కూటమి ప్రభుత్వం నన్ను చంపేస్తుందేమో.. జైల్లో పోసాని | Posani Krishna Murali expresses fear over the AP coalition government regarding illegal cases | Sakshi
Sakshi News home page

Posani Krishna Murali : కూటమి ప్రభుత్వం నన్ను చంపేస్తుందేమో.. జైల్లో పోసాని

Published Thu, Mar 13 2025 3:31 PM | Last Updated on Thu, Mar 13 2025 3:58 PM

Posani Krishna Murali expresses fear over the AP coalition government regarding illegal cases

సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం తనని చంపేస్తుందేమోనని రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.గురువారం గుంటూరు జైల్లో ఉన్న పోసానితో అంబటి రాంబాబు ములాకత్‌ అయ్యారు.

అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.పోసానిపై ప్రభుత్వం 17 కేసులు బనాయించింది. అన్ని కేసుల్లో బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో సిఐడి వారు పిటి వారెంట్ దాఖలు చేసి పోసాని ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు.

ఆయనపై సీఐడీ 111 సెక్షన్‌ నమోదు చేశారు. 111 సెక్షన్ పోసానికేసుకు వర్తించదు అని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
మేజిస్ట్రేట్ సైతం 111 సెక్షన్‌ను తిరస్కరించారు. ఎప్పుడో మీడియాలో మాట్లాడితే ఇప్పుడు పోసానిపై కేసులు పెట్టడం దారుణం.

జైల్లో పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారు.ప్రభుత్వం నన్ను చంపేస్తుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారులని ఏమైనా చేస్తారేమో అని పోసాని కంగారు పడుతున్నారని’ ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు జైలులో పోసాని కృష్ణమురళికి అంబటి రాంబాబు పరామర్శ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement