కొత్తపేట: అమెరికాలో ఉంటున్న తూర్పు గోదావరి జిల్లా వాసి ఇక్కడకు రాకుండానే కేవలం 15 రోజుల్లో బర్త్ సర్టిఫికెట్ పొందారు. జిల్లాలోని కొత్తపేట మండలం పలివెల గ్రామం రెండో వార్డుకు చెందిన యర్రాప్రగడ కృష్ణకిషోర్ సుమారు పదేళ్ల కిందట అమెరికాలోని చికాగో వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయనకు గ్రీన్ కార్డు ఇమ్మిగ్రేషన్ నిమిత్తం బర్త్ సర్టిఫికెట్ అవసరమైంది. కోవిడ్ కారణంగా ఇక్కడికి స్వయంగా రాలేని ఆయన ఆ సర్టిఫికెట్ కోసం కలెక్టర్ డి.మురళీధర్రెడ్డిని ఆన్లైన్లో సంప్రదించారు. స్పందించిన కలెక్టర్ రాజమహేంద్రవరం డీఎల్డీఓ, కొత్తపేట ఇన్చార్జ్ ఎంపీడీఓ కె.రత్నకుమారికి ఆ సమాచారం పంపించారు.
ఆమె కృష్ణకిషోర్ నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు రప్పించుకుని, తహసీల్దార్ జీడీ కిశోర్బాబుకు పంపించారు. ఆయన వీఆర్ఓ కె.శ్రీనివాస్ ద్వారా విచారణ జరిపించి, నివేదికను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్కు సమర్పించారు. ఆయన సూచనల మేరకు పలివెల గ్రామ సచివాలయం–2 కార్యదర్శి కె.సురేష్, డిజిటల్ అసిస్టెంట్ లాజరస్ సాయంతో డేటా ఎంట్రీ చేసి, ఈ నెల 14న ఈ–మెయిల్ ద్వారా చికాగోలో ఉన్న దరఖాస్తుదారు కృష్ణకిషోర్కు బర్త్ సర్టిఫికెట్ను మెయిల్ ద్వారా పంపించారు. దీనివల్ల ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు ఇమ్మిగ్రేషన్ పని పూర్తయ్యింది. సాధారణంగా ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు బర్త్ సర్టిఫికెట్ పొందటానికి 60 రోజుల సమయం పడుతుంది. దీనికి భిన్నంగా కేవలం 15 రోజుల్లోనే సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణకిశోర్ గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును అభినందిస్తూ కలెక్టర్కు లేఖ రాశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అసమానమైన సేవలు అందిస్తుండటం గొప్ప విషయమని అందులో పేర్కొన్నారు. కృష్ణకిశోర్ తాను అమెరికా నుంచి పలివెల వచ్చి వెళ్లేందుకు రూ.1.10 లక్షలు ఖర్చయ్యేదని తెలిపారు. ఆ మొత్తాన్ని కలెక్టర్ మురళీధర్రెడ్డికి పంపించి.. కలెక్టర్ సూచించిన మేరకు ఆ నిధులను వినియోగించాలని కోరారు. దీంతో గ్రామ కార్యదర్శి సురేష్కు కలెక్టర్ రూ.5 వేలు రివార్డు ప్రకటించి, మిగిలిన రూ.1.05 లక్షలను గ్రామ సచివాలయ అభివృద్ధికి కేటాయిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. సంబంధిత అధికారులను, కార్యదర్శి సురే‹Ùను, సచివాలయ సిబ్బందిని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు.
సచివాలయ సేవల్లో ఇదో అద్భుతం
Published Wed, Nov 18 2020 5:29 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
‘సెర్చ్’ ఏదీ ?
థాయిలాండ్లో అద్భుతం
‘బంధం’ తెగిపోతోంది!
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం
తప్పక చదవండి
- 18న పీఎం కిసాన్ నిధుల విడుదల
- దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
- గ్రామాల్లో ఉండాలంటే మేము చెప్పినట్లు చెయ్యాలి
- పవన విద్యుత్తుకు రాష్ట్రమే బెస్ట్
- పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి..
- దేశంలో తృణధాన్యాల వినియోగం తగ్గుదల
- 26 మంది ఐఏఎస్ల బదిలీ
- త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
- మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
- Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
Advertisement