17 వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలు | Political Pressures on Vice Chancellors: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

17 వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలు

Published Fri, Jul 19 2024 5:37 AM | Last Updated on Fri, Jul 19 2024 5:37 AM

Political Pressures on Vice Chancellors: Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

 కూటమి ప్రభుత్వం రాగానే వైస్‌ చాన్సలర్లపై రాజకీయ ఒత్తిళ్లు

రాజీనామాలు చేయాలంటూ బెదిరింపులు.. వైదొలిగిన వీసీలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్ల(వీసీల)ను నియమి­స్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

యూనివర్సిటీల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement