
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 51,544 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 1,901 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,08,924కు చేరింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 19 మంది మరణించగా మొత్తం 6606 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 3,972 మంది కోలుకోగా ఇప్పటి వరకు 7,73,548 మంది కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 76,21,896 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. ప్రస్తుతం 28,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (కరోనా కేసుల కంటే డిశ్చార్జ్లే ఎక్కువ)
చదవండి: చార్మీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment