
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పరీక్షల సంఖ్య 61 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 56,145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,256 మందికి పాజిటివ్గా తేలింది. నిన్న ఒక్క రోజు 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. మరణాల సంఖ్య 6,019గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం 51,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాడు 7,558 మంది కోలుకోగా మొత్తం 6,66,433 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 61,50,351 కరోనా పరీక్షలు పూర్తి చేశారు. చదవండి: రాధిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
Comments
Please login to add a commentAdd a comment