East Godavari district
-
ఏపీలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద "ఆదియోగి" విగ్రహం ఎక్కడో తెలుసా (ఫొటోలు)
-
ఉపాధి పరిమళం!
పెరవలి : గోదారికి ఆనుకుని ఉన్న గ్రామం అది. ఊరు ఊరంతా పూల తోటలమయం. ఊళ్లోనే కాదు.. ఊరికి ఏ పక్కన వెళుతున్నా పూల సువాసనలు ముక్కు పుటాలను తాకి మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. రంగు రంగుల పూల మొక్కలు మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. ఇక శీతాకాలంలో అయితే మంచు తెరల మధ్య ఆ గ్రామం భూతలస్వర్గమే! తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామ ప్రత్యేకత ఇది. పూల మార్కెట్లో జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. సుమారు 5 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 1100 కుటుంబాలున్నాయి. 3,500 మంది జనాభా ఉంది. 1200 ఎకరాలు పంట భూమి ఉండగా.. 800 ఎకరాల్లో వివిధ రకాల పూలనే సాగు చేస్తుండటం విశేషం. ఏడాది పొడవునా ఉపాధి గ్రామంలో నివసిస్తున్న 1100 కుటుంబాల్లో 900 కుటుంబాలు పూల వ్యాపారం, పూల సాగు పైనే ఆధారపడ్డాయి. గ్రామంలోని మహిళలంతా ఇంటి వద్దే ఉండి పూల మాలలు, దండలు కడుతూ ఉపాధి పొందుతున్నారు. కిలో పూలు మాలగా కట్టినందుకు బంతిపూలకు రూ.40, కనకాంబరాలకు రూ.150, కాగడాలు, మల్లెలు, విరజాజులు వంటి వాటికి రూ.100 తీసుకుంటారు. ఇలా ప్రతి ఇంటి నుంచి ఒక్కో మహిళ రోజుకు రూ.200 నుంచి రూ.400 వరకు సంపాదిస్తోంది. శుభముహుర్తాలు, పండుగలప్పుడైతే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఇక యువకులు పెండ్లి మండపాలకు పూలను డెకరేట్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలోని పురుషులు చాలామంది తెల్లవారు జామున సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వివిధ ప్రాంతాలకు వెళ్లి పూలను అమ్ముతుంటారు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి పూలను అమ్మి.. ఆ డబ్బుతో పూట మార్కెట్కు వెళ్లి కావాల్సిన పూలను కొనుగోలు చేసి ఇంటికొస్తారు. తిరిగి వాటిని మాలలుగా కట్టించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు వివిధ ప్రాంతాలకు వెళ్లి అమ్మకాలు జరుపుకొని రాత్రి 9 గంటలకు ఇళ్లకు చేరతారు. ఇలా ఏడాది పొడవునా వీరు ఉపాధి పొందుతూనే ఉంటారు. చిరు వ్యాపారులు పూలను కొని మాకు అందిస్తే.. మేం మాలలుగా కట్టి ఇస్తాం. ఇంటి దగ్గరే ఉండి రోజుకు 200 నుంచి 400 దాకా ఆదాయాన్ని పొందుతున్నాం. – షేక్ హసేన్ బేబీ, గృహిణి, కాకరపర్రుమా గ్రామంలో యువకులంతా పూలను సాగు చేయడంతో పాటు పెండ్లి మండపాలకు పూలను డేకరేట్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చాలామంది యువకులు సైకిళ్లు, బైక్లపై పూల అమ్మకాలు చేస్తుంటారు. – కాపకా సూర్యనారాయణ, చిరువ్యాపారి, కాకరపర్రు -
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్!
పెరవలి: ముక్కుపచ్చలారని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా చితకబాదిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన చేబ్రోలు అనిల్కుమార్ కుమారుడు పెరవలి మండలం కానూరు గ్రామంలోని రమా గాయత్రి ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన సమయంలో ఏడుస్తున్న ఆ విద్యార్థి ఆటో నుంచి దిగలేదు. దీంతో ఉపాధ్యాయుడు అశోక్ వచ్చి, ఆ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇంటికి వచ్చిన తరువాత కూడా బాబు ఏడుస్తుండడంతో ఆరా తీయగా మాస్టారు కొట్టారంటూ వీపుపై ఉన్న గాయాలు చూపించాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని శుక్రవారం రాత్రి పెరవలి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి అనుమతి తీసుకుని, కేసు నమోదు చేయాల్సి ఉందని, అనుమతి కోసం దరఖాస్తు చేశామని ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
ఎమ్మెల్యేలకు ముడుపులు.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతల దందా
తూర్పుగోదావరి జిల్లా : పేరుకే ఉచిత ఇసుక విధానం. కానీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. యథేశ్చగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముడుపు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు.బాట ఛార్జీల పేరుతో లారీకి రూ.2,500వరకు వసూలు చేస్తున్నారు. కొవ్వూరు టీడీపీ ఎంపీపీ కాకర్ల నారాయుడు వాడపల్లి ర్యాంప్లో తన అనుచరులతో దగ్గరుండి వసూలు చేయిస్తున్నాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో రహస్య ప్రదేశాలలో ఇసుక డంప్ చేసి.. మొత్తంలో ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి నేతలు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వైరల్గా మారాయి. -
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్పోర్ట్లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
విద్యుత్ షాక్కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
ప్రజల్లో తిరుగుబాబు మొదలైంది: జక్కంపూడి రాజా
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదవరి జిల్లాలో బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ లొల్ల భద్రంను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ కి ప్రయత్నించారు. కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయగా గ్రామస్తులు.. కిడ్నాపర్లను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో సర్పంచ్ క్షేమంగా బయట పడ్డారు. దండగుల పెనుగులాటలో సర్పంచ్కి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత గూడూరు శ్రీనివాస్ ఇల్లపల్లి సర్పంచ్ను పరామర్శించారు. అనంతరం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లడారు. ‘‘ కూటమి ప్రభుత్వం దాడులు పెచ్చు మీరుతున్నాయి. ఇల్లపల్లిలో ప్రజలే తిరగబడి సర్పంచును కాపాడుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అనపర్తిలో మరొక్క హింస పక్క సంఘటన చోటుచేసుకున్నా ఊరుకునేది లేదు. వేలాదిగా ప్రజలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అధికారం శాశ్వతం కాదు’’ అని అన్నారు. -
సినిమా వృక్షం పునరుజ్జీవానికి చర్యలు
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నేలకూలిన 150 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా (నిద్ర గన్నేరు) వృక్షాన్ని తిరిగి అదే ప్రదేశంలో బతికించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటించారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి బుధవారం కూలిన చెట్టును ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కెమికల్ ట్రీట్మెంటు ద్వారా ఈ చెట్టును మళ్లీ చిగురింప జేసేందుకు రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ముందుకొచి్చందన్నారు. -
తూర్పు ఏజెన్సీలో కరెంట్ కష్టాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్
-
బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు... కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాలో పని చేశాడు... గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు... ఇతడు టార్గెట్ చేసింది కూడా రాజకీయ నేతల్నే... రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకంతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 40 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు...ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 37 పోలీసుస్టేషన్లలో ఇతడిపై కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించినా పంథా మారలేదు... ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు నేర చరిత్ర ఇది. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఇతగాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క సామాన్యుడి జోలికీ వెళ్లలేదు. నాటి ఎమ్మెల్సీ ఆకుల లలిత నుంచి రూ.10 లక్షలు కాజేసిన కేసులో 2017, మరో ప్రముఖుడిని బురిడీ కొట్టించి 2019ల్లో జైలుకెళ్లిన ఇతగాడు తాజాగా మరో ఎమ్మెల్యేకు టోకరా వేసి శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన విషయం విదితమే. 50 ఏళ్ల వయస్సున్న ఈ నిందితుడు ఇప్పటి వరకు 21 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఒక్కోసారి ఒక్కో విధంగా... తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు. వైజాగ్లో విధులు నిర్వర్తిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఈ కేసు నిరూపితం కావడంతో ఆ తర్వాతి ఏడాది ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం ప్రభావంతో బయటకు వచ్చినప్పటికీ నుంచి మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకుని విజృంభించాడు. విజయనగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయని, మీ నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాల్సిందిగా మీమీ ఎమ్మెల్యేలకు సూచించాలంటూ ఎర వేశాడు. డిపాజిట్ పేరుతో కొంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. ఈ నేరంపై విజయనగరం రెండో టౌన్ పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ అనేక మందిని ఇలానే మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి పంపారు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం పోలీస్స్టేషన్ పరిధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నేతల నుంచే రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుకు వెళ్లాడు. ఇలానే మరికొందరిని ముంచి జైలుకు వెళ్లివచ్చాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ నెంబర్లు... బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎంక్వైరీ నెంబర్ 197ను సంప్రదించి అవనిగడ్డ, విజయనగరం, చిలకలూరిపేట, బొబ్బిలి, నర్సాపురం, బెంగళూరు, అంబర్పేట, యాదగిరిగుట్ట, సాలూరు, చిపురుపల్లి, పొన్నూరు, కారంచేడు తదితర నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. రాజీవ్ యువకిరణాలు పేరుతో దాని ప్రాజెక్ట్ డైరెక్టర్నంటూ ఎర వేశాడు. వారి పీఏలకు విషయాన్ని ‘వివరించి’ ఒక్కో అభ్యర్థికి రూ.1,060 చొప్పున ముందస్తు డిపాజిట్ చేయాలంటూ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశాడు. కొందరు నిరుద్యోగుల్నీ ఉద్యోగాల పేరుతో ముంచాడు. ఈ నేరాలకు సంబంధించి బీజేపీ నాయకుడు రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్పై జైలు నుంచి బయటకు వచి్చన బాలాజీ అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్గౌడ్, పాల్వాయి గోవర్థన్లను టార్గెట్ చేశాడు. వారితో పాటు వారి పీఏలకూ ఫోన్లు చేసి రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాల పేరే చెప్పాడు. మీమీ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగులుకు ఉద్యోగాలు ఇప్పించుకోండని సూచించాడు. ఒక్కో అభ్యర్థికీ సంబంధించి ముందుగా దరఖాస్తు రుసుము రూ.500, మెస్ చార్జీల కింద రూ.560 కలిపి మొత్తం రూ.1,060 చొప్పున వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయమని కోరాడు. వీరు అలానే చేయగా మొత్తం డ్రా చేసుకుని స్వాహా చేశాడు. హన్మంతరావు రూ.1,09,500, దేవేందర్గౌడ్ రూ.66,000, గోవర్థన్ రూ.1,32,00 డిపాజిట్ చేశారు. తానే ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అరెస్టు అయ్యాడు. 2015లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి చిక్కాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీ నుంచి... ఇతగాడి ఘరానా నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉండి 2017 జనవరిలో విడుదలైన బాలాజీ నాయుడు సిటీతో పాటు ఏపీ, తెలంగాణల్లో మళ్లీ మోసాలు చేశాడు. ఆ ఏడాది సెపె్టంబర్ 12న తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు కాల్ చేసిన బాలాజీ నాయుడు తాను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ముందుగా ఐదు శాతం చెల్లిస్తే ఆ మెత్తం విడుదల చేయిస్తానంటూ చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించారు. చివరకు మోసపోయానని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లారు. 2019లోనూ ఓ ప్రజాప్రతినిధిని మోసం చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఏకంగా ప్రముఖులనే టార్గెట్గా చేసుకుని రెచ్చిపోతున్న ఇతగాడిని కట్టడి చేయడానికి అనువైన మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు వారి సంబంధీకులు, సిబ్బంది ఈ మోసగాడి పం«థాను దృష్టిలో ఉంచుకోవాలని, ఫోన్ ద్వారా సంప్రదించే వారిని పూర్తి స్థాయిలో నమ్మవద్దని హితవు పలుకుతున్నారు. -
తూర్పు గడ్డపై ఫ్యాన్ హోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ జోరుగా తిరుగుతోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూర్పు గడ్డపై వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో బలంగా ఉందనుకున్న జనసేనపై నమ్మకం సడలి ఆ పార్టీ నేతలు జారుకోవడం, టీడీపీ ఆదరణ కోల్పోవడం తదితర పరిణామాలతో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పులో 19 అసెంబ్లీ స్థానాల్లో 15 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని స్థానాల్లోనూ క్లీన్స్వీప్ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కన్నబాబు కన్నుల్లో ఆనందమే రెండుసార్లు ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అభివృద్ధితో తనదైన ముద్ర వేసుకున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలుపు నల్లేరుపై నడకే. వివాదరహితుడు, అందరితో కలిసిపోయేతత్వం ఈయనకు సానుకూల అంశాలు. ఆయన స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసినప్పుడు 40 వేల ఓట్లు పైచిలుకు సాధించిన రికార్డు ఉంది. జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావుపై పలు స్టేషన్లలో 19 కేసులున్నాయి. దీంతో ఆయనకు అన్ని వర్గాల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ప్రత్తిపాడులో ఫ్యాన్ పవర్ ప్రత్తిపాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ నిలిచారు. వీరిద్దరూ వరుసకు తాత, మనవరాలు. సీనియర్ నాయకుడు కావడం, వివాదరహితుడనే పేరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సుబ్బారావుకు కలిసి వచ్చే అంశాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండటం సుబ్బారావుకు ప్లస్ పాయింట్. ఈ ఎన్నికల్లోనే తొలిసారి బరిలో నిలిచిన సత్యప్రభకు రాజకీయాలు కొత్త. పారీ్టలో తన భర్త దివంగత రాజాతో విభేదాలున్న వర్గం సత్యప్రభకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం ప్రతికూలాంశం.కాకినాడ మరోసారి కేకకాకినాడ సిటీ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హ్యాట్రిక్ విజయం దిశగా పయనిçస్తున్నారు. విద్యార్థి దశ నుంచి కాకినాడలో దాదాపు అన్ని వర్గాల సాన్నిహిత్యంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్మార్ట్ సిటీ నిధులతో సుందర నగరంగా తీర్చిదిద్దడం, ఎన్నికల మేనేజ్మెంట్లో నైపుణ్యం, ముక్కుసూటితనం ద్వారంపూడికి మూడోసారి గెలుపునకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ద్వారంపూడికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు సొంత సామాజికవర్గం నుంచి వ్యతిరేకత, టీడీపీలో గ్రూపుల గోలతో ఎదురీదుతున్నారు. ‘తోట’కే విజయ ఫలంపూర్తిగా మెట్ట ప్రాంతం జగ్గంపేట. రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేచింది ఇక్కడ. వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. వీరిద్దరు 2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేటలో పాత ప్రత్యర్థులే. ఈ రెండుసార్లు కూడా తోటదే గెలుపు. మూడోసారి మళ్లీ తలపడుతున్నారు. మహానేత వైఎస్ కేబినెట్లో మంత్రిగా తోట చేపట్టిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు నరసింహంకు సానుకూలత ఏర్పడింది. టీడీపీ అభ్యర్థి నెహ్రూకు పారీ్టలోని వ్యతిరేక వర్గంతోపాటు జనసేన రెబల్గా బరిలో ఉన్న పాటంశెట్టి సూర్యచంద్రరావు తోడుకావడం మైనస్.జగ్గిరెడ్డిని ఆపతరమా..? కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యనే మరో సారి పోరు సాగుతోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి బండారు సత్యానందరావు బరిలోకి దిగారు. 2004 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోను వీరిద్దరే ప్రత్యర్థులు. 2009లో తప్ప మిగిలిన అన్నిసార్లూ చిర్లదే గెలుపు. జగ్గిరెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సానుకూలమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చిర్ల గెలుపు వాకిట ముందున్నారు. టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు పొత్తుతోనే చిత్త య్యే వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్కు భంగపాటే... అపజయం ఎరుగని రాజకీయ నాయకురాలిగా పేరున్న సిట్టింగ్ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్ పిఠాపురం బరిలో నిలిచారు. 2009లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గీత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న ఏకైక మహిళా నాయకురాలిగా పేరుంది. నియోజకవర్గంలో ఎవరినైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి పరిచయాలున్న గీతతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీపడుతున్నారు. తనకున్న పరిచయాలు, కలుపుగోలుతనం, జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవంతో పిఠాపురంలో పవన్కు చుక్కలు చూపిస్తూ గెలుపు దిశగా అడుగులేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికలప్పుడు కనిపించి తరువాత ముఖం చాటేస్తారనే భయం ఉంది. ‘పెద్ద’రికానికి బ్రేకు తప్పదు పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు టీడీపీ వరుస విజయానికి బ్రేక్ వేసే వైపు అడుగులేస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి దొరబాబు చేసిన కృషి విజయం వైపు నడిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి ఆశాభంగం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్ర తిరగేసి చూస్తే పెద్దాపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు లేవు. ఇక్కడి నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన చినరాజప్ప ఈ సారి తప్పకుండా ఓటమి చవిచూస్తారని అంటున్నారు. తునిలో టీడీపీ తూర్పుకు దండమే తూర్పు సెంటిమెంట్ నియోజకవర్గం తుని. రెండు, మూడు సందర్భాలు మినహాయిస్తే ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పారీ్టనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టాలని వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా ధీమాగా ఉన్నారు. చేపట్టిన అభివృద్ధి, సాయం అర్థించి వస్తే కాదనలేని మనస్తత్వం రాజాను గెలిపిస్తుంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె దివ్యను బరిలోకి దింపినా ఎదురీదక తప్పడం లేదు. రామకృష్ణుడు మోసానికి గురైన తమ్ముడు కృష్ణుడు టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరడంతో గెలుపు మరింత సులువైంది. కమలానికి కంటి తడి తప్పదు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యరి్థగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బరిలోకి దిగగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పోటీపడుతున్నారు. చేయి తిరిగిన వైద్యుడిగా పేరొందిన శ్రీనివాస్ను బలహీనవర్గాల కోటాలో ఈ స్థానాన్ని కట్టబెట్టడంతో బీసీలతో పాటు ఇతర సామాజికవర్గాల మద్ధతుతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.స్థానికులను కాదని పురందరేశ్వరికి బీజేపీ సీటు కేటాయించడంతో కమళనాథుల కుమ్ములాటలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దిగుమతి చేసుకునే నేతలకు పట్టంకడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది గతంలో సినీ నటుడు మురళీమోహన్ విషయంలో చూసిన ఈ ప్రాంత జనం పురందరేశ్వరి అభ్యరి్థత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.‘బుచ్చిబాబు’ను వెంటాడుతున్న పాపాలు ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎదురీదుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు అతని అనుచరగణం సాగించిన అరాచకాలు, సెటిల్మెంట్లు ఈ ఎన్నికల్లో వెంటాడుతున్నాయి. నాడు చేసిన తప్పులు ఇప్పుడు కొద్దోగొప్పో బాగుందనుకుంటున్న పార్టీకి మైనస్గా మారాయి. సమస్యల పరిష్కారంలో సామాజికంగా కొన్ని పక్షాలను దూరం పెట్టిన ప్రభావం ఇప్పుడు వ్యతిరేకతగా మారి ఓటమి అంచులకు చేరుస్తోందని ఆ వర్గాలే భావిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్కు బలమైన రెండు సామాజికవర్గాల మద్దతుతో ఈసారి కూడా గెలుపు సునాయసమేనని విశ్లేíÙస్తున్నారు. సునీల్..గెలుపు జిగేల్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది.వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్తో జనసేన అభ్యర్థి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయశ్రీనివాస్ పోటీపడుతున్నారు. సునీల్కు మెట్ట ప్రాంత మండలాల్లో పారీ్టరహితంగా నేతలతో ఉన్న బంధుత్వాలు, పరిచయాలు కలిసి వస్తున్నాయి. సునీల్తో పోటీపడుతోన్న జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ స్థానికేతరుడు, కనీస పరిచయాలు లేకపోవడం ప్రతికూలతగా మారింది. మిత్రపక్షం టీడీసీలో అంతర్గత కుమ్ములాటలు, వారి నుంచి ఎదురవుతోన్న సహాయనిరాకరణతో ఎదురీదుతున్నారు. గొల్లపల్లి గుప్పెట్లో రాజోలు ఎమ్మెల్యే, మంత్రిగా రాజకీయాల్లో అపారమైన అనుభవం, ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిచయాలు, రాజోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు విజయావకాశాలకు ఢోకా లేకుండాపోతోంది. గతంలో గొల్లపల్లి చేసిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు, వందేళ్లుగా జరగని సఖినేటిపల్లి– నర్సాపూర్ వంతెన నిర్మాణం కోసం రూ.580 కోట్లు కేటాయింపు సానుకూల అంశాలై గెలుపు ఖాయమంటున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యర్థిగా పోటీచేస్తున్న జనసేన అభ్యర్థి దేవ వర ప్రసాద్ ఈ ప్రాంతంతో పరిచయం లేకపోవడంలో ఓటమి ఖరారుగా కనిపిస్తోంది. అనపర్తి సత్తికి కంచుకోట అనపర్తి నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోటగా మరోసారి నిలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పాలనకుతోడు అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించిన సత్తికి గెలుపు సునాయాసమేనంటున్నారు. ఓటమి ఖాయమనే సర్వే నివేదికలతో వెనక్కు తగ్గిన టీడీపీ, బీజేపీని బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి పోటీకి పెట్టింది. ఈ పరిణామాలతో విస్తుపోయిన ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ‘దేశం’ సర్దుకోవలసిందే అమలాపురం నియోజకవర్గంలో మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ గెలుపు బాటలో పయనిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సీనియర్గా అన్ని వర్గాలతో మమేకం కావడం, అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో విశ్వరూప్ విజయానికి ఢోకా లేదు. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా ప్రజలతో పెద్దగా మమేకమవకపోవడం ప్రతికూలతగా మారింది. సొంత పారీ్టలోనే కాకుండా కూటమిలోని జనసేన నేతలు కూడా తెరవెనుక వ్యతిరేకంగా పనిచేస్తుండటం మైనస్.‘రాజా’నగరమే ఇక్కడ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్యరి్థగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీపడుతున్నారు. రూ.1773 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1377 కోట్లతో అందించిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలిచి సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని పలువురిని మోసం చేయడం వంటి కేసులుండటంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేనతో జతకట్టిన టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత బలరామకృష్ణకు ప్రతికూల అంశం. బలరామకృష్ణ ఏకైక నమ్మకం పవన్ సామాజికవర్గం.రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ రయ్..రయ్ రాజకీయ దురంధరుడైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రామచంద్రపురం బరిలోకి దిగిన అతని తనయుడు, విద్యావంతుడు పిల్లి సూర్యప్రకాశ్ విజయానికి చేరువలో ఉన్నారు. స్థానికుడు, తండ్రి బోస్ ద్వారా గ్రామ,గ్రామాన ఉన్న విస్తృతమైన పరిచయాలు సానుకూల అంశాలు. బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు చెందిన బలమైన సామాజిక వర్గాలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి వైఎస్సార్సీపీ పక్షాన నిలవడం ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ స్థానికేతరుడు, నేరచరిత్ర, అమలాపురం పరిసరాల్లో ఉన్న కేసులు, జనసేన నుంచి సహాయ నిరాకరణ ప్రతికూల అంశాలు.మార్పు కోరుతున్న ‘రూరల్’ రాజమహేంద్రవరం రూరల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదేళ్లపాటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆ«ధిపత్య సామాజిక వర్గానికి చెందిన గోరంట్లపై బీసీ సామాజికవర్గానికి చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బరిలోకి దిగారు. సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన గోరంట్ల ఇక్కడ మూడోసారి తలపడుతుంటే, నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమితులై ప్రగతికి శ్రీకారం చుట్టడంతో వేణుకు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీకి ప్రసాదమే అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్న రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు ఫ్యాన్గాలి బలంగా వీస్తోంది. దేశంలో ఎస్సీ సామాజికవర్గం బలంగా ఉన్న రెండో పార్లమెంటు స్థానం అమలాపురం కావడం, ఆ సామాజికవర్గం ముద్ర వైఎస్సార్సీపీపై బలంగా ఉండటంతో కలిసి వచ్చే అంశం. రాపాకకు ప్రత్యరి్థగా టీడీపీ నుంచి పోటీచేస్తోన్న గంటి హరీ‹Ùమాధుర్కు రాజకీయాలపై పెద్దగా అవగహన లేకపోవడం మైనస్. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వర్గవైషమ్యాలు హరీ‹Ùకు ప్రతికూలంగా ఉన్నాయి.మండపేటలో వేగుళ్ల ఎదురీతమండపేటలో ఈ సారి వైఎస్సార్సీపీ దెబ్బకు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నియోకవర్గంలో తొలిసారి టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గాన్ని ఢీకొట్టే సత్తా కలిగిన నాయకుడిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బరిలోకి దిగారు. సొంత సామాజికవర్గంతోపాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు మునుపెన్నడూ లేని రీతిలో తొలిసారి టీడీపీని కాదని కలిసి వస్తుండటం సానుకూలంగా మారింది. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు. వేణుకు ‘వరమే’మృదు స్వభావి, నీటి పారుదల ఇంజనీర్గా రైతులకు చేసిన సేవలు పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యరి్థ, జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావును గెలుపు తీరానికి చేరుస్తున్నాయి. వివాదరహితుడు, విద్యావంతుడు, జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర, స్థానికుడు కావడం తదితర అంశాలు గెలుపునకు సానుకూలంగా మారాయి. ప్రత్యర్థి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికేతరుడు కావడం మైనస్గా ఉంది. పొత్తు సమన్వయం లేకపోవడం, ఆ పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో గిడ్డికి ఎదురుగాలి వీస్తోంది.రాజమండ్రి సిటీలో సీటు చిరిగిపోయినట్లే రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎదురీదుతోంది. సిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్రామ్ను గెలుపు బాటలో పయనింపచేస్తున్నాయి. కళ్లెదుట కనిపిస్తున్న సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన నగర సుందరీకరణ భరత్కు సానుకూలంగా మారింది. నగరంలో దశాబ్దన్నర కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న ప్రత్యరి్థ, టీడీపీ అభ్యరి్థగా ఆదిరెడ్డి వాసుపై నెలకొన్న అసంతృప్తే అతనికి మైనస్గా మారింది. తల్లి నగరపాలక సంస్థ మేయర్గా, భార్య భవానీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు నగరాభివృద్ధిపై కన్నెత్తి చూడకపోవడంతో వాసుకు ప్రతికూలంగా మారింది. -
Memantha Siddham: ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. కొనసాగుతున్న సీఎం జగన్ ప్రభంజనం (ఫొటోలు)
-
Memantha Siddham Photos: పల్లె పల్లెలో జన గోదారి..సీఎం జగన్కు జేజేలు (ఫొటోలు)
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన కోనసీమ (ఫొటోలు)
-
గోదావరి తీరం.. జననేత కోసం పోటెత్తిన జనం (ఫొటోలు)
-
చంద్రబాబుకు మతిభ్రమించింది
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్గా కాకినాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు. ఎగుమతుల దిశగా.. మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. ఎమ్మెల్యే సీటు నాదంటే నాదంటూ బాహాటంగా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంబిస్తూ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన బాబు స్వపక్ష నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలను చక్కదిద్దలేక చేతులెత్తేశారు. దీనికి తోడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న మీమాంస నెలకొంది. ఆది నుంచీ ఉన్న వారికి భంగపాటు తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిడదవోలులో ‘సోషల్’ వార్ నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై స్వపక్షంలో అయోమయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, టీడీపీ నేత కుందుల సత్యనారాయణలు సీటు కోసం నువ్వా నేనా? అనే రీతిలో చక్రం తిప్పుతున్నారు. అధినేత ప్రసన్నం కోసం ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో వార్కు దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా నాయకుడే ఎమ్మెల్యే అవుతాడని ఇరు వర్గాలూ పోస్టులు పెడుతూండటంతో ద్వితీయ స్థాయి నాయకులు ఎవరి వెంట నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తనకే కేటాయించాలని టీడీపీ అధిష్టానానికి కుందుల సత్యనారాయణ భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు జనసేన నుంచి మరో ముగ్గురు బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు సన్నిహితంగా ఉండే సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్తో పాటు తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తుండగా.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ సైతం రేసులో ఉన్నారు. పొత్తులో భాగంగా నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని, తామే పోటీ చేస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతల్లో మింగుడు పడటం లేదు. గోపాలపురం.. గందరగోళం గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. ఆది నుంచీ పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో మద్దిపాటి వెంకట్రాజును బాబు నియమించారు. కనీస సమాచారం లేకుండా ఎందుకు మార్చారని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీ చేస్తారని బాబు ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాల అగ్గి మరింతగా రాజుకుంది. అప్పటి నుంచీ ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజికవర్గ నేతలు టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోగా తాడోపేడో తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద బలప్రదర్శనకు దిగుతున్నారు. కొవ్వూరులో ఎస్సీలకు అవమానం ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన కొవ్వూరులో ఆ సామాజిక వర్గాలకు ఘోర అవమానం ఎదురవుతోంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి, తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి కేఎస్ జవహర్కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబుకు అందలం వేయడం.. జవహర్కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కొవ్వూరు అభ్యర్థిత్వం తనదేనంటూ చెప్పుకుంటూండటంతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. రాజానగరం.. గరంగరం రాజానగరంలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే సీటు తనకే వరిస్తుందని జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధిష్టానానికి భారీ స్థాయిలో పార్టీ ఫండ్ ఇచ్చారని.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం ఇప్పటికే రాజానగరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గంలో అగ్గి రాజేస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని, జనసేనకు టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరోవైపు బొడ్డు వెంకట రమణ చౌదరిని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గం ఇప్పటికే పార్టీ అధినేతపై గరంగరంగా ఉంది. ఒకవేళ టీడీపీకే ఈ సీటు కేటాయించినా ఇటు పెందుర్తి వర్గం, అటు జనసేన శ్రేణులు వెంకట రమణ చౌదరికి జెల్ల కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలా కాదని జనసేనకే కేటాయించినా ఆ పార్టీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపించడం లేదు. రాజమహేంద్రవరం రూరల్లో తేలని పంచాయితీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై టీడీపీ – జనసేన మధ్య నెలకొన్న పంచాయితీ నేటికీ కొలిక్కి రావడం లేదు. పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ చెబుతూండగా.. తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఇతరులెవరికైనా ఉందా? తానే పోటీ చేస్తానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. -
మద్దిపాటి వర్సెస్ ముళ్ళపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరావు వర్గాల మధ్య ముసలం
-
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు
-
బూరుగుపూడిలో ‘సామాజిక’ ప్రభంజనం
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది. సామాన్యుల నేత : ఎంపీ సురేష్ సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి. 175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం. -
జనం.. జైత్రయాత్ర
రాష్ట్రంలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. కర్నూలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సీఎం జగన్ పాలనలో తాము సాధించిన సాధికారతను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అవహేళన చేసి కించపరిస్తే.. జగన్ వారందరినీ చేయిపట్టి అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఎన్నడూలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. బడుగులకు లబ్ధి చేకూర్చి వారి అభివృద్ధికి బాటలు వేశారు. పదవుల్లోనూ అధిక ప్రాధాన్యమిచ్చిన ఏకైక సీఎం జగన్’ అని వివరించారు. నందిగామ (పెనుగంచిప్రోలు): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం సాయంత్రం నందిగామలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి యాత్రకు తరలివచ్చిన వారితో పట్టణంలోని వీధులన్నీ కిటకిటలాడాయి. జై జగన్.. జగనే కావాలి అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పట్టణంలోని గాంధీ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలి వచ్చారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పటంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రులు, నేతలు పిలుపునివ్వటంతో ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. జగనన్న పాలనలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని కోరుకున్నారని, వారి ఆశయాలను సాధ్యం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేస్తూ చంద్రబాబు అన్నమాటలను ఎవరూ మరచి పోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన లీడర్ ఒక్క జగనే అని అన్నారు. చంద్రబాబు ఒక గజదొంగ అని, చట్టాలను అనుకూలంగా మార్చుకుని బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాశారని చెప్పారు. సామాజిక సాధికారత విధానంగా...: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఒక నినాదంగా కాకుండా విధానంగా అమలు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని విధాలుగా మోసం చేశారని చెప్పారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే ఈ వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నాయన్నారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్లోనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. శాసనçÜభలో, శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం రూ.2,650 కోట్లు కేటాయిస్తే, సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలోనే రూ.23,175 కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి..: జోగి అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తిగా, పూలే ఆలోచనలను జోడించి సీఎం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో సామాజిక న్యాయం ఒక్క జగన్ వల్లనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆనక కనకమేడల రవీంద్రకు కేటాయించటం బడుగు, బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న వైఖరి అర్ధమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో అందరూ జగన్కు మద్దతు పలకాలన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, పెనమలూరు ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, కైలే అనిల్కుమార్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్కుమార్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు. మంత్రి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్ జగన్ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
అభయమిచ్చారు.. ఆదుకున్నారు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా దివాన్చెరువు గ్రామంలో జక్కంపూడి గణేశ్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి న సీఎం వైఎస్ జగన్కు పలువురు తమ సమస్యలు తెలియజేశారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశించిన మూడు గంటల్లోనే కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొత్తం ఆరుగురు అర్జీదారులకు రూ.5.50 లక్షల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ మాధవీలత అందించారు. ధవళేశ్వరానికి చెందిన ఆర్జీ బాలకృష్ణ డిసెంబర్లో మలేసియాలో జరిగే వెయిట్లిఫ్టింగ్ పోటీలకు వెళ్లేందుకు ప్రయాణఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షల చెక్కు అందజేసినట్లు తెలిపారు. అలాగే వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అన్నవరానికి చెందిన పెయ్యాల బాబురావుకు రూ.లక్ష, రాపాక వెంకట సూర్యనారాయణకు రూ.25 వేలు, వాడపల్లికి చెందిన దాకే చంద్ర ఫణికుమార్కి రూ.లక్ష, పోతవరానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్కు రూ.25 వేలు చెక్కు అందజేశామన్నారు. తండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పెనుగొండకు చెందిన కె.లక్ష్మీకుమారికి రూ.50 వేలు చెక్కు అందజేయడంతో పాటు ఉద్యోగం కోసం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు సిఫారసు చేసినట్లు తెలిపారు. పోతవరానికి చెందిన తోట ఇంద్రకుమారి ఇంటి స్థలం పట్టా కోసం సీఎంను కలిశారని.. ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన
తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 26న పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10:15 గంటలకు తాడెపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. రాజానగరం మండలం దివాన్చెరువు డి.బి.వి.రాజు లే-అవుట్లో జరగనున్న విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అనంతరం తాడెపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదీ చదవండి: ఎల్లుండి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర -
సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లు ప్రారంభం (ఫొటోలు)
-
అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు..
-
3 కొత్త పొగాకు వంగడాల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీటీఆర్ఐ) ద్వారా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ గురువారం తెలిపారు. ఎఫ్సీఆర్–15 (సీటీఆర్ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది అధిక దిగుబడిని (హెక్టార్కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకమన్నారు. ఎఫ్సీజే–11 (సీటీఆర్ఐ నవీన) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే (హెక్టార్కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకమన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబడినిచ్చే (హెక్టార్కు 2,900 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ (ఎస్వీఆర్సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్లో సీటీఆర్ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు. -
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
‘దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకున్నది మా ప్రభుత్వమే’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: దళితులపై అత్యాచారాలు,హత్యలు అంటూ ఈనాడులో ప్రచురించిన వార్తలపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని తానేటి వనిత స్పష్టం చేశారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని హోంమంత్రి మరోసారి గుర్తు చేశారు. ‘దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి వెను వెంటనే చర్యలు తీసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చేసాం. ఈ విషయాలు ఈనాడుకు పట్టవా... వాటిని ఎందుకు ప్రచురించడం లేదు?, చంద్రబాబు హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి అప్పుడు దళితులపై జరిగిన దాడులకు సంబంధించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. టిడిపి హయాంలో దళితులపై దాడులకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. దళితులను అన్ని రకాలుగా ఆదుకున్నది సీఎం జగనన్నే అని చెప్పడంలో సందేహమే లేదు. రాజకీయంగా ,సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారు. దళితులకు అత్యధిక భద్రతను కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నాలాంటి సాధారణ దళిత మహిళలకు రాష్ట్ర హోం మంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నే. టిడిపి హయాంలో దళితులకు హోం మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి. ఒకటి రెండు సంఘటన బూచిగా చూపించి వైఎస్సార్ సీపీకి దళితులను దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.అది ఎప్పటికీ సాధ్యం కాదు’ అని తెలిపారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది. -
కర్ర తీసాము అంటే..
పిఠాపురం: కనుమరుగైపోతున్నాయి అనుకుంటున్న కర్రసాము, కత్తిసాము (శిలంభం) అనే ప్రాచీన యుద్ధ కళలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. పూర్వం యుద్ధాల్లో ఆయుధంగా వాడిన కర్ర, కత్తి.. ఆ తర్వాత వచ్చి న ఆధునిక ఆయుధాలతో యుద్ధ క్షేత్రం నుంచి కనుమరుగయ్యాయి. అయితే కళగానూ ప్రాచుర్యం పొందిన కర్రసాము, కత్తిసాములను గ్రామీణ ప్రాంతాల్లో యువకులు అభ్యసించేవారు. పెళ్లిళ్లు, పండుగలు, ఊరేగింపులు లాంటి సందర్భాల్లో విన్యాసాలు చేస్తుండేవారు. వీటి సాధనకు గ్రామంలో వ్యాయామ శాలలు (తాలింఖానాలు) ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో కర్ర, కత్తి సాము పోటీలు కూడా నిర్వహించేవారు. రానురాను ఈ కళను నేర్చుకునేవారు తక్కువయ్యారు. అయితే ఇటీవల ఈ కళ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. కర్ర, కత్తిసాములపై గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేట, అమలాపురం, పిఠాపురం తదితర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 మంది వీటిల్లో శిక్షణ పొందుతున్నారు. కర్రసాములో రకాలు కర్రసాములో ఒంటిబాణా, ఓడిబాణా అనే కర్రలను తిప్పుతూ ఉంటారు. ఇద్దరు పరస్పరం గురిచూసి తిప్పుతూ ఒకరిపై ఒకరు దాడికి యత్నిస్తుంటే దెబ్బ తగలకుండా తప్పించుకోవడం ఇందులో నైపుణ్యం. ఈ సమయంలో వివిధ వాయిద్యాలకు అనుగుణంగా ఈ విద్యను ప్రదర్శిస్తారు. అలాగే కర్రకు నూనెలో తడిపిన గుడ్డ చుట్టి వెలిగించి ఆ మంటలతో కర్రసాము చేస్తూ అబ్బురపరుస్తుంటారు. ఇదే మాదిరిగా కత్తులతోనూ చేసే విన్యాసాలు, ఈ పోరాటాలలో ఎత్తుకు పైఎత్తు వేస్తూ కత్తిని ఎదుటి వారిపై ప్రయోగించడానికి చేసే ప్రయత్నాలు, తప్పించుకుంటూ ప్రత్యర్థిని ఎదుర్కొనే వ్యూహాలు గగుర్పాటు కలిగిస్తాయి. కత్తిసాములో కత్తి, డాలు ధరించి రకరకాలుగా తిప్పుతూ విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిÙని కింద పడుకోబెట్టి అతని శరీరంపై వివిధ పళ్లు, కూరగాయలు ఉంచి నరుకుతుంటే చూస్తూ విస్తుపోవాల్సిందే. మనిషి పొట్టభాగంపై తమలపాకు ఉంచి, దానిపై ఓ పలుచని వస్త్రం వేసి ఆ వస్త్రం చిరగకుండా తమలపాకు రెండు ముక్కలయ్యేలా కత్తితో నరకడం అద్భుతంగా ఉంటుంది. పోటీలు ఇలా.. జాతీయ స్థాయిలో కర్రసాము, కత్తిసాము పోటీల్లో పాల్గొంటూ స్థానిక రాష్ట్ర యువకులు పతకాలు సాధిస్తున్నారు. కర్రసాము పోటీలను సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, బల్లెం, సురులు, ఫైట్ అనే ఆరు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఈపోటీలను నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. వీరు జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది కర్రసామును క్రీడగా నేర్చుకోవడానికి విద్యార్థులు ముందుకు వస్తున్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఏపీ టీంను తయారు చేసి మంచి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక శిక్షణ పొంది జాతీయస్థాయిలో విజేతలయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నాం. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తాం. – టి అబ్బులు, కర్రసాము శిక్షకుడు, పిఠాపురం రాష్ట్ర స్థాయి స్వర్ణం సాధించాను పిఠాపురంఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. చిన్నప్పుడు దేవుడి సంబరాల్లో కర్రసాము చేయడం చూసేదానిని. దానిని నేర్చుకోవాలని ఆసక్తి ఏర్పడి నేర్చుకున్నాను. గతంలో కర్రసాములో రాష్ట్ర స్థాయి స్వర్ణ పతకం సాధించాను. మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసాన్నిచ్చే ఈకళను నేర్చుకోవడం ఆనందంగా ఉంది. – పి నిర్మల, కొండెవరం ఆత్మరక్షణకు ఈ కళను నేర్చుకున్నా నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఆత్మ రక్షణలో మెళకువల కోసం కర్రసాము నేర్చుకున్నా. రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్నాను. కొండెవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి పతకం సాధించడానికి ప్రయత్నం చేస్తుంటాను. – షేక్ అమీద, పిఠాపురం -
‘చంద్రబాబు.. బషీర్బాగ్ ఘటనను ప్రజలు మర్చిపోలేదు’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటున్న చంద్రబాబు.. అదే విషయాన్ని మహానాడు బహిరంగ సభలో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్టాడిన ఎంపీ మార్గాని భరత్.. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు చేపట్టిన పర్యటన దండగ అని విమర్శించారు. ‘బషీర్ బాగ్ ఘటన ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు. 58 లక్షల మందికి రైతులకు రైతు భరోసా ప్రతి సంవత్సరం సీఎం అందిస్తున్నారు. పంట నష్టం కూడా ప్రభుత్వం అందిస్తుంది . ఓటుకు నోటు లో దొరికి ఎపి కి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు. పుష్కరాల సమయంలో 29మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పటికీ వారిని పరామర్శించలేదు. ఆర్ధిక నేరాలు చేసే వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడు. బ్లూ మీడియా అని చంద్రబాబు మాట్లడటం కరెక్ట్ కాదు. మీడియా ను బానిస బ్రతుకులు బ్రటుకుతున్నరా అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. అని నిలదీశారు ఎంపీ మార్గాని భరత్. -
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ వర్గాల ఘర్షణ
-
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
అనపర్తిలో చంద్రబాబు ఓవరాక్షన్.. రెచ్చిపోయిన పచ్చగ్యాంగ్
-
జగనన్న కాలనీలు: ‘తూర్పు’లో ఉగాదికి రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది పండగ నాటికి లబ్ధిదారులను శాశ్వత గృహ యజమానులుగా మార్చేందుకు, తద్వారా వారి కుటుంబాల్లో పండగ సంతోషాన్ని సంపూర్ణంగా నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యాన్ని ఉగాదికి ఒక రోజు ముందే అధిగమించే ఏర్పాట్లలో జిల్లా అధికారులు తలమునకలవుతున్నారు. జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న పేదల ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాలనీల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేస్తున్నారు. మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి గృహ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి అవగాహన కల్పించి, నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండటంతో లబ్ధిదారులు సైతం ముందుకు వస్తున్నారు. ఉగాదికి 6,319 గృహ ప్రవేశాలు పేదలకు శాశ్వత నివాసం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మందికి ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. వీటిలో తొలి దశలో రూ.113.48 కోట్లతో 63 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మరికొన్నింటిలో లబ్ధిదారులు గృహప్రవేశాలు సైతం చేసుకున్నారు. మిగిలిన వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఉగాది నాటికి 6,318 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికార యంత్రాంగం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,211 ఇళ్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగిలిన 5,107 నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలంలో హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికి బోర్లు తవ్వుతున్నారు. తాగు, ఇతర అవసరాలకు నీటిని సమకూరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో నివసించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అనపర్తి, బిక్కబోలు, తొర్రేడు, చాగల్లు, కొవ్వూరు కృష్ణారావు చెరువు, కడియం, దామిరెడ్డిపల్లి, నిడదవోలు వైఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి. జగనన్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించే పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 755 కాలనీల్లో రూ.411 కోట్ల అంచనాతో పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో సైతం అధునాతన విధానం అవలంబిస్తున్నారు. మూడు పెద్ద లే అవుట్లు అయిన కొమరగిరి, వాకలపూడి (కాకినాడ), వెలుగుబంద (రాజానగరం) జగనన్న కాలనీల్లో ప్రయోగాత్మకంగా భూగర్భ విద్యుత్ సరఫరాకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రతి వారం లబ్ధిదారులతో ముఖాముఖి ఉగాది నాటికి గృహప్రవేశాలకు ముమ్మర కసరత్తు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. మిగిలినవి కూడా వేగవంతం చేసేందుకు ప్రతి శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరుతున్నాం. ఇల్లు కట్టుకుంటే బిల్లు సకాలంలో వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైతన్యం తీసుకువస్తున్నాం. ఉగాది నాటికి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి గృహప్రవేశాలు చేపడుతాం. జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 13,019 ఇళ్లకు విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – కె.మాధవీలత, కలెక్టర్ లక్ష్యాన్ని అధిగమిస్తాం ఉగాది నాటికి ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అధిగమిస్తాం. జిల్లా వ్యాప్తంగా 6,318 గృహప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటికే 1,211 పూర్తి చేశాం. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రత్యేక హౌసింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ లబ్ధిదారులను చైతన్యపరుస్తున్నాం. – జి.పరశురాం, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
సీతమ్మా.. దయ ఏదమ్మా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు దండిగా నిధులు వస్తాయనే ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. రైల్వే కేటాయింపులపై శుక్రవారం రాత్రికి కానీ స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ఈ బడ్జెట్లో మోక్షం లభించలేదు. కొన్నింటిని అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. కీలకమైన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కనీసం నాలుగైదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారని ఆశ పడ్డారు. 22 ఏళ్ల క్రితం రూ.645 కోట్లతో మొదలైన ఈ రైల్వే లైన్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,892 కోట్లకు పెరిగింది. దీనికి తగినట్టుగా కేటాయింపులు లేవని కోనసీమ వాసులు పెదవి విరుస్తున్నారు. కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని, 57 కిలోమీటర్ల రైల్వే లైను కోసం గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలపై నిర్మాణంలో ఉన్న మూడు వంతెనల పనులు వేగం అందుకుంటాయని అందరూ ఆశించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేస్తే వైనతేయపై బోడసకుర్రు – పాశర్లపూడి మధ్య మందకొడిగా జరుగుతున్న తొమ్మిది పిల్లర్ల పనులు ఊపందుకునేవని అంటున్నారు. పెండింగ్లో ఉన్న 528 ఎకరాల భూసేకరణకు కూడా ఈ కేటాయింపులు సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న కాకినాడ – పిఠాపురం మెయిన్ లైన్ ఊసే బడ్జెట్లో లేకుండా పోయింది. ఈ రైల్వే లైను కోసం నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనికరించ లేదు. కాకినాడ మెయిన్ లైన్ నిర్మాణానికి రూ.40 కోట్లతో 22 ఏళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ లభించింది. కాకినాడ పోర్టు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం వస్తున్నా మెయిన్ లైన్ నిర్మాణం అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని పలువురు అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు రాములోరి సన్నిధికి వెళ్లేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 151 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ ప్రాజెక్టును 2012–13లో రూ.1,445 కోట్లతో ఆమోదించారు. అనంతరం అంచనాలు రూ.2,154.83 కోట్లకు చేరాయి. దీనికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైళ్లకు హాల్టులు సహా పలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్లో ఎటువంటి స్పష్టతా కనిపించలేదు. -
రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది?
రాజమహేంద్రవరం రూరల్(తూర్పుగోదావరి): రెండురోజుల్లో పెళ్లి... మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. సంతోషంగా గడపాల్సిన సమయం..ఇంతలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మూరులోని బాలాజీపేట రోడ్లో శ్రీ అపార్టుమెంటులో గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథ«నం ప్రకారం శ్రీ అపార్ట్మెంటులో ఉంటున్న బొరుసు మంగాదేవికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. నాలుగో సంతానం రాజీవ్బాబు(32).దానవాయిపేట యాక్సెస్ బ్యాంక్లో ఐటి విభాగం మేనేజర్గా పనిచేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతితో ఈనెల 4వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10గంటలకు మంగాదేవి, కుమార్తెలు కలసి షాపింగుకు వెళ్లారు. రాజీవ్ను రమ్మని కోరారు. ఇంటిలో టీవీ రిపేరు చేయించి వస్తానని అతడు సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ తెరిచి ఉంది. బెడ్రూమ్ డోర్ వేసి ఉంది. రాజీవ్ పడుకుని ఉన్నాడని భావించారు. తమ పనిలో పడిపోయారు. కాస్సేపటి తర్వాత రాజీవ్ను నిద్రలేపుదామని కిటికీలో నుంచి చూశారు. ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజీవ్ నిశ్చితార్ధమైనప్పటి నుంచి కాబోయే భార్యతో సరదాగా మాట్లాడేవాడు. పరస్పరం గిఫ్ట్లు ఇచ్చుకునేవారిని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే -
జగ్గంపేటలో భారీ చోరీ
గండేపల్లి/జగ్గంపేట: ఒక విశ్రాంత ఉద్యోగి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశించి రూ.12 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, ఒక బైక్ను దొంగిలించుకుపోయారు. జగ్గంపేట బాలాజీనగర్లోని ఘటనా స్థలాన్ని సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్ఐ సీహెచ్ విద్యాసాగర్ పరిశీలించారు. వారి వివరాల మేరకు ఉప్పలపాడుకు చెందిన బుర్రి వెంకటరమణ ఉద్యోగ రీత్యా బాలాజీనగర్లో ఇటీవల నిర్మించుకున్న మూడు అంతస్తుల భవనంలో రెండవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన బంధువైన విశ్రాంత ఉద్యోగి (బీఎస్ఎన్ఎల్) పుర్రె సూరన్న, ఉమాదేవి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. సూరన్న, ఉమాదేవి బుధవారం మధ్యా«హ్నం కాకినాడ వెళ్లి రాత్రికి అక్కడ ఉన్న తమ సొంత ఇంట్లో ఉండిపోయారు. తెల్లావారేసరికి జగ్గంపేటలో వారు ఉంటున్న ఇంటి తలుపు తాళాలతోపాటు బీరువా తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంటి యజమాని బుర్రి వెంకటరమణ గమనించి సమాచారం అందించడంతో వారు వెంటనే జగ్గంపేట చేరుకున్నారు. ఇంట్లో గల బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దుస్తులు, వెండి వస్తువులు చెల్లా చెదురు అయ్యాయి. లాకర్లో ఉన్న 26 కాసుల బంగారు వస్తువులు చోరీ అయినట్టు గుర్తించారు. మూడు ఉంగరాలు, నక్లెస్, కాసులపేరు, ఏడు జతల చెవి దుద్దులు, నాలుగు లాకెట్స్, నల్లపూసల గొలుసు, పూజా పుష్పం, గోల్డ్ బిస్కెట్, మూడు గొలుసులతోపాటు మోటార్ సైకిల్ చోరీకి గురైనట్టు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ క్రైం డీఎస్పీ రాంబాబు, పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, జగ్గంపేట సీఐ, ఎస్ఐ బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించగా డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. చోరీ జరిగిన ఇంటికి సమీపంలో గల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో బుధవారం అర్ధరాత్రి 1.16 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై తచ్చాడటాన్ని గుర్తించారు. నీలాద్రిరావుపేట, తదితర చోట్ల గల సీసీ కెమెరాలను పోలీసు బృందాలు తనిఖీ చేస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
తూర్పు గోదావరిలోని కోళ్ల పందెల్లలో విషాదం
-
దేవరపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ
దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎంఎస్కే అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ తెలిపారు. దేవరపల్లిలోని హైవే సమీపంలో అకాడమీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఏఎస్ఆర్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో ఎం.ఎస్.కె.ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఐదు, యూఎస్ఏలో రెండు అంతర్జాతీయ క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారిణులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. అమరావతి సమీపంలోని నంబూరులో కూడా అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేవరపల్లి అకాడమీలో ప్రతి నెలా ఎనిమిది మ్యాచ్లు జరిగేలా చూస్తామన్నారు. త్రీ లెవెల్ కోచ్లు ఇద్దరు ఉంటారని, అకాడమీల వద్ద ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని చెప్పారు. మండలంలో జాతీయ మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నందున ఈ ప్రాంతంలో వారిని ప్రోత్సహించి భారత జట్టులో ఆడే విధంగా తీర్చిదిద్దుతానని వివరించారు. తాను 11 ఏళ్ల వయస్సులో అండర్–12 క్రికెట్ ఆడానని ఆయన గుర్తు చేసుకున్నారు. శాప్ మాజీ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్, రాష్ట్ర క్రికెట్ అకాడమీ సీనియర్ కోచ్ హమానుల్లా తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎం.ఎస్.కె.ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు మస్తాన్రెడ్డి, ప్రసన్న, పీడీలు ఓరుగంటి నాగరాజు, ఓరుగంటి రామకృష్ణ, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
Goldsmiths: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు
(డెస్క్–రాజమహేంద్రవరం): ఆధునిక పరిస్థితుల ప్రభావితంతో కుల వృత్తులు కూలిపోతున్నాయి. రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నాయి. మనుగడ కష్టమని భావించిన కొందరు బతుకుదారి మార్చుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికీ తాతల కాలం నుంచి వారసత్వంగా అబ్బిన వృత్తినే నమ్ముకుంటూ యాతనలు పడుతున్నారు. ఒకప్పుడు ‘బంగారు’బాబుల్లా బతికిన స్వర్ణకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చాలామంది పల్లెటూళ్ల నుంచి పట్టణాల బాట పడుతున్నారు. బతుకు బండి పయనానికి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. ఉనికిపాట్లు కార్పొరేట్ సంస్థల సవాళ్ల నేపథ్యంలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇప్పటికీ ఉనికి చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని నల్లమందుసందు, సీతమ్మసందు, చందాసత్రం, గుండువారి వీధి ప్రాంతాల్లో కొందరు స్వర్ణకారులు కొద్దోగొప్పో ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ వృత్తికి ఊపిరిలూదుతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న పరిచయాలతో కొందరు ఇక్కడకు వచ్చి బంగారమిచ్చి వారితో ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 2008 నాటికి వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది. తమ సంఘంలో 600 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం గండేబత్తుల శ్యామ్ చెప్పారు. కార్పొరేట్ సెగ ఆభరణాల రంగంలో కార్పొరేట్లు అడుగు పెట్టడంతో స్వర్ణకారుల బతుకులు రంగు మారిపోయాయి. అప్పటి వరకూ ఉన్న ఉపాధి కాస్తా దూరం కావడం ప్రారంభమైంది. తొలినాళ్లలో జ్యూయలరీ షాపులొచ్చి వీరి మనుగడను కొంత దెబ్బ తీశాయి. పాతిక సంవత్సరాలుగా నగరాల్లో కార్పొరేట్ షాపులు పెరిగిపోయాయి. ఈ పదేళ్లలో ఓ మాదిరి పట్టణాలకూ ఈ షాపులు విస్తరించాయి. పగలూ రాత్రీ విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోయే అందాల షాపుల భవంతుల వైపే జనమూ అడుగులు వేస్తున్నారు. ఫలితంగా వృత్తి నైపుణ్యమున్న స్వర్ణకారులకు ఆదరణ తగ్గింది. కార్పొరేట్ తాకిడికి తలవంచిన కొందరు బ్యాంకులు లేదా బంగారంపై వడ్డీ ఇచ్చే వ్యక్తుల వద్ద అప్రైజర్లుగా చేరిపోయారు. వయసు 50లు దాటిన మరికొందరు మరో పని నేర్చుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పాత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణకారులుగా పని చేస్తున్నవారెవరూ తమ పిల్లలను ఈ రంగం వైపు నడిపించడంలేదు. తన ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారని.. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని నల్లమందు సందులో పని చేస్తున్న స్వర్ణకార సంఘం సభ్యుడు పేరూరి సూర్యప్రకాష్ చెప్పారు. తమ తరం తర్వాత స్వర్ణకారులు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పడదామన్నా పెట్టుబడి ఏదీ.. అన్ని వృత్తుల మాదిరిగానే ఆభరణాల తయారీలో కూడా ఆధునికత అడుగు పెట్టింది. ప్రతి చిన్న పనీ యంత్రాల సాయంతోనే చేయాల్సి వస్తోంది. కానీ వాటిని సమకూర్చోలేక స్థాయికి తగ్గట్టుగా చిన్నపాటి పరికరాలతో స్వర్ణకారులు నెట్టుకొస్తున్నారు. గతంలో ఎక్కువగా కుంపటి ఉపయోగించేవారు. నాటి స్వర్ణకారులెందరినో శ్వాసకోశ వ్యాధులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని స్వర్ణకారుడు ఈదరాడ శ్రీనివాస్ చెప్పారు. ఉదయం నుంచి చీకటి పడే వరకూ కూర్చుని పని చేయడం వల్ల శారీరక వ్యాయామం లేక అనారోగ్యం బారిన పడుతున్నామని మరో స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దోగొప్పో డబ్బులు వెచ్చించి, చిన్నపాటి యంత్రాలు కొందామన్నా ఎక్కువ మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒక్కో యంత్రానికి కనీసం రూ.50 వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వ్యక్తిగత రుణాలకు బ్యాంకులు సహకరించడ లేదని స్వర్ణకారుడు వరప్రసాద్ చెప్పారు. దొంగ బంగారం కొన్నారంటూ గతంలో పోలీసుల నుంచి తమకు తరచూ వేధింపులు ఎదురయ్యేవని కొందరు స్వర్ణకారులు చెప్పారు. ఐదేళ్లుగా ఈ వేధింపులు తగ్గాయన్నారు. ఏమైనప్పటికీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక స్వర్ణకారుల బతుకులు కాంతిహీనమవుతున్నాయి. సామాజిక భవనమూ లేదు ఈ మధ్యనే రాజమహేంద్రవరం స్వర్ణ కారుల సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. స్వర్ణకారుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. ఈ నగరంలో మాకు ఒక సామాజిక భవనం కూడా లేదు. స్థలమివ్వగలిగితే భవనం ఇస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసి సమకూర్చగలిగే ఆర్థిక స్తోమత మాలో ఎవ్వరికీ లేదు. ప్రజాప్రతినిధులు మా కష్టాలను గమనించి సామాజిక భవనం నిర్మించాలని కోరుతున్నాను. – గండేబత్తుల శ్యామ్, అధ్యక్షుడు, రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం రుణం అందించాలి స్వర్ణాభరణాల తయారీ యంత్రాలు చాలా ఖరీదైనవి. కొనుక్కుని బతుకుదామంటే ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ముద్రా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు. పూచీకత్తు లేనిదే ఇవ్వబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఎలా పోటీ పడగలం? ఎలా ముందుకు వెళ్లగలం? రుణ సదుపాయం కల్పిస్తే కొద్దోగొప్పో ఈ వృత్తి బతకడానికి అవకాశముంటుంది. – ఈదర వరప్రసాద్, నల్లమందు సందు, రాజమహేంద్రవరం ఈ స్పీడులో మాలాంటి వాళ్లకు కష్టమే.. ఎక్కడ పడితే అక్కడ జ్యూయలరీ షాపులు వచ్చేశాయి. పెద్ద పట్టణాల్లో కార్పొరేట్ సంస్థల షోరూములు వచ్చేశాయి. అక్కడ అడిగిన వెంటనే కావాల్సిన నగ దొరుకుతోంది. ప్రస్తుతం ప్రజలకు అడిగిన వెంటనే సరకు ఇవ్వాలి. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టే తత్వం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎంత బాగా చేసినా ఫలితం ఏముంది? కొద్ది మంది మాత్రం చిన్నచిన్న నగలు చేయించుకోవడానికి నమ్మ కంతో వస్తున్నారు. జగన్ ప్రభుత్వం పుణ్యమాని పెన్షన్ వస్తోంది. – నామగిరి బ్రహ్మానందం, ప్రత్తిపాడు -
తూర్పు గోదావరి జిల్లా వైష్ణవ ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
ఊరంతా కళాకారులే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్ శ్రీరంగపట్నం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, బాలనాగమ్మ, చింతామణి.. నాటకం ఏదైనా వారి నటనాచాతుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాళికా మాత, దుర్గమ్మ, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకన్నబాబు, రాక్షసుడు, అఘోరాలు.. ఇలా వేషమేదైనా పరకాయ ప్రవేశం చేయడమే వారి ప్రత్యేకత. తాతల కాలం నుంచి సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని మరీ వారు రంగస్థలంపై, జాతర్లలో సత్తా చాటుతున్నారు. నటనపై మక్కువతోనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం చేసినా ప్రదర్శనలను మాత్రం విస్మరించరు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం పౌరాణిక నాటకాలకు కేరాఫ్ అడ్రస్గా విరాజిల్లుతోంది. ఊరంతా కళాకారులే తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం ఖ్యాతి గడించింది. కేవలం నగరం ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. శ్రీరంగపట్నంలో అయితే ఊరంతా కళాకారులే దర్శనమిస్తారు. మేజర్ పంచాయతీ అయిన ఈ గ్రామ జనాభా 12,500. కుటుంబాలు 3,165 ఉన్నాయి. వీరిలో 400 మంది పౌరాణిక నాటకాలు వేసే కళాకారుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారంటే నాటకాలపై వారికున్న మక్కువ ఏమిటో అర్థమవుతోంది. వ్యవసాయ పనులతో జీవనం సాగించే కళామతల్లి ముద్దుబిడ్డలు వివిధ పండగలు, జాతర సమయాల్లో కళాకారులుగా రూపుదాలుస్తారు. ప్రజలను అలరించే ప్రదర్శనలు ఇస్తారు. వీరి నట విశ్వరూపానికి దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. శ్రీరంగపట్నం కళాకారులంటే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడుతూంటారు. రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ వేలాది ప్రదర్శనలు వారి సొంతం. ఫలితంగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, గ్రామ దేవతల జాతరల సమయంలో కళా ప్రదర్శనలతో సందడి వాతావరణం తీసుకువస్తారు. వివిధ వేషధారణలతో అలరిస్తారు. రూ.500తో మొదలై.. 1988లో ఒక్కో బృందంలో సభ్యుడికి కళాప్రదర్శనకు రూ.500 అందేది. ఇవి ఖర్చులకు కూడా సరిపోకపోయినా కళామతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఉన్న బృందంలో ఒక్కో కళా ప్రదర్శనకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. ఏ పాత్ర కావాలన్నా.. గ్రామంలో 20 నాటక బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 400 మంది కళాకారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరాణిక కళాబృందాలున్నా.. పాత్రకు అనువైన కళాశారులు దొరకడం కష్టం. కానీ శ్రీరంగపట్నం మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రయినా.. ఏ నాటకమైనా అందుకు తగిన కళాకారులను సమకూర్చడం ఈ ఊరి ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అత్యంత ప్రాధాన్యమైన అన్నమయ్య, రాముడు, లక్ష్మణుడు వంటి విభిన్న పాత్రల్లో నటించే వారు కేవలం ఇక్కడే ఉండటం విశేషం. వీటితో పాటు కాళికాదేవి, నెమలి కోబ్రా డ్యాన్స్, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, తాండ్ర పాపారాయుడు వంటి వేషధారణలకు కేరాఫ్గా ఈ గ్రామం ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ లేని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. నాటక ఘట్టం సందర్భంగా వీరు వేసే పాత్రలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేస్తుంటాయి. తమ తాతలను, తండ్రులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం వారి సంతానం నాటక రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రదర్శనలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోనే స్థిరపడిపోతూ కళకు జీవం పోస్తున్నారు. 34 ఏళ్లుగా.. 1988 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. నాటక రంగంపై ఉన్న ప్రేమతో నేటికీ కళామతల్లి బిడ్డగా కొనసాగుతున్నా. రామాంజనేయ యుద్ధంలో నా నటనకు ప్రశంసా పత్రాలు, అవార్డులు దక్కాయి. నాడు ఒక్కో ప్రదర్శనకు రూ.500 గౌరవ వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలు పైగా అందుతోంది. డ బ్బులు ఎంత వచ్చాయన్నది కాకుండా.. కళను బతికించాలన్న తాపత్రయంతోనే కొనసాగుతున్నాం. – బాసెట్టి జగ్గారావు, కళాకారుడు రాక్షసుడే వచ్చినట్టు.. బాలగౌరి కళాకారుల సంఘ సభ్యుడైన తనకాల నాని మిమిక్రీ ఆర్టిస్ట్. నాటక రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. నల్లకాళికాదేవి, వేపాలమ్మ పాత్రలకు జీవం పోస్తున్నాడు. తన నటనకు గుర్తింపుగా ఇటీవల పుష్ప–2 సినిమాలో అవకాశం దక్కింది. ఆవేశం.. ఈ వేషం.. నాన్న కీబోర్డ్ ప్లేయర్. బాబాయ్ సింగర్. వారిని స్ఫూర్తిగా తీసుకున్న కళాకారులు సతీష్ లేడీ ఓరియంటెడ్ గెటప్లో అలాగే ఒదిగిపోతాడు. బుల్లితెరపై స్టాండప్ కామెడీ రోల్ చేస్తున్నా.. నాటక ప్రదర్శన ఉందంటే చాలు వాలిపోతాడు. వేషమేదైనా.. కళాత్మకమే.. అఘోరా నృత్యం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ పాత్రకు జీవం పోస్తాడు ఎం.సంపత్. అతను నాట్యం చేస్తూంటే అఘోరాలే ఔరా! అంటూ ఆశ్చర్య పోవాల్సిందే. పార్వతీ దేవి పాత్రకు సైతం న్యాయం చేస్తాడు. అబ్బాయే.. అమ్మాయిలా.. మరో కళాకారుడు రాంబాబు అమ్మవారు, లేడీ గెటప్, రుక్మిణీదేవి వేషధారణల్లో అలరిస్తుంటారు. ఇలా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పాత్రకు న్యాయం చేయడంతో కీలక భూమిక పోషిస్తారు. (క్లిక్ చేయండి: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు) -
Mega Job Fair: కొవ్వూరులో 9న మెగా జాబ్మేళా
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా) -
‘మౌంట్ కోజిస్కో’ని అధిరోహించిన ఉమేష్ ఆచంట
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట మరో ఘనకీర్తిని సాధించారు. ఆస్ట్రేలియా ఖండంలోనే అతి పెద్ద పర్వతం మౌంట్ కోజిస్కో పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 5వ తేదీన మనదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఉమేష్ 12వ తేదీన మౌంట్ కోజిస్కో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం ఎత్తు 2,228 మీటర్లు. ప్రస్తుతం ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉండటంతో పర్వతారోహణను పూర్తిగా ఆపేశారు. అయితే గతంలో రెండు పర్వతాలు ఎక్కిన అనుభవం ఉందని, ప్రత్యేక అనుమతి తీసుకుని ఉమేష్ పర్వతారోహణ పూర్తి చేశారు. ఉమేష్ ఆచంట మార్చి 2021లో మౌంట్ కిలిమాంజరో (ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద పర్వతం), ఆగస్టు 2021లో మౌంట్ ఎలబస్(యూరప్ ఖండంలో అతి పెద్ద పర్వతం) అధిరోహించాడు. -
నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-
చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి..
నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): ఆమె చదివింది ఏడో తరగతి. అయినా వివిధ శాఖల అధికారినంటూ ప్రజలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడింది. శనివారం దూబచర్లలో బేకరీ, భోజన హోటల్ను చెక్ చేసి వసూళ్లకు పాల్పడుతుండగా సివిల్ సప్లయిస్ డీటీ సుజాత, వారి సిబ్బంది ఈ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాడేపల్లిగూడేనికి చెందిన కాళ్ల రమాదేవి నేషనల్ కన్సూ్యమర్ రైట్స్ కమిషన్ మహిళా చైర్పర్సన్గా ఐడీ కార్డుతో తన షిఫ్ట్ డిజైర్ కారులో వివిధ ప్రాంతాలలో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటోంది. చదవండి: ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ.. ఈ విషయం సివిల్ సప్లయిస్ అధికారుల దృష్టికి రాగా కొంతకాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. శనివారం దూబచర్లలో బెంగళూరు బేకరీకి వెళ్లి గృహ వినియోగ గ్యాస్ వ్యాపారానికి వినియోగిస్తున్నారంటూ బెదిరించి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా యజమాని ప్రదీప్ రూ.3 వేలు ఇచ్చాడు. అదే గ్రామంలో శివాలయం దగ్గర భోజన హోటల్కు వెళ్లి వంటకు వినియోగిస్తున్న రెండు గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తానని బెదించింది. కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు ఇవ్వాలంది. యజమాని ముగ్గాల సర్వేశ్వరరావు రూ.2 వేలు ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఆ గ్రామ వీఆర్ఏ రవి తమ సివిల్ సప్లయిస్ డీటీ సుజాతకు సమాచారం అందించి నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలకు చెందిన చెల్లా ఏసు తప్పించుకుని పారిపోయాడు. పారిపోయిన చెల్లా ఏసుపై, ఆమె కారు డ్రైవరు దూబచర్ల గాంధీకాలనీకి చెందిన బోడిగడ్ల బాలరాజును, నకిలీ అధికారి రమాదేవిపై సీఐ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. -
నోరూరించే సీతాఫలాలు.. ఫుల్ డిమాండ్! 100 కాయల రేటు రూ.2500
చాగల్లు (తూర్పు గోదావరి): మండలంలోని ఊనగట్ల, అమ్ముగుంట, చిక్కాల, చిక్కాలపాలెం గ్రామాలు సీతా ఫలాలకు ప్రసిద్ధి. మెట్ట ప్రాంత గ్రామాల్లోని గరువు భూముల్లో రైతులు ఈ తోటలను విస్తారంగా పెంచుతారు. ఏటా అక్టోబర్లో కాపునకు కొచ్చే సీతాఫలాలను మండలంలోని అమ్ముగుంట, చిక్కాల కేంద్రాలుగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. రూ.కోట్లలో వ్యాపారం మండలంలో పండే సీతాఫలాలు రుచిగా ఉంటాయి. అందుకే డిమాండ్ కూడా ఎక్కువ. వీటిని కొనుగోలు చేయడానికి భీమవరం, తణుకు, విజయవాడ, ఏలూరు సహా పరిసర పట్టణ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ సీజన్లో రోజూ ఊనగట్ల, చిక్కాల వస్తారు. రైతులు తమ పొలాల్లో కాసిన సీతాఫలాలను మార్కెట్లకు తీసుకొచ్చి వారికి విక్రయిస్తారు.పెద్ద వ్యాపారులు రోజు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మేర లావాదేవీలు జరుపుతారు. ఇక చిల్లర వ్యాపారులు కూడా ఈ రెండు చోట్లా సీతాఫలాలను కొనుగోలు చేసి కొవ్వూరు, నిడదవోలు పరిసర గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఊనగట్ల శివారు అమ్మిగుంట సెంటర్లో సీతాఫలాల ఎగుమతి వర్షాల వల్ల ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కాయలన్నీ దాదాపు ఒకేసారి పక్వానికి రావడంతో వాటిని ఒబ్బిడి చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. కొంత మేర కాయలు వర్షానికి దెబ్బతిన్నాయని పలువురు రైతులు తెలిపారు. అయితే ఏటా ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వంద సీతాఫలాలను రైతుల వద్ద నుంచి రూ.2,000 నుంచి రూ.2,500 రేటుకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రిటైల్గా రూ.3,000 నుంచి రూ.4,000 రేటుకు అవకాశాన్ని బట్టి, కాయల సైజును బట్టి విక్రయిస్తున్నారు. రెండు వేల ఎకరాల్లో తోటలు ఈ ఏడాది సీతాఫలాల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాగల్లు మండలంలోని సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సీతాఫలాల తోటలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో పండిన కాయలను కోసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన కాయలను మినీ వ్యాన్లపై పట్టణాలకు తరలించి అక్కడ అమ్ముకుంటారు. అవగాహన కల్పించాలి సీతాఫలాల తోటల పెంపకంపై ఉద్యాన శాఖాధికారులు రైతులకు ఆవగాహన కల్పించాలి. ఈ ఏడాది సీతాఫలాలు కాపు బాగానే ఉంది. వాతవరణ పరిస్థితులు వలన కాయలు అధిక స్థాయిలో ఒకేసారి పక్వానికి రావడంతో రైతులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. – మిక్కిలి నాగేశ్వరరావు, రైతు, చిక్కాల అధిక ధరలకు విక్రయాలు ఈ సారి సీతాఫలాలు దిగుబడి తగ్గడంతో మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక్కడి కాయలు వివిధ పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు అంతగా లాభాలు రాకపోయినా వ్యాపారులకు ప్రయోజనకరంగానే ఉంది. – సంసాని రమేష్, చిక్కాల -
నిడదవోలులో అమరావతి పాదయాత్రకు నిరసన సెగ
-
పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వైస్ ప్రెసిడెంట్ కర్రి వేణుబాబుపై దాడి
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పీఆర్సీ అమలు ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పీఆర్సీతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (ప్రస్తుత తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు) సుమారు 3,600 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీఎస్పీటీడీ)గా మార్చారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించారు. కార్మికుల సంబరాలు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు కానుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి కొంతమేర బయటకు తీసుకువచ్చి, ఆర్టీసీ కార్మికులకు అనేక రాయితీలు కల్పించి అండగా నిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్టీసీపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరిన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ప్రకటించారు. అయితే సంస్థాగత, సాంకేతిక, విధాన పరంగా కొన్ని చిక్కులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించారు. అనంతరం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెరగనున్న జీతాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు, ఏలేశ్వరం, తుని, గోకవరం, కొవ్వూరు, నిదడవోలు ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోల్లోని సుమారు 3600 మంది ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు అందనున్నాయి. వీరిలో పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, క్లీనర్లు, ఎల్రక్టీíÙయన్లు ఉన్నారు. వీరికి వారి ఉద్యోగ స్థాయి ప్రకారం రూ.2 వేల నుంచి 6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దీంతో పాటు కార్గో ద్వారా ఆదాయం సమకూరుతోంది. పీఆర్సీని స్వాగతిస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత మొదటిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయం ఆనందాన్ని నింపుతోంది. పాత బకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తే ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గిడ్ల చిరంజీవి, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, రాజమహేంద్రవరం సీఎం జగన్కు ధన్యవాదాలు ఇప్పటివరకూ చిన్నపాటి మొత్తంలో జీతాలు తీసుకుంటున్న మాకు కొత్త పీఆర్సీ ద్వారా వచ్చే జీతాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మా దశాబ్దాల కల నెరవేరింది. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. మా ఉద్యోగులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – సీహెచ్ఎన్ లక్ష్మీ, ఏపీపీటీడీ ఎంప్లాయూస్ యూనియన్, మహిళా కమిటీ కోశాధికారి, రాజమహేంద్రవరం చాలా సంతోషం ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మార డం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని రాయితీలు మాకు అందుతున్నాయి. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు కూడా పెరుగుతాయి. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. సీఎం జగన్కు రుణపడి ఉంటాం. – పోలిశెట్టి లక్ష్మణరావు, ఏపీపీటీడీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం సాహసోపేతం ఆరీ్టసీని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం సాహసోపేత నిర్ణయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా సీఎం జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఉద్యోగుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రావడం ఆనందంగా ఉంది. – వీరమల్లు శివ లక్ష్మణరావు, డ్రైవింగ్ స్కూల్ కోచ్, రాజమహేంద్రవరం -
పంటల్లో పంట పండుతోంది
పెరవలి(తూ.గో.జిల్లా): కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఈ అభ్యుదయ రైతులకు అక్షరాలా సరిపోతుంది. పుడమి తల్లిని నమ్ముకుని సాగు చేయటమే ఈ రైతులకు నిన్నటి వరకూ తెలుసు. కానీ నేడు రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫిదా అయిన వీరు అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు. అంతర పంటలు సాగు చేయాలంటే పెరవలి రైతులే చేయాలనే రీతిలో ముందుకు “సాగు’తున్నారు. ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో ఇక్కడి రైతులు బాగా ఒంట పట్టించుకున్నారు. వాణిజ్య పంటల దిగుబడి అందే సమయంలో మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. జిల్లాలో 5 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తుండగా.. ఒక్క పెరవలి మండలంలోనే సుమారు 1,500 ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. అంతర పంటలు వేసే వారిలో ఎక్కువగా కౌలు రైతులే ఉండటం విశేషం. రైతులతో పాటు కూలీలు, వాహనదారులు, సంచుల వ్యాపారులు కలిపి సుమారు 60 వేల మంది అంతర పంటల ద్వారా జీవనం సాగిస్తున్నారు. పండించుకుంటున్నారిలా.. ► మెట్ట ప్రాంతంలోని కొబ్బరిలో అరటి, కూరగాయలు, పూలు సాగు చేస్తుంటే, డెల్టాలో పూలు, అరటి, కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ► గతంలో వాణిజ్య పంటలైన కొబ్బరిలో అరటి, కోకో వేస్తే ఇప్పుడు కోకోతో పాటు పూలు, వరి, కొత్తిమీర, బీర, అరటి వంటివి సాగు చేస్తున్నారు. ► అరటిలో గతంలో ఆకుకూరలు సాగుచేస్తే ఇప్పుడు పిలక నాటిన నుంచి ఏదో ఒక పంట వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బంతి, ఆకుకూరలు, పచ్చిమిర్చి, కూరగాయలు సాగు చేస్తున్నారు. ► బొప్పాయిలో పూలసాగు, కొబ్బరిలో కంది, జామలో బొప్పాయి వంటి పంటలు వేస్తూ మంచి ఫలసాయం పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. ► అరటి పంట 9 నెలలకు కానీ చేతికి రాదు. ఇతర వాణిజ్య పంటల ద్వారా 11 నెలలకు కానీ ఆదాయం రాదు. అప్పటి వరకూ పెట్టుబడి పెట్టాల్సిందే. ఇదే సమయంలో స్వల్పకాలిక అంతర పంటల ద్వారా రైతులు 40 నుంచి 90 రోజుల్లోనే ఫలసాయం పొందుతున్నారు. ► వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, ఈ పంటలకు స్వల్పంగా అంటే రూ.వందల్లో పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తోంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని రైతులు తగ్గించుకుంటున్నారు. ► అంతర పంటల్లో కలుపు అంతంత మాత్రంగానే ఉండటం రైతులకు కలిసివస్తోంది. -
గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం
గోదావరి నది చరిత్రలోనే మూడవ అతి పెద్ద వరదను చూశాం. సాధారణంగా ఆగస్టు నెలలో గోదావరికి పెద్ద వరదలు వస్తాయి. అటువంటిది చరిత్రలో మొదటిసారి జూలై నెలలో అతి పెద్ద వరదను చూడాల్సి వచ్చింది. అయినా వరదను ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొంది. కొన్నిచోట్ల గట్లు దాటి ప్రవహించినా గండ్లు పడకపోవడానికి ఏకైక కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు చూపు... దార్శనికతలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. 1847– 55 మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరిపై సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆనకట్ట నిర్మాణం చేశారు. 1851 నుంచి పి.గన్నవరం వద్ద అక్విడెక్టు నిర్మాణం కూడా చేపట్టారు. ఆ సమయంలో గోదావరి వరద నియంత్రణ పనులు కూడా ఆరంభించారు. దీనిలో భాగంగా బ్యారేజ్ ఎగువ అఖండ గోదావరి, దిగువన గోదావరి నదీ పాయల చుట్టూ ఏటిగట్ల నిర్మాణాలు ఆరంభించారు. నాటి నుంచి నేటి వరకు పలు సందర్భాలలో వరద ఉధృతిని బట్టి ఏటిగట్ల ఎత్తును పెంచుకుంటూ వస్తున్నాం. గోదావరికి 2006లో రెండవ అతిపెద్ద వరద వచ్చింది. ఈ వరద వల్ల ఇప్పటి కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంక, పి. గన్నవరం మండలం మొండెపు లంకల వద్ద ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. పెద్దగా ప్రాణ నష్టం లేకున్నా అంతులేని ఆస్తి నష్టం సంభవించింది. నాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్సార్ ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు చేపట్టమని ఆదేశించారు. 2008 నుంచి డెల్టాలో ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు ఆరంభమయ్యాయి. గోదావరి ఏటిగట్ల విస్తీర్ణం సుమారు 530 కి.మీ.లు. పటిష్ఠం చేసే పనులకు వైఎస్సార్ రూ. 650 కోట్లు కేటాయించారు. 1986 వరదను ప్రామాణికంగా తీసుకున్నాం. నాడు వచ్చిన మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్ (ఎంఎఫ్ఎల్)కు రెండు మీటర్లు (6.56 అడుగులు) ఎత్తు చేయడం, గట్టు ఎగువ భాగంలో (టాప్ విడ్త్) 6.5 మీటర్లు (21.32 అడుగులు) వెడల్పున పటిష్ఠం చేశాం. వైఎస్సార్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరగకున్నా అటు గోదావరి, ఇటు గోదావరి పాయల చుట్టూ మహాకుడ్యం ఏర్పడింది. ప్రస్తుతం వచ్చిన వరద వల్ల బ్యారేజ్ నుంచి దిగువకు 25 లక్షల 63 వేల 833 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అయినా గట్లకు నష్టం వాటిల్ల లేదు. నాడు ఏటిగట్లను పటిష్ఠం చేయకుంటే ఇప్పుడు కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్ర విపత్తును చవిచూడాల్సి వచ్చేది. వైఎస్సార్ దార్శనికతే గోదావరి తీర ప్రాంత జనాన్ని కాపాడింది. ఈ మహాయజ్ఞంలో ఇరిగేషన్ అధికారిగా (హెడ్వర్క్స్ డీఈఈ, ఈఈ) నేనూ భాగస్వామిని కావడం గర్వంగా అనిపిస్తోంది. (క్లిక్: ‘బురద జల్లుదాం ఛలో ఛలో’) - విప్పర్తి వేణుగోపాలరావు తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్; రిటైర్డ్ ఎస్ఈ, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ -
51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ 25 లక్షలు 8 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడుదల చేశారు. గోదావరి ఉధృతితో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి పాయలు పోటెత్తుతున్నాయి. గోదావరి పాయలు ముంచెత్తడంతో లంకల్లో ఆరుడగుల వరద నీరు చేరింది. కోనసీమలో 51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటిగట్లపై ఉన్నతాధికారులు దష్టిసారించారు. 40 వేల ఇసుక బస్తాలతో బలహీనమైన ప్రాంతాల్లో ఏటి గట్లను పట్టిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు, ఏటిగట్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా వాలంటీర్లతో బండ్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కోనసీమ జిల్లాలోని 88 గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. కోనసీమజిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద పరిస్ధితులని కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి మోనిటరింగ్ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 25లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి.. మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇంతటి వరదను 1986 తర్వాత ఇంతటి వరద చూడలేదని లంక గ్రామ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం వరద ప్రభావం నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గండ్లు పడే ప్రమాదం ఉన్న చోట అదనంగా సిబ్బందిని మెటీరియల్ని సమీకరించాలని ఆదేశించింది. ఏటీ గట్లను మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏఈఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. -
ఎస్ఎస్ఏ పోస్టుల భర్తీలో టీడీపీ నేతల మాయాజాలం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయంటారు పెద్దలు. అది నిజమని తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో మరోసారి తేలిపోయింది. అప్పటికి అధికారం చేతిలో ఉంది కదా అని కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీలో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా లక్షల రూపాయలు మింగేశారు. అధికారానికి చివరి ఘడియల్లో ఉన్న సమయంలో నాలుగేళ్ల క్రితం.. 2019లో ఈ అవినీతి బాగోతాన్ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు. నాటి పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు ఇటీవల అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల బండారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యాలయంలో నాటి ఫైళ్లను సీజ్ చేశారు. దీంతో నాడు పోస్టుల భర్తీలో చక్రం తిప్పిన అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పోస్టుల మాయాజాలం వివరాలివీ.. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను 2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్ఎస్ఏకి అప్పగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏలో ఖాళీగా ఉన్న 2,600 పైగా పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 400 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వీటిలో అన్ని కేటగిరీలకూ చెందిన 242 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఇండియన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ, ఎస్ఎస్ఏ అధికారులు కీలక పాత్ర పోషించారు. భారీ పోటీయే అవకాశంగా.. మార్కులు, రోస్టర్ పాయింట్లు, కులం ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మార్గదర్శకాలతో ఉద్యోగ నియామకానికి సమగ్ర శిక్ష అధికారులు ప్రకటన విడుదల చేశారు. పోస్టును బట్టి రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం ఉండటంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంట్రాక్టు పోస్టులే అయినప్పటికీ ప్రభుత్వంలో పని చేసిన సర్వీసు రికార్డు, ఎప్పుడైనా క్రమబద్ధీకరిస్తారనే ఆశతో మొత్తం 242 పోస్టులకు 3 వేల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు నలుగురైదుగురి వరకూ పోటీ పడ్డారు. ఇదే అదనుగా తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. కాకినాడ ఎస్ఎస్ఏ కార్యాలయంలో చక్రం తిప్పిన ఉద్యోగులతో కుమ్మక్కై లక్షల రూపాయలు దిగమింగి పోస్టింగులు ఇచ్చేశారు. పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసి మింగేశారు. తెలుగు తమ్ముళ్లే తెర వెనుక ఉండి ఈ మొత్తం వ్యవహారం నడిపించడంతో అప్పట్లో పెదవి విప్పేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అయితే ఆ పాపం పండే రోజు రానే వచ్చింది. అనర్హులకు కూడా పోస్టింగులు ఇవ్వడంతో కడుపు మండిన అర్హుల్లో పలువురు ఈ బాగోతంపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నాటి పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల క్రితమే కాకినాడలోని ఎస్ఎస్ఏ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. నాడు జరిగిన పోస్టుల భర్తీ ప్రక్రియ, నియమితులైన వారి విద్యార్హతలు తదితర వివరాలు సేకరిస్తున్నారు. నాటి ముఖ్య ప్రజాప్రతినిధి ప్రమేయం! కాకినాడకు చెందిన అప్పటి టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి, కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో ఔట్సోర్సింగ్ వ్యవహారాలను చక్కబెట్టిన, నాడు టీడీపీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు తెర వెనుక ఉండి ఈ బాగోతాన్ని నడిపించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు చక్రం తిప్పారనే కోణంలో విచారణ సాగుతోంది. పోస్టులను పంచేసుకుని ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసిన ఉద్యోగులు ఎవరు, వారిలో ఎవరి పాత్ర ఎంత, వారికి సహకరించిన బయటి వ్యక్తులు ఎవరనే వివరాలను ఏసీబీ సేకరిస్తోంది. అర్హతల ఆధారంగా రోస్టర్ పాయింట్లు లేకపోవడం, లేని విద్యార్హతలు సృష్టించి పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడటం వంటివి జరిగాయని చెబుతున్నారు. ఈ పరిణామంతో నాడు పోస్టుల భర్తీలో తెలుగు తమ్ముళ్లతో మిలాఖత్ అయిన అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకూ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు నాలుగైదు పోస్టుల వంతున పంచేసుకుని.. రూ.లక్షలు దిగమింగిన విషయం ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. -
మోదీ హయాంలోనే దేశంలో పేదరికం తగ్గింది: జేపీ నడ్డా
-
సామాజిక న్యాయభేరీ నాదం..ప్రతిధ్వనించేలా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతం చేసే దిశగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. బడుగు, బలహీనవర్గాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టాలని పార్టీ సంకల్పించింది. ఈ నెల 26న శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 29న అనంతపురంలో ముగుస్తుంది. కాకినాడ జిల్లాకు 27న చేరుకునే ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లా మీదుగా సాగనుంది. యాత్రను 17 మంది మంత్రులు అనుసరించన్నారు. ఈ రెండు జిల్లాల్లో యాత్రను విజయవంతం చేసే లక్ష్యంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ ఖాదర్బాషా తదితరులు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ యాత్రను విజయవంతం చేసే దిశగా ఉదయం పూట రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్.. రాత్రి అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాలులో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో అంతర్గత సమీక్ష నిర్వహించారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఈ బస్సు యాత్ర మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు. ఉమ్మడి ‘తూర్పు’న యాత్ర సాగనుందిలా.. సామాజిక న్యాయభేరి యాత్ర 27వ తేదీన తుని వద్ద కాకినాడ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఈ యాత్రకు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఏ–1 కన్వెన్షన్ వద్ద భారీ స్వాగతం పలకాలని నిర్ణయించారు. కత్తిపూడి సెంటర్లో యాత్ర కొద్దిసేపు ఆగుతుంది. అక్కడికి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి కొద్దిసేపు ప్రసంగించేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి వేదిక, ఇతర ఏర్పాట్లు చేసే బాధ్యతను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్కు అప్పగించారు. జగ్గంపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంలో అక్కడి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆ బాధ్యతలు చూడాలని సమీక్షలో సుబ్బారెడ్డి నిర్ణయించారు. జగ్గంపేట నుంచి జాతీయ రహదారి మీదుగా ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించనుంది. సభా వేదికపై నిర్ణయం రాజమహేంద్రవరంలో నిర్వహించే బహిరంగ సభకు పక్కా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభ ఏర్పాటుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యాన రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్, మున్సిపల్ స్టేడియాలను పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తున్న ప్రాధాన్యం అందరికీ తెలిసేలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సత్తా చాటాలని నేతలు పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసే దిశగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు అప్పగించారు. రాజమహేంద్రవరం సభ విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. విజయవంతానికి సుబ్బారెడ్డి పిలుపు ముఖ్యమంత్రి జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా నాయకులందరూ కలసికట్టుగా గళం వినిపించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఒకే మాట మీదకు వచ్చి సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి వేణు, వైఎస్సార్ సీపీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (కాకినాడ), పొన్నాడ వెంకట సతీష్ కుమార్(అమలాపురం), జక్కంపూడి రాజా (తూర్పు గోదావరి), ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, గెడ్డం శ్రీనివాస నాయుడు, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దవులూరి దొరబాబు, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కర్రి వెంకట ముకుందరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర దృశ్యకళల కార్పొరేషన్ చైర్పర్సన్ కుడుపూడి సత్యశైలజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గుబ్బల తులసీకుమార్, గిరజాల బాబు, వాసిరెడ్డి జమీలు, అల్లి రాజబాబు, సిరిపురపు శ్రీనివాస్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కేపీఆర్ సత్తిబాబు, కొవ్వూరి త్రినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గంగపుత్రులకు మరింత చేరువగా..
కొవ్వూరు: జిల్లాల పునర్విభజన పుణ్యమా అని మత్స్యకారులకు ఆ శాఖ సేవలు మరింత చేరువయ్యాయి. గతంలో ఉన్న జాయింట్ డైరెక్టర్ పోస్టును ఇప్పుడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా మార్చారు. రాజమహేంద్రవరంలో 10, కొవ్వూరులో 9 మండలాలు ఉండేటట్లు జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అసిస్టెంట్ డైరెక్టర్ల (ఏడీ) పర్యవేక్షణలో ఈ డివిజన్లు పని చేస్తాయి. రాజమహేంద్రవరం డివిజన్లో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలు ఉంటాయి. ఈ డివిజన్లో ఏడీతో పాటు ఇద్దరు మత్స్యశాఖ డెవలప్మెంట్ అధికారులు, ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, 10 మంది గ్రామ మత్స్యశాఖ సహాయకులు పని చేస్తారు. కొవ్వూరు డివిజన్లో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం మండలాలు ఉంటాయి. ఈ ఏడీ పరిధిలో ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, గ్రామ మత్స్యశాఖ సహాయకులు ఉంటారు. గోదారే ఆధారం జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, సీతానగరం, కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో మాత్రమే మత్స్యకారులున్నారు. వీరిలో గోపాలపురం మినహా మిగిలిన చోట్ల మత్స్యకారులు ప్రధానంగా గోదావరి నది పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి జిల్లాలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. పురుషోత్తపట్నం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ 41 కిలోమీటర్ల పొడవునా గోదావరి విస్తీర్ణం 12 వేల హెక్టార్లు కాగా, ఇందులో వెయ్యి హెక్టార్లలో నిరంతరం నీరుంటుందని మత్స్యశాఖ అధికారులు లెక్కలు కట్టారు. చేపలు గుడ్డు పెట్టే దశ కావడంతో ఏటా మే 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గోదావరిలో వేట నిషేధం అమలులో ఉంటుంది. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ ఆధ్వర్యాన ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల వరకూ చేప పిల్లలను గోదావరి నదిలో విడిచిపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 489 మంది రైతులు 974.99 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా నిడదవోలు, పెరవలి, బిక్కవోలు, సీతానగరం, చాగల్లు తదితర మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిగిలిన మండలాల్లో 50 ఎకరాల్లోపే ఈ సాగు జరుగుతోంది. కడియంలో చేప పిల్లల నర్సరీ కడియంలో 6.54 ఎకరాల్లో మేజర్ చేపల పిల్లల నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా చిరు చేపపిల్లలు (స్పాన్) 5 కోట్లు, 12 ఎంఎం చేప పిల్లలు 53.21 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు చేపపిల్లలు 20 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అవసరమైన చేప పిల్లలను ఇక్కడి నుంచే సరాఫరా చేస్తున్నారు. గోదావరితో పాటు, ఏలేరు రిజర్వాయర్కు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారు. రైతులకు అవసరమైన చేప స్పాన్ను విక్రయిస్తారు. ప్రధానంగా బొచ్చలు, శీలావతి, మోసే, బంగారు తీగ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మత్స్యసంపద అభివృద్ధికి చాన్స్ గోదావరి తీర ప్రాంతం కావడంతో మత్స్యసంపద అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల చేపపిల్లల్ని నదిలో విడిచిపెడుతోంది. ఏపీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) కింద ఒక హెక్టారు చెరువు తవ్వి చేపపిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కడియం నర్సరీ ద్వారా అవసరమైన వారందరికీ చేపపిల్లలను అందిస్తున్నాం. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ వాహనాలు, బోట్లు అందజేస్తున్నాం. వీటిని మత్స్యకారులు వినియోగించుకోవాలి. – ఇ.కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖాధికారి -
కాలుష్య భూతంపై ప్రక్షాళన అస్త్రం
రాజమహేంద్రవరం సిటీ: పవిత్ర గోదావరి నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నదీ తీరంలోని ప్రధాన నగరం రాజమహేంద్రవరంలోని ఘాట్లలో మాత్రం పరిస్థితులు పుణ్యస్నానానికి తగినట్టుగా ఉండవు. ఎగువన కోటిలింగాల నుంచి దిగువన గౌతమ ఘాట్ వరకూ ప్రతి చోటా ఈ పావన వాహిని మురికికూపాన్ని తలపిస్తుంది. దీంతో ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నగరంలో ప్రధానంగా గోదావరి ఘాట్లు తొమ్మిది ఉన్నాయి. కొంతవరకూ పుష్కర ఘాట్ మినహా మిగిలినచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు, మలినాలు, మురుగు, నాచు పేరుకుపోయి దుర్గంధభరితంగా మారాయి. అనేక ప్రసిద్ధ ఆలయాలకు నెలవుగా ఉన్న గౌతమ ఘాట్ వద్ద గోదావరిలో నాచు, వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోయాయి. ఇబ్బందికర పరిస్థితుల మధ్యనే స్నానాలకు దిగుతూ దుర్గంధంతో పాటు దురదలతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన కోటిలింగాల ఘాట్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇంత పొడవైన ఈ ఘాట్ వద్ద గోదావరిలో దిగేందుకు, స్నానం చేసేందుకు సైతం అవకాశం లేని దుస్థితి. అంతలా ఇక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. కోటిలింగాల ఘాట్కు పుష్కర ఘాట్కు మధ్య నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఇన్టేక్ పాయింట్ ఉంది. ఇక్కడ విపరీతంగా ఉన్న వ్యర్థాల మధ్య నుంచే గోదావరి జలాలను సేకరించాల్సిన దుస్థితి. ఈ రెండు ఘాట్లకు దిగువన కూడా ప్రధాన రక్షిత మంచినీటి సరఫరా పథకం ఇన్టేక్ పాయింట్ ఉంది. వీటి నుంచి కలుషితమైన నీటినే నగర ప్రజలకు ఫిల్టర్ చేసి అందిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రక్షాళనకు కదిలిరావాలి గోదావరి నదీ కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంపై నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నగరంలోని ఘాట్ల వద్ద పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో చెత్తను తొలగించే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాకే తలమానికమైన గోదావరి నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి స్ఫూర్తి నింపాలని కోరారు. ఈ నది పవిత్రతను కాపాడటంలో ఎవరికి వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గోదావరి ప్రక్షాళనను ఉద్యమంలా చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో నగరాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు. నదీ జలాలు కలుషితం కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఇతరులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం అభినందనీయమని దినేష్కుమార్ అన్నారు. -
తాడిపూడి అబ్బాయికి తైవాన్ అమ్మాయితో పెళ్లి
సాక్షి, తాళ్లపూడి: దేశాలు వేరైనా వారిని వివాహ బంధం ఒక్కటి చేసింది.. ప్రేమ వారిని కలిపింది.. తాడిపూడి అబ్బాయికి తైవాన్ అమ్మాయితో వివాహం జరిగింది. భారతీయ వివాహ వ్యవస్థకు ఎల్లలు లేవని చాటి చెప్పింది. తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గంటా సూర్యచంద్రం కుమారుడు రంగబాబు ఐఐటీ చదివి తైవాన్ టీఎస్ఎంసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో పనిచేస్తున్న తైవాన్ అమ్మాయి చెల్సీతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించడంతో పెళ్లి నిశ్చయించారు. బుధవారం బల్లిపాడులోని ఫంక్షన్ హాలులో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తైవాన్ అమ్మాయి చెల్సీ చీర కట్టులో ఆకట్టుకున్నారు. దీవించడానికి వచ్చిన పెద్దలకు ఆమె రెండు చేతులతో నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మన సంప్రదాయం అంటే తనకు ఎనలేని గౌరవమని ఆమె పేర్కొన్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా కృష్ణ, పలువురు సర్పంచులు, ఆయా పార్టీల నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక) -
శీఘ్రమేవ శుభ్రమస్తు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తుంది. పల్స్ ఆక్సీ మీటరు ద్వారా చెక్ చేసుకుంటూ ఆక్సిజన్ లెవెల్ తగ్గగానే ఆస్పత్రులకు పరుగు తీస్తాం. లక్షల మందికి తాగు, సాగునీరు అందించే గోదావరిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా ఎవరూ ఉలకరు పలకరు. కాలుష్యంతో కూడిన వ్యర్థాలు మురుగు కాలువల ద్వారా గోదావరిలో కలిసిపోతున్నా పట్టించుకోరు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న గోదారమ్మను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నదిలో నీటి నాణ్యత అథమ స్థాయి డి–గ్రేడ్కు (చేపలు, జంతువులకు మాత్రమే పని చేస్తుంది) పడిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం నిర్ధారించింది. గోదావరి ప్రక్షాళనకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుంటే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఐదేళ్ల క్రితమే స్పష్టం చేసింది. ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ ఈ పావన నది ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ పేరిట కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకు చేసిన ప్రతిపాదనలకు ఇటీవల కేంద్ర ఆమోదం లభించింది. గోదావరి జన్మస్థలి నాసిక్ నుంచి చివరన రాజమహేంద్రవరం వరకూ నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.1,700.84 కోట్లతో ప్రతిపాదించింది. ఇందులో ‘నమామి గోదావరి’ పేరిట తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నదిలో జల కాలుష్య కట్టడికి రూ.400 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.87 కోట్లు ఇప్పటికే కేటాయించింది. కార్యాచరణ మొదలు కావాల్సి ఉంది. కాలుష్యమిలా.. దేశవ్యాప్తంగా 351 నదుల్లో జల కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఆ నదుల జాబితాలో మన గోదావరి కూడా ఉంది. గోదావరి జలాల కాలుష్యంపై 2018లో ఎన్జీటీలో కేసు కూడా నమోదైంది. రాజమహేంద్రవరం నుంచి కోనసీమలోని సముద్ర మొగ వరకూ అడుగడుగునా గోదావరి కలుషితమవుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన రాజమహేంద్రవరంలో 5 లక్షల జనాభా ఉంది. ఈ నగరంలోని ఇళ్లల్లో వినియోగించిన నీరు, కాలువల్లో మురుగు కలిసి రోజుకు 60 మిలియన్ లీటర్లు (60 ఎంఎల్డీ) వస్తోంది. ఇందులో రోజూ 30 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే హుకుంపేట వద్ద మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ – ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసి గోదావరిలో విడిచి పెడుతున్నారు. మూడు ప్రధాన కాలువల ద్వారా గోదావరికి మురుగు నీరు వచ్చి చేరుతుంది. నల్లా చానల్: లోతట్టు ప్రాంతంగా ఉన్న రాజమహేంద్రవంలో వర్షాకాలంలో వచ్చే నీటిని పైపులైన్ల ద్వారా గోదావరిలోకి తోడేందుకు నల్లా చానల్ ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఈ పైపులైన్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. ఆవ డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా మురుగునీటిని ధవళేశ్వరం వద్ద గోదావరిలో విడిచిపెడుతున్నారు. మల్లయ్యపేట డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా పేపర్ మిల్లు ప్రాంతంలో మురుగు నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి ప్రక్షాళనకు చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వద్ద మూడు కాలువల ద్వారా మురుగునీరు చేరుతోంది. రాజమహేంద్రవరంలో రోజుకు 60 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో చేరుతోంది. ఇందులో సగం మాత్రమే శుద్ధి చేసి విడిచిపెడుతున్నారు. మిగిలిన మురుగునీటిని కూడా శుద్ధి చేసే ప్రణాళిక సిద్ధమవుతోంది. నదీ కాలుష్యాన్ని నివారించగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. – ఎన్.అశోక్కుమార్, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ కలవరం కాలుష్య నియంత్ర మండలి కాకినాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ప్రతి నెలా గోదావరిలోకి మూడు కాలువల ద్వారా కలుస్తున్న మురుగు నీటి నమూనాలను లేబొరేటరీలో పరీక్షిస్తుంటే వస్తున్న ఫలితాలు కలవరపెడుతున్నాయి. మూడు శాతం ఉండాల్సిన బయో కెమికల్ ఆక్సిజన్ 70 శాతం నమోదవడం కాలుష్య తీవ్రతను చాటుతోంది. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) ఆధారంగా నీటి నాణ్యతను లెక్కిస్తారు. డీఓ పరిమాణం లీటరుకు కనీసం నాలుగు మిల్లీ గ్రాములుండాలి. బీఓడీ మూడు మిల్లీ గ్రాములు దాటకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ గోదావరిలో నాలుగు నుంచి తొమ్మిది శాతం వరకూ ఉందని గుర్తించారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో 50 పరిశ్రమలున్నాయి. వీటిల్లో కొన్ని పరిశ్రమల వ్యర్థాలు గోదావరి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇదిగో సాక్ష్యం గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకూ గోదావరి జలకాలుష్యంపై లేబొరేటరీ నివేదికలు. నల్లా చానల్: బీఓడీ కనిష్టంగా 52, గరిష్టంగా 94 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 71.83గా తేలింది. ఆవ డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 44, గరిష్టంగా 82 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 66.33గా గుర్తించారు. మల్లయ్యపేట డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 50, గరిష్టంగా 114 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 78.33గా నమోదైంది. -
దారి.. అద్దంలా మారి..
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చాన్నాళ్లుగా ప్రజలకు నరకం చూపిస్తున్న రహదారులు బాగుపడుతున్నాయి. పాఠశాలల తరహాలోనే ‘నాడు–నేడు’ పథకం కింద రహదారుల తీరుతెన్నులనూ మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏనాడూ రోడ్ల బాగుకు తట్ట మట్టి వేసిన దాఖలా లేదు. దీంతో రోడ్లలో అత్యధికం అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ప్రభుత్వం వీటి రూపురేఖలు ఆధునీకరించేందుకు గట్టిగా పూనుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు తొలి విడతలో ప్రత్యేక మరమ్మతులకు రూ.196 కోట్లు కేటాయించింది. జూన్ నెలాంతానికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో రోడ్లు, భవనాల శాఖాధికారులు రెండు నెలలుగా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. రెండు నెలల క్రితం మరమ్మతుకు టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకు రాలేదు. తర్వాత టెండర్లను ఆహ్వానిస్తే జిల్లాలో 97 రహదారుల ఆధునీకరణకు కాంట్రాక్టర్లు ఉత్సాహంగా దాఖలు చేశారు. వర్షా కాలం రాకుండా పనులన్నింటినీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే నెల రోజులు ముందుగానే ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులు గట్టి సంకల్పంతో కదులుతున్నారు. అమలాపురం–బొబ్బర్లకం రోడ్డుపై ప్రయాణమంటేనే వెనకడుగు వేసే పరిస్థితి. కోనసీమ జిల్లా వాసులకు రాజమహేంద్రవరం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై నిలువెత్తు గోతులుండేవి. వాహనం వెళ్లాలంటేనే గుండెలు జారిపోయేవి. అటువంటి అధ్వాన రహదారిపై రెండు నెలలుగా దృష్టి పెట్టి రూ.రూ.7.70 కోట్లతో ఆధునీకరించారు మే నెలాఖరుకు పూర్తి చేస్తాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 30 రోడ్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మే నెలాఖరు నాటికి అన్ని రోడ్లనూ ఆధునీకరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రోజూ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. – ఎ.హరిప్రసాద్బాబు,ఎస్ఈ, ఆర్అండ్బీ గతుకుల సమస్య తీరింది నిత్యం కాకినాడ వెళ్లేందుకు కొత్తూరు మీదుగా ప్రయాణించేవాళ్లం. యు.కొత్తపల్లి వెళ్లాలన్నా పండూరు నుంచి దగ్గర. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ రిపేర్లలో భాగంగా ఆర్అండ్బీ రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో రహదారుల ఇబ్బందులు తప్పాయి. క్షేమంగా రాకపోకలు సాగిస్తున్నాం. – వెల్లంకి భాస్కరరమేష్, పెనుమర్తి, కాకినాడరూరల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది చాలా ఏళ్ల నుంచి అమలాపురం–బొబ్బర్లంక రహదారి మరమ్మతులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా్నం. ఇప్పుడు కొత్తగా రహదారి ఆధునీకరణతో ప్రయాణం సాఫీగా సాగుతోంది. – నందుల ఆదినారాయణ, పుల్లేటికుర్రు -
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
తాళ్లపూడి: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని ప్రక్కిలంక నుంచి చిట్యాల వరకూ ఆర్అండ్బీ రోడ్డుకు ప్రక్కిలంకలో ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.3.40 కోట్లతో ఎనిమిది కిలోమేటర్ల మేర ఈ బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు. శంకుస్థాపన అనంతరం తాళ్లపూడిలోని అబుబాకర్ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి వనిత పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోశిన శ్రీలేఖ, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ డీఈ హరికృష్ణ, ఏఈ సమీర్, సర్పంచులు యాళ్ల స్వప్న, కొమ్మిరెడ్డి పరశురామారావు, ఎల్లిన శివ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం (ఫోటోలు)
-
ఒక్కొక్క అవరోధాన్ని తొలగిస్తూ ప్రాజెక్టు నెలకొల్పాం: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్ను బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 'గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రత్యక్షంగా 1300మంది, పరోక్షంగా 1150 మందికి అవకాశం లభిస్తుంది. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేశాం. ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుంది. భయాలకు తావులేకుండా ప్రాజెక్టును నెలకొల్పారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశాం. అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ సహకారం మరవలేం: కుమార మంగళం బిర్లా బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం సందర్భంగా ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 2,500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నట్లు వివరించారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో గ్రాసిమ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని కుమార మంగళం బిర్లా తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం జగన్ సహకారం మరవలేనిదంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అంతకు ముందు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్లాంట్ను సందర్శించారు. ఉపాధి అవకాశాలు మెండు ఆదిత్య బిర్లా గ్రూపు భారీ స్థాయిలో రూ.2700 కోట్ల పెట్టుబడితో కాస్టిక్ సోడా ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్లాంట్ ఏర్పాటు ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూపులో ఒకటైన గ్రాసిమ్ కంపెనీ ముఖ్యమంత్రి చొరవతో ఈ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు రావడంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని సంతోషపడుతున్నారు. -
కొండ మూలన ‘కీడు పాక’
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు మన్యంలో ఎత్తైన కొండలపై చెట్టుకొకటి, పుట్టకొకటి అన్నట్టుగా ఉండే మారుమూల పల్లెలవి. అక్కడ నివసించే కొండరెడ్డి గిరిజనుల్లో నూటికి 70 మంది నిరక్షరాస్యులే. గిరిజన జాతుల్లో కొండరెడ్ల జీవనం ప్రత్యేకంగా ఉంటుం ది. అనాదిగా వారి జీవన విధానాన్ని మూఢనమ్మ కాలే శాసిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి విడివడి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు విలీన మండలాల్లోనూ కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగానే ఉన్నారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని సుమారు 70 ఆవాసాల్లో 2,500 కుటుంబాలున్నాయి. వీరి జనాభా 8 వేల పైమాటే. ఎవరికీ కనిపించనిచోట ‘కీడు పాక’ కొండరెడ్లలో పూర్వీకుల నుంచి ఓ దురాచారం కొనసాగుతోంది. అదే కీడుపాకల ఆచారం. కొండరెడ్డి మహిళలు నెలసరి, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు ఎట్టిపరిస్థితుల్లో కనిపించకూడదు. ఆ సమయంలో మహిళలు ఊరి బయట ప్రత్యేకంగా ఉండే పూరిపాకల్లో ఒంటరిగా నివాసం ఉండాల్సిందే. నెలసరి (పీరియడ్స్) సమయం నాలుగైదు రోజుల్లో పర పురుషులెవరూ ఆమెను కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ మహిళకు భర్త మాత్రమే ఆహారం తీసుకువెళ్లాలి. అతడు కూడా ఆహారాన్ని ఆ పాకముందు పెట్టి ఆమెకు కనిపించకుండా తిరిగి వచ్చేయాలి. ప్రసవ సమయంలో గర్భిణులు రెండు నెలలకు పైగా కీడుపాకలోనే ఉండాలి. ప్రసవం కూడా ఆ పూరిపాకలోనే. పుట్టిన బిడ్డకు ఆ తల్లే బొడ్డుపేగు కత్తిరించి ముడివేయాలి. ఈ ఆచారాన్ని పాటిస్తేనే అడవి జంతువులు, శారీరక రుగ్మతల నుంచి కొండ దేవరలు కాపాడతారని కొండరెడ్ల విశ్వాసం. కీడుపాక ఆచారం వల్ల సకాలంలో ప్రసవాలు జరగక, వైద్యం అందక పురిటి సమయంలోనే నవజాత శిశువులు, గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతుండేవారు. ప్రభుత్వ చర్యలతో మార్పొస్తోంది ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం చింతూరు ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొదట్లో చింతూరు ఐటీడీఏ అధికారులు ఎంతగా నచ్చచెప్పినా అక్కడి మహిళలు కీడు పాకల ఆచారాన్ని విడిచిపెట్ట లేదు. చివరకు కీడుపాకకు ప్రత్యామ్నాయంగా ఊరి చివర్లో చిన్నపాటి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆకుల వెంటకరమణ వీటిని ఏర్పాటు చేయించారు. వాటిలో విద్యుత్ సదుపాయం, మంచినీరు, స్నానాల గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. దీంతోపాటు ఆ గ్రామాల్లో పాఠశాలలను మెరుగుపరచడమే కాకుండా వారి పిల్లలను బడులకు రప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. గిరిజనులు ఇప్పుడిప్పుడే అధికారుల మాట వింటున్నారు. గర్భిణులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా కీడుపాకల వల్ల తలెత్తే దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తుండటంతో గర్భిణులు కాన్పుల కోసం పీహెచ్సీలకు వెళుతున్నారు. అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలతో అక్కడి పిల్లలు చదువుల వైపు ఆకర్షితులవుతున్నారు. చింతూరు మండల ఏరియా ఆస్పత్రి, కూనవరం మండలం కూటూరు, వీఆర్ పురం మండలం రేకపల్లి పీహెచ్సీలకు కాన్పులకు వచ్చే గర్భిణిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చింతూరు డివిజన్లో గతంలో ఏడాదికి కాన్పులు 70లోపే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది 148 కాన్పులు జరిగాయి. గతంలో మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు వెయ్యి మించి లేని విద్యార్థు సంఖ్య ఇప్పుడు 1,500 మందికి పెరగడం మార్పునకు సంకేతంగా పేర్కొంటున్నారు. కాన్పులపై అవగాహన పెరిగింది ఆస్పత్రుల్లో కాన్పుల పట్ల కొండరెడ్డి మహిళల్లో అవగాహన పెరిగింది. ఆస్పత్రిలో కాన్పయితే ప్రభుత్వం జేఎస్వై క్రింద తక్షణం రూ.వెయ్యి, ఆరోగ్యశ్రీ కార్డుంటే రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది కొండలపైకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులను ప్రసవానికి 15 రోజులు ముందే మైదాన ప్రాంత ఆస్పత్రికి తరలించి బర్త్ వెయిటింగ్ సెంటర్లో ఉంచుతున్నాంద. – డాక్టర్ శివకృష్ణారెడ్డి, వైద్యాధికారి, కూటూరు పీహెచ్సీ, కూనవరం మండలం కీడుపాకలు వదిలిపెడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం కొం డరెడ్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో ఊరికి దూరంగా ఉండే కీడుపాకల్లోనే ప్రసవాలు జరిగేవి. వైద్యసిబ్బంది తరచూ కొండలపైకి వచ్చి అవగాహన కల్పిస్తుండటంతో ప్రసవాల కోసం కీడుపాకలు విడిచిపెట్టి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. కీడుపాకలకు బదులుగా భవనాలు నిర్మించేందుకు అధికారులు ముందుకు రావడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – కదల బూబమ్మ, ఎర్రగొండపాకల, చింతూరు మండలం -
ఎమార్వో చేతివాటం
-
యువతి అదృశ్యం కేసు.. అనేక మలుపులు.. అసలేం జరిగిందంటే..
సాక్షి, తూర్పుగోదావరి: పిఠాపురం పట్టణంలో కలకలం రేపిన యువతి అదృశ్యం కేసును 24 గంటల్లో ఛేదించినట్టు, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించినట్టు కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. యువతి మానసిక స్థితి బాగోలేక విజయవాడ స్నేహితుల దగ్గరకు వెళ్లి పోగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఆమె ఆటో ఎక్కినట్టు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అభూతకల్పనలుగా ఆయన కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసులో అనేక మలుపులు పరీక్షల హాల్ టిక్కెట్ తెచ్చుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఒక యువతి అదృశ్యమైన ఈ ఘటన జిల్లా పోలీసులకు సవాల్గా మారింది. ఆటో ఎక్కితే డ్రైవరు ఏడిపిస్తున్నాడు అంటూ ఆమె మెసేజ్ పంపినట్టు సోషల్ మీడియాలో వచ్చినవన్నీ అబద్దాలని (ఆ సమయంలో ఆమె కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో కనిపించింది) సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. అసలేం జరిగిందంటే.. డిగ్రీ విద్యార్థిని అయిన ఆమె కొన్ని రోజులుగా ఇంటి వద్దే చదువుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం కాకినాడలో తాను చదువుకుంటున్న కాలేజీ నుంచి హాల్ టిక్కెట్ తెచ్చుకుంటానని వెళ్లింది. పిఠాపురంలో ఉప్పాడ బస్టాండ్కు వెళ్లి కాకినాడ వెళ్లేందుకు ప్రైవేటు బస్ ఎక్కింది. కొంత సేపటికే సెల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. తరువాత ఆమె కాకినాడ భానుగుడి సెంటర్లో బస్ దిగి, అక్కడి నుంచి ఆటోలో బస్టాండ్కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు కట్టు కథేనా? సోమవారం రాత్రి 10–30 గంటల సమయంలో ఒకసారి ఆమె ఫోన్ ఆన్ అయినట్టు ఒక కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తన స్నేహితుల సోషల్ మీడియా గ్రూపుల నుంచి తప్పుకోవడం సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కట్టు కథగా పోలీసులు భావించారు. అసలు ఆమె అలా ఎందుకు వెళ్లింది..? ఎక్కడకు వెళ్లింది అని దర్యాప్తు చేశారు. ఆమె సెల్ నుంచి సిమ్ తీసేయడంతో పోలీసులు దర్యాప్యులో ఇబ్బంది పడ్డారు. పోలీసులు వారికి కనీస సమాచారం ఇవ్వకుండా తన స్పేహితురాలు ఆపదలో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఫొటోలతో సహా పోస్టింగ్లు పెట్టడం నేరమంటున్నారు పోలీసులు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ బహిరంగ లేఖ
Mudragada Padmanabham Letter, సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో రాధాకృష్ణకు పలు చురకలంటించారు. పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే తాను కాపు ఉద్యమం చేశానని ముద్రగడ తెలిపారు. లక్షాధికారిని కోటేశ్వరున్ని, కోటీశ్వరున్ని అపర కుబేరునిగా చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి తాను అసమర్థుడిని.. చేతకాని వాణ్ణి కాదని ముద్రగడ అన్నారు. రాధాకృష్ణలాగా.. ఎదుటి వాళ్లను ఏకవచనంతో మాట్లాడే పత్రిక యాజమానిని ఇంత వరకు చూడలేదన్నారు. ఆంధ్రజ్యోతి యాజమాని కేఎల్ఎన్ ప్రసాద్ను కూర్చిలోంచి కాళ్లుపట్టుకొని లాగి.. ఆ కుర్చిలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అని విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదని దుయ్యబట్టారు. ‘‘నా చరిత్ర కంటే మీ చరిత్రను అందరూ చదవాలి. ఎందుకంటే మీలా అపర కోటేశ్వరులు అవ్వలేరు. నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యాజమానులను బెదిరించి ఏలా చలమణిలోకి తెచ్చారో? రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని మీరు(రాధాకృష్ణను ఉద్దేశిస్తూ) ప్రజలకు చెప్పాలి. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి అంటూ రాధాకృష్ణపై ముద్రగడ ఆ లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
ఏం తల్లివమ్మా నువ్వు.. ఇంత దారుణమా!
కాకినాడ(తూర్పుగోదావరి): అడుక్కోవడానికి వెళ్లమంటే వెళ్లనందని 11 ఏళ్ల కుమార్తెపై ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. కాకినాడ దుమ్ములపేటకు చెందిన కారే థెరెస్సాకు సుగుణ అనే 11 ఏళ్ల కుమార్తె ఉంది. బంధువుల సహకారంతో బాలిక వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. కొన్నాళ్ల క్రితం తల్లి థెరెస్సా కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. మద్యానికి బానిసై కుమార్తెను నిత్యం వేధించేది. బిచ్చమెత్తి డబ్బులు తెచ్చివ్వాలని కొడుతూండేది. సుగుణ వెళ్లనని చెప్పింది. ఆదివారం మరోమారు వెళ్లి తీరాలని థెరెస్సా చెప్పింది. కుమార్తె వెళ్లననీ, తాను చదువుకుంటానని హాస్టల్కు పంపేయమంటూ ప్రాధేయపడింది. కనికరించని తల్లి బాలికను కొట్టింది. స్టౌపై నూనె మరిగించి బాలిక ఒంటిపై పోసింది. బాలిక చేతులు కాలి గాయాలపాలై బిగ్గరగా ఏడవడంతో బాలికను స్థానికులు తల్లి చెర నుంచి తప్పించి సమీపంలో నివాసం ఉంటున్న మేనమామ కుటుంబానికి అప్పగించారు. వారు బాలికను కాకినాడ జీజీహెచ్లో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పట్టపగలు దారుణ హత్య.. యానాంలో కలకలం
యానాం(తూర్పు గోదావరి): పట్టపగలే ఓ వ్యక్తి హత్యకు గురవడం యానాంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని గోపాల్ నగర్ మోకా వారి వీధికి చెందిన మోకా వెంకటేశ్వరరావు (57)ను ఆయన ఇంట్లోనే ఓ దుండగుడు శనివారం కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు కారులో హుటాహుటిన యానాం జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. మధ్యాహ్నం తాను బయటకు వెళ్తున్నప్పుడు కాజులూరు మండలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణస్వామి తమ ఇంటికి వచ్చాడని హతుని కుమారుడు ఆనందమూర్తి పోలీసులకు చెప్పాడు. అతడే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. నారాయణస్వామి వద్ద వెంకటేశ్వరరావు గతంలో అప్పు తీసుకున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నారాయణస్వామి పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. ఈ సంఘటనపై ఎస్సై నందకుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ జీజీహెచ్లో సందర్శించారు. హతుని కుమారుడు ఆనందమూర్తిని ఓదార్చారు. ఎస్పీ బాలచంద్ర, సీఐ అర్విసెల్వంలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం
వీఆర్పురం( తూర్పుగోదావరి): మండలంలోని రాజుపేట కాలనీలో ఓ కోడు గుడ్డు వింత ఆకారంలో ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన ముంజపు సత్యనారాయణకు చెందిన కోడిపెట్ట ఆదివారం ఈ గుడ్డు పెట్టింది. వంపు తిరిగిన ఆకారంలో ఉండడం ఈ గుడ్డు ప్రత్యేకత. తొలుత గంప కింద ఉన్న దానిని ఏదో ఒక వస్తువు అని సత్యనారాయణ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. తరువాత క్షుణ్ణంగా పరిశీలించగా అది తమ కోడి పెట్టిన గుడ్డుగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ గుడ్డు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. -
ఎమ్మెల్యే సతీష్ తనయుడు, మేనల్లుడికి గాయాలు
కాకినాడ క్రైం: తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ పెద్ద కుమారుడు సుమంత్, ఎమ్మెల్యేకు వరుసకు మేనల్లుడైన కాకాడి లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అమలాపురంలోని నివాసం నుంచి సుమంత్, లోకేష్ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కాకినాడ బయలుదేరారు. పాత ఇంజరం వద్ద వారి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న లోకేష్తో పాటు ముందు సీటులో ఉన్న సుమంత్ గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే మొబైల్ పోలీసులు క్షతగాత్రులను యానాం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సుమంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉండగా, లోకేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోన్లో సీఎం జగన్ పరామర్శ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు, మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యేకు బుధవారం ఫోన్చేసి పరామర్శించారు. గాయపడిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ను పరామర్శించారు.