సాక్షి, అమరావతి: రాయపూర్–విశాఖ ఎకనమిక్ కారిడార్కు భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎస్ డాక్టర్ సమీర్శర్మను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ కారిడార్తో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని చెప్పారు. అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాల సీఎస్లు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాయపూర్–విశాఖపట్టణం ఎకనమిక్ కారిడార్, కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ సమీర్శర్మ మాట్లాడుతూ ఎకనమిక్ కారిడార్ కోసం 798 హెక్టార్లకుగాను 561 హెక్టార్ల భూమిని ఇప్పటికే అప్పగించినట్లు చెప్పారు. రోడ్సైడ్ ఎమినిటీస్కు మరో 50 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణకు అడ్వాన్స్ పొజిషన్ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేస్తున్నట్లు తెలిపారు. సహజవాయువు పైపులైను ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మొదటిదశ పూర్తయిందని చెప్పారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు రెండోదశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ తెలిపారు.
ఎకనమిక్ కారిడార్కు భూసేకరణ పూర్తిచేయాలి
Published Thu, May 26 2022 5:29 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement