీ మహిళలే టాప్
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) ఇపుడు దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. 2019–20లో ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో నిలవగా... 2020–21లో ఏకంగా దేశంలో కెల్లా అగ్రస్థానం సాధించడం గమనార్హం. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పొదుపు పెరగడమే కాదు అప్పులూ తగ్గాయి స్వయం సహాయక సంఘాల పొదుపు పెరగడమే కాదు వారి అప్పులు కూడా తగ్గాయని నాబార్డు నివేదిక పేర్కొంది. 2019–20తో పోల్చితే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల పొదుపు ఏకంగా రూ.4,153.37 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో మన రాష్ట్ర సంఘాల పొదుపు 29.17 శాతం ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో అప్పులు రూ.5,940.97 కోట్ల మేర తగ్గాయి. ఈ రెండేళ్లలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేయడంతో పాటు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లించిన సంఘాలకు సున్నా వడ్డీ రాయితీలను అక్కచెల్లెమ్మల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో మహిళా సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొదుపు పెరగడం, అప్పులు తగ్గడంతో పురోగతి సాధించాయి. 2019 – 20లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉండగా.. 2020–21లో 69.12 శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదిక స్పష్టం చేసింది. పొదుపు సంఘాలు జీవం పోసుకున్నాయిలా.. స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు పైసా మాఫీ చేయకపోగా చివరికి సున్నా వడ్డీకి కూడా ఎగనామం పెట్టారు. ఫలితంగా స్వయం సహాయక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ఆ సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. గత సర్కారు తీరుతో స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని రెండేళ్లలోనే అమలు చేయడంతో స్వయం సహాయక సంఘాలు జీవం పోసుకున్నాయి. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను 4విడతల్లో చెల్లిస్తామని చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మంది మహిళలకు రూ.6,792.21 కోట్లు అందచేశారు. అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 87 లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద 2019–20లో రూ.1,400.8 కోట్లను చెల్లించారు. 2020–21లో సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.ఆసరా, సున్నావడ్డీతోపాటు చేయూత పథకం కూడా మహిళలు నిలదొక్కుకోవడానికి దోహదపడుతోంది. అలాగే రిసోర్స్ పర్సన్స్కి జీతాలు పెంచి మోటివేట్ చేయడమే కాక.. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
ఘరానా మోసగాడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల్ని మోసం చేసిన ఘరానా నిందితుడు దీపక్ కిండోను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు రూ.200 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన ఇతనిపై ఆయా రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. ఒడిశాలోని రూర్కెలా కేంద్రంగా పనిచేస్తున్న సంబంధ్ ఫిన్సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు దీపక్ ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. నాబార్డ్కు అనుబంధంగా పనిచేసే నవ్సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సంబంధ్ సంస్థ పేరుతో దీపక్ రూ.5 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ తీసుకున్నాడు. 2019 మార్చి ఒకటిన ఈ మొత్తాన్ని తన సంస్థ ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో నవ్సమృద్ధి నిర్వాహకులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. -
రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తి పెరిగింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కోవిడ్ వేళ దేశంలో పంటల ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం నాబార్డ్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహారశుద్ధి రంగంలో విప్లవం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దేశ స్వయం సమృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరమని వ్యాఖ్యానించారు. గ్రామీణాభివృద్ధితోనే భారత స్వయం సమృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్ష రేపు( మంగళవారం) ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీఎంలతో మోదీ మాట్లాడనున్నారు. ఇక మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, త్రిపురలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా త్రిపురలో డెల్టాప్లస్ వేరియంట్ కేసులు రోజురోజుకు అధికమవుతున్న విషయం తెలిసిందే. -
మరో 332 మండలాల్లో డీసీసీబీ శాఖల ఏర్పాటు
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. డీసీసీబీ శాఖల విస్తరణ, ఇతర అంశాలపై ఆప్కాబ్ఎండీ శ్రీనాథ్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష జరిపారు. డీసీసీబీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు కౌలు రైతులకు అధికంగా రుణాలు ఇచ్చే విషయంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. దీని వల్ల ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో 675 మండలాలుండగా, వాటి పరిధిలో 416 బ్రాంచ్లున్నాయని తెలిపారు. వాటిలో 73 బ్రాంచ్లు పట్టణాలు, నగరాల్లో ఉన్నాయన్నారు. గడచిన మూడేళ్లలో 21 బ్రాంచ్లు కొత్తగా ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 20,చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 4బ్రాంచ్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు పంపినట్టు అధికారులు వివరించగా, సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని మంత్రి సూచించారు. -
పీఏసీఎస్లకు 'ఆర్థిక' దన్ను
సాక్షి, అమరావతి: సాగులోనే కాదు వ్యక్తిగత అవసరాల్లో కూడా అన్నదాతలకు బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్, సొసైటీ)ను బహుళ సేవా కేంద్రాలు (మల్టీ సర్వీసెస్ సెంటర్స్)గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వాటిలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సొసైటీని ‘వన్ స్టాప్ షాపు’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నాబార్డు చేయూతతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో పనిచేసే 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ల పరిధిలో 1,992 పీఏసీఎస్లు అన్నదాతలకు సేవలందిస్తున్నాయి. వీటిని వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.1,584.61 కోట్లతో.. వ్యవసాయ సదుపాయాల నిధి కింద రూ.1,584.61 కోట్ల నాబార్డు రుణంతో పీఏసీఎస్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రతి సొసైటీకి కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు నాబార్డు నుంచి రుణంగా అందించేలా చర్యలు చేపట్టింది. ఈ రుణంలో 10 శాతం పీఏసీఎస్లు భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని 4 శాతం వడ్డీపై నాబార్డు అందిస్తుంది. గడువులోగా రుణాల్ని చెల్లిస్తే ఇంట్రస్ట్ సబ్వెన్షన్ కింద వడ్డీలో 3 శాతం సబ్సిడీ రూపంలో సొసైటీలకు తిరిగి ఇస్తారు. ఈ లెక్కన ఒక్క శాతం వడ్డీకే పీఏసీఎస్లకు రుణాలు అందుతాయి. తొలి దశలో రూ.659.48 కోట్లతో 1,282 పీఏసీఎస్ల్లోను, రెండో దశలో రూ.925.13 కోట్లతో 710 పీఏసీఎస్ల్లోను మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తొలివిడత పనులను 2021–22 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సొసైటీల్లో కల్పించే మౌలిక సదుపాయాలివే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల కింద ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫామ్లు, గిడ్డంగులు, ప్యాకింగ్ హౌస్లు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్ సౌకర్యాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, రైపెనింగ్ (మగ్గించే) చాంబర్స్, కమ్యూనిటీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద సేంద్రియ ఉత్పత్తులు, బయో స్టిమ్యులెంట్ ప్రొడక్షన్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక సభ్యుల అవసరాలను బట్టి అద్దె ప్రాతిపదికన అందించే లక్ష్యంతో అధునాతన వ్యవసాయ పరికరాలతో వ్యవసాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రూ.కోటి నుంచి రూ.2.50 కోట్ల వరకు హైటెక్, హై వేల్యూ ఫార్మ్ పరికరాలతో హబ్లు ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఇచ్చే రుణాలపై 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పీఏసీఎస్లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ద్వారా నాబార్డుకు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. -
ఆన్లైన్ చెల్లింపులకే సై
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ ఆరి్థక లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని నాబార్డ్ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. కోవిడ్–19 లాక్డౌన్, ఆ తరువాత ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధికమంది నగదు లావాదేవీలు, కార్యకలాపాలకు డిజిటల్, ఆన్లైన్లనే ఎంచుకున్నారు. 2019 డిసెంబర్లో జరిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే గత ఏడాది అక్టోబర్లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి. గతంలో పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి సమయంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్లో ఆర్థిక కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికన్నా ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రిటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్ నివేదికలో పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్లైన్ చెల్లింపులు విస్తరిస్తున్నాయని తెలిపింది. -
మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం అవసరమని నాబార్డ్ అంచనా వేసింది. ఇది గత ఏడాది కన్నా 26.81 శాతం అధికమని పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డ్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటోందని ప్రశంసించింది. మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని పెంచిందని, వేట నిషేధ సమయంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరుతో వరుసగా రెండేళ్లు వారికి ఆర్థికసాయం అందించిందని తెలిపింది. ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుందని, రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్ ఇన్పుట్స్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి రుణ అవసరం గతంతో పోలిస్తే బాగా పెరిగిందని నాబార్డ్ పేర్కొంది. -
పోలవరానికి రూ.333 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.333 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బహిరంగ మార్కెట్లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమీకరించాలని నాబార్డును ఆదేశించింది. నాబార్డు నిధులను సేకరించి ఎన్డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ), పీపీఏ (పోలవరంప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన బిల్లులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకు పంపింది. వాటిని పరిశీలించిన పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్ చేయాలని తాజాగా ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలిస్తున్న కేంద్ర జల్శక్తిశాఖ ఆమోదముద్ర వేసి, కేంద్ర ఆర్థికశాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకు రూ.17,153.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత చేసిన వ్యయం రూ.12,422.83 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.10,741.46 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా రూ.1,681.37 కోట్లను కేంద్రం బకాయిపడింది. రూ.1,681.37 కోట్లను రీయింబర్స్ చేయాలని పీపీఏకు రాష్ట్ర జలవరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలిస్తున్న పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్ చేయాలని ప్రతిపాదనలు పంపింది. ఈ 418 కోట్లు రీయింబర్స్ చేసినా.. ఇంకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.930.37 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. -
పశు సంవర్ధకానికి రూ.12,606 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సహకార డెయిరీలను ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తగిన తోడ్పాటునందిస్తామని నాబార్డు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణ ఆవశ్యకత ఉన్నట్లు నాబార్డు అంచనా వేసింది. 2021–22లో మొత్తంగా పశు సంవర్ధక రంగానికి రూ.12,606 కోట్ల మేర రుణ ఆవశ్యతక ఉంటుందని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 15.87 శాతం ఎక్కువని తెలిపింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. మొత్తం దేశంలోనే 4వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2019–20లో 152.63 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. దీని విలువ రూ.57,433 కోట్లుగా పేర్కొంది. ఏపీలో రోజూ 380 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. ఇందులో 46 శాతం రాష్ట్ర సొంత అవసరాల కోసం.. మరో 34 శాతం అసంఘటిత రంగాలు వినియోగిస్తుండగా, 18 నుంచి 20 శాతం సహకార, ప్రైవేట్ పాల ఉత్పత్తుల రంగాలకు వెళ్తున్నాయని నాబార్డు పేర్కొంది. డెయిరీ అభివృద్ధిపై దృష్టి.. పాడి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని.. ఈ నేపథ్యంలో తాము కూడా డెయిరీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు నాబార్డు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మహిళలకు అందించిన ఆర్థిక సాయానికి తోడుగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు మంజూరు చేయించి పశు సంపదను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మహిళా పాడి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు వారి నుంచి ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసేలా.. అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో అమూల్ సంస్థ ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పాల సేకరణ చేస్తోంది. అలాగే మహిళా డెయిరీ సహకార సంఘాలకు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా 9,899 గ్రామాల్లో ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాబార్డు కూడా ఈ ఆర్థిక సంవత్సరం పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణాల ఆవశ్యకత ఉన్నట్లు అంచనా వేసింది. -
ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్కు రూ.3,766 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2021–22లో ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.3,766.25 కోట్ల రుణాలు అందించాలని నాబార్డు అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా 6.2 శాతం అధికమని తెలిపింది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలతో పాటు ఆక్వా, డెయిరీ, విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల పరిధిలోనే మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాల్లో డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ–మార్కెటింగ్, జనతా బజార్లు తదితర సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే 13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లపై తాము కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు నాబార్డు ఆ ఫోకస్ పత్రంలో పేర్కొంది. -
స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో..!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) రాష్ట్రంలోని రైతు ఉత్పత్తుల సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో కలిసి మార్కెటింగ్ అవకాశాల కల్పన, ఇతరత్రా మెరుగైన వ్యవస్థ ఏర్పాటు విషయంలో కీలక భూమికను పోషించనున్నట్టు నాబార్డ్ రాష్ట్ర సీజీఎం వైకే రావు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు ఎఫ్పీవోలు ఒక్కటే మార్గమని, అందువల్లే వాటిని మరింత ప్రోత్సహించేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 330 ఎఫ్పీవోలకు అవసరమైన సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళుతున్నట్టు, 2020–21లో నవకిసాన్ ద్వారా 57 ఎఫ్పీవోలకు నాబార్డ్ క్రెడిట్ లింకేజీని ఇచ్చిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి అవసర మైన సహాయ సహకారాలను నాబార్డ్ అందిస్తుందని చెప్పారు. మొత్తంగాచూస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో నాబార్డ్ రాష్ట్రానికి రూ.20,549 కోట్ల మేర సహకారాన్ని, మద్దతును అందించినట్టు, ఇది 2019–20తో పోల్చితే 25.09 శాతం ఎక్కువని ఒక ప్రకటనలో తెలిపారు. 2020–21లో బ్యాంకులకు రూ. 13,915.22 కోట్ల పంటరుణాలు, టర్మ్లోన్ల కింద అందజేసినట్లు, అందులో రూ.వందకోట్లు నాబార్డ్ మద్దతు అందించిన వాటర్షెడ్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి రూ. 6,633 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం రూ. 4,600 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్కు రూ. 2,500 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద మంజూరు చేసి పంపిణీ చేసినట్టు వైకేరావు వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సాహం -
ఎంఎస్ఎంఈలకు రూ.47,402 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) రూ.47,402.15 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఫోకస్ పత్రంలో అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని ఆ పత్రంలో పేర్కొంది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు.. రూ.3,900 కోట్ల రుణాలను వైఎస్సార్ నవోదయం పేరిట వన్టైమ్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నాబార్డు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని.. రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థికసాయం అందించాలని నాబార్డు సూచించింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. 2020–23 రాష్ట్ర పారిశ్రామిక విధానంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని నాబార్డు పేర్కొంది. -
రాష్ట్రానికి రూ.2.31లక్షల కోట్ల రుణసాయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగాలకు రూ.2.31 లక్షల కోట్ల రుణ సహాయం అందించేందుకు అవకాశమున్నట్లు నాబార్డు (జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు)రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ వెల్లడించింది. దీనిలో వ్యవసాయ రంగానికి రూ.1.57 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.47,402 కోట్లు, ఎగుమతులు క్రెడిట్ కింద రూ.2,880 కోట్లు, విద్యా రంగానికి రూ.1,584 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.14,335 కోట్లు, రెన్యువల్ ఎనర్జీకి రూ.461 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంకు క్రెడిట్ కింద రూ.513 కోట్లు, ఇతర రంగాలకు రూ.6,418 కోట్ల రుణాలు అందించేందుకు అవకాశముందని ఫోకస్ పేపర్లో పేర్కొన్నారు. ఈ పేపర్ను రిఫరెన్స్ డాక్యుమెంట్గా చేసుకుని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్ క్రెడిట్ సదస్సు శుక్రవారం నాబార్డు ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ ఫోకస్ పేపర్ 2021–22ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలకు తోడ్పాటునందించాలి : మంత్రి కన్నబాబు అనంతరం.. వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రాథమిక రంగాల అభివృద్ధితోపాటు రైతుల ఆర్థిక ప్రయోజనాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టంచేశారు. వీటి సాధనకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► జనతా బజార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు కూడా బ్యాంకులు సహకరించాలి. ► అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ రిటైల్ చైన్ అభివృద్ధికి, గ్రామస్థాయిలో వ్యవసాయానికి సంబంధించి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికీ సహకరించాలి. ► అదే విధంగా.. పాడి పరిశ్రమాభివృద్ధి రంగానికి, కౌలు రైతులకు మానవతా దృక్పథంతో వ్యవహరించి తగిన సహాయం చేయాలి. ► రాష్ట్ర ప్రగతికి నాబార్డు ఎంతగానో సహాయ పడుతోంది. ఇందుకు నాబార్డు చైర్మన్ గోవిందరాజులుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాబార్డు తోడ్పాటు అభినందనీయం : సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి వివిధ బ్యాంకులు, నాబార్డు అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు. నాబార్డు కేవలం వ్యవసాయ రంగానికే కాక నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో కూడా సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకు మరింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని సీఎస్ ఆకాంక్షించారు. నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. లక్ష్యానికి మించి సాయం: నాబార్డు సీజీఎం నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుదీర్కుమార్ జొన్నావర్ మాట్లాడుతూ.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రాష్ట్రానికి రూ.27,992 కోట్ల సహాయం అందించాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి రూ.32 వేల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా నాబార్డు తనవంతు తోడ్పాటును అందిస్తోందన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం కంటే 9 శాతం అధికంగా ప్రాధాన్యతా రంగంలో రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా స్టేట్ ఫోకస్ పేపరును రూపొందించామన్నారు. సమావేశంలో నాబార్డు జీఎం బి ఉదయభాస్కర్ అజెండా అంశాలను వివరించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్బీఐ జీఎం సుందరం శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, స్పెషల్ సెక్రటరీ మధుసూదన్రెడ్డి, రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఎ.బాబు తదితరులు మాట్లాడారు. -
‘మనబడి నాడు–నేడు’కు చేయూతనిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి: నాడు– నేడు’కు నిధులు ఇస్తామని నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు తెలిపారు. ఈ పథకానికి వచ్చే ఏడాది రూ.2 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. అదేమంత కష్టం కాదన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా రాష్ట్రంలోని పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాబార్డ్ చైర్మన్ హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన డాక్టర్ జీఆర్ చింతలతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) శుక్రవారం విజయవాడలో మీట్ ది మీడియా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మనబడి: నాడు – నేడును నాబార్డ్ విశేషంగా అధ్యయనం చేసిందన్నారు. ఇప్పటికే రూ.12 వందల కోట్లు ఇచ్చామని చెప్పారు. కూలడానికి సిద్ధంగా ఉన్న స్కూళ్లను బాగు చేసే ఈ పథకం చాలా బాగుందన్నారు. పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లే పరిస్థితి రావాలని చెబుతూ తాను సైతం సర్కార్ స్కూళ్లలోనే చదివానని గుర్తు చేసుకున్నారు. సహకార సంఘాల ఆధునికీకరణకు పెద్దపీట దేశంలో 95 వేల సహకార సంఘాలను ఆధునికీకరించి మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చనున్నట్టు జీఆర్ చింతల తెలిపారు. తొలిదశలో 5 వేల సంఘాలను మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించగా.. అందులో ఇప్పటికే 3,500 సంఘాలకు నిధులు మంజూరు చేశామన్నారు. ఏపీకి రూ.30 వేల కోట్లు, తెలంగాణకు రూ.20 వేల కోట్లు రుణాలు ఇచ్చామని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి.ఆంజనేయులు, నాబార్డ్ రాష్ట్ర శాఖ సీజీఎం సుధీర్కుమార్ జన్నావార్ పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులు భేష్: నాబార్డు చైర్మన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ చాలా బావున్నాయని, ఈ ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని నాబార్డు చైర్మన్ జీఆర్ చింతల స్పష్టం చేశారు. కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ తపనతో ఉన్నారని, ఆయన నవరత్నాల సీఎం అని ప్రశంసించారు. ముఖ్యమంత్రితో అనేక అంశాలపై చర్చించానని, సీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాల వల్ల వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. మంచి చదువు, మంచి వైద్యం ప్రజలకు అందు తాయన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు ఆర్థిక సాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రంలో విద్య, వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించి.. ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై నా బార్డు చైర్మన్ స్పందిస్తూ.. వీటిని పరిశీలించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ చాలా ముఖ్యమైన రంగం అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉం దని, ఈ రంగంలో తాము ఏరకంగా సహా య పడగలమో ఆలోచిస్తామని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నాబార్డు చైర్మన్గా తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం అంటూ జీఆర్ చింతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానించారు. అధికారులు నాబార్డ్ చైర్మన్కు విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి. ఈ రంగాలకు రుణ సాయం అందించండి ► ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కింద 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. తొలివిడతలో నాడు– నేడు కింద స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు రూ.652 కోట్లు ఇచ్చింది. మిగిలిన స్కూళ్లలో పనుల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాలి. ► వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. ప్రజారోగ్య రంగంలో కూడా నాడు– నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. వీటికి తగిన విధంగా రుణ సహాయం అందించాలి. ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆర్బీకేలు, మల్టీపర్పస్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు, జనతా బజార్లను తీసుకొస్తున్నాం. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టాం. వీటన్నింటికీ సహకరించాలి. ► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సహకార రంగం.. బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను పునర్ వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్కాన్స్) చేసిన సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు అంగీకరించారు. పీఏసీఎస్లలో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్ చేయించాలని, రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని చెప్పారు. మూడవ పార్టీతో (థర్డ్ పార్టీ) స్వతంత్రంగా విచారణ చేయించాలని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఏబీసీఓఎన్ఎస్ – నాబ్కాన్స్) సిఫార్సులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని నివేదించారు. వాటి లైసెన్స్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని, 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్వర్క్తో అనుసంధానం లేదని చెప్పారు. రుణాలు తక్కువగా ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంట రుణాలకే పరిమితం అవుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. డీసీసీబీల పనితీరు మెరుగవ్వాలి డీసీసీబీల్లో మెరుగైన పనితీరు ఉండాలని, వీటి నుంచి చక్కగా రుణాలు అందాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రుణాలు ఎవరికి ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి అనే దానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలని, ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులకు ఆమోదం తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంకుల మార్కెట్ షేర్ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించారు. ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఎంఎస్ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల భావం పోవడంతో పాటు విశ్వాసం, నమ్మకం కలిగించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలని, ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఉండకూడదన్నారు. డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగడంతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు రావాలని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, దీనివల్ల ఆ కర్మాగారాలకు ఊరట లభిస్తుందని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు వ్యవసాయం అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీ పర్పస్ సెంటర్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్ 15 కల్లా టెండర్ల ఖరారు చేసి, ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు వెల్లడించారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్పస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్లు, డ్రైయింగ్ యార్డులు, కోల్డు రూమ్లు, పంటల సేకరణ కేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ బాబు ఏ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల వెల్లువతో రైతులకు మంచి రేటు పాల వెల్లువ కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. పాల వెల్లువతో మార్పు ఇదీ.. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఫార్సులపై చర్చ సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి. ► సమగ్ర బ్యాంకు సేవల కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్ల వరకు కంప్యూటరీకరణ చేయాలి. ► పీఏసీఎస్లు క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలు కూడా అందించాలి. ► పీఏసీఎస్ నెట్వర్క్ను మరింత విస్తరించాలి. ఇందులో భాగంగా ప్రతి 3 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలి. ► ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలి. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలి. ► బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలి. బోర్డులో సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా ఏపీసీఎస్ యాక్ట్కు సవరణ తీసుకురావాలి. పీఏసీఎస్లోనూ మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్ను తీసుకురావాలి. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలి. -
బడి పిల్లలు పనులకు వెళ్తున్నారు: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్ : నాబార్డ్ ఉద్దేశ్యం మొత్తం రైతు శ్రేయస్సు, రైతు అభివృద్ధికి లబ్ది చేకూరెందుకు కృషి చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాబార్డ్ ‘ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2021’ శుక్రవారం హోటల్ మారి గోల్డ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నాబార్డ్ ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్త బ్యాంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది కూడా క్రెడిట్ ఏక్షన్ ప్లాన్ క్షేత్ర స్థాయిలో జరగాలని చెప్పినట్లు పేర్కొన్నారు. గత ఏడాది చెప్పిన అంశాలన్నీ చేశామని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే గత పాలకుల పాలనలో అనేక సమస్యలు ఉండేవని, కానీ కేసీఆర్ నాయకత్వం వచ్చిన తరువాత 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తోందన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భీమా లాంటివన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్ తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అనతి కాలంలోనే పూర్తయ్యాయని, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల బెడద తప్పిందన్నారు. లేబర్, గోడౌన్స్, ప్యాకేజింగ్ లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయన్న మంత్రి కొత్త సమస్యలపై నాబార్డ్ దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ కూలీలు దొరక్క బడి పిల్లలు పనులకు వెళ్తున్నారని, రైతు పిల్లలను ఎంకరేజ్ చేయాలని అన్నారు. పత్తి తీయడానికి కొత్తగా మెషీన్లు వచ్చాయని, వాటి సబ్సిడీ కోసం ఎలా ప్రయత్నం చేయాలనేది ఆలోచించాలని సూచించారు. ఇంతకుముందు సీజన్ అయిపోయిన డబ్బులు రాకపోయేవని, కానీ ఇప్పుడు సీజన్ రాకముందే రైతులకు డబ్బులు అందుతున్నాయని, వారికి మెసేజ్లు కూడా వెళ్తున్నాయన్నారు. -
జలకళ పెంపు.. నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: బీడువారిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఉచిత బోర్లు వేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా.. పథకం ద్వారా అధిక ప్రయోజనం కలిగేలా నిబంధనలను మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నాబార్డు మార్గదర్శకాలను అనుసరించి తొలుత వైఎస్సార్ జలకళ పథకానికి నిబంధనలు రూపొందించారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఈ నిబంధనలు ప్రతికూలంగా మారాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భూగర్భ జల శాఖ గణాంకాలను విశ్లేషించిన అనంతరం నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు మార్పులు చేసేందుకు నిర్ణయించింది. సమస్యలు ఏమిటంటే.. వాస్తవానికి 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోరు ఉంటే మరో బోరు మంజూరు చేయకూడదు. రాతి నేలల్లో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదనే నిబంధన ఉంది. ఇసుక నేలల్లో బోరు లోతుపై పరిమితి లేదు. కానీ.. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,200 అడుగల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. దీంతో ఇక్కడ 120 మీటర్ల నిబంధన వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాగే ఒక రైతు భూమిలో బోరు ఉంటే పక్క రైతు భూమి వంద మీటర్ల పరిధిలోనే బోరు వేయాల్సి ఉంటుంది. అందువల్ల కనీసం 200 మీటర్ల దూరం దాటిన తర్వాతే మరో బోరు వేయాలనే నిబంధన రైతులకు అశనిపాతంగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పథకం నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. తగిన సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర భూగర్భ జల శాఖ , గ్రామీణ నీటి సరఫరా, జల వనరులు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి రాష్ట్ర భూగర్భ జలశాఖ సంచాలకులు సభ్య కన్వీనర్గా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులతోపాటు రాష్ట్ర భూగర్భ జలశాఖ ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని ప్రభుత్వం సవరించనుంది. నిబంధనల్ని సవరిద్దాం ‘ప్రతి రైతుకూ ఉపయోగపడేలా వైఎస్సార్ జలకళ నిబంధనలను సవరిద్దాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు సమర్పించండి. రాయలసీమలో ఒక్కో రైతు 1,200–1,400 అడుగుల లోతు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితిని కళ్లారా చూశాం. వీటిని పరిగణనలోకి తీసుకోండి’ అని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. -
ఏపీ మహిళలే అత్యధికంగా పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి. నిరర్ధక ఆస్తులు తగ్గిపోయాయి. ఇదంతా ఏడాదిన్నర కాలంలోనే జరిగిందని నాబార్డు నివేదిక వెల్లడించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు నివేదిక రూపొందించింది. చంద్రబాబు సర్కారు తీరు వల్ల స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం కావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆ సంఘాలు తిరిగి గాడిలో పడటాన్ని నాబార్డు నివేదిక ప్రతిబింబిస్తోంది.క పేర్కొంది. రుణాల్లోనూ టాప్ దేశం మొత్తం మీద 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక పేర్కొంది. 2018–19 ఆర్థిక ఏడాదిలో 26.98 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.58,317 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, 2019–20లో 31.46 లక్షల సంఘాలకు రూ.77,659 కోట్లు మంజూరైంది. ► ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని, అత్యధికంగా దక్షణాది రాష్ట్రాల్లోనే రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల మంజూరు ఎక్కువగా ఉందని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోందని నివేదిక పేర్కొంది. ► 2018–19లో దేశ వ్యాప్తంగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి సగటున బ్యాంకులు 2.16 లక్షల రుణం మంజూరు చేయగా 2019–20లో 2.47 లక్షల రుణం మంజూరు చేశాయి. ఈ లెక్కన 14.35 శాతం వృద్ధి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే సగటున ఒక్కో సంఘానికి 3.35 లక్షల రుణం మంజూరు అయింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 15 శాతం పెరుగుదల. ఏపీలో అయితే ఏకంగా సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల రుణం మంజూరైందని నివేదిక స్పష్టం చేసింది. బాబు సర్కారుకు, ఇప్పటి జగన్ సర్కారుకు ఇదీ తేడా ► స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మాఫీ తూచ్ అన్నారు. దీంతో ఆయా సంఘాల మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ► ఈ తరుణంలో 2019 మే లో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మేనిఫేస్టోలో చెప్పిన మాటలను కొద్ది నెలల కాలంలోనే అమలు చేయడంతో తిరిగి స్వయం సహాయక సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. 2020 మార్చి 31 నాటికి నిరర్థక ఆస్తులు తగ్గిపోయాయని, 2019–20లో సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉందని నివేదిక తెలిపింది. సీఎం నిర్ణయం వల్లే ముందడుగు – పొదుపులో, రుణాలు పొందడంలో రాష్ట్రానికి చెందిన స్వయం సహాయక సంఘాలు ముందుండటానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలే. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను నాలుగు విడతల్లో ఇస్తానని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మహిళలకు రూ.6,792.21 కోట్లు ఇచ్చారు. – సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 90.37 లక్షల మహిళకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాలు గాడిలో పడి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. – ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మహిళలు వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో సర్కారు ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత మత్స్య రంగంపై ప్రభావం పడింది. దేశంలో కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై పడిన ప్రభావంపై నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల ఉత్పాదకత తగ్గడమే కాకుండా లాక్ డౌన్ సమయంలో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయినట్లు సర్వే పేర్కొంది. దేశంలో 54 శాతం జిల్లాల్లో ధరలు తగ్గిపోగా 23 శాతం జిల్లాల్లో ధరలు యధాతథంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. లాక్డౌన్లో మార్కెట్లతో పాటు ప్రధాన ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు చెందిన రంగాలు మూత పడటంతో పాటు రవాణా నిలిచిపోవడం వల్ల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు పడిపోయినట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్లో నెలలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. జంతు ఉత్పత్తులను వినియోగిస్తే కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారంతో పౌల్ట్రీ రంగం ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ► మత్స్య, మేకలు, గొర్రెల ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోవడంతో ఈ రంగాల ఉత్పాదకత భారీగా తగ్గిపోయింది. పాల డిమాండ్పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ, డెయిరీ ఇతర ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగానే ఉంది. ► హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, పార్లర్లు మూత పడటం, వీధి వ్యాపారాలు నడవక పోవడం వల్ల స్వీట్లు, పన్నీరు, క్రీమ్ ఉత్పత్తుల డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో పాడి రైతుల పాలకు సరైన ధర లభించలేదు. పర్యవసానంగా పాడి రైతులు తమ పశువులకు గ్రీన్, డ్రై దాణాను ఇవ్వడం తగ్గిచేశారు. తద్వారా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ► ఒక్క ఏప్రిల్ నెలలోనే డెయిరీ ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగా పడింది. అయితే ఏప్రిల్ నాటికే రబీ పంటలు వచ్చేయడంతో వ్యవసాయ ఉత్పత్తులపై లాక్ డౌన్ ప్రభావం తక్కువగానే ఉంది. -
పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్మెంట్ కింద ఎన్డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమ చేయనుంది. కాగా 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి . ఇప్పటివరకు రూ.8,507 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇంకా రూ.1788 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. -
పోలవరానికి రూ.2,234.288 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరఫున రీయింబర్స్మెంట్ నిమిత్తం రూ.2,234.288 కోట్లను మంజూరు చేస్తూ నాబార్డు డీజీఎం వికాశ్ భట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. ఈ రూ.2,234.288 కోట్ల రీయింబర్స్మెంట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకు.. అంటే 2016 సెప్టెంబర్ 8 వరకు పోలవరానికి కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేసేది. ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో నాబార్డు నుంచి రుణం తీసుకుని పోలవరానికి నిధులిస్తామంటూ మెలిక పెట్టింది. అప్పటినుంచి అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేస్తూ వస్తోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730.71 కోట్లను ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,529.42 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.8,614.16 కోట్లను నాబార్డు రీయింబర్స్ చేస్తూ ఎన్డబ్ల్యూడీఏ, పీపీఏలకు విడుదల చేసింది. అందులో పీపీఏ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. దీంతో మిగతా రూ.4,022.16 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో రూ.2,234.288 కోట్లను రీయింబర్స్ చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. -
మల్లన్నసాగర్కు రూ.4,600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రుణం ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయడానికి రూ. 4,600 కోట్ల రుణం ఇవ్వనుంది. దీనిపై ప్రభుత్వం నాబార్డ్తో త్వరలోనే ఒప్పందం చేసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులను రూ.6,805 కోట్లతో ఆరంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనుల్లో ఏకంగా 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ కింద అన్ని ప్రధాన చానళ్ల ద్వారా మొత్తం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 9.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. -
సాగిపోదాం.. సాఫీగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ► జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ► రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► ఆర్ అండ్ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు. రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. ► గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. ► కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల పంచాయతీరాజ్శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ జిల్లాలో పాడేరు నుంచి సుజనాకోట వరకు రూ.20 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. పెదబయలు మండలం దూడకోట పంచాయతీ కేంద్రం నుంచి అత్యంత మారుమూల జాముగూడ వరకు రూ.13.21 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో కెందుగూడ వరకు, ముంచంగిపుట్టు మండలం మారుమూల లబ్బూరు జంక్షన్ నుంచి మారుమూల గ్రామం బుంగాపుట్టు వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట–దోన్బాయి–వీరఘట్టం వరకు 25 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.24 కోట్లతో చేపట్టారు. డిసెంబర్కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రహదారులు వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాధాన్యత క్రమంలో రోడ్లను నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే రోడ్లు గుర్తించి వాటి మరమ్మతులు, నిర్వహణ చేపడుతున్నాం. డిసెంబర్ నాటికల్లా రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. గ్రామీణ రహదారులను విస్తరించడం, నిర్వహణ కోసం నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. రూ.1,089 కోట్ల ప్రతిపాదనల్లో రూ.440 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపట్టే ప్రణాళికలున్నాయి. – వేణుగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
పరపతి సంఘాలకు నాబార్డ్ చేయూత!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నాబార్డ్ చేయూతను అందిస్తోంది. రైతులకు విత్తనాలు మొదలు అన్ని రకాల సేవలు అందిస్తున్న వీటిని మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం రూ.3,321 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ► సంఘాల ఆధ్వర్యంలో గోడౌన్లు, కోల్డ్ రూములు, కలెక్షన్ సెంటర్లు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ప్లాట్ఫామ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలతోపాటు సంఘాలకు అదనపు ఆదాయం లభిస్తుంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని సమగ్ర నివేదికలను అధికారుల ద్వారా నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందే ఏర్పాటు చేశారు. ► ఈ ప్రతిపాదనలకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు తొలి విడత రూ.1,250 కోట్ల విడుదలకు అంగీకరించారు. ► మరే రాష్ట్రంలో లేని విధంగా నామమాత్రపు వడ్డీకి ఈ రుణం లభించనుంది. నాలుగు శాతం వడ్డీకి రుణం ఇస్తున్నప్పటికీ సకాలంలో చెల్లిస్తే మూడు శాతం రాయితీ ఇవ్వడానికి నాబార్డ్ అంగీకరించింది. దీంతో కేవలం 1 శాతం వడ్డీతోనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రుణం పొందనున్నాయి. సహకార సంఘాలను పటిష్టం చేయడానికే.. ► రాష్ట్రంలో 2,043 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉంటే.. వీటిలో 800 నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ► ఈ సంఘాలు రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించలేకపోతున్నాయి. అదే విధంగా రుణాలను కూడా ఇవ్వలేకపోతున్నాయి. ► వీటితోపాటు మిగిలిన సంఘాలను ఆర్థికంగా పటిష్టపరిచి రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం రెండు నెలల క్రితం రూ.3,321 కోట్లకు డీపీఆర్లను రూపొందించింది. ► ఇందులో గోడౌన్ల నిర్మాణాలకు రూ.1,893 కోట్లు, పంటలను ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్ల నిర్మాణాలకు రూ.207 కోట్లు, పీపీసీ ఎక్విప్మెంట్, డయ్యర్లు తదితర యాంత్రిక పరికరాలకు రూ.1,009 కోట్లు, ప్రొక్యూర్మెంట్, ఈ–ప్లాట్ఫామ్లకు రూ.212 కోట్లను కేటాయించింది. ► నాబార్డ్ రుణం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఆసక్తి, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంఘాలు.. గోడౌన్లు, కోల్డ్ స్టోర్ రూమ్ల ఏర్పాటుకు ముందుకు వస్తే, వాటికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► సోమవారం ఇదే అంశంపై చర్చలు జరపడానికి సహకార, మార్కెటింగ్, నాబార్డ్ అధికారులు సమావేశం కానున్నారు.