ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3,950 కోట్ల ఆదాయం | Revenue for the current financial year is Rs 3950 crore | Sakshi
Sakshi News home page

ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3,950 కోట్ల ఆదాయం

Published Thu, Jan 21 2021 4:33 AM | Last Updated on Thu, Jan 21 2021 4:33 AM

Revenue for the current financial year is Rs 3950 crore - Sakshi

రికార్డులను పరిశీలిస్తున్న ఉదయభాస్కరరావు

భీమవరం (ప్రకాశం చౌక్‌): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అడిషనల్‌ ఐజీ ఎం.ఉదయభాస్కరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం తమ శాఖ ఆదాయ లక్ష్యం సుమారు రూ.6,336 కోట్లుగా తెలిపారు. అంతకు ముందు డిసెంబర్‌ నెలలో సుమారు రూ.421 కోట్ల ఆదాయం వస్తే, గతేడాది డిసెంబర్‌లో రూ.599 కోట్లు వచ్చిందని ఉదయభాస్కరరావు వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement