Financial year
-
ఖజానాకు చేరిన గత బడ్జెట్ కేటాయింపులు
భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కొన్ని శాఖలు పూర్తిస్థాయిలో అప్పటి బడ్జెట్ నిధులను ఉపయోగించలేదు. మూలధన పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్లలో జాప్యం కారణంగా కొంతమేర నిధులు బూ తిరిగి ఖజానాకు చేరాయి. ఏయే విభాగాలు ఎంతమేరకు ఇలా నిధులు తిరిగి పంపాయో.. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన బడ్జెట్ను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కొనుగోలు ప్రక్రియల్లో జాప్యం, ఇతర బ్యూరోక్రాటిక్ అడ్డంకుల కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ.12,500 కోట్లు తిరిగి కేంద్ర ఖజానాకు జమ చేసింది. ప్రభుత్వం కఠినమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా భారీగా ఖర్చు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖర్చులను ఆదాయ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇది ఆర్థిక జాప్యాన్ని నివారించడానికి, సమతుల్య బడ్జెట్ను నిర్వహించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 100 మంది వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?మెరుగైన పన్ను వసూలు యంత్రాంగాలు, పన్ను ఎగవేతను అరికట్టడంతో సహా సమర్థమైన ఆదాయ సమీకరణ ప్రయత్నాల వల్ల కొంత బడ్జెట్ను మిగిల్చింది. కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రభుత్వాల మద్దతు వల్ల ద్రవ్యలోటును నిర్వహించడానికి, బడ్జెట్ అమలు సజావుగా జరిగేలా చూడటానికి సాయపడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. నిధుల రాబడి, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెబుతున్నారు. -
మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–2026) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ విశ్లేషించింది. స్థిర వృద్ధి, ధరల పెరుగుదల్లో కట్టడి వంటి అంశాలు దీనికి దోహదపడతాయన్నది ఫిచ్ విశ్లేషణ. రెపో రేటు కోత 2025–26లో కార్పొరేట్ల రుణ లభ్యత పెరుగుదలకు దారితీసే అంశంగా పేర్కొంది. అధిక మూలధన వ్యయాలు నమోదయినప్పటికీ, వచే ఆర్థిక సంవత్సరం భారత్ కార్పొరేట్ల మార్జిన్లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఫిచ్ వెలిబుచ్చింది. ‘‘ఇండియా కార్పొరేట్ల క్రెడిట్ ట్రెండ్స్’’ పేరుతో ఫిచ్ రూపొందించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... వృద్ధి 6.5 శాతం 2025–26లో సిమెంట్, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, ఇంజినీరింగ్, నిర్మాణ (ఈఅండ్సీ) కంపెనీల ఉత్పత్తులకు మంచి డిమాండ్ అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎకానమీ 6.5 శాతం పురోగమించే వీలుంది. మౌలిక సదుపాయాల వ్యయం పెరగవచ్చు. ఎకానమీ స్థిరవృద్ధికి ఈ అంశం దోహదపడుతుంది. మరికొన్ని అంశాలు... → దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు నెమ్మదించడం వల్ల ఆటో రంగంలో వృద్ధి మధ్యస్థంగా ఉండే వీలుంది. → రవాణా, పర్యాటక పరిశ్రమలో డిమాండ్ రికవరీ ఒక మోస్తరు వేగంతో కొనసాగుతుంది. → అంతర్జాతీయంగా అధిక సరఫరాల ప్రభావం రసాయన కంపెనీల ధరలపై ప్రభావం చూపుతుంది. → టెలికం కంపెనీల ఆదాయ వృద్ధికి టారిఫ్ల పెంపు మద్దతు లభిస్తుంది. → ఔషధ రంగంలో మెరుగైన ఫలితాలు నమోదుకావచ్చు.రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత రూపాయి మరింత క్షీణించవచ్చు. అమెరికాసహా కొన్ని దేశాలు తీసుకునే వాణిజ్య రక్షణాత్మక చర్యల వల్ల దిగుమతులు తగ్గి, రూపాయిపై ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఐటీ మందగమనం.. కీలకమైన విదేశీ మార్కెట్లలోని వినియోగదారులు ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యయాల విషయంలో విచక్షణతో వ్యవహరించవచ్చు. దీనితో ఐటీ, సేవా కంపెనీల అమ్మకాల్లో కేవలం ఒక అంకె వృద్ధి మాత్రమే నమోదయ్యే వీలుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితం కావచ్చు.రేటు తగ్గింపు ప్రక్రియ షురూ! రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపనకు పడిపోయే అవకాశం ఉంది. ఆర్బీవ్యోల్బణం నుండి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని మేము నమ్ముతున్నాము. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నాము. – అఖిల్ మిట్టల్, సీనియర్ ఫండ్ మేనేజర్ (టాటా అసెట్ మేనేజ్మెంట్)ఫిబ్రవరిలో రేటు తగ్గదు నవంబర్ 2024లో 5.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.2 శాతానికి దిగివచ్చింది. ఇది మా అంచనాలకన్నా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు కష్టమే. అయితే కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల్లో ధరలలో గణనీయమైన క్షీణత వల్ల వృద్ధే లక్ష్యంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుల్లో కొందరు కోతకు మొగ్గుచూపే వీలుంది. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఏప్రిల్ పాలసీలో కోత కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుంది. – పరాస్ జస్రాయ్, ఇండ్–రా ఎకనమిస్ట్ -
8 నెలలు..8 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు ముగిసే నాటికి (నవంబర్ 30, 2024 వరకు) అన్ని రకాల రాబడులు కలిపి రూ.1,41,178 కోట్లు వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడుల కింద అంచనా వేసిన రూ.2.74 లక్షల కోట్లలో ఇది 51.51 శాతం కావడం గమనార్హం.కాగా గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో నవంబర్ నెల ముగిసేసరికి రూ.1,49,316.41 కోట్లు రావడం గమనార్హం. గత ఏడాది మొత్తం అంచనాల్లో ఇది 57.46 శాతం కాగా, ప్రస్తుత 8 నెలల కాలంలో రూ.8 వేల కోట్ల మేర రాబడులు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారీగా తగ్గిన పన్నేతర ఆదాయంరాష్ట్ర ప్రభుత్వ ఆదాయ రాబడులకు సంబంధించిన కీలకమైన పద్దుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పన్నేతర ఆదాయంలో భారీగా క్షీణత నమోదైంది. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల మైనింగ్, యూజర్ చార్జీలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సమకూరే ఆదాయాన్ని పన్నేతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఈ పద్దు కింద 2023–24లో నవంబర్ నెల ముగిసే సమయానికి రూ.19,524.69 కోట్లు సమకూరింది. అదే ప్రస్తుత సంవత్సరంలో మాత్రం కేవలం రూ. 5,217.26 కోట్లు మాత్రమే వచ్చింది. వాస్తవానికి 2024–25లో రూ.35,208 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అందులో దాదాపు 15 శాతం మాత్రమే సమకూరడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 8 నెలల్లో రూ.14,607 కోట్లు రాగా, ఈ ఏడాదిలో రూ.2 వేల కోట్లు తక్కువగా రూ.12,364 కోట్లు వచ్చింది. అయితే జీఎస్టీ పద్దు కింద గత ఏడాది కంటే రూ.3 వేల కోట్లు, అమ్మకపు పన్ను కింద రూ.1.500 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.3 వేల కోట్లు అధికంగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.200 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అప్పులు కూడా గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గినా బడ్జెట్ అంచనాల్లో 72 శాతం ఇప్పటికే సమకూరడం గమనార్హం.నాలుగు నెలల్లో రాబడి వస్తుందా?ప్రస్తుత లెక్కల ప్రకారం నవంబర్ తర్వాత మిగిలిన నాలుగు నెలల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.30 లక్షల కోట్లకు పైగా రాబడులు ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సి ఉంది. అయితే గత ఏడాది చివరి నాలుగు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా మాత్రమే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బడ్జెట్ అంచనాలకు, రాబడులకు భారీ లోటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నాలుగు నెలల్లో రూ.80 వేల కోట్ల మేర రాబడులు వస్తాయని ఆశించినా, కనీసం మరో రూ.20–30వేల కోట్లు ఇతర మార్గాల్లో సమకూర్చుకోకపోతే బడ్జెట్ లెక్కలు తప్పుతాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, జీవో 59 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, భూముల అమ్మకాలు, మైనింగ్ ఆదాయం పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని వారు సూచిస్తున్నారు. -
జీడీపీ మందగమనం వ్యవస్థీకృతం కాదు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గుముఖం పట్టడం అన్నది.. వ్యవస్థీకృతం కాదని (ఆర్థిక వ్యవస్థ అంతటా) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన మూలధన వ్యయాల మద్దతుతోతగ్గిన మేర డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) భర్తీ అయ్యి మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పడిపోవడం తెలిసిందే. ఇది ఏడు త్రైమాసికాల కనిష్ట రేటు కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది. ‘‘ఇది వ్యవస్థ అంతటా మందగమనం కాదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యయాలు, మూలధన వ్యయాలు లోపించడం వల్లే. క్యూ3లో ఇవన్నీ సర్దుకుంటాయి. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వచ్చే ఏడాది, తర్వాత కూడా కొనసాగుతుంది’’అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి చెప్పారు. అంతర్జాతీయ డిమాండ్ స్తబ్దుగా ఉండడం ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున మూలధన వ్యయాలు చేయకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గిన కార్యకలాపాలు వృద్ధిపై ప్రభావం చూపించడం తెలిసిందే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాలను కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 37.3 శాతమే ఖర్చు చేసింది. చర్యలు తీసుకుంటున్నాం.. ‘‘దేశ ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడుతోంది. అదే సమయంలో వేతనాల్లోనూ మందగమనం ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇవి దేశ వినియోగంపై ప్రభావం చూపించగలవు. ప్రతి సవాలు నుంచి అవకాశాలను చూసే ప్రధాన మంత్రి మనకు ఉన్నారు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సమయంలో ఐదు మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టాం. విడిగా ప్రతి ఒక్కటీ తనవంతు మద్దతునిచి్చంది’’అని మంత్రి సీతారామన్ వివరించారు. -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
వినియోగదారుల రుణాలు రూ.90 లక్షల కోట్లు
కోల్కతా: వినియోగదారుల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15 శాతం వృద్ధి చెంది రూ.90 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే కొంత క్షీణత కనిపించింది. వినియోగదారుల రుణాల్లో 40 శాతం వాటా కలిగిన గృహ రుణ విభాగంలో మందగమనం ఇందుకు కారణమని క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. 2023–24లో గృహ రుణాల విభాగంలో వృద్ధి 7.9 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే విభాగం 23 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. రూ.35 లక్షలకు మించిన గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. సగటు రుణ సైజ్ 2019–20లో ఉన్న రూ.20లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 2023–24లో రూ.26.5 లక్షలకు పెరిగింది. వ్యక్తిగత రుణాలకు డిమాండ్ ఇక వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్)కు డిమాండ్ బలంగా కొనసాగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2023–24లో వ్యక్తిగత రుణాల విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. రూ.10లక్షలకు మించిన వ్యక్తిగత రుణాల వాటా పెరగ్గా.. అదే సమయంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాల విలువ అధికంగా ఉండగా, ఎన్బీఎఫ్సీలు సంఖ్యా పరంగా ఎక్కువ రుణాలు జారీ చేశాయి. టూవీలర్ రుణాల జోరు ద్విచక్ర వాహన రుణ విభాగం సైతం బలమైన పనితీరు చూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2022–23లో 30 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆటోమొబైల్ రుణాల విభాగంలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22 శాతంగా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని చూపించాయి. రుణాల సగటు విలువ కూడా పెరిగింది. ఎంఎస్ఎంఈ విభాగంలో వ్యక్తిగత రుణాల కంటే సంస్థాగత రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఎంఎస్ఎంఈ రుణాలు 29 శాతం, సంస్థలకు సంబంధించి ఎంఎస్ఎంఈ రుణాలు 6.6 శాతం చొప్పున పెరిగాయి. సూక్ష్మ రుణాలు సైతం బలమైన వృద్ధిని చూపించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. -
ఒక్క రూపాయీ గ్రాంట్ రాలే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసిపోయింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడేకాదు చాలా ఏళ్లుగా రాష్ట్రానికి గ్రాంట్లు ఇచ్చే విషయంలో కేంద్రం శీతకన్ను వేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో సగం కూడా నిధులను మంజూరు చేయడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.2,317 కోట్లు అయినా ఇవ్వగా.. ఈసారి అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21 వేలకోట్లకుపైగా వస్తాయని బడ్జెట్లో అంచనా వేసుకుంది.పన్నుల వసూళ్లతోనే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 30వ తేదీ వరకు ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు ఇచ్చిన నివేదికలోని గణాంకాల ప్రకారం పన్ను రాబడులు ఆశించిన మేర వస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో పన్ను రాబడులు రూ.11,464 కోట్లు వచ్చాయి. మే నెలలో కొంత తగ్గి రూ.10,954 కోట్లు వచ్చినా, జూన్లో మళ్లీ పుంజుకుని రూ.12,190 కోట్లు వచ్చాయి. మొత్తంగా మూడు నెలల్లో కలిపి అన్నిరకాల రాబడులు, పన్నుల్లో వాటా, అప్పులు కలిపి రూ.48,790.66 కోట్లు ఖజానాకు సమకూరగా.. అందులో రూ.34,609 కోట్లు పన్ను ఆదాయం కిందే అందాయి. అంటే మొత్తం రాబడిలో 80శాతానికిపైగా పన్నుల రూపంలోనే ఖజానాకు వచ్చినట్టు అర్థమవుతోంది.మూడు నెలల్లో రూ.13,171 కోట్ల అప్పులుఇక ఈ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,171 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకుంది. ఏప్రిల్లో రూ.2,246 కోట్లు, మేలో రూ.5,133 కోట్లు, జూన్లో రూ.5,790 కోట్లు రుణాలు తీసుకుంది. ఈ మొత్తంలో సగం వరకు గతంలోని అప్పుల అసలు, వడ్డీలకు చెల్లించినట్టు కాగ్కు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్లో రూ.1,865 కోట్లు, మేలో రూ.1,864 కోట్లు, జూన్లో రూ.2,203 కోట్లు అప్పుల కింద చెల్లించారు. ఇక ఇతర ఖర్చుల విషయానికి వస్తే జీతాలకు రూ.11,026.69 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో చెల్లించిన దానికంటే ఇది రూ.1,300 కోట్లు అధికం. పింఛన్ల కోసం రూ.4,311.62 కోట్లు, సబ్సిడీల కింద రూ.3,354 కోట్లు చెల్లించారు. మొత్తం రాబడిలో రూ.45,320.12 కోట్లు ఖర్చయిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
సెయిల్ ఈ ఏడాది పెట్టుబడి రూ. 6,500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. 2030 నాటికి రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సెయిల్ సీఎండీ అమరేందు ప్రశాశ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తొలి దశలో సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ టన్నుల నుంచి 2031 నాటికి 35 మిలియన్ టన్నులకు చేరుస్తాం. తదుపరి దశలో వార్షిక సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుతాం. స్టీల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 0.5% వృద్ధి చెందుతోంది. గతేడాది భారత్ ఏకంగా 13 శాతం వృద్ధి నమోదు చేసింది. వచ్చే పదేళ్లు భారత్లో స్టీల్ రంగం ఏటా సగటు వృద్ధి 8%గా ఉంటుంది’ అని వివరించారు. -
వృద్ధికి వర్షపాతం, ప్రపంచ సానుకూలతల దన్ను
న్యూఢిల్లీ: సాధారణ రుతుపవనాల అంచనాలు, ఇప్పటివరకు ఎటువంటి ప్రపంచ ప్రతికూలతలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడానికి దోహదపడే అవకాశం ఉందని ఎకనామిక్ థింక్ ట్యాంక్– ఎన్సీఏఈఆర్ తన నెలవారీ సమీక్షలో తెలిపింది.దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని హై–ఫ్రీక్వెన్సీ సూచికలు వెల్లడిస్తున్నాయని, 2024–25 వృద్ధి అంచనాలను దాదాపు అన్ని ఏజెన్సీలు కూడా ఎగువముఖంగా సవరిస్తున్నాయని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 7.2 శాతం శ్రేణిలో ఉంటుందని పలు సంస్థలు అంచనావేస్తున్న విషయాన్ని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా పేర్కొంటూ.. ఎకానమీ వృద్ధి 2024–25లో 7 శాతం ఖాయమని, 7.5 శాతం వరకూ కూడా ఈ రేటు పురోగమించే వీలుందని అన్నారు. పూనమ్ గుప్తా పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...మార్చి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు తోడు సాధారణ రుతుపవనాల అంచనాలు ఎకానమీకి ఊతం ఇస్తాయి.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉన్నందున, కీలక రెపో రేటు మరింత కఠినమయ్యే పరిస్థితులు లేవు.అయితే ఆహార ధరలు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసురుతున్న సమస్య. దీనిని పరిష్కరించడానికి విస్తృత విధాన ఫ్రేమ్వర్క్ అవసరం కావచ్చు. వాతావరణ సవాళ్లను తట్టుకునే ఆహార సరఫరాల చైన్ను వ్యవస్థీకరించడంతోపాలు, ప్యాక్ అయిన సురక్షిత ఆహార సరఫరాలవైపు క్రమంగా మారాలి. సరఫరా–డిమాండ్ అంతరాన్ని తగ్గించడానికి తగిన కృషి జరగాలి.ప్రధాన పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)లో వృద్ధి ఏప్రిల్ 2024లో వేగంగా ఉంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏడాది పొడవునా పటిష్టంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ’సాధారణం కంటే ఎక్కువ’ రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నాయి. భారత్ ఎకానమీ పురోగతిలో ఇవన్నీ కీలకాంశాలు. -
భారీగా బంగారం వెండి దిగుమతులు
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం లో గణనీయంగా పెరిగాయి. 210 శాతం అధికంగా 10.7 బిలియన్ డాలర్లు (88,810 కోట్లు) విలువైన బంగారం, దిగుమతులు నమోదైనట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీ యేటివ్ (జీటీఆర్ఐ) సంస్థ అధ్యయనంలో తెలిసింది. 2022–23లో బంగారం, వెండి దిగుమతుల విలువ 3.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. భారత్–యూఏఈ సమగ్ర ఆరి్థక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద యూఏఈకి భారత్ కలి్పంచిన కస్టమ్స్ డ్యూటీ రాయితీలే ఈ పెరుగుదలకు కారణమని జీటీఆర్ఈ ఓ నివేదికలో వెల్లడించింది. పెరిగిన దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ రాయితీలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. యూఏఈ నుంచి వెండి దిగుమతులపై 7 శాతం టారిఫ్ రాయితీని భారత్ కల్పిస్తోంది. దిగుమతుల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదు. అదే బంగారం అయితే ఒక ఆరి్థక సంవత్సరంలో 160 మెట్రిక్ టన్నుల వరకు ఒక శాతం డ్యూటీ రాయితీ కింద అనుమతించింది. 2022 మే నుంచి రెండు దేశాల మధ్య సీఈపీఏ అమల్లోకి వచ్చింది. దీనికితోడు గిఫ్ట్ సిటీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సే్ఛంజ్’(ఐఐబీఎక్స్) ద్వారా యూఏఈ నుంచి ప్రైవేటు సంస్థలు బంగారం, వెండి దిగుమతులకు ప్రభుత్వం అనుమతించింది. బంగారం, వెండి మినహా యూఏఈ నుంచి ఇతర ఉత్పత్తుల దిగుమతులు గత ఆరి్థక సంవత్సరంలో క్షీణించాయి. 2022–23లో 48 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు యూఏఈ నుంచి భారత్కు రాగా, 2023–24లో 9.8 శాతం తక్కువగా 48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.ఇదే ధోరణి ఉండకపోవచ్చు.. యూఈఏ నుంచి బంగారం, వెండి దిగుమతులు ఇక ముందూ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎందుకంటే యూఏఈలో బంగారం లేదా వెండి తవ్వకాలు (మైనింగ్) లేవని, కనుక ఆ దేశానికి ఈ ఉత్పత్తుల ఎగుమతులతో ఒనగూడే అదనపు విలువ ఏమంత ఉండదన్నారు. ‘‘ప్రస్తుతం భారత్లో బంగారం, వెండి, ఆభరణాల దిగుమతులపై 15 శాతం సుంకం అమలవుతోంది. ఇదే అసలు మూలంలోని సమస్య. టారిఫ్లను 5 శాతానికి తగ్గించినట్టయితే అక్రమ రవాణా, దురి్వనియోగానికి అడ్డుకట్ట పడుతుంది’’అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. యూఏఈ నుంచి దిగుమతులపై తక్కువ టారిఫ్ నేపథ్యంలో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ను నియంత్రించేందుకు రాయితీతో కూడి కస్టమ్స్ సుంకాలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బంగారం మాదిరే వెండి దిగుమతులపై వార్షిక పరిమితిని అయినా విధించాలని సూచించారు. దీనివల్ల ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. గిఫ్ట్ సిటీ ద్వారా బంగారం, వెండి దిగుమతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. -
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి. -
రూ.1.2 లక్షల కోట్లకు ఆయుర్వేద మార్కెట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రెట్టింపు స్థాయికి పైగా వృద్ధి చెందనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 57,450 కోట్లు) ఉన్న ఈ మార్కెట్ 16.27 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) చేరనుంది. స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లలో సహజసిద్ధ చికిత్సా విధానాలకు డిమాండ్ నెలకొనడం, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కొత్తగా ఈ విభాగంలోకి ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వస్తుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆయుర్వేద టెక్ స్టార్టప్ సంస్థ నిరోగ్స్ట్రీట్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2023 – 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ ఏటా 15 శాతం చొప్పున పెరగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. నివేదిక ప్రకారం ప్రోడక్ట్ విభాగం 16 శాతం, సర్వీసుల విభాగం 12.4 శాతం చొప్పున వృద్ధి చెందనున్నాయి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 7,500 పైచిలుకు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, జమ్మూ–కశీ్మర్, కేరళ ఈ జాబితాలో ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఆయుష్ (ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగం 24 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని నిరోగ్స్ట్రీట్ తెలిపింది. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు.బ్రిటిష్ పాలన నుంచి వారసత్వంబ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.వ్యవసాయ దేశంభారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.పండుగలుభారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.ప్రాంతీయ నూతన సంవత్సరంభారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు.ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటిష్ పాలన నుంచి వారసత్వం బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. వ్యవసాయ దేశం భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. పండుగలు భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ నూతన సంవత్సరం భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
బ్యాంకింగ్ మార్జిన్లకు ఇకపై సవాళ్లు..!
న్యూఢిల్లీ: డిపాజిట్ వృద్ధి స్వల్పంగా ఉంటే ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ బ్యాంకుల రుణ వృద్ధి 12–14 శాతం శ్రేణిలో ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘భారత్ బ్యాంకుల్లో కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులు– రుణ వృద్ధి’ అన్న శీర్షికతో ఈ మేరకు ఒక నివేదిక వెలువడింది. ‘‘మేము రేట్ చేసే భారతీయ బ్యాంకుల విషయంలో డిపాజిట్ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. ఇది కఠిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), రుణ పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ నికితా ఆనంద్ నివేదిక విడుదల సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ నిధుల సమీకరణవైపు దృష్టి సారించవచ్చని ఆయన పేర్కొంటూ.. ఇదే జరిగితే బ్యాంకింగ్ రుణ వ్యయాలు పెరిగి మార్జిన్లు, లాభదాయకత దెబ్బతింటాయని విశ్లేసించారు. నిధుల సమీకరణ వ్యయాల పెరుగుదల, వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశాలు 2025లో బ్యాంకింగ్పై ప్రతికూలతలు చూపవచ్చని, నికర వడ్డీ మార్జిన్లు తగ్గడానికి కారణంగా ఉండవచ్చని నికితా ఆనంద్ వివరించారు. వ్యక్తిగత రుణ విభాగం జూమ్.. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం, బ్యాంకుల మొత్తం లోన్ బుక్లో అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్ల వాటా పెరుగుతూనే ఉంటుంది. కఠిన ద్రవ్య పరిస్థితుల్లో మార్జిన్లు భారీగా పడిపోకుండా బ్యాంకింగ్కు రక్షించే అంశాల్లో ఇది ఒకటి. క్రెడిట్ కార్డుల వంటి కొన్ని విభాగాలకు సంబంధించి వ్యక్తిగత రుణ మంజూరీలు ఇకపై మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ విభాగంలో పురోగతి ఆగలేదు. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ ఇటీవలి ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరిగింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించబోవని ఆర్బీఐ స్పష్టం చేయడం వ్యక్తిగత రుణ విభాగంలో కొనసాగుతున్న పురోగతికి కారణం. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ క్రెడిట్ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. కాగా, స్థిరమైన రుణ నాణ్యత, మూలధనం బ్యాంకుల క్రెడిట్ ప్రొఫైల్లకు మద్దతు ఇచ్చే అంశాలుగా ఆనంద్ తెలిపారు. అనుకూలమైన ఈక్విటీ మార్కెట్లు, ఆపరేటింగ్ పరిస్థితులు 2024లో బ్యాంకులకు రుణ సమీకరణ అవకాశాలను పెంచే అంశాలని ఆయన తెలిపారు. -
షిప్పింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు
ముంబై: దేశీ షిప్పింగ్ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల డెడ్వెయిట్ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ వివరాలు అందించింది. తగ్గిన రేట్లు.. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్ షిప్లు, గ్యాస్ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్ రేట్లు అంతర్జాతీయ డిమాండ్–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్ నుంచి పెరిగే డిమాండ్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్ క్యారియర్ల చార్టర్ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా రూ. 10.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22 శాతం పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న టార్గెట్లో 58 శాతానికి చేరాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 12.48 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూళ్లు 31.77 శాతం పెరిగాయని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు రూ. 1.77 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు కలిపి) సుమారు 18% పెరిగి రూ. 12.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 18.23 లక్షల కోట్లు సాధించాలని నిర్దేశించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 16.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75 శాతం అధికం. -
కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
భారీ లక్ష్యంతో దిశగా ఐఆర్ఈడీఏ - 2025 నాటికి..
న్యూఢిల్లీ: భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,350 కోట్ల ఆదాయన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అలాగే, 2025 మార్చి నాటికి రూ.5,220 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర నూతన, పునరుత్పాదక శాఖ (ఎంఎన్ఆర్ఈ)తో ఇందుకు సంబంధించి పనితీరు ఆధారిత అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం నిర్ధేశించిన మేర ఆదాయ లక్ష్యాలను ఐఆర్ఈడీఏ చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్, రుణాల్లో ఎన్పీఏ రేషియో, అస్సెట్ టర్నోవర్ రేషియో తదితర పనితీరు ఆధారిత లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,482 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ఐఆర్ఈడీఏ ప్రకటించింది. ‘‘జూన్ త్రైమాసికంలో రుణాల పంపిణీలో 272 శాతం వృద్ధి నమోదు చేశాం. పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి నమోదైంది’’అని ఐఆర్ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. నికర నిర్ధరక రుణాలు (ఎన్పీఏలు) 2.92 శాతం నుంచి 1.61 శాతానికి తగ్గినట్టు చెప్పారు. -
రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి. విలువలో కాంపాక్ట్ ఎస్యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది. టూ–వీలర్లు 2 కోట్లు.. ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం.. భారత్లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి. వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. భారీ పెట్టుబడులు.. భారత్లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది. భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
రూ.3.51 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ పరిశ్రమ
కోల్కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) నిర్వహణలోని పోర్ట్ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐల పోర్ట్ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు. -
16 రోజుల్లో ఐటీ రీఫండ్స్ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లింపులను (రిఫండ్) సగటున 16 రోజుల్లో పూర్తి చేస్తోంది. 2022–23 సంవత్సరాలో సగటు రిఫండ్ సమయం 16 రోజులకు తగ్గినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 80 శాతం రిఫండ్లను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోనే విడుదల చేసినట్టు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారులు సులభంగా, వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఐటీఆర్ దాఖలు చేసిన ఒక్కరోజులోనే వాటిని ప్రాసెస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒక్క రోజులో ప్రాసెస్ చేసినవి 2021–22లో 21 శాతం ఉంటే, 2022–23లో 42 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. 2022 జూన్ 28న ఒకే రోజు 22.94 లక్షల రిటర్నుల ప్రాసెసింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. స్వచ్ఛంద నిబంధనల అమలును సులభతరం చేసేందుకు వీలుగా.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు చెప్పారు. 2023 మార్చి 31 నాటికి 24.50 లక్షల అప్డేటెడ్ రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. -
బజాజ్ అలియెంజ్ నుంచి బోనస్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ బజాజ్ అలియెంజ్ గత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) గాను పాలసీదారులకు రూ. 1,201 కోట్ల విలువైన బోనస్ ప్రకటించింది. వెరసి అర్హతగల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు వరుసగా 22వ ఏడాదిలోనూ బోనస్ చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా బోనస్లో రెగ్యులర్ రివర్షనరీ బోనస్ రూ. 872 కోట్లు, టెర్మినల్, క్యాష్ బోనస్ రూ. 329 కోట్లు కలసి ఉన్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది (2021 - 22) రూ. 11.62 లక్షలకుపైగా పాలసీదారులకు రూ. 1,070 కోట్ల బోనస్ చెల్లించింది. -
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్సేల్లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ వన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు. యుటిలిటీ వాహనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి. సానుకూలంగా పరిశ్రమ.. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ స్కటర్లు 27 శాతం, మోటార్సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్షోర్, ఆఫ్షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
టికెట్ల ఆదాయం రూ. 5 వేల కోట్లపైనే
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రూపంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ దేశంలోని రైల్వే జోన్లలో కీలకంగా అవతరించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్ రైళ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని నమోదు చేసింది. టికెట్ల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారం రోజులు మిగిలి ఉండగానే రూ.5 వేల కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే అతి పెద్ద ఆదాయంగా రికార్డుకెక్కింది. గురువారం నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,000.81 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఆదాయం గరిష్ట మొత్తంగా రూ.2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,119.44 కోట్లు. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేస్తూ తొలిసారి రూ.5 వేల కోట్లను దాటింది. మార్చి చివరి నాటికి ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈసారి దేశవ్యాప్తంగా చాలా జోన్లు టికెట్ల రూపంలో మంచి ఆదాయాలను సొంతం చేసుకున్నాయి. 18 జోన్లకు గానూ దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత ఇటీవలే పూర్తిస్థాయిలో.. కోవిడ్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు చాలా రైళ్లు పార్కింగ్ యార్డులకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పూర్తిస్థాయి రైళ్లను నడుపుతున్నారు. కోవిడ్ తర్వాత తిరిగి 100 శాతం రైళ్లను నడిపిన తొలి జోన్గా దక్షిణ మధ్య రైల్వేనే నిలిచింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు రైళ్లు, ఉన్న రైళ్లకు అదనపు కోచ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బిజీగా ఉంటోంది. ఇటీవల పలు రైళ్లకు అదనంగా ఏర్పాటు చేసిన వాటిల్లో 200 కోచ్లను శాశ్వత ప్రాతిపదికన నడుపుతున్నారు. ఇక రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలకు సంబంధించి రోజువారీ ప్రాతిపదికన 10,539 కోచ్లను తాత్కాలికంగా నిర్వహించారు. వీటి రూపంలో 9,83,559 మంది అదనంగా బెర్తులు పొందగలిగినట్టు అ«ధికారులు తెలిపారు. ఈ అదనపు ప్రయాణికుల ద్వారానే రూ. 81 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో 3,543 ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటి ద్వారా 30.42 లక్షల మంది అదనంగా ప్రయాణించారు. వీరి ద్వారా రూ.219 కోట్లు అదనంగా సమకూరాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతం ఈ సంవత్సరం సికింద్రాబాద్–విశాఖ మధ్య దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలును, కాచిగూడ–మెదక్, అకోలా–అకోట్, బీదర్–కలబురగి మధ్య కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం 8 జతల రైళ్లకు కొత్తగా ఎల్హెచ్బీ కోచ్లను ప్రారంభించారు. వీటిల్లో ప్రయాణికుల సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల కూడా వారి సంఖ్య పెరిగింది. వెరసి ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతానికి చేరుకోవటం విశేషం. చమురు ధరలు విపరీతంగా పెరగటంతో సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. దూరప్రాంతాలకు రైళ్లలో వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ అన్ని కారణాలతో ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైందని తెలుస్తోంది. -
‘మార్చి 31’ గాభరావద్దు? ఈ విషయాలు తెలుసుకుంటే చాలు!
‘మార్చి’.. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. మీ ఆదాయాన్ని లెక్క వేసుకుని.. అవసరం అయితే వీలున్నంత వరకు ప్లానింగ్ చేసుకుని, ఆదాయాన్ని బట్టి పన్ను భారం లెక్కించుకోవాలి. ఆదాయం లెక్కింపునకు (అంచనా), పొదుపు .. పెట్టుబడులకు, చెల్లింపులకు, ఇతరత్రా ప్లానింగ్కు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఏమిటంటే.. ♦ ఉద్యోగస్తులు కేవలం జీతాలు కాకుండా ప్రతి నెలా వచ్చే ఆదాయాలు.. ఉదాహరణకు.. ఇంటద్దె, వడ్డీ, ఇతరాలు ఉంటే లెక్కలు వేసుకోవాలి. ఇటువంటి వారు తమ అవసరాన్ని బట్టి పీఎఫ్, ఎన్ఎస్సీ, బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లింపు, అసలుకు కట్టాడం లాంటివి ఏమైనా చేసి ఆదాయాన్ని తగ్గించి చూపించుకుని, పన్ను భారం తగ్గించుకోవాలా? లేదా చేతిలో నగదును ’బ్లాక్’ చేసుకోవాలా? బదులుగా కేవలం పన్ను భారం చెల్లించి బైటపడి, ఊపరి పీల్చుకోవాలా? ఇదంతా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. గుర్తుంచుకోండి. అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవద్దండి. ఎవరి వీలు వారిది. ఎవరి వెసులుబాటు వారిదే. ♦ ప్లానింగ్లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు, మిగతా ఆదాయాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉండే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7,00,000 వరకు పన్ను భారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఏప్రిల్కు వాయిదా వేసుకోండి. ప్రైవేట్ సంస్థల్లో యజమానిని, జీతం/బోనస్ ఎక్స్గ్రేషియా వచ్చే సంవత్సరం ఇవ్వమనండి. మీకు వచ్చే ఇంటద్దెను వచ్చే సంవత్సరం నుంచి పెంచండి. ♦ అలాగే క్యాపిటల్ గెయిన్స్ విషయానికొస్తే.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ అంచనాల మేరకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఒప్పందాలు అవసరమైతే మార్చుకోండి. అయితే, ఒక జాగ్రత్త తీసుకోండి. కేవలం పన్ను భారం తగ్గించుకోవడం కోసం వాయిదా వేసుకోకండి. మిగతా విషయాలు .. అంటే అగ్రిమెంటును గౌరవించడం, మీరు అనుకున్న ప్రతిఫలం రావడం, మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్ను దృష్టిలో పెట్టుకోండి. ♦ చివరగా.. ’మార్చి’ వచ్చిందని ’మార్చ్’ చేయనక్కర్లేదు (ముందుకు పరుగెత్తనక్కర్లేదు). గాభరా పడక్కర్లేదు. వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు. తలకు మించి భారం పెట్టుకోకండి. అవసరం లేకపోతే పన్ను చెల్లించండి. పన్ను భారం కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటే వీలును బట్టి చెల్లించండి. ప్రభుత్వం ఒక శాతం ఒక నెలకు చొప్పున అదనంగా కట్టవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఆలోచించి, అడుగు వేస్తూ ఆనందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు
దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (cbdt) తెలిపింది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరగ్గా... అందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్లు జారీ అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్ల కంటే 59.44 శాతం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష పన్నుల బోర్డ్ పేర్కొంది. Gross Direct Tax collections for FY 2022-23 upto 10th March, 2023 are at Rs. 16.68 lakh crore, higher by 22.58% over gross collections for corresponding period of preceding yr. Net collections at Rs. 13.73 lakh crore are 16.78% higher than net collections for same period last yr pic.twitter.com/wtxMsqm1LG — Income Tax India (@IncomeTaxIndia) March 11, 2023 స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత, సీటీఐ (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్)తో సహా పీఐటీ (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లు 20.06 శాతంగా ఉంది. -
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు -
టీసీఎస్ సంచలనం, ఇక ‘ఐటీ ఉద్యోగులకు పండగే!’
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు. 150,000 మంది నియామకం టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు. చదవండి👉 మూన్లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్ఎస్ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఎన్ఎస్ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. ►జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%. ►ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్కాస్టింగ్ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది. ►ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది. ►అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది. ►పబ్లిక్ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది. ►స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది. ఎన్ఎస్ఓ అంచనా విలువల్లో. 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్ఎస్ఓ తాజా అంచనా. అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట. -
11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ పరిశ్రమ (మైక్రోఫైనాన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11 శాతం అధికంగా రూ.71,916 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రుణాల పంపిణీ రూ.64,899 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల సంఖ్య 1.81 కోట్లుగా కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం పంపిణీ చేసిన రుణాల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. ద్వితీయ త్రైమాసికానికి సంబంధించి గణంకాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసింది. పరిశ్రమ మొత్తం రుణ పోర్ట్ఫోలియో విలువ రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తం 12 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందిస్తోంది. ‘‘మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్థూల రుణ పోర్ట్ఫోలియో (జీఎల్పీ) రూ.3,00,974 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.2,43,737 కోట్లతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి చెందింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన ఒక్కో రుణం సగటున రూ.40,571గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఒక వంతు వాటా పీఎస్బీలదే ఈ మొత్తం రుణాల్లో 13 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) సంయుక్తంగా 37.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ) 36.7 శాతం వాటా (రూ.1,10,418 కోట్లు) కలిగి ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సూక్ష్మ రుణాల్లో 16.6 శాతం వాటా (రూ.50,029) ఆక్రమించాయి. ఇక ఎన్బీఎఫ్సీలు 7.9 శాతం, ఇతర సూక్ష్మ రుణ సంస్థలు 1.1 శాతం మేర రుణాలను పంపిణీ చేసి ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ యాక్టివ్ (సకాలంలో చెల్లింపులు చేసే) రుణ ఖాతాలు గత 12 నెలల్లో (సెప్టెంబర్తో అంతమైన చివరి) 14.2 శాతం పెరిగి 12 కోట్లకు చేరాయి. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది ప్రాంతాలు మొత్తం సూక్ష్మ రుణాల్లో 63.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ఎక్కువ వాటా ఆక్రమిస్తోంది. -
ఎయిర్లైన్స్కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ అక్టోబర్లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
క్యాడ్ 3 శాతం లోపే ఉండొచ్చు!
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్ క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది. భారత్ కరెంట్ అకౌంట్లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్వేర్ ఎగుమతు లు క్యాడ్ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
ఎన్టీపీసీ లాభం క్షీణత, క్యూ2లో రూ. 3,418 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,418 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,691 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,096 కోట్ల నుంచి రూ. 44,681 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 28,950 కోట్ల నుంచి రూ. 40,001 కోట్లకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.42 ఎంఎంటీ నుంచి 5.58 ఎంఎంటీకి జంప్ చేసింది. దేశీయంగా బొగ్గు సరఫరా 44.83 ఎంఎంటీ నుంచి 48.72 ఎంఎంటీకి పుంజుకుంది. సొంత వినియోగ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 2.79 ఎంఎంటీ నుంచి 4.32 ఎంఎంటీకి పెరిగింది. సెప్టెంబర్ చివరికల్లా విద్యుదుత్పత్తి సామర్థ్యం భాగస్వామ్యం, అనుబంధ సంస్థలతో కలిపి 70,254 మెగావాట్లకు చేరింది. స్థూల విద్యుదుత్పత్తి 77.42 బిలియన్ యూనిట్ల నుంచి 85.48 బీయూకి మెరుగుపడింది. -
నేటి నుంచి బడ్జెట్ కసరత్తు షురూ..
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సానికి (2023–24) సంబంధించిన బడ్జెట్పై నేటి నుంచి (సోమవారం) కేంద్రం కసరత్తు మొదలుపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు (ఆర్ఈ), రాబోయే సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు తదితర అంశాలపై వివిధ శాఖలు, విభాగాలతో సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి రోజైన సోమవారం నాడు అటవీ శాఖ, కార్మిక శాఖ, సమాచార .. ప్రసార శాఖ, గణాంకాల శాఖ, యువజన వ్యవహారాల శాఖ ఆర్ఈ సమావేశాలు ఉంటాయి. వివిధ శాఖలతో నెల రోజుల పాటు సాగే సమావేశాలు నవంబర్ 10న ముగుస్తాయి. సాధారణంగా ఈ సమావేశాలన్నింటికి ఆర్థిక విభాగం, వ్యయాల విభాగం కార్యదర్శులు సారథ్యం వహిస్తారు. ప్రీ–బడ్జెట్ భేటీల తర్వాత 2023–24 బడ్జెట్ అంచనాలను సూచనప్రాయంగా రూపొందిస్తారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే చర్యలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ జోరు
న్యూఢిల్లీ: స్థూల అడ్వాన్స్లు 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 20 శాతం పెరిగి రూ.22,802 కోట్లకు చేరుకున్నాయని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలం నాటికి ఇది రూ.18,978 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్లో బ్యాంక్ ఇచ్చిన రుణాలు 22 శాతం ఎగసి రూ.3,845 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 20 శాతం అధికమై రూ.21,726 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 13 శాతం దూసుకెళ్లి రూ.7,665 కోట్లు నమోదైంది. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) రూ.8,200 కోట్ల నుంచి రూ.10,456 కోట్లకు ఎగసింది. నిధుల కోసం చెల్లిస్తున్న వడ్డీ (కాస్ట్ ఆఫ్ ఫండ్స్) 6.81 నుంచి 6.25 శాతానికి వచ్చి చేరిందని బ్యాంక్ వివరించింది. -
ప్రభుత్వానికి పీఎస్యూల డివిడెండ్..తాజాగా రూ. 1,203 కోట్లు జమ
న్యూఢిల్లీ: పీఎస్యూల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,203 కోట్లు అందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్రానికి రూ. 14,778 కోట్లు లభించాయి. ప్రధానంగా సెయిల్ నుంచి రూ. 604 కోట్లు, హడ్కో నుంచి రూ. 450 కోట్లు, ఐఆర్ఈఎల్ రూ. 37 కోట్లు చొప్పున దశలవారీగా దక్కినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇతర సంస్థలలో ఐఆర్సీటీసీ రూ. 81 కోట్లు, భారతీయ రైల్ బిజిలీ రూ. 31 కోట్లు చొప్పున చెల్లించినట్లు వెల్లడించారు. -
అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు అలెర్ట్. మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో వడ్డీ మొత్తం కనిపించడంలేదని కంగారు పడుతున్నారా? సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్మెంట్లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో ఆ వడ్డీని జమ చేస్తుంది. ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లబ్ధి దారుల అకౌంట్లలో డిపాజిట్ అయ్యింది. 2021-22 సంబంధించి ఈపీఎఫ్ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. There is no loss of interest for any subscriber. The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII — Ministry of Finance (@FinMinIndia) October 5, 2022 దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నిర్ణయించిన వడ్డీ మొత్తం ఇప్పటి వరకు తమ అకౌంట్లలో జమ కాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్దాస్ పాయ్ పీఎఫ్ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్లో స్పష్టం చేసింది. -
ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థిరంగా పన్ను ఆదాయం.. కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే! -
వృద్ధి రేటు 6.9 శాతం
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను మరో అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా కొనసాగించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య’ (ఓఈసీడీ) సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఆర్బీఐ అంచనా అయిన 7.2 శాతానికంటే ఓఈసీడీ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ‘‘వెలుపలి (అంతర్జాతీయ) డిమాండ్ మృదువుగా ఉండడం వల్లే భారత జీడీపీ వృద్ధి 2021–22లో ఉన్న 8.7 శాతం నుంచి, 2022–23లో సుమారు 7 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇది 2023–24కు 5.75 శాతంగా ఉండొచ్చు. అయినా కానీ బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మాత్రం వృద్ధి అన్నది వేగవంతమైనదే అవుతుంది’’అని ఓఈసీడీ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. జూన్ నాటి నివేదికలోనూ ఓఈసీడీ భారత వృద్ధి అంచనాలను 6.9 శాతంగా పెర్కొనడం గమనార్హం. యుద్ధం వల్లే సమస్యలు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి జోరును కోల్పోయినట్టు ఓఈసీడీ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ వృద్ధి రేటును కిందకు తోసేసిందని, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేందుకు దారితీసిందని తన తాజా నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఈ ఏడాదికి అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని, 2023కు ఇది 2.2 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు వేసిన అంచనాలకు ఇది తక్కువ కావడం గమనించాలి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందన్నది ఓఈసీడీ పూర్వపు అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ సైతం ప్రతికూలతలు చూస్తోందంటూ.. 2022 సంవత్సరానికి 3.2 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. 2020 కరోనా సంక్షోభ సంవత్సరాన్ని మినహాయిస్తే 1970 తర్వాత చైనాకు ఇది అత్యంత తక్కువ రేటు అవుతుందని పేర్కొంది. జీ20 దేశాల్లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 8.2%గాను, 2023లో 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. భారత్కు సంబంధించి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
వీసాల సంఖ్యను భారీగా పెంచిన ఆస్ట్రేలియా!
కోవిడ్ -19 మహమ్మారిని నుంచి కోలుకునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాశ్వత వలసదారుల వీసాల సంఖ్యను మరింత పెంచింది. గతంలో ఉన్న వీసా నిబంధనల్ని సడలిస్తూ వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏడాదికి 35 వేల వీసాలు మంజూరు చేసే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇప్పుడు వాటి సంఖ్యను ఏకంగా 1.95 లక్షలకు పెంచింది. తద్వారా ప్రభుత్వానికి మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తోంది. అసలు విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుని 3.4 శాతంగా ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా వేతనాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఉన్న వీసాల్ని సవరించాలని అక్కడి వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. వ్యాపారస్థుల విజ్ఞప్తితో పాటు ఇతర అంశాల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీసాల పెంపుతో విదేశీయులతో పాటు సంస్థల్ని ఆకర్షించడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించింది. అందుకే ప్రతిఏడు వేలల్లో వీసాలు జారీ చేసే ప్రభుత్వం ఈ ఏడాది ఆ వీసాల సంఖ్యను లక్షకు పైగా పెంచింది. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడులు,రూ.8,898 కోట్లకే పరిమితం!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక జూలైలో నిదానించింది. కేవలం రూ.8,898 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. అంతకుముందు జూన్ నెలలో వచ్చిన రూ.15,495 పెట్టుబడులతో పోల్చి చూస్తే 43 శాతం తగ్గాయి. మే నెలలో రూ.18,529 కోట్లు, ఏప్రిల్లో రూ.15,890 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలైలోనే పెట్టుబడులు తక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతల ప్రభావం పెట్టుబడులపై పడినట్టు తెలుస్తోంది. ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫీ) సోమవారం విడుదల చేసింది. ఇన్వెస్టర్లలో సానుకూల ధోరణికి నిదర్శనంగా 2021 మార్చి నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ ఆగస్ట్లోనూ రేట్లను పెంచొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించి ఉంటారని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవితా కృష్ణన్ తెలిపారు. స్మాల్క్యాప్ ఫండ్స్కు ఆదరణ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్క్యాప్ ఫండ్స్ పథకాలు అత్యధికంగా రూ.1,780 కోట్లను జూలైలో ఆకర్షించాయి. ఆ తర్వాత ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్ విభాగాలు ఒక్కోటీ రూ.1,000 కోట్లకు పైనే నికర పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో రూ.12,140 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.61 కోట్లకు చేరుకుంది. ఇక గత నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి రూ.4,930 కోట్ల పెట్టుబడులు నికరంగా వచ్చాయి. జూన్లో రూ.92,247 కోట్లు డెట్ నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించాలి. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) నుంచి రూ.457 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ గత నెలలో రూ.23,605 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ జూలై చివరికి రూ.37.75 లక్షల కోట్లకు చేరింది. జూన్ చివరికి ఇది రూ.35.64 లక్షల కోట్లుగా ఉంది. -
భారత్ నుంచి ఎగుమతుల్లో సముచిత వృద్ధి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. బడా ఎగుమతిదారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లతో సమాలోచనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు పరిణామాలను సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. ‘ధర, నాణ్యతపరంగా మన ఎగుమతులకు ప్రత్యేకత ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఎగుమతుల అంచనాలు ఉంటాయి‘ అని గోయల్ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2022–23లో 450–500 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యపడేదేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యమేదీ విధించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ)పై స్పందిస్తూ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పాలసీని ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో ఉత్పత్తుల ఎగుమతులు 17 శాతం పెరిగి 37.94 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి, క్రూడాయిల్ దిగుమతులు భారీగా పెరగడంతో కరెంటు అకౌంటు లోటు 25.63 బిలియన్ డాలర్లకు ఎగిసింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 45 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జూన్ 16వ తేదీ నాటికి 45 శాతం పెరిగాయి. విలువలో రూ.3.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022–23 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.2,33,651 కోట్లు. భారీగా నమోదయిన ముందస్తు పన్ను వసూళ్లు ఈ స్థాయి పురోగతికి కారణమని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విభాగానికి సంబంధించి రూ.1.70 లక్షల కోట్లకుపైగా మొత్తం నమోదయ్యింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) విభాగంలో రూ.1.67 లక్షల కోట్లకుపైగా వసూళ్లు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. వసూళ్లలో ముందస్తు పన్ను వాటా 33 శాతంపైగా పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు ఎగసింది. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
కంపెనీల సమస్యాత్మక రుణాలు రూ.60 వేల కోట్లు అధికం!
ముంబై: ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రేట్ల విషయంలో మారనున్న ఆర్బీఐ కఠిన వైఖరి, బలహీన రూపాయి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక రుణాలు (రిస్కీ డెట్) రూ.60,000 కోట్ల మేర పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. కంపెనీల నిర్వహణ లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5 రెట్లకు మించిన మొత్తాన్ని రిస్కీ డెట్గా పేర్కొంటారు. తాజా సంక్షోభం, అస్థిరతలతో ఈ తరహా రుణాలు 2022–23 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.6.9 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఇవి రూ.6.3 లక్షల కోట్ల స్థాయిలోనే ఉండేవని తెలిపింది. 1,385 కంపెనీలను ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గడానికితోడు.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని అంచనాకు వచ్చింది. రూపాయి బలహీనత వల్ల రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. కమోడిటీలను మడి సరుకులుగా వినియోగించుకునే కంపెనీల మార్జిన్లు 3 శాతం వరకు క్షీణిస్తాయని అంచనా వేసింది. -
April : అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
ముందుగా మీ అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు మీ అందరి ఆరోగ్యం బాగుండాలని, మీ ఆర్థిక వ్యవహారాలు ఏ చింతలు లేకుండా జరగాలని కోరుకుంటూ .. కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వచ్చే కీలక అంశాలు మీకోసం. ► అనుసంధానించకపోతే ‘పాన్’ పనిచేయదు: అవును. 31–3–2022 తేదీలోపల పాన్తో అనుసంధానం చేయని వారి పాన్ పనిచేయదు. దాన్ని స్తంభింపచేస్తారు. వాడుకలో ఉండదు. చెల్లుబడి కాదు. అంటే మీరు ఏ సందర్భంలోను పాన్ని ప్రస్తావించాలో, ఏ సందర్భంలో అయితే నంబర్ను పేర్కొనాలో ఆ సమయంలో పాన్ వాడకూడదు. అంటే కొన్ని ఆర్థిక వ్యవహారాలు చేయలేరు. అయితే, డిపార్ట్మెంట్పరమైన కార్యకలాపాల్లో ఇది చలామణీలో ఉంటుంది. అనుసంధానం చేయకపోవడం .. రద్దు వల్ల వాడకూడదు కాబట్టి ఇవ్వలసిన చోట ఇవ్వకపోయినా.. పాన్ తెలియజేసినా .. పాన్ని ప్రస్తావించినా శిక్షార్హులు. కొందరు ఇక్కడ ఉండీ అనుసంధానం చేయలేదు. మరికొందరు విదేశాల్లో ఉండిపోవడం వల్ల చేయలేదు. అటువంటి వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 1–4–22 నుండి 30–6–2022 వరకూ రూ. 500, అది దాటితే 1–7–2022 నుండి 31–3–2023 వరకూ రూ. 1,000 ఫీజు కింద చెల్లించి అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత పాన్ను మళ్లీ యధావిధిగా వాడుకోవచ్చు. ► క్రిప్టో ఆస్తుల మీద పన్ను: 2022 ఏప్రిల్ 1 నుండి క్రిప్టో కరెన్సీలపై, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) మీద 30 శాతం పన్ను విధిస్తారు. 31–03–2023 నాటి విలువ మీద పన్ను చెల్లించాలి. ► ఆదాయపు పన్ను మదింపులో అధికారులు ముసుగు వేసుకున్న వీరుల్లా తయారవుతారు. ఒకరి ముఖం ఒకరికి కనపడదు. అంతా ఫేస్లెస్సే. ► స్థిరాస్తుల వ్యవహారాల్లో (వ్యవసాయ భూములకు వర్తించదు) రూ. 50,00,000 ప్రతిఫలం దాటిన కేసుల్లో స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందంలో పేర్కొన్న విలువ .. ఏది ఎక్కువ ఉంటే ఆ మొత్తం మీద టీడీఎస్ రికవరీ చేయాలి. 1 శాతం చొప్పున చేయాలి. గతంలో కేవలం ఒప్పంద విలువ మీద చేయాల్సి వచ్చేది. కొత్త రూల్స్ ప్రకారం స్టాంప్ డ్యూటీని తీసుకువచ్చారు. ► మరో అశనిపాతంలాంటిది ఏమిటంటే.. ప్రావిడెంట్ ఫండ్ మీద వడ్డీపరంగా ప్రతికూల పరిణామం. గతంలో మనం తెలుసుకున్నాం ఉఉఉ (పన్నుపరమైన మినహాయింపుల) గురించి. కానీ కొత్త రూల్స్ ప్రకారం పీఎఫ్ జమలు రూ. 2,50,000 దాటితే ఆ ఆదనం మీద వచ్చే దాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అంటే పరోక్షంగా రూ. 2,50,000 దాటి జమ చేసినందుకు ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. ఉన్న స్కీముల్లో పీపీఎఫ్ అత్యుత్తమం. హైక్లాస్ ఆదాయం ఉన్న వారికి దెబ్బ. సాధారణ, మధ్యతరగతి వారికి ఎటువంటి నష్టం లేదు. ► కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులకు మినహాయింపు లభిస్తుంది. అయి తే అన్ని కాగితాలు, రుజువులు ఉండాలి. -
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది, పాన్తో ఆధార్ లింక్ చేశారా!..చేయకపోతే..!
అవును..మరో నాలుగు రోజుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ సందర్భంగా నాలుగు ముక్కలు. 2021–22 ఆర్థిక సంవత్సరం 31–03–2022తో ముగియనుండటంతో .. ఏదైనా కారణం వల్ల చేయాల్సిన విధులు చేయకపోతే, ఇంకా టైమ్ ఉంది. త్వరపడండి. ► వాస్తవానికి 31–03–21తో పూర్తయ్యే సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేయడానికి గడువు తేదీ 31–07–21. తర్వాత రెండు సార్లు పొడిగించారు. 31–12–2021 తర్వాత పెనాల్టీతో వేసుకోవ చ్చు. ఆ గడువు కూడా 31–03–22తో ముగు స్తుంది. ఈ గడువు దాటితే ఇక రిటర్ను వేయలేరు. రిటర్ను వేయకపోతే ఏర్పడే నష్టాలు మీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకుండా నడుం కట్టండి. రిటర్నులు దాఖలు చేయండి. ► అడ్వాన్స్ ట్యాక్స్ 15–03–2022 లోపల చెల్లించాలి. నాలుగు విడతల్లో జూన్ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే వడ్డీ పడుతుంది. అశ్రద్ధ వద్దు. 15–03–22 లోపల చెల్లించకపోయినా కనీసం 31–03–22 లోగా చెల్లించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ తగ్గుతుంది. రెండోది రిటర్నులు వేసే వరకు ఆగకుండా రుణం కోసమో వీసా కోసమో ఈ చలాన్లను బట్టి మీ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. ► ఇక ప్లానింగ్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్లు.. సేవింగ్స్.. చెల్లింపులు మొదలైనవి చేయవచ్చు. 80సి కింద ఏ ప్రయోజనం పొందాలన్నా 31–03–22 లోపల చెయ్యాలి. గత 4 వారాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న .. ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ..సేవింగ్స్..వివరాలు మీకు తెలియజేశాము. బ్యాంకులో డిపాజిట్ చేయండి. మదుపు ఖాతా జమలు మీ ఖాతాలో ఖర్చు పడేలా తొందరపడండి. కొన్ని క్లెయిమ్లను చెల్లించడం జరిగితేనే మినహాయింపు పొందగలరు .. మరిచిపోతే ప్రయోజనం ఉండదు. మెడిక్లెయిమ్ .. డొనేషన్లు ఇలా ఎన్నో ఉంటాయి. త్వరపడండి. ► ఇక నాలుగోది.. పాన్తో ఆధార్ అనుసంధానం. ఎన్నో గడువు తేదీలు..ఎన్నో సార్లు వాయిదాలు ఇచ్చారు. ఇక వెయిట్ చేయవద్దు. అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. పెన్షన్, స్కాలర్షిప్, గ్యాస్ సబ్సిడీ ఈ కోవకి వస్తాయి. దీన్ని పాటించకపోతే సెక్షన్ 272బి ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా కేవైసీ పథకం కింద గడువు తేదీ 31–3–22 అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్, మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఈ మధ్య ఎందరో ప్రముఖులు, సినీ హీరోలు .. ఈ చట్టప్రకారం శిక్షార్హులయ్యారు. అశ్రద్ధ వద్దు. కేవైసీ కాగితాలు సమర్పించండి. ఇవన్నీ పూర్తి చేసి.. ప్రశాంతంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడదాం. -
కోలుకుంటున్న ఖజానా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం దీనిని సూచిస్తోంది. ఆర్థిక మందగమనంతో 2019–20లో రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ తర్వాత ఏడాది 2020–21లో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి నేరుగా నగదు బదిలీ చేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఈ ఆర్థిక ఏడాది 2021–22లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర సొంత ఆదాయం రూ.73,690 కోట్లకు చేరుతుందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషించింది. అయితే, 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం రూ.57,601 కోట్లు రాగా ఆ మరుసటి సంవత్సరం 2020–21లో రూ.57,427 కోట్లు మాత్రమే వచ్చిందని పేర్కొంది. అంటే.. 2019–20లో వచ్చిన ఆదాయం కూడా 2020–21లో రాలేదు. ప్రధానంగా లాక్డౌన్లో రవాణా ఆంక్షల కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2021–22లో అమ్మకం పన్నుతో పాటు ఎస్జీఎస్టీ, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రంగాలన్నింటిలో ఆదాయం పెరుగుదల నమోదైనట్లు సర్వే పేర్కొంది. అలాగే.. పన్నేతర ఆదాయం కూడా పెరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది. 2019–20లో పన్నేతర ఆదాయం రూ.3,315 కోట్లు రాగా 2020–21లో రూ.3,395 కోట్లు వచ్చింది. 2021–22లో సవరించిన అంచనాల మేరకు రూ.5,451 కోట్లు వస్తుందని అంచనా వేసింది. -
పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోండిలా?
మీరు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఈ సందర్భంగా మీరు ట్యాక్స్ సేవ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెక్షన్ 80సీ కాకుండా సెక్షన్ 80డీ కింద అదనంగా మరో రూ.1లక్ష వరకు అదా చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించడానికి 2022 మార్చి,31చివరి తేదీ. అయితే ఈ ట్యాక్స్ చెల్లింపు సందర్భంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి వరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 80సీతో పాటు సెక్షన్ 80డీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీలో వయస్సు ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు మీరు తీసుకున్నహెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై సెక్షన్ 80సీ పరిమితి కంటే ఎక్కువ మీకు అదనపు పన్ను ప్రయోజనాల్ని పొందవచ్చు. మీరు,మీ తల్లిదండ్రులు 60ఏళ్లు పైబడిన వారు అంటే సీనియర్ సిటిజన్లు అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ను తీసుకోవడం ద్వారా మీరు రూ.1లక్ష వరకు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేకం ఉన్నాయి. మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నా పన్ను ఆదా చేసుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం 961లోని సెక్షన్ 80డీ కిందకు వస్తుంది. ఇందులో గరిష్ట పన్ను ప్రయోజనం రూ.25,000 లేదా రూ.50,000 మాత్రమే. అయితే వాస్తవ పన్ను ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నిర్దిష్ట వయస్సు కంటే ఎక్కువ ఉంటే మీరు పొందే మొత్తం మినహాయింపు సుమారు రూ.లక్షరూపాయలు. ఆరోగ్య బీమా ప్రీమియం 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 25,000 వరకు, 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50,000 వరకు పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం (కనీసం 60 సంవత్సరాలు) ఆరోగ్య బీమా ప్లాన్ను కొనుగోలు చేయాలనుకుంటే, మొత్తం పన్ను ప్రయోజనాన్ని రూ.75,000 వరకు పొందవచ్చు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే, గరిష్టంగా రూ.1,00,000 వరకు మినహాయింపు పొందవచ్చు” అని క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ,సీఈఓ పంకజ్ అరోరా చెప్పారు. చెల్లించిన ప్రీమియం మీ స్థూల మొత్తం ఆదాయాన్ని సమాన మొత్తానికి తీసుకువస్తుంది. తద్వారా మీ పన్ను బాధ్యత తగ్గుతుంది. -
ప్రభావం చూపని ఒమిక్రాన్, వృద్ధి సాధించనున్న హౌసింగ్ ఫైనాన్స్
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. ►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి. ►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది. -
జనవరి 18లోగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2022–23కి బడ్జెట్ ప్రతిపాదనల అంచనాలను ఈ నెల 18లోగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ విభాగాలు అంచనాలను ఈ నెల 17లోగా సంబంధిత శాఖ కార్యదర్శికి సమర్పించాలని కోరింది. 2021–22కి సవరించిన బడ్జెట్ అంచనాలనూ సమర్పించాలంది. ఈ అంచనాల్లో కేటాయింపుల పెంపును అంగీకరించమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులిచ్చారు. బడ్జెట్ అంచనాల సమర్పణలో జాప్యం ఉండొద్దని, జాప్యమైతే మార్పులకు సమయం లభించడం లేదన్నారు. గడువులోగా ప్రతిపాదనలు సమర్పించకుంటే సంబంధిత శాఖకు పథకాల అమలుకు ఆర్థిక శాఖ నిధులు కేటాయించదన్నారు. తదనంతర పరిణామాలకు సదరు శాఖదే బాధ్యతని చెప్పారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనల స్వీకరణ ప్రారంభమయింది. -
డీఆర్డీఏలకు కేంద్రం మంగళం!
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు ఉద్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డీఆర్డీఏల నిర్వహణకు నిధులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో వీటిలో పనిచేస్తున్న సిబ్బంది సంకట స్థితిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, వేర్వేరుగా అమలు చేసే పలు సంక్షేమ పథకాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అవి క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చూడటం వీటి బాధ్యత. 1999లో ఏర్పాటైన డీఆర్డీఏలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. వీటిలో 230 మందికి పైగా సిబ్బంది కాంట్రాక్టు, తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల గ్రామీణ మహిళల పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పింఛన్ల పంపిణీ వంటి పథకాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేసే డీఆర్డీఏల నిర్వహణ, సిబ్బంది జీతాల నిధులను కేంద్రమే ఇస్తోంది. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ అన్ని రాష్ట్రాలకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఈ ఉద్యోగులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే వివిధ విభాగాల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
స్టీల్ప్లాంట్ టర్నోవర్ రూ. 17,980 కోట్లు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్ప్లాంట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,980 కోట్లు టర్నోవర్ సాధించింది. దీంతో గత ఏడాది కంటే 14 శాతం వృద్ధి సాధించినట్టయింది. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వివరాలను ప్రకటించారు. స్టీల్ప్లాంట్ ఏజీఎంలో పాల్గొన్న సీఎండి, డైరెక్టర్లు సంస్థ ఉత్పత్తులు,ఎగుమతులు 0.497 మెట్రిక్ టన్నుల నుంచి 1.308 మెట్రిక్ టన్నులకు పెరిగాయన్నారు. గత ఏడాది కంపెనీ నికర నష్టం రూ.3,910 కోట్లు కాగా ఈ ఏడాది రూ.789 కోట్లకు తగ్గిందన్నారు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20 శాతం కాగా ఈ ఏడాది 24 శాతానికి పెరిగాయన్నారు. సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అండర్ సెక్రటరీ సుభాష్ కుమార్, స్టీల్ప్లాంట్ డైరెక్టర్లు వి.వి.వేణుగోపాలరావు, డి.కె. మహంతి, కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ సీతా సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి -
జీఈఎం ద్వారా రూ.1,500 కోట్లు: బీహెచ్ఈఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది. ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది. చదవండి: భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో.. -
సర్వే: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం
ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు. ► మొత్తం జీఎస్డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం. ► 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది. ► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. ► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది. ► తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది. అధిక ద్రవ్యోల్బణం, బేస్ పెంపు ద్వారా జీఎస్టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది. ► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్ రేటింగ్స్ ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్ రేటింగ్స్ పేర్కొంది. చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
వేగవంతమైన వృద్ధిపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుసగా గత తొమ్మిదేళ్ల నుంచి లాభాల బాటలో ఉన్న ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైన వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అత్యంత సంపన్న వ్యక్తులు (హెచ్ఎన్ఐ) సహా వివిధ వర్గాలకు అనువైన పథకాలను రూపొందిస్తోంది. ‘‘2002 నుంచి ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పాలసీదారులకు బోనస్లు ఇస్తున్నాం. పాలసీదారులను ఆకర్షించడానికి ఇది ఒక కీలకాంశం కాగలదు. దీంతో పాటు వినూత్న పాలసీలు ప్రవేశపెడుతున్నాం. ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్ పేరిట కొత్తగా గ్యారంటీడ్ సేవింగ్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉంటూ మెరుగైన రాబడులు కోరుకునే వారికి ఇది అనువైన పథకం. వివిధ కేటగిరీల్లో పథకాల మేళవింపును మెరుగుపర్చుకుంటున్నాం‘ అని కంపెనీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ‘మా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి పరిశ్రమలో మెరుగ్గా 98.54 శాతం స్థాయిలో ఉంటోంది. క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు మేము కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. గడిచిన 3–4 సంవత్సరాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం, ఈ–సేల్స్ వంటి సాధనాలపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టపర్చుకున్నాం. కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, పాలసీల విక్రయ ప్రక్రియను సత్వరం పూర్తి చేసేందుకు మా సేల్స్ బృందాలు, భాగస్వాములకు తోడ్పడేలా డేటా, డిజిటైజేషన్ సామర్థ్యాలను పటిష్టం చేసుకున్నాం’’ అని ఆయన తెలిపారు. 800 కోవిడ్ క్లెయిములు .. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పట్నుంచి కోవిడ్–19కి సంబంధించి 800 క్లెయిమ్స్ వచ్చాయని, వాటన్నింటిని సాధ్యమైనంత వేగంగా సెటిల్ చేశామని అగర్వాల్ వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 582 వ్యక్తిగత కోవిడ్–19 క్లెయిమ్లు, 147 గ్రూప్ క్లెయిమ్లు వచ్చాయని, వాటన్నింటిని సెటిల్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మే నెల దాకా 38 వ్యక్తిగత క్లెయిమ్లు, 6 గ్రూప్ క్లెయిమ్లు వచ్చినట్లు తెలిపారు. మార్చి ఆఖరు నాటి దాకా కోవిడ్–19 క్లెయిమ్ల సెటిల్మెంట్ కింద దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లు అగర్వాల్ వివరించారు. మారిన పంపిణీ వ్యవస్థ.. కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని అగర్వాల్ తెలిపారు. సాంప్రదాయ విధానాల నుంచి డిజిటల్ వ్యవస్థ వైపు బీమా సంస్థలు మారుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో తమ సంస్థకు సంబంధించి ఈ–సేల్స్ పేరిట డిజిటల్ ప్లాట్ఫాం తయారు చేసుకున్నామని, ప్రస్తుతం కొత్త ప్రపోజల్స్లో 95 శాతం భాగం దీని ద్వారానే లాగిన్ అవుతున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. లాగిన్ దగ్గర్నుంచి పాలసీ జారీ అయ్యే దాకా ఈ విధానంతో పారదర్శకత, సమర్థత పెరిగిందని, మధ్య కాలికం నుంచి దీర్ఘకాలికంలో వ్యయాలను నియంత్రించుకోవడానికి కూడా ఇది దోహదపడగలదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్ల ఆదాయాలు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సేల్స్ బృందాలకు డిజిటల్ సాధనాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. సరైన పథకాలను అందించడం ద్వారా జీవిత బీమా రంగంలో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడంలో ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తుంటారని, ఈ నేపథ్యంలో డిజిటల్ విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్నా సాంప్రదాయ పంపిణీ విధానాలు కూడా కొనసాగుతాయని వివరించారు. -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్వేవ్లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
బీఎస్ఎన్ఎల్: ఆశ్చర్యకరమైన పరిణామాలు!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ఆశ్చర్యకర ఫలితాల్ని చవిచూస్తోంది. 4జీ సర్వీసులు లేకున్నా.. ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. సబ్ స్క్రయిబర్ షేర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం. బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. 2016-2017 మధ్య బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ 8.6 శాతంగా ఉండగా, 2017-18కి 9.4 శాతం, 2018-19కి 9.9 శాతం, 2019-2020 నాటికి 10 శాతానికి చేరింది. ఇక 2020-2021కి(మార్చి 21, 2021) స్వల్పంగా పెరిగి.. 10.3 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. డాటా వినియోగం, టెలికామ్ సెక్టార్లో పోటీ వల్ల టారిఫ్లలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. 4జీ సర్వీసులు లేకపోవడం బీఎస్ఎన్ఎల్కు ప్రతికూలంగా మారాయని టెలికాం నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU)పై మాత్రం ప్రభావం పడేలా చేస్తోంది. 4జీ ఎందుకు లేట్ అంటే.. లోకల్ ఎక్విప్మెంట్లు, తగిన సాంకేతికత లేకపోవడం బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతూ వస్తోంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 4జీ స్పెక్ట్రమ్ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. హాట్ న్యూస్: మీ ఫోన్లో ఈ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి నష్టాల్ని ఇలా తగ్గించుకుంది పీఎస్యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. మరోపక్క ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా-బీఎస్ఎన్ఎల్ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కొందరు తెర మీదకు తెస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరిధిలో మాత్రం అలాంటి ఆలోచనేం కనిపించడం లేదు. -
స్పైస్జెట్కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
నిధుల సమీకరణలో ప్రభుత్వ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీలు) గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో నిధులను సమకూర్చుకోవడంలో దూకుడు ప్రదర్శించాయి. వెరసి రుణాలు, ఈక్విటీ మార్గాలలో దాదాపు రూ. 58,700 కోట్లు సమీకరించాయి. ఒక ఏడాదిలో ఇది సరికొత్త రికార్డు కాగా.. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులను పెంపొందించుకోవడంలో బ్యాంకులు జోరు చూపాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 2,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ప్రయివేట్ ప్లేస్మెంట్) రూ. 3788 కోట్లు చొప్పున అందుకున్నాయి. క్విప్లు విజయవంతంకావడం పీఎస్బీల పట్ల దేశ, విదేశీ ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 12 పీఎస్బీలు రికార్డుకు తెరతీస్తూ టైర్–1, టైర్–2 బాండ్ల జారీ ద్వారా గతేడాది రూ. 58,697 కోట్లు సమీకరించాయి. సంస్కరణల ఎఫెక్ట్ గుర్తింపు, రుణ పరిష్కారాలు, కొత్తపెట్టుబడులు వంటి పలు ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) తగ్గడంతోపాటు.. లాభాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా పీఎస్బీల ఎన్పీఏలు రూ. 6,16,616 కోట్లకు తగ్గాయి. 2020లో ఇవి రూ. 6,78,317 కోట్లుకాగా.. 2019లో రూ. 7,39,541 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి 84 శాతానికి బలపడింది. గత ఐదేళ్లలోలేని విధంగా ప్రభుత్వ బ్యాంకుల లాభాలు రూ. 31,816 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించినప్పటికీ పటిష్ట పనితీరును కనబరిచాయి. 2020లో నమోదైన రూ. 26,015 కోట్ల నష్టాల నుంచి ఈ స్థాయి టర్న్అరౌండ్ను సాధించడానికి మొండి రుణ సవాళ్లను అధిగమించడం సహకరించింది. ఎన్పీఏల నియంత్రణ, రికవరీ చర్యలు ఇందుకు తోడ్పాడునిచ్చాయి. గత ఆరేళ్లలో పీఎస్బీలు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయడం గమనార్హం. ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా. -
ఐటీసీ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 30 శాతంపైగా ఎగసి రూ. 3,343 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 36 శాతం జంప్చేసి రూ. 14,241 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం 28 శాతంపైగా పెరిగి రూ. 10,220 కోట్లను తాకాయి. కోవిడ్–19 సెకండ్ వేవ్లోనూ వివిధ విభాగాలు పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ పేర్కొంది. విభాగాల వారీగా ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ 24 శాతం వృద్ధితో రూ. 9,534 కోట్లను అధిగమించింది. సిగరెట్ల విభాగం 34 శాతం పుంజుకుని రూ. 5,803 కోట్లకు చేరింది. కాగా.. ఎఫ్ఎసీజీ ఇతర విభాగంలో బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, డైరీ, పానీయాలు, స్టేషనరీ తదితరాల టర్నోవర్ 10 శాతంపైగా బలపడి రూ. 3,731 కోట్లను తాకింది. హోటళ్ల ఆదాయం ఐదు రెట్లు ఎగసి రూ. 134 కోట్లకు చేరింది. -
ఐటీ స్టాక్స్ జోరు, లాభాల్లో ఎల్అండ్టీ టెక్నాలజీ షేర్లు
ముంబై: ఎల్అండ్టీ అనుబంధ సంస్థ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. కంపెనీ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.117 కోట్ల నుంచి రూ.216 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.1,562 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 17.3 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి 2021–22లో 15–17 శాతం మధ్య ఉండొచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. ‘‘యూఎస్, యూరోప్లో (ఈ రెండు ప్రాంతాల నుంచి 80 శాతం ఆదాయం) దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జపాన్, భారత్లోనూ సాధారణ పరిస్థితులు ఏర్పడనున్నాయి’’ అని కంపెనీ సీఈవో, ఎండీ అమిత్చద్దా తెలిపారు. బీఎస్ఈలో కంపెనీ షేరు 3 శాతం లాభపడి రూ.2,910 వద్ద క్లోజయింది. చదవండి : వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది -
నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్లకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్)ను రూ. 5 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్ నెం: 13 జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల వారీగా ఈ నిధులను వెచ్చించేందుకు గాను త్వరలోనే మార్గదర్శకత్వాలు విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి, ప్రస్తుత జిల్లాల వారీగా రాష్ట్ర మంత్రి వర్గంలోని 16 మంది పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆయా జిల్లాల పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్సీల వివరాలను ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొన్నారు. చదవండి: షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియ -
వేతన జీవులూ.. జర జాగ్రత్త!
► వేతన జీవులకు జీతభత్యాల మీద వారి యజమాని ప్రతి నెలా టీడీఎస్ కొంత చేసి, ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. అలా జమ చేసిన తర్వాత ఆ సమాచారం అంతా ఫారం 26 ఏఎస్లో పొందుపర్చబడుతుంది. ఇందులో ఎప్పటికప్పుడు సమాచారం చేరుస్తుంటారు. ముందుగా ఉద్యోగస్తులు వారి ఆదాయ వివరాలు, సేవింగ్స్ వివరాలు ఇవ్వాలి. యజమాని నికర ఆదాయాన్ని లెక్కించి, పన్ను భారం లెక్కించి పన్నెండు సమాన భాగాలుగా ప్రతి నెలా జమ చేయాలి. కానీ అలా జరగడం లేదు. బదులుగా చివరి 3-4 నెలల్లో చేస్తున్నారు. జీతం, పెన్షన్ మీద టీడీఎస్ వర్తింపచేయడం జరుగుతుంది. జాగ్రత్తగా సమాచారం ఇవ్వండి. ► ఉద్యోగి తనకి వచ్చే ఇతర ఆదాయపు వివరాలు యజమానికి తెలియజేస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించి, రికవరీ చేయాలి. ► ఏదైనా కారణం వల్ల వేతన జీవులు ఇతర ఆదాయం గురించి యజమానికి చెప్పలేకపోయిన పక్షంలో వారే స్వయంగా అలాంటి ఆదాయాలన్నింటినీ లెక్కించి, జీతం మీద ఆదాయంతో కలిపి మొత్తం పన్ను భారాన్ని లెక్కించాలి. అందులో నుంచి టీడీఎస్ని తగ్గించి, మిగతా భారాన్ని 2022 మార్చిలోగా చెల్లించాలి. ► జీతం కాకుండా వేతన జీవులకి బ్యాంకు వడ్డీ, ఫిక్సిడ్ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రావచ్చు. ఇలాంటి ఆదాయం మీద కేవలం 10 శాతం టీడీఎస్ వర్తింపచేస్తారు. మీరు శ్లాబును బట్టి అదనంగా 10 శాతం నుంచి 20 శాతం దాకా చెల్లించాల్సి రావచ్చు. ► అలాగే ఇంటి అద్దె. దీని మీద టీడీఎస్ జరగవచ్చు లేదా జరగకపోనూ వచ్చు. ఒకవేళ జరిగినా నిర్దేశిత స్థాయి పన్ను భారానికి సరిపోకపోవచ్చు.. తేడా ఉండొచ్చు. అటువంటి తేడాలేమైనా ఉంటే సకాలంలో చూసుకుని పన్నుని చెల్లించాలి. ► క్యాపిటల్ గెయిన్స్ని ఉదాహరణగా తీసుకుంటే.. కొన్ని సందర్భాల్లోనే టీడీఎస్ వర్తిస్తుంది. (అమ్మకపు విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ చేయాలి) వేతన జీవులు స్వయంగా వాళ్ల క్యాపిటల్ గెయిన్స్ లెక్కించి పన్ను భారం చెల్లించాలి. లావాదేవీ జరిగిన తేదీ తర్వాత వచ్చే త్రైమాసికంలో పన్ను చెల్లించాలి. అలా చేయకపోతే వడ్డీ చెల్లించాలి. ► ఇంకేదైనా ఇతర ఆదాయం కూడా ఉండి ఉండవచ్చు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ► అడ్వాన్స్ ట్యాక్స్ వర్తించే పరిస్థితి వస్తే.. ప్రతి మూడు నెలలకు అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదాల ప్రకారం చెల్లించేయాలి. గడువు తేదీ దాటితే కొన్ని సందర్భాల్లో వడ్డీ పడుతుంది కాబట్టి మీ సంవత్సర ఆదాయాన్ని సేవింగ్స్ను ముందుగా లెక్కించండి. నికర ఆదాయం మీద పన్ను భారాన్ని టీడీఎస్ ద్వారా, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు! -
ముగింపులో అదర గొట్టిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లోముగిసాయి. కొత్త ఆర్థిక సంసంవత్సర ఆరంభంలోనే భారీగా ఎగిసిన సూచీలు ముగింపును కూడా అదరగొట్టేశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగినా వారాంతంలో పాజిటివ్గా ముగిసాయి. చివరి గంటలో పుంజుకుని కీలక మద్దతు స్థాయిలకుఎగువన ముగియం విశేషం. సెన్సెక్స్ 520 పాయింట్లు ఎగిసి 50029వద్ద,నిప్టీ 177 పాయింట్లలాభంతో 14867 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా టాటా స్టీల్ 6 శాతానికిపైగా ఎగిసింది. దీంతో సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ తిరిగి లక్ష కోట్ల రూపాయలకు చేరింది. జూన్,2008 తర్వాత ఆ స్థాయి ధరకి చేరడంతో 12ఏళ్ల నాటి గరిష్టానికి షేరు చేరింది.ఆస్ట్రేలియాలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కొనుగోలుతో విప్రో షేర్లు దాదాపు 5 శాతం ర్యాలీ అయ్యాయి. ఇండస్ఇండ్, కోటక్మహీంద్ర, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు, బజాజ్ ఫైనాన్స్,సన్ఫార్మ టాప్ గెయినర్స్గా నిలిచాయి., మరోవైపు హెచ్యూఎల్, టీసీఎస్ నెస్లే, టైటన్, టెక్ మహీంద్ర స్వల్పంగా నష్టపోయాయి. -
ఆరేళ్లలో ఆరు లక్షల కోట్లు.. కార్పొరేట్లకు మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరేళ్ళలో దేశంలోని కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపుల రూపంలో రూ.6,07,583.04 కోట్లను మినహాయించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ కెకె రాగేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,176.50 కోట్లు, 2016–17లో రూ.1,30,184.41 కోట్లు, 2017–18లో రూ.1,20,069.67 కోట్లు, 2018–19లో రూ.1,25,891.78 కోట్లు, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,16,260.68 కోట్లు దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయిం పులు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చట్టం ప్రకారమే.. ఆదాయ పన్ను చట్టం–1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపులిచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఒక నిర్దిష్ట రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి లేదా ప్రాంతీయ అసమాన పరిస్థితులను తగ్గించడానికి సాధారణంగా పన్ను ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రాంతాలలో వివిధ పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆయా పెట్టుబడిదారులు ఈ పన్ను మినహాయింపులను వినియోగిస్తారని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. -
నిధులెట్లా.. 2021–22 బడ్జెట్ కూర్పుపై సీఎం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకునే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా దెబ్బకు కకావికలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఏడాది అవసరాలకు తగినట్టు నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ వర్గాలు, సలహాదారులతో సమావేశమైన ఆయన ఈ వారంలో కీలక భేటీలు జరుపుతారని, వచ్చే నెలలోపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన వార్షిక బడ్జెట్ (2021–22)పై అధికారులకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ భేటీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, కష్టకాలంలోనూ కేంద్ర సాయం అరకొరగా ఉన్న నేపథ్యంలో సొంత ఆదాయం పెంచుకునేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలు, వచ్చే ఏడాది కొత్త కార్యక్రమాల అమలుకు అవసరమయ్యే, అనివార్య ఖర్చుల కింద వెచ్చించాల్సిన మేరకు కావాల్సిన నిధులను సమకూర్చుకునే అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్) రూ.95 వేల కోట్లు కావాల్సిందే.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించాల్సి ఉంది. దీంతో పాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు వేతన సవరణ లాంటి కచ్చితంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పింఛన్లు, అప్పుల కింద కట్టాల్సిన మొత్తం, వడ్డీ చెల్లింపుల కింద రూ.45 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. రైతు బంధు, ఆసరా పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, గొర్రెల పంపిణీ లాంటి సంక్షేమ కార్యక్రమాలకు రూ.50 వేల కోట్లు తప్పనిసరిగా కావాల్సిందే. వీటికి తోడు నిరుద్యోగ భృతి అమలు చేస్తే రూ.5 వేల కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇస్తారన్న దాన్ని బట్టి కనీసం మరో రూ.5 వేల కోట్లు అవసరముంటాయి. ఇటు ప్రభుత్వ నిర్వహణ, రెవెన్యూ ఖర్చు, అత్యవసర కార్యక్రమాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని నిధులు అవసరం కానున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా కనిపిస్తోంది. వీటన్నింటికీ కలిపి కనీసం రూ.1.50 లక్షల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొత్తం ఆదాయం, అప్పుల అంచనాలను బట్టి ఈ మేరకు వచ్చే ఏడాది బడ్జెట్ను రూపొందించేందుకు సీఎం దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. విలువల సవరణ.. భూముల అమ్మకాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు ఏంటన్నవి ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన గత రెండేళ్లుగా అమలు కావడం లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సవరించాల్సిన భూముల రిజిస్ట్రేషన్ల విలువలు ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సవరించలేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై నిర్ణయాల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ.80 వేల కోట్ల వరకు వచ్చే అవకాశముండటం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల కింద మరో రూ.25 వేల కోట్ల వరకు వచ్చినా, మిగిలిన నిధులను సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములాగానే మారనుంది. ఇక, అప్పులు చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాబడులకు తోడు భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ విలువల సవరణ ద్వారా మరో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో జరిగే భేటీల్లో సీఎం సమీక్షలో చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకుపోతుందో వేచి చూడాల్సిందే..! -
ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3,950 కోట్ల ఆదాయం
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అడిషనల్ ఐజీ ఎం.ఉదయభాస్కరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం తమ శాఖ ఆదాయ లక్ష్యం సుమారు రూ.6,336 కోట్లుగా తెలిపారు. అంతకు ముందు డిసెంబర్ నెలలో సుమారు రూ.421 కోట్ల ఆదాయం వస్తే, గతేడాది డిసెంబర్లో రూ.599 కోట్లు వచ్చిందని ఉదయభాస్కరరావు వెల్లడించారు. -
ఐఆర్సీటీసీకి రూ.25 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రూ.25 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో రూ.72 కోట్ల నికర లాభం వచ్చిందని ఐఆర్సీటీసీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం, లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.459 కోట్ల నుంచి 71 శాతం పతనమై రూ.131 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. టూరిజం విభాగం ఆదాయం రూ.48 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గిందని తెలిపింది. కేటరింగ్ విభాగం ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.90 కోట్లకు, రైల్నీర్ ఆదాయం రూ.58 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గాయని పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్ల డెడ్లైన్ 14 వరకూ పొడిగింపు ఐఆర్సీటీసీలో 15–2 శాతం వాటాను కేంద్రం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)మార్గంలో విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను సమర్పించడానికి గడువు తేదీని ఈ నెల 10 నుంచి మరో నాలుగు రోజులు... .ఈ నెల 14 వరకూ పొడిగించింది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి 87.40 శాతం వాటా ఉంది. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఐఆర్సీటీసీ వాటా విక్రయం ఒకింత తోడ్పడుతుందని అంచనా. కేంద్రం ఇటీవలనే హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. మర్చంట్ బ్యాంకర్ల గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 0.2% లాభంతో రూ. 1,374 వద్ద ముగిసింది. -
హీరో మోటోకార్ప్ లాభం రూ.621 కోట్లు
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్అలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,885 కోట్ల నుంచి 21 శాతం పతనమై రూ.6,235 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం, ఆదాయాలు తగ్గాయని వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.25 తుది డివిడెండ్ను ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. వాహన అమ్మకాలు 25 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17.81 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు గత క్యూ4లో 13.35 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు స్పల్ప లాభంతో రూ.2,386 వద్ద ముగిసింది. -
కొత్త ఏడాది : కీలక సూచీలు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించింది. అనంతరం నష్టాల్లోంచి మరింత బలహీనపడింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 722 పాయింట్ల నష్టంతో 28745 వద్ద, నిప్టీ 209 పాయింట్లు పతనమై 8381 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 29వేల దిగువకు చేరగా, నిఫ్టీ 84 వేల స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉండగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్లు లాభపడుతున్నాయి. అలాగే గత 2 రోజులుగా నష్టాల్లో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్లో షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. ఎస్ బ్యాంకు పది శాతం ఎగసింది. బ్రిటానియా, సిప్లా, హెచ్యూఎల్, నెస్లేలు నిఫ్టీ లాభపడుతుండగా, కోటక్ మహీంద్రా, ఒఎన్జీసీ, అదాని పోర్ట్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్లు టాప్ లూజర్స్గా ఉన్నాయి. కాగా ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. -
ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2019 నుంచీ ప్రారంభమై మార్చి 2020తో ముగిసే 2019–2020 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు అంటే జూన్ నెలాంతం వరకూ పొడిగించినట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక వివరణాత్మక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం పొడిగింపు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ 30వ తేదీన ఇండియన్ స్టాంప్స్ యాక్ట్లో కొన్ని సవరణలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. ‘‘స్టాక్ ఎక్సే్చంజీలు లేదా క్లీనింగ్ కార్పొరేషన్ల ద్వారా జరిగే సెక్యూరిటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ల లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ వసూళ్లకు 2020 ఏప్రిల్ 1 నుంచీ పటిష్ట యంత్రాంగం అమల్లో ఉంటుందని గత నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యంత్రాగం అమలును 2020 జూలై 1వ తేదీ వరకూ వాయిదా వేయడం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి 30వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి’’ అని ఆర్థికశాఖ ప్రకటన మంగళవారం వివరణ ఇచ్చింది. -
ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదు : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుందనే వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది. యథావిధిగా ఈ ఆర్థిక సంవత్సరం 31.3.2020 తో ముగుస్తుందని తెలిపింది. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదని, మార్చి 31 తో ముగియనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత స్టాంప్ చట్టంలో చేసిన మరికొన్ని సవరణలకు సంబంధించి 2020 మార్చి 30న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఆర్థిక సంవత్సరం పొడిగింపు లేదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. కరోనా కల్లోలం కారణంగా కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని3 నెలలు పొడిగించిందంటూ వార్తలు వెలువడ్డాయి. 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుందని సూచించాయి. అయితే ఈ అంచనాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగియనున్న నేపథ్యంలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాల ఫైలింగ్ ను, ప్యాన్-ఆధార్ లింకింగ్ గడువున, జీఎస్టీ ఫైలింగ్ లాంటి కొన్ని అంశాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. (చదవండి : తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?) -
ఐడియా నష్టాలు 6,439 కోట్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ చెప్పారు. మరిన్ని వివరాలు..... 30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు... గత క్యూ3లో రూ.11,983 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం పతనమై రూ.11,381 కోట్లకు తగ్గింది. వడ్డీ వ్యయాలు 30 శాతం ఎగసి రూ.3,722 కోట్లకు, తరుగుదల వ్యయాలు 23 శాతం వృద్ధితో రూ.5,877 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్గా చూస్తే, ఈ కంపెనీ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.50,922 కోట్ల నికర నష్టాలను కంపెనీ ప్రకటించింది. ఏజీఆర్ బకాయిల కేటాయింపుల కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. టారిఫ్ల పెంపుతో మెరుగుపడుతున్న ఆదాయం.... ఏజీఆర్కు సంబంధించిన ఊరటనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని రవీందర్ టక్కర్ పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కెపాసిటీ విస్తరణ, 4జీ కవరేజ్, నెట్వర్క్ ఇంటిగ్రేషన్పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇటీవల టారిఫ్లను పెంచడం వల్ల సెప్టెంబర్ నుంచి ఆదాయం పుంజుకుంటోందని పేర్కొన్నారు. గత డిసెంబర్లో టారిఫ్లను మరింతగా పెంచడం వల్ల ఆదాయం మరింతగా మెరుగుపడగలదని వివరించారు. కాగా వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.53,000 కోట్ల మేర ఉన్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 0.6 శాతం నష్టంతో రూ.4.48 వద్ద ముగిసింది. -
‘లోటు’ పెరిగినా.. వృద్ధికే ఓటు!
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21లో 6–6.5 శాతానికి పుంజుకోవచ్చని 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో పట్టువిడుపుగా వెళ్లాలని.. ప్రజలు ఓటుతో ఇచ్చిన బలమైన తీర్పును సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు వినియోగించుకోవాలని.. భారత్ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా (అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్) మార్చాలని.. ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలని.. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు అవసరమని.. సంపద, ఉద్యోగ సృష్టికర్తలు అయిన వ్యాపారస్తులను గౌరవంగా చూడాలనే సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 ఆర్థిక బడ్జెట్ను శనివారం పార్లమెంట్చు సమర్పించనున్న విషయం తెలిసిందే. దీనికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ద్రవ్యలోటు పరంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామని గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. కానీ, కార్పొరేట్ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు 3.8 శాతానికి చేరుతుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధి రేటును బలంగా పైకి తీసుకురావడమే ప్రాధాన్యమైన అంశంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్య సవరణను పరిశీలించొచ్చని సూచించింది. రూ.1.84 లక్షల కోట్ల మేర ఉన్న ఆహార సబ్సిడీలను తగ్గించుకోగలిగితే ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ప్రభుత్వం తన ఖర్చులను స్థీరీకరించుకోవచ్చని, పలు దేశాలు గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని పేర్కొంది. మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు.. రెవెన్యూ వ్యయాలను తగ్గించుకోవడంతోపాటు మూలధన వ్యయాలను పెంచుకోవడం ద్వారా ఆస్తులను సృష్టించుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణకు సాయంగా నిలవడం ద్వారా పెట్టుబడుల ఆధారిత వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. వ్యాపార నిర్వహణను సులభంగా చేసేందుకు వీలుగా.. పోర్టుల్లో ఎగుమతులు పెంచేందుకు రెడ్ టేపిజం (అధిక నియంత్రణలతో కూడిన విధానాలు)ను తొలగించాలని సూచించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరేందుకు మౌలిక రంగంలో కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. ‘‘మౌలిక రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. విద్యుత్ కోతలు, చాలీ చాలని రవాణా సదుపాయాలు అధిక వృద్ధి సాధన దిశగ అవరోధంగా నిలుస్తాయి. సాఫీగా, వేగవంతమైన వృద్ధి కోసం భారత్ నాణ్యమైన సదుపాయాల కల్పనకు సకాలంలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి’’ అని ఆర్థిక సర్వే తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు పటిష్టం కావాలి.. అధిక మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామ పరంగా చిన్నగా ఉండడాన్ని సర్వే ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వాటిని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పీఎస్బీలు మరింత సమర్థవంతంగా మారడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేయూతగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్థంగా లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను వినూత్నమైన అవకాశాలను అందుకోలేని వైకల్యంగా మార్చేస్తుందని హెచ్చరించింది. బ్యాంకుల్లో అన్ని కార్యకలాపాలకు ఫైనాన్షియల్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఈసాప్) ఇవ్వడం ద్వారా సమర్థతను పెంచొచ్చని అభిప్రాయపడింది. ‘‘రుణాలకు సంబంధించి నిర్ణయాల్లో, ముఖ్యంగా పెద్ద రుణాల జారీలో బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ను వినియోగించుకునేందుకు జీఎస్టీఎన్ తరహా సంస్థను ఏర్పాటు చేయాలి. రుణ గ్రహీతలను సమగ్రంగా తెలుసుకునేందుకు పీఎస్బీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలి’’ అని సర్వే సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో మెరుగైన ఫలితాలు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్ఈలు) పెట్టుబడుల ఉపసంహరణను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. గతంలో ప్రైవటీకరించిన సీపీఎస్ఈల పనితీరు ఆదాయం, లాభాలు, నికర విలువ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేసింది. గతంలో ప్రైవేటీకరించిన సీపీఎస్ఈల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ముందు పదేళ్లు, ఆ తర్వాత పదేళ్ల కాలంలో వాటి పనితీరును సర్వే అధ్యయనం చేసింది. హిందుస్తాన్ టెలీ ప్రింటర్స్, ఎంఎఫ్ఐఎల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి కొన్ని కంపెనీలు మినహా మిగిలిన వాటి నికర విలువ, స్థూల ఆదాయం, నికర లాభాల మార్జిన్, ఆదాయాల వృద్ధి అన్నది ప్రైవేటీకరణకు ముందు నాటి కాలంలో పోలిస్తే ప్రైవేటీకరణ అనంతరం కాలంలో ఎంతో మెరుగుపడినట్టు సర్వే వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది మొత్తానికి వాటి పనితీరు, ఉత్పాదకతను గణనీయంగా మార్చేసినట్టు తెలిపింది. అధిక లాభదాయకత, సమర్థత పెంపు, మరింత పోటీతత్వం కోసం వేగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంరహరణను చేపట్టాలని సూచించింది. పన్ను కోతతో లాభం పెద్ద కంపెనీలకే.. కార్పొరేట్ పన్నులో గణనీయమైన తగ్గింపుతో ఎక్కువ ప్రయోజనం పెద్ద కంపెనీలకేనని, చిన్న కంపెనీలు అప్పటికే తక్కువ పన్ను రేటు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకునే నాటికే రూ.400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు (దేశంలో 99.1 శాతం ఈ పరిధిలోనివే) 25 శాతం కార్పొరేట్ పన్ను పరిధిలో ఉన్న విషయాన్ని సర్వే ప్రస్తావించింది. అంటే కేవలం 0.9 శాతం కంపెనీలు (4,698 కంపెనీలు) రూ.400 కోట్ల టర్నోవర్ పైగా ఉన్నవి. ఇవి చెల్లించే రేటు 30.9 నుంచి 34.61 శాతం మధ్య (సెస్సులు కూడా కలుపుకుని) ఉంది. దీంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు చిన్న కంపెనీలకు 3.2 శాతం నుంచి 13.5 శాతం మేర ప్రయోజనం కలిగిస్తే, పెద్ద కంపెనీలకు 18.5 శాతం నుంచి 27.3 శాతం మధ్య లాభం చేకూర్చినట్టు ఆర్థిక సర్వే వివరించింది. ఇళ్ల ధరలను తగ్గించడం పరిష్కారం! అమ్ముడుపోని ఇళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వీటిని తగ్గించుకునేందుకు నిర్మాణదారులు కొంత మేర ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. రియల్ఎస్టేట్ డెవలపర్లు కొంత మేర హేర్కట్ (నష్టం) భరించి ధరలను తగ్గిస్తే త్వరగా అమ్ముడుపోతాయని పేర్కొంది. బిల్డర్లు ఈ విధంగా చేసినట్టయితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల బ్యాలెన్స్ షీట్లు సానుకూలంగా మారతాయని తెలిపింది. 2015–16 నుంచి వృద్ధి నిలిచిపోయినప్పటికీ, ఇళ్ల ధరలు అధిక స్థాయిల్లోనే ఉన్నట్లు పేర్కొంది. సంపద సృష్టి ద్వారానే.. సంపదను సృష్టించినప్పుడే దాన్ని పంచడం సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. అనుమానంగా చూడడం, సంపద సృష్టికర్తలను (వ్యాపారవేత్తలు) అమర్యాదగా చూడడం మంచిది కాదన్నారు. జీడీపీ వృద్ధి నిదానించడాన్ని వృద్ధి సైకిల్లో భాగంగానే చూడా లన్నారు. 2011 తర్వాత జీడీపీ రేటును 2.7 శాతం అధికం చేసి చూపిస్తున్నారన్న మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. బలమైన సంస్కరణలు కావాలి 2019–20లో జీడీపీ అంచనా వృద్ధి రేటు 5 శాతం నుంచి 2020–21లో 6–6.5 శాతానికి బలంగా పుంజకుంటుందని తాజా ఆర్థిక సర్వే అంచనా వేసింది. సరైన మోతాదులో సంస్కరణలు, ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యం సాధించతగినదే. ఆర్థిక సర్వే అన్నది యూనియన్బడ్జెట్కు ముందస్తు సూచిక. కనుక బలమైన సంస్కరణల చర్యలను ఈసారి బడ్జెట్లో అంచనా వేస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 6–6.5 శాతం వృద్ధి రేటు సవాలే... డిమాండ్ సైకిల్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ ప్రభావం భారత్ సహా అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గతంలో సార్స్ వైరస్ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని చూడాలి. – రణేన్ బెనర్జీ, పీడబ్ల్యూసీ ఇండియా రికవరీ ఆవశ్యకతను చెప్పింది.. బలమైన ఆర్థిక మందగమనం నుంచి వ్యవస్థ రికవరీ అయ్యేందుకు బలమైన సంస్కరణలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది. –నిరంజన్ హిరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ -
‘బిగ్ బాస్కెట్’కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: బిగ్ బాస్కెట్ సంస్థను నిర్వహించే ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగాయి. 2017–18లో రూ.179 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.348 కోట్లకు పెరిగాయి. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,410 కోట్ల నుంచి 69 శాతం వృద్ధితో రూ.2,381 కోట్లకు పెరిగింది. ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ సంస్థ బిగ్ బాస్కెట్నే కాకుండా ‘సూపర్మార్కెట్ గ్రోసరీ సప్లైస్’ పేరుతో హోల్సేల్ విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది. ఆర్థిక ఫలితాల వివరాలను ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ సంస్థ కేంద్ర కంపెనీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. -
వీడియోకాన్ నష్టాలు రూ.6,761 కోట్లు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ నడుస్తున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను ప్రకటించింది. మార్చి, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,761 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సంస్థ తెలిపింది. ఆదాయం భారీగా తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.5,264 కోట్లని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,424 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,063 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,413 కోట్ల రుణాలను రద్దు చేశామని వివరించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లకు వీడియోకాన్ గ్రూప్ బకాయిలు రూ.90,000 కోట్ల మేర ఉంటాయి. -
ఫండ్స్ ఎంపిక ఇలా కాదు..!
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ప్రతి నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్ (క్రమానుగత పెట్టుబడులు) రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ను ఎలా ఎంచుకోవాలనే ప్రాథమిక అవగాహన కొందరిలో ఉన్నప్పటికీ.. ఎంపిక విషయంలో పట్టిపట్టి చూడకూడని, అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. జీవనశైలి, అవసరాలు, రిస్క్ తీసుకునే సా మర్థ్యం ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే, ఫండ్ పనితీరును కూడా ప్రామాణికంగా చూడాల్సి ఉం టుంది. నాణేనికి మరోవైపు అన్నట్టు ఫండ్స్లో పెట్టుబడులకు ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర ముఖ్య అంశాలపై ఆధారపడడం మంచిదని నిపుణుల సూచన. డివిడెండ్ డివిడెండ్ అధికంగా ఇస్తున్నాయని ఫండ్స్ను ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధమైన డివిడెండ్ను పంపిణీ చేయాలన్న హామీ ఉండదు. ఉదాహరణకు మార్కెట్లు పడిపోతే, సంబంధిత ఫండ్ డివిడెండ్ పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసమే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, వస్తున్న లాభాన్ని ఎప్పటికప్పుడు డివిడెండ్ రూపంలో తీసేసుకోవడం మంచి ఆలో చన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లాభాన్ని తీసేసుకోవడం వల్ల పెట్టుబడి వృద్ధి చెందదు. పైగా ఇప్పుడు డివిడెండ్ పంపిణీపై ఈక్విటీ ఫండ్స్ అయితే 10% పన్ను పడుతోంది. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై 10% పన్నుమాదిరిగానే. కనుక డివిడెండ్ ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు అవసరమైనప్పుడు కొన్ని యూనిట్లను విక్రయించి అవసరాలు తీర్చుకోవడమే మంచిది. డెట్ ఫండ్స్లో అయితే డివిడెండ్ కోసం చూడడం అన్నది ఏ మాత్రం సరికాదు. దీనికంటే క్రమానుగత ఉపసంహరణ(ఎస్డబ్ల్యూపీ) అన్నది మరింత సమర్థవంతమైన టూల్ అవుతుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా అవసరమైన మేర పొందొచ్చు. దీనివల్ల పన్ను పరంగా కలిసొస్తుంది. అదే డెట్ ఫండ్స్లో డివిడెండ్ ఆశిస్తే, డివిడెండ్ పంపిణీ పన్ను కింద 29.12% పడుతుంది. ఇన్వెస్టర్ ఆదాయం ఏ స్లాబ్లో ఉందన్నదానితో సంబం ధం ఉండదు. కానీ, ఎస్డబ్ల్యూపీలో పెట్టుబడిపై ఆర్జించిన లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఏ పన్ను రేటులో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్డబ్ల్యూపీలో ఉపసంహరించుకునేది కొద్ది మొత్తమే ఉంటుంది కనుక పన్ను భారం అంతగా ఏమీ ఉండదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని డెట్ ఫండ్స్లో ఆర్జనకు ముడిపెట్టి సర్దుబాటు చేసుకునే వీలూ ఉంది. ఫండ్స్ సంస్థ తెలియక్కర్లేదు.. మనలో చాలా మందికి కొన్ని బ్యాంకులంటే ఎక్కువగా పరిచయం, అనుబంధం ఉండి ఉంటుంది. కనుక తెలిసిన బ్యాంకుల నిర్వహణలోని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదని భావించే వారూ ఉన్నారు. కానీ, ఇది నిజం కానే కాదు. ఇటీవలి డెట్ ఫండ్ సంక్షోభంలో బ్యాంకుల మద్దతుగల ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పైగా వీటి ఈక్విటీ రాబడుల చరిత్ర కూడా అంత గొప్పగా లేదు. మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డుకు స్థిరత్వం ఎంతో అవసరం. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కీలకం అవుతుంది. నికర విలువ స్టాక్స్లో పెట్టుబడుల పట్ల అవగాహన ఉన్న వారు అవే అంశాలను ఫండ్స్కు అన్వయించడం çసరి కాదు. స్టాక్స్లో 52 వారాల గరిష్ట, కనిష్ట ధరలను సాధారణంగా చూస్తుంటారు. కానీ ఫండ్స్ యూనిట్ల నికర విలువ 52 వారాల కనిష్ట స్థాయిలో ఉంటే, అది మంచి పెట్టుబడికి సంకేతంగా చూడడం తప్పిదమే కావచ్చు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఎంచుకున్న స్టాక్స్ పనితీరు బాగాలేకపోయినా యూనిట్ల ఎన్ఏవీ పడిపోతుంది. ఇక మార్కెట్లు పడిపోయినప్పుడు ఫండ్ మేనేజర్లు సరసమైన ధరల కంటే దిగొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధమైన అవకాశాలున్నాయేమో చూడాలి. దీనికి బదులు ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫండ్ యూనిట్లను తక్కువ ధరల వద్ద మరిన్ని జోడించుకోవడంపై దృష్టి సారించొచ్చు. ఫండ్ సైజు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు, సంబంధిత పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా చూడడం అవసరం లేదు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం నిర్వహణ ఆస్తులను చూడడం అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఏ స్థాయిలోఉంటుందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్కు ఆస్తుల పరిమాణం ప్రతికూలంగా మారొచ్చు. ఉదాహరణకు స్మాల్క్యాప్ ఫండ్కు భారీ ఆస్తులు ఉంటే అది సానుకూలం కంటే ప్రతికూలమే అవుతుంది. ఇలా ఫండ్ సైజు చూసే వారు ఆస్తులను అద్భుతంగా నిర్వహించే చిన్న సైజు పథకాల్లో పెట్టుబడి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే ఓ పథకం ఎంపికకు స్థిరమైన రాబడుల చరిత్ర, పోటీ పథకాలతో పోల్చినప్పుడు ఇచ్చిన రాబడులు మెరుగ్గా ఉన్నాయా అన్నవి చూడాలి. అస్తుల పరిమాణాన్ని కాదు. వ్యయ భారం ఎక్స్పెన్స్ రేషియో... ఓ మ్యూచువల్ ఫండ్ పథకం తాను నిర్వహించే పెట్టుబడులపై అన్ని రకాల చార్జీలను కలుపుకుని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే దానిని టోటల్ ఎక్స్పెన్స్ రేషియోగా చెబుతారు. ఫండ్స్ పథకాల ఎంపికకు చూసే అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చార్జీలను ప్రతి రోజూ ఏఎంసీలు ఫండ్స్ యూనిట్ల ఎన్ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. అంటే కనిపించే ఎన్ఏవీ ఖర్చులు మినహాయించుకున్న అనంతర విలువ అని తెలుసుకోవాలి. అయితే, అన్ని వేళలా ఈ ఎక్స్పెన్స్ రేషియోపై అంతగా ఆధారపడక్కర్లేదు. బెంచ్మార్క్, పోటీ పథకాల కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంటే, అటువంటి పథకాల్లో ఎక్స్పెన్స్ రేషియో పట్ల అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. డెట్ ఫండ్స్లో రాబడులు ఎక్కువగా లేకపోతే, అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో రాబడులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫండ్ నాణ్యత, రిస్క్ ఆధారిత రాబడుల రేషియో అన్నవి ఎక్స్పెన్స్ రేషియో కంటే ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఈక్విటీ ఫండ్స్లో ఏడాది కాల పాయింట్ టు పాయింట్ రాబడులు అన్నవి రాబడుల పనితీరుకు ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ పథకం 2016లో పనితీరు పరంగా నంబర్ 1 స్థానంలో ఉంది. కానీ, మరుసటి ఏడాది మూడో స్థానానికి వెళ్లింది. ఒకే తరహా పనితీరు తర్వాతి సంవత్సరంలోనూ నమోదు చేయడం అన్నది కష్టమే. అందుకే పనితీరు పరంగా స్థిరత్వాన్ని చూడడం అవసరం. -
రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!
న్యూఢిల్లీ: ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా రాకపోవడాన్ని గమనించారా...? గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు...! గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడమే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంఖ్యాపరంగా 2016–17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018–19లో ఆర్బీఐ 4.66 కోట్ల నోట్లు ప్రింట్ అయ్యాయి. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. నల్లధనం కూడబెట్టుకునేందుకు పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. 2019 జనవరిలో ఆంధ్ర– తమిళనాడు సరిహద్దుల్లో రూ.6 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం (లెక్కల్లో చూపని) ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016–17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017–18లో 17,929 నోట్లు బైటపడ్డాయి. -
ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 6 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతేడాది నమోదైన 6.8 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ భారత్ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉందని వ్యాఖ్యానించింది. 2021లో 6.9 శాతం, 2021లో 7.2 శాతానికి భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని తన తాజా నివేదికలో అంచనా వేసింది. 2018–19లో 6.8 శాతం, 2017–18లో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదైన విషయం గమనార్హం. ‘ఇటీవల మందగమనం చోటు చేసుకున్నా కానీ.. ఎంతో సామర్థ్యంతో భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారత వృద్ధి రేటు అధికం.’ అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. -
ఎస్బీఐ లాభం 2,312 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,312 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ అలోన్)సాధించింది. గత క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా రావడం, మొండిబకాయిలు తగ్గిన కారణంగా కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో లాభాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.65,493 కోట్ల నుంచి రూ.70,653 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు... నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్... బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.21,798 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.22,939 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.01 శాతానికి ఎగసింది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 9.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.84% నుంచి 3.07 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలు తగ్గడం తో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ1లో రూ.16,849 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో 35 శాతం తగ్గి రూ.10,934 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 79.34 శాతంగా ఉంది. అయితే తాజా మొండిబకాయిలు ఈ క్యూ1లో భారీగా, రూ.16,212 కోట్లకు పెరిగా యి. ఒక మహారత్న కంపెనీకి చెందిన రూ.2,000 కోట్ల రుణం ఎన్పీఏగా మారడం, వ్యవసాయ, ఎస్ఎంఈ రుణాలు ఎన్పీఏలుగా మారడంతో ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు పెరిగాయి. రూ. 5,769 కోట్ల రికవరీలు... మొండి బకీలకు సంబంధించి రికవరీలు, అప్గ్రేడ్లు రూ.5,769 కోట్లకు పెరిగాయి. దివాలా ప్రక్రియ నడుస్తున్న ఎస్సార్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ల కేసులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.16,000 కోట్ల రుణాలు రికవరీ అవుతాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.89% నుంచి 12.83 శాతానికి మెరుగుపడింది. రూ.7,000 కోట్ల సమీకరణ.... అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. మరో రూ.20,000 కోట్ల నిధులు సమీకరించాలని కూడా ఆలోచిస్తున్నామని, అయితే దీనికి సమయం పడుతుందని బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడేదాకా వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ నాలుగో క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్ ఐపీఓ ఉంటుందని, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ వచ్చే ఏడాది ఉంటుందని ఆయన తెలిపారు. రూ.2,312 కోట్ల నికర లాభం రావడం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి సానుకూలతలున్నా, బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ నష్టపోయింది. తాజా మొండి బకాయిలు పెరగడంతో ఎస్బీఐ షేర్ 3 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమక్రమంగా మెరుగుపడుతున్నామని పేర్కొన్నారు. సిబ్బంది, ఇతర వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయని, ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి అర శాతం తగ్గి 2.03 శాతానికి చేరిందని వివరించారు. నిర్వహణ లాభం పెంచుకోవడంపై దృష్టి పెట్టామని, ఈ క్యూ1లో నిర్వహణ లాభం 11 శాతం వృద్ధితో రూ.13,246కు పెరిగిందని పేర్కొన్నారు. రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నికర వడ్డీ మార్జిన్ పెంచుకోవడం కష్టమైన పనేనని అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి, 3.1 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించగలమని పేర్కొన్నారు. మొండిబకాయిలు వసూలు కావాలని ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాహన రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వల్ల తామెలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొన్నారు. మొత్తం రిటైల్ వాహన రుణాలు రూ.71,000 కోట్లుగా ఉన్నాయని, వీటిల్లో వాహన డీలర్ల రుణాలు రూ.11,500 కోట్లని రజనీష్ కుమార్ తెలిపారు. -
అలహాబాద్ బ్యాంక్ లాభం 128 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది. మిశ్రమంగా రుణ నాణ్యత.. బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 7.32% నుంచి 5.71%కి చేరాయి. సీక్వెన్షియల్గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55%, నికర మొండి బకాయిలు 5.22%గా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.6% నష్టంతో రూ.36.85 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం 32 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వాహన కంపెనీ మారుతీ సుజుకీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.2,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,377 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. అమ్మకాలు తక్కువగా ఉండటం, తరుగుదల వ్యయాలు ఎక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.21,814 కోట్ల నుంచి రూ.18,739 కోట్లకు తగ్గిందని తెలిపింది. తరుగుదల, అమోర్టైజేషన్ వ్యయాలు రూ.720 కోట్ల నుంచి రూ.919 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నిర్వహణ లాభం 39% తగ్గి రూ.2,048 కోట్లకు తగ్గిందని, మార్జిన్ 4.5% తగ్గి 10.4 శాతానికి చేరిందని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ 10%కి మించి మార్జిన్ను సాధించడం విశేషమని నిపుణులంటున్నారు. కాగా ఈ క్యూ1లో మొత్తం అమ్మకాలు 18 శాతం తగ్గి 4,02,594 యూనిట్లుగా ఉన్నాయని మారుతీ తెలిపింది. దేశీయ అమ్మకాలు 19 శాతం తగ్గి 3,74,481 యూనిట్లకు చేరాయని, ఎగుమతులు 28,113 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. రూపాయిల్లో రాయల్టీ చెల్లింపులు... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ అమ్మకాలు తగ్గాయని మారుతీ సుజుకీ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేత్ పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో నెలకొన్న మందగమనం తమపై బాగానే ప్రభావం చూపించిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితి చక్రీయమేనని వివరించారు. దీర్ఘకాలంలో అమ్మకాలు బాగా ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా తమ మాతృ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొకు రాయల్టీని యెన్ కరెన్సీలో చెల్లించామని, రానున్న మూడు సంవత్సరాల్లో రాయల్టీని రూపాయిల్లో చెల్లించనున్నామని తెలిపారు. గ్రామీణ అమ్మకాలు తగ్గుతున్నాయ్ గతంలో జోరుగా ఉన్న గ్రామీణ ప్రాంత అమ్మకాలు కూడా తగ్గుతున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి పేర్కొన్నారు. భారత్ స్టేజ్–సిక్స్(బీఎస్–6) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెస్తామని వివరించారు. బీఎస్–సిక్స్ వాహనాలను 2020 కల్లా అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికంగా అమ్ముడయ్యే ఐదు మోడళ్లు–ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనోలను ఇప్పటికే బీఎస్–సిక్స్ పర్యావరణ నియమాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తెచ్చామని కల్సి వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేర్ 0.7 శాతం లాభంతో రూ.5,806 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.5,685కు పతనమైంది. -
బీఓబీ లాభం రూ.826 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్కు రూ.826 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.646 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ల విలీనం తర్వాత తాము వెల్లడిస్తున్న తొలి ఆర్థిక ఫలితాలు ఇవని, అందుకని గత క్యూ1, ఈ క్యూ1 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. గత క్యూ1లో రూ.13,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.22,057 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం వృద్ధితో రూ.6,496 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ4లో 2.78 శాతంబ ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ1లో 2.73 శాతానికి తగ్గిందని పేర్కొంది. 4 శాతం పెరిగిన నిర్వహణ లాభం స్టాండ్అలోన్ పరంగా చూస్తే, ఈ క్యూ1లో నికర లాభం రూ.709 కోట్లు, మొత్తం ఆదాయం రూ.20,861 కోట్లని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. గత క్యూ1లో రూ.528 కోట్ల నికర లాభం, రూ.12,788 కోట్ల ఆదాయం వచ్చాయని పేర్కొంది. స్టాండ్అలోన్ నిర్వహణ లాభం 4 శాతం వృద్ధితో రూ.4,276 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, 34 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. తగ్గిన తాజా మొండి బకాయిలు.... ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 10.28 శాతంగా, నికర మొండిబకాయిలు 3.95 శాతంగా ఉన్నాయని బ్యాంక్ తెలిపింది. గత క్యూ1లో స్థూల మొండి బకాయిలు 12.46 శాతమని, నికర మొండి బకాయిలు 5.4 శాతమని వెల్లడించింది. ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు రూ.5,583 కోట్లని, సీక్వెన్షియల్గా చూస్తే, తాజా మొండి బకాయిలు తగ్గాయని తెలిపింది. ఈ క్యూ1లో రూ.3,168 కోట్ల కేటాయింపులు జరిపామని తెలిపింది. రిటైల్ రుణాలు 21 శాతం వృద్ధి చెందడంతో మొత్తం రుణాలు 5 శాతం ఎగసి రూ.5.33 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దేశీయ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ.7.85 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 0.68 శాతం నష్టంతో రూ.110 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ నష్టాలు 3,679 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్లో కూడా అమ్మకాలు తగ్గడం, మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండటం, అమ్మకాలు పెంచుకోవడానికి పెద్ద మొత్తాల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.బి. బాలాజీ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.66,701 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.1,188 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ1లో రూ.97 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.336 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.1,712 కోట్లకు చేరాయని తెలిపారు. 23 శాతం తగ్గిన అమ్మకాలు... లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) నికర నష్టాలు గత క్యూ1లో 26 కోట్ల పౌండ్ల నుంచి ఈ క్యూ1లో 39.5 కోట్ల పౌండ్లకు పెరిగాయని టాటా మోటార్స్ కంపెనీ తెలిపింది. ఈ క్యూ1లో జేఎల్ఆర్ విక్రయాలు 12 శాతం తగ్గి 1.28 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఈ క్యూ1లో మొత్తం వాహన విక్రయాలు 23 శాతం క్షీణించి 1.36 లక్షలకు తగ్గాయని తెలిపింది. మందగమనం... వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, లిక్విడిటీ సమస్య, యాగ్జిల్ లోడ్కు సంబంధించిన నిబంధనలు.. వీటన్నింటి కారణంగా డిమాండ్ తగ్గి వాహన పరిశ్రమలో మందగమనం చోటు చేసుకుందని టాటా మోటార్స్ సీఈఓ, ఎమ్డీ గుంటర్ బషెక్ చెప్పారు. లాభాల గైడెన్స్ కొనసాగింపు ప్రపంచ వ్యాప్తంగా వాహన పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తమ ఆర్థిక ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయని టాటా మోటార్స్ సీఈఓ, ఎమ్డీ గుంటర్ బషెక్ చెప్పారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల పౌండ్ల లాభం ఆర్జించగలమన్న గైడెన్స్ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. చైనాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయని, కొత్త మోడళ్ల కారణంగా జేఎల్ఆర్ వృద్ధి పుంజుకోగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇక దేశీయంగా కూడా పరిస్థితులు మెరుగుపడగలవని పేర్కొన్నారు. రిటైల్ అమ్మకాల వృద్ధిపై దృష్టిపెట్టామని, డీలర్ల లాభదాయకత మెరుగుపడగలదని, డిమాండ్ పుంజుకునే కొత్త ఉత్పత్తులను అందించనున్నామని, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్థతులు పాటించనున్నామని ఆయన వివరించారు. భారీ మార్పు దశలో టాటా మోటార్స్ ఉందని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెత్ వ్యాఖ్యానించారు. కఠినమైన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నామని, నిర్వహణ సామర్థ్యం పెంచుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సంరలోనే మళ్లీ లాభాల బాట పడుతామని బషెక్ ధీమా వ్యక్తం చేశారు. ఏడీఆర్ 3 శాతం డౌన్ మార్కెట్ ముగిసిన తర్వాత టాటా మోటార్స్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ కంపెనీ భారీగా నష్టాలను ప్రకటిస్తుందనే అంచనాలతో బీఎస్ఈలో ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. గత మూడు నెలల కాలంలో ఈ షేరు 35 శాతం పతనమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.129ను తాకింది. ఇక అమెరికా స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ ఏడీఆర్ 3 శాతం నష్టంతో 10.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం టాటా మోటార్స్కు భారీ నష్టాలు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు. -
గేరు మార్చు.. స్పీడు పెంచు!
న్యూఢిల్లీ: అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన పెరగటమనేది చాలా కీలకంగా నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాలను వెల్లడించింది. బడ్జెట్కు ముందురోజు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే... ఇటు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలకు కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం (నేడు) పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎకనమిక్ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పుంజుకోనున్న పెట్టుబడులు .. ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2018–19లో 6.8%కి క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20లో 7% స్థాయిలో నమోదు కానుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8%కి పడిపోయింది. ఇది చైనా నమోదు చేసిన 6.4% వృద్ధి కన్నా తక్కువ కావడం గమనార్హం. ఇక 2011–12 నుంచి క్రమంగా తగ్గుతున్న పెట్టుబడుల రేటు.. ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇక నుంచి మళ్లీ పుంజుకోగలదని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల డిమాండ్, బ్యాంకుల రుణాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేసింది. అయితే, పన్ను వసూళ్లు, వ్యవసాయ రంగంపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాల కారణంగా ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చని వివరించింది. ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో భారత ఎకానమీ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్ను దాటేసి అయిదో స్థానానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. రుతుపవనాలు కీలకం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో చమురు ధరలు తగ్గవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ జీడీపీలో దాదాపు 60%గా ఉన్న వినియోగానికి ఇది ఊతమివ్వగలదని పేర్కొంది. కాకపోతే వినియోగం మందగించే రిస్కు లున్నాయని హెచ్చరించింది. ‘వ్యవసాయ రం గం రికవరీ, వ్యవసాయోత్పత్తుల ధరలే గ్రామీణ ప్రాం తాల్లో వినియోగానికి కీలకం కానున్నాయి. రుతుపవనాల పరిస్థితి వీటన్నింటినీ నిర్దేశిస్తుంది. కొన్ని ప్రాం తాల్లో సాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చు. ఇది పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు’ అని సర్వే పేర్కొంది. కార్మిక సంస్కరణలు ప్రధానం .. దేశంలో డిమాండ్కు ఊతమివ్వాలన్నా, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నా, కార్మిక ఉత్పాదకత పెర గాలన్నా ప్రైవేట్ పెట్టుబడులు కీలకమని సర్వే తెలిపింది. ఇవే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడగలవని వివరించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మిక రంగం మొదలైన వాటిల్లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇక లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రధానంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రంగం నుంచే వృద్ధికి మరింత ఊతం లభించగలదని ఆర్థిక సర్వే వివరించింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలివీ... ► ఒప్పందాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలి. పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి. ► 2018–19లో ద్రవ్య లోటు 3.4 శాతంగా నమోదు కావొచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. అంతక్రితం ఏడాదిలో ఇది 6.4%. ► రాజకీయ స్థిరత్వం వృద్ధి అవకాశాలకు సానుకూలాంశం. పెట్టుబడులు, వినియోగమే ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ► 2024–25 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే (ప్రస్తుత స్థాయికి రెట్టింపు) నిలకడగా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యపడగలదు. ► చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మరింత ఎదిగేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, ఉత్పాదకత పెంచుకునేందుకు అనువైన విధానాలు ఉండాలి. ఎప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండిపోయే సంస్థల కన్నా భవిష్యత్లో భారీగా ఎదిగే సత్తా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలి. ► వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంపై పెట్టుబడులు పెంచాలి. రిటైర్మెంట్ వయస్సునూ దశలవారీగా పెంచాలి. ► తక్కువ జీతభత్యాలు, వేతనాల్లో అసమానతలే సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధాలుగా ఉంటున్నాయి. వీటిని సరి చేసేందుకు చట్టపరమైన సంస్కరణలు, స్థిరమైన విధానాలు అవసరం. ► కాంట్రాక్టుల అమలయ్యేలా చూసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకులను మెరుగుపర్చుకోవడానికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. ► 2018–19లో రూ. 38,931 కోట్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) తరలిపోయాయి. 2017–18లో నికరంగా రూ. 1,44,681 కోట్లు వచ్చాయి. ► 28 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం విషయంలో ఆర్థిక శాఖ గణనీయ పురోగతి సాధించింది. మూడింట్లో వాటాల విక్రయం పూర్తి కూడా అయింది. ► 2021 నాటికి ఉక్కు ఉత్పత్తి 128.6 మిలియన్ టన్నులకు చేరనుండగా, 2023 నాటికి వినియోగం 140 మిలియన్ టన్నులకు చేరనుంది. 2018–19లో ఉత్పత్తి 106.56 మిలియన్ టన్నులు. ► ఉపాధి లేని గ్రామాలను గుర్తించేందుకు, ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రయోజనాలను కల్పించేందుకు రియల్ టైమ్లో వివరాలు లభించేలా ప్రత్యేక సూచీని ఏర్పాటు చేయాలి. ► ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంలో డేటా ప్రాధాన్యాన్ని గుర్తించి, దానిపై తగినంత ఇన్వెస్ట్ చేయాలి. ► 2018–19లో దిగుమతులు 15.4 శాతం, ఎగుమతులు 12.5 శాతం వృద్ధి నమోదు చేసి ఉండొచ్చని అంచనా. ► 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283.4 మిలియన్ టన్నుల మేర ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణే ముఖ్యం: సీఈఏ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తూ పోతే పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతింటాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత బాగుంది. కాబట్టి ఇటు ప్రైవేట్ సంస్థలు, అటు ప్రభుత్వం రుణాల సమీకరణ కోసం అటువైపు దృష్టి పెట్టొచ్చు. 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో పెట్టుబడులనేవి 30 శాతానికి పైగా ఉండాలి. చైనాలో ఇది 50 శాతానికి చేరింది. ప్రస్తుతం మన దగ్గర 29.6 శాతంగా ఉన్న పెట్టుబడుల రేటును 35 శాతం దాకానైనా పెంచుకోవాలి‘ అని సుబ్రమణియన్ చెప్పారు. ‘మన వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ నిలకడగా 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే మనం గేర్లు మార్చాలి. టేకాఫ్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం‘ అని ఆయన పేర్కొన్నారు. టాప్ ట్యాక్స్పేయర్స్కు ప్రత్యేక వెసులుబాట్లు.. సక్రమంగా పన్నులు చెల్లించడాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి జిల్లాలో టాప్ 10 ట్యాక్స్పేయర్స్కు ప్రత్యేక గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో డిప్లమాటిక్ తరహా వెసులుబాట్లు, ఎయిర్పోర్టుల్లో ఎక్స్ప్రెస్ బోర్డింగ్ సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొంది. అలాగే ఒక దశాబ్దకాలంలో అత్యధికంగా పన్నులు చెల్లించిన వారి పేర్లను ముఖ్యమైన భవంతులు, రహదారులు, రైళ్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలకు పెట్టే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆర్థిక సర్వే సూచించింది. చాలా మంది కోరుకునే సామాజిక హోదాతో పాటు సంఘంలో గౌరవం కూడా లభించేలా ప్రత్యేక క్లబ్స్ను ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. వ్యవసాయ రంగానికి తోడ్పాటు.. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది. 2050 నాటికి భారత్లో నీటి వనరులు ఆందోళనకరంగా అడుగంటుతాయన్న వార్తల మధ్య .. ’భూమిపరమైన ఉత్పాదకత’పై కాకుండా ’సాగు నీటిపరమైన ఉత్పాదకత’ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు రైతాంగం జలవనరులను సమర్ధంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించింది. ఇన్ఫ్రాపై ఏటా 200 బిలియన్ డాలర్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఇన్ఫ్రా రంగంపై భారత్ వార్షిక వ్యయాలను దాదాపు రెట్టింపు చేయాలని, ఏటా 200 బిలియన్ డాలర్లు పెట్టాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే దానికి తగ్గ పటిష్టమైన మౌలిక సదుపాయాలూ ఉండాలని పేర్కొంది. అయితే ఈ క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులు మరిన్ని వచ్చేలా చూడటమే పెద్ద సవాలుగా ఉండగలదని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఏటా కేవలం 100 నుంచి 110 బిలియన్ డాలర్లు మాత్రమే ఇన్ఫ్రాపై వెచ్చించగలుగుతోందని వివరించింది. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధన.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లక్ష్యాలు చాలావరకూ నెరవేరాయని, పలు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటా మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నూటికి నూరు శాతం నిల్చిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014 అక్టోబర్లో ఈ పథకం ప్రారంభించినప్పట్నుంచీ దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 2019 జూన్ 14 నాటికి 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని వివరించింది. రాబోయే రోజుల్లో ఎస్బీఎం కింద ద్రవ, ఘన వ్యర్థాల విసర్జనపై దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. వాటిపై పెట్టే వ్యయం తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లేలా చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం నార్వేలో 39 శాతం, చైనాలో రెండు శాతం ఉండగా భారత్లో 0.06 శాతమే ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు, విద్యుత్ వాహనాలపై ఆర్థిక సర్వే సూచనలను పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. కొత్త మార్కెట్లలో ఐటీకి బాటలు భారత ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు చాన్నాళ్లుగా సర్వీసులు అందిస్తున్న దేశాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న మార్కెట్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త మార్కెట్లపైనా అవి దృష్టి సారించాలి. యూరప్, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం దేశీ ఐటీ–బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) ఎగుమతులు 2018–19లో 136 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ పరిమాణం 181 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అటు స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేలా పన్నులను క్రమబద్ధీకరించాలని కూడా సర్వే సూచించింది. రిటైర్మెంట్ వయస్సు పెంచాలేమో... భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో పదవీ విరమణ వయస్సును కూడా పెంచే అవకాశాలు పరిశీలించాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే సూచనప్రాయంగా తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల్లో జనాభా వృద్ధి గణనీయంగా మందగించే అవకాశం ఉందని పేర్కొంది. ఓవైపు యువ జనాభా (0–19 మధ్య వయస్సున్న వారు) సంఖ్య 2041 నాటికి 25 శాతానికి తగ్గనుండగా వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు పైబడిన వారు) రెట్టింపై 16 శాతానికి చేరనుంది. ఇక ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతున్నందున పాఠశాలలు లాభదాయకంగా నడవాలంటే కొన్నింటిని విలీనం చేయాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. 100 స్మార్ట్ సిటీలు.. స్మార్ట్ సిటీస్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాలు తలపెట్టగా, ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 2.05 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ ప్రాజెక్టుల అమల్లో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు తెలిపింది. నగర ప్రజలకు మెరుగైన జీవన విధానాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 2015 జూన్లో అయిదేళ్ల వ్యవధికి కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 100 నగరాల్లో 5,151 ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ ప్రాంత) కింద ఇప్పటిదాకా 4,427 నగరాలు, పట్టణాలను చేర్చినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొంది. ఐబీసీతో పటిష్టంగా రికవరీ.. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కీలక ఆర్థిక సంస్కరణల్లో దివాలా స్మృతి (ఐబీసీ) ఒకటని, దీనివల్ల మొండిబాకీల రికవరీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇప్పటిదాకా దీని కింద రూ. 1.73 లక్షల కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయినట్లు వివరించింది. 94 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొంది. మరోవైపు మొండిబాకీల భారం తగ్గడంతో బ్యాంకింగ్ రంగం పనితీరు కూడా మెరుగుపడిందని ఆర్థిక సర్వే వివరించింది. ప్రధాన సూచీ 17 శాతం అప్.. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 17 శాతం, నిఫ్టీ సుమారు 15 శాతం పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 మార్చి 31న 32,969గా ఉన్న సెన్సెక్స్ గతేడాది మార్చి 31న 38,673 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 10,114 నుంచి 11,624కి చేరింది. ఆచరణాత్మక లక్ష్యం: పరిశ్రమ వర్గాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను.. ఆచరణాత్మక లక్ష్యంగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. సర్వేలో పేర్కొన్నట్లుగా 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే.. ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లభించాలని, వినియోగం పెరగాలని పేర్కొన్నాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఐఐ, ఫిక్కీ, అసోచాం తదితర పరిశ్రమ సమాఖ్యలు అభిప్రాయపడ్డాయి. ‘7 శాతం వృద్ధి రేటు అంచనా కాస్త ఆచరణాత్మక లక్ష్యమే. విధానాలపరమైన తోడ్పాటు ఉన్నప్పుడు వచ్చే ఐదేళ్లలో సగటున 8 శాతం వృద్ధి రేటు కూడా సాధించవచ్చు‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పెట్టుబడులను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడులు, వినియోగం, పొదుపును ప్రోత్సహించేలా నిర్దిష్ట చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ చెప్పారు. ఎగవేతదారులు నరకానికే! ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినబడుతున్న మాట ‘ఎగవేత’ అంటే అతిశయోక్తి కాదేమో!! పన్నులు, రుణాలను ఎగ్గొడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సర్కారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా పరిష్కారం మాత్రం అంతంతే. బహుశా! అందుకేనేమో!! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు... ప్రభుత్వం ఎగవేతల కట్టడికి ‘మతం’ మంత్రం జపిస్తోంది. ప్రజలకున్న మత విశ్వాసాలను దీనికి విరుగుడుగా వాడాలని చూస్తోంది. ఆర్థిక సర్వేలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. హిందూ మతం ప్రకారం ఎవరైనాసరే అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అంటే పాపం చుట్టుకోవడమేకాదు.. తీవ్రమైన నేరం కూడా!!. ఇక రుణగ్రస్తులుగా కన్ను మూస్తే... ఏకంగా నరకానికి పోతారన్నది నానుడి!! అందుకే ఆ నరకకూపంలోకి పోకుండా చూడాలంటే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత తమ పిల్లలదేనని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇస్లాం, బైబిల్లో కూడా ఇలాంటి బోధనలే కనబడతాయి. భారతీయ సంస్కృతిలో అప్పులు ఎగ్గొట్టడం అంటే ఎంత పాపమో, నేరమో అన్నది మన మతాలే చెబుతున్నప్పుడు.. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నది సర్వే చెబుతున్న సారాంశం. మరి మోదీ సర్కారు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో ఆ దేవుడికే తెలియాలి!!. -
2.76 లక్షల కొత్త కొలువులు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. విదేశీ రిటైల్ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి పెద్ద యెత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్–సెప్టెంబర్ 2019–20 కాలానికి సంబంధించి ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్లీజ్ సర్వీసెస్ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం రిటైల్ రంగంలో నికరంగా ఉద్యోగావకాశాలు 2 శాతం పెరిగి అదనంగా 1.66 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఎఫ్ఎంసీజీలో 1 శాతం వృద్ధితో 1.10 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. 27,560 ఉద్యోగాలతో ఢిల్లీ రిటైల్ రంగం అగ్రస్థానంలో.. 22,770 కొత్త కొలువులతో బెంగళూరు ఆ తర్వాత స్థానంలో ఉంటాయి. విదేశీ రిటైల్ దిగ్గజాల రాకతో పాటు రిటైల్ రంగం భారీగా వృద్ధి చెందడం, కార్యకలాపాలు విస్తరించడం, కంపెనీల కొనుగోళ్లు జరగడం తదితర అంశాలు ఉపాధి కల్పనకు ఊతంగా నిలుస్తున్నాయని టీమ్లీజ్ సర్వీసెస్ పేర్కొంది. ఎఫ్ఎంసీజీలో ముంబై, ఢిల్లీ టాప్.. రిటైల్లో కొత్త కొలువులకు ఢిల్లీ, బెంగళూరు అగ్రస్థానాల్లో ఉండగా.. ఎఫ్ఎంసీజీ విభాగంలో ముంబై (14,770 కొత్త ఉద్యోగాలు), ఢిల్లీ (10,880) టాప్ స్థానాల్లో ఉంటాయి. ఫుడ్ పార్కుల ఏర్పాటు, సామర్థ్యాల పెంపు, ప్రస్తుత కంపెనీలు.. ఇతర సంస్థలను కొనుగోళ్లు చేయడం, క్యాష్ అండ్ క్యారీ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం, సింగిల్, మల్టీ బ్రాండ్ రిటైల్లో ఆటోమేటిక్ రూట్లో పెట్టుబడులకు అనుమతించడం వంటి అంశాలు ఈ ఉపాధి కల్పనకు ఊతంగా ఉండగలవని టీమ్లీజ్ సర్వీసెస్ హెడ్ (డిజిటల్, ఐటీ విభాగం)మయూర్ సారస్వత్ తెలిపారు. మొత్తం మీద చూస్తే రిటైల్ ద్వారా 15.11 శాతం, ఎఫ్ఎంసీజీ వల్ల 10.31% ఉద్యోగాల వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులకు మాత్రమే కాకుండా ఫ్రెషర్లకు కూడా బాగానే అవకాశాలు లభించగలవని సారస్వత్ తెలిపారు. కేవలం రిటైల్లోనే 33,310 తాజా గ్రాడ్యుయేట్స్కు కొత్తగా ఉద్యోగావకాశాలు లభించగలవన్నారు. నివేదిక ప్రకారం 2018–19 అక్టోబర్–మార్చి వ్యవధితో పోలిస్తే 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగుల వలసలు భారీగా నమోదయ్యాయి. రిటైల్లో 19.82 శాతంగాను, ఎఫ్ఎంసీజీలో 16.03 శాతంగాను ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం 2,550 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.15,990 కోట్లకు పెరిగిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14–16 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల(రూ.70,258 కోట్లు) ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో షేర్కు రూ.2 మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. డిమాండ్ జోరుగానే.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.10,120 కోట్లకు, ఆదాయం 19% వృద్ధితో రూ.60,427 కోట్లకు పెరిగాయని విజయ్కుమార్ పేర్కొన్నారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో 12% ఆదాయ వృద్ధిని సాధించామని, అంచనాలను అందుకున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6% వృద్ధితో 36.4 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధి తో 220 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమకే కాకుండా, ఐటీ పరిశ్రమకు కూడా ఉత్తమ సంవత్సరం కానున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ సర్వీసులు, ఉత్పత్తులకు డిమాండ్ జోరుగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఇక గత క్యూ4లో స్థూలంగా 14,249 మందికి ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 1,37,965కు పెరిగిందని విజయకుమార్ వివరించారు. ఏడాది కాలంలో ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 17.7%గా ఉందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ఫ్లాట్గా రూ.1,132 వద్ద ముగిసింది. -
రిలయన్స్ ‘రికార్డ్’ లాభం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రికార్డ్ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కంపెనీకి కీలకమైన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు రికార్డ్ స్థాయి లాభం వచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. భారత్లోనే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇప్పటివరకూ ఈ స్థాయి లాభాలను ప్రకటించలేదు. రిటైల్ వ్యాపారం 52 శాతం, డిజిటల్ సర్వీసుల వ్యాపారం 62 శాతం చొప్పున వృద్ధి చెందాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. పెట్రో కెమికల్ విభాగం అమ్మకాలు అధికంగా ఉండటం కూడా కలసివచ్చిందని పేర్కొంది. ఆదాయం జోరుగా పెరగడానికి ఇవే ముఖ్య కారణాలని వివరించింది. 10 శాతం పెరిగిన లాభం.... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో త్రైమాసిక కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9,438 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే తాజా నాలుగో క్వార్టర్లో (2018–19) నికర లాభం 10 శాతం పెరిగి రూ.10,362 కోట్లు చేరింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేరు వారీ నికర లాభం రూ.15.9 నుంచి రూ.17.5కు ఎగసింది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం తగ్గింది. స్థూల రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ మార్జిన్ తగ్గడంతో నికర లాభం 2 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,54,110 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. క్యూ4 మొత్తం ఆదాయం సీక్వెన్షియల్గా చూస్తే, 10 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ.1,70,709 కోట్లుగా ఉంది. వడ్డీ వ్యయాలు రూ.2,566 కోట్ల నుంచి రూ.4,894 కోట్లకు పెరిగాయి. రిటైల్ వ్యాపారం ఎబిటా 77 శాతం ఎగసి రూ.1,923 కోట్లకు చేరగా, టెలికం విభాగం లాభం 65 శాతం పెరిగింది. క్వార్టర్లీ ఎబిటా 13 శాతం వృద్ధితో రూ.20,832 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 15 శాతం సాధించామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కంపెనీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.39,588 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,33,027 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్కు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.50 డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. పెట్రో కెమికల్స్ విభాగం.. తగ్గిన జీఆర్ఎమ్! గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో పెట్రో కెమికల్స్ విభాగం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.42,414 కోట్లకు పెరిగింది. రియలైజేషన్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఎబిట్ 24 శాతం వృద్ధితో రూ.7,975 కోట్లుగా నమోదైంది. ఎబిట్ మార్జిన్ 19 శాతంగా నమోదైంది. అయితే స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 11 డాలర్లుగా ఉన్న జీఆర్ఎమ్(ఒక్కో బ్యారెల్కు) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 8.2 డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీఆర్ఎమ్ 8.8 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్ ఆదాయం 6 శాతం తగ్గి రూ.87,844 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో కంపెనీ 25 శాతం వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తలు, ఫలితాలు సానుకూలంగా ఉండగలవన్న అంచనాల కారణంగా ఈ షేర్ పెరిగింది. బీఎస్ఈలో 2.7 శాతం లాభంతో రూ.1,383 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ, సెన్సెక్స్లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఈ ఏడాదిలో ఈ షేర్ ఇప్పటివరకూ 20 శాతం లాభపడింది. రిలయన్స్ జియో...జిగేల్! టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 65 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.510 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.840 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,128 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.11,106 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 309 శాతం వృద్ధితో రూ.2,964 కోట్లకు పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఆదాయం 93 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లను దాటింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వినియోగదారులను సాధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇదే. కంపెనీ ఏఆర్పీయూ (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి) రూ.126.2గా ఉంది. ఏఆర్పీయూ గత క్యూ3లో రూ.130గా ఉంది. రిటైల్ వ్యాపారం... లక్ష కోట్ల మైలురాయి ! గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రిటైల్ వ్యాపారం ఆదాయం 52% పెరిగి రూ.36,663 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ.24,183 కోట్లుగా ఉంది. ఎబిటా 77 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం ఆదాయం 89 శాతం వృద్ధితో రూ.1,30,566 కోట్లకు పెరిగింది. ఎబిటా 145 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగింది. ఆదాయం, లాభాల వృద్ధి పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రికార్డ్లు సృష్టించింది. అంతర్జాతీయ టాప్ 100 కంపెనీల జాబితాలో చోటు సాధించిన ఏకైక భారత కంపెనీ ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయన్స్ భవిష్యత్తు కోసం చెప్పుకోదగిన ప్రయత్నాలు చేశాం. రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ. లక్ష కోట్లను దాటేసింది. రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. పెట్రో కెమికల్స్ విభాగం ఎన్నడూ లేనంత లాభాన్ని సాధించింది’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
పెట్టుబడులు, వినియోగమే భారత్కు దన్ను!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని, ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది. రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు ఆర్థిక సంస్థలతో అంచనాలతో పోల్చితే, ప్రపంచబ్యాంక్ ప్రస్తుత వృద్ధి అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. త్వరలో జరగనున్న ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పింగ్ సమావేశాల నేపథ్యంలో విడుదలైన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2018–2019లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా. ఇది మరింత మెరుగుపడుతుందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ► 2018–19 మొదటి మూడు త్రైమాసిక గణాంకాలను (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే, వృద్ధి ఏ ఒక్క రంగానికే పరిమితం కాకుండా, విస్తృత ప్రాతిపదికన ఉంది. సేవల రంగం కొంత తగ్గినా, పారిశ్రామిక వృద్ధిరేటు మాత్రం 7.9 శాతంగా ఉంది. ► వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే. ► డిమాండ్ కోణంలో చూస్తే, దేశీయ వినియోగం వృద్ధి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి ధోరణి కూడా బాగుంది. మూడవ త్రైమాసికంలో చూస్తే, పలు రంగాల్లో సమతౌల్యమైన డిమాండ్, వృద్ధి పరిస్థితులు కనిపించాయి. ► గడిచిన ఆర్థిక సంవత్సరం (2018–19) ద్రవ్యోల్బణం పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉన్నాయి. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది. ► దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి. ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ ముడి చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్ అకౌంట్ లోటును 1.9%కి (2019–20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4%కి దాటకపోవచ్చు. -
ఈ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశీయ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 31, ఆదివారం సెలవు దినం రోజున బ్యాంకులు పనిచేయనున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే అన్ని ఏజెన్సీ శాఖలు ఆదివారం పనిచేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వినియోగదారుల అవగాహన కోసం పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని బ్యాంకులను కోరింది. 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ ఆదివారం సెలవును రద్దు చేసింది. బ్యాంకులతో పాటు ప్రభుత్వ రశీదు, చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకుగాను అన్ని చెల్లింపు, అకౌంట్ అఫీసులు తెరిచే వుండాలని ఆదేశించింది. ప్రభుత్వ లావాదేవీలన్నీఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని మరో నోటిఫికేషన్లో కోరింది. ఇందుకు మార్చి 30న రాత్రి 8 గంటలవరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని వివరించింది. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 1867వ సంవ్సతరం బ్రిటిష్ కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. -
ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు, తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద 2019 ఏప్రిల్ 1 నుంచి 3 ఆర్థిక సంవత్సరాల కాలంలో కేంద్రం రూ.10,000 కోట్ల మేర విద్యుత్తో నడిచే వాహనాల కొనుగోలుదారులకు రాయితీలు కల్పించనుంది. ఈ పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35వేల కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందొచ్చు. హైబ్రిడ్ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000–20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు. అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు, ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరం లో రూ.1,500 కోట్లు, 2020–21లో 5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధర లో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20%గా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఇది సరైన సమయంలో సరైన అవకాశమని, ఫేమ్–1కు, ఫేమ్–2కు మధ్య విరామం లేకుండా కొనసాగింపు అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణుమాథుర్ పేర్కొన్నారు. -
చేప పిల్లల పంపిణీపై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 21,189 జల వనరులలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు ఆమోదం తెలిపే ఫైలుపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టా రు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల సమక్షంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కృత్రిమ పద్ధతి ద్వారా వీర్య సరఫరా చేసి లేగదూడలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రూ.47.50 కోట్లతో కరీంనగర్లో ఏర్పా టు చేయనున్న ప్రాజెక్టు అనుమతుల ఫైలుపై రెండో సంతకం చేశారు. ఇక రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో ఆధునీకరణ, పరికరాలను సమకూర్చేందుకు సంబంధించి రూ. 12.18 కోట్ల ప్రతి పాదనలకు ఆమోదం తెలిపే ఫైలుపై మూడో సంతకం చేశారు. కాగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో మంత్రికి సచివాలయంలో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం 10.52కి మంత్రి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా తలసానికి హోంమం త్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు అభినందనలు తెలిపారు. విజయ డ్రింకింగ్ వాటర్కు శ్రీకారం విజయ డెయిరీ నూతన ఉత్పత్తులు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్, దూద్ పేడ నూతన ప్యాకింగ్, పెట్ జార్లలో నెయ్యి ప్యాకింగ్లను తలసాని ఆవిష్కరించారు. పశు ఆరోగ్య కార్డులను విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక, మత్స్య శాఖల కు రూ. వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తలసాని తెలిపారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీ నంబర్వన్ స్థానంలో నిలవడం ఖాయ మన్నారు. అనంతరం విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయదారులు నలుగురికి బెస్ట్ వెండర్ అవార్డులను మంత్రి అందజేశారు. -
‘ఆ లక్ష్యం నెరవేరాలంటే రూ లక్ష కోట్లు అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముద్ర రుణాల లక్ష్యం రూ 3 లక్షల కోట్లకు చేరువ కావాలంటే కేవలం ఒక నెల వ్యవధిలో బ్యాంకులు రూ లక్ష కోట్ల మేర ఈ తరహా రుణాలను జారీ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 22వరకూ బ్యాంకులు రూ 2 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఇప్పటివరకూ 3.89 కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 2018-19 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాంతానికి రూ 3 లక్షల కోట్ల ముద్ర రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు ముద్ర రుణాల పంపిణీలో లక్ష్యాలను అధిగమించాయి. 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన ముద్రా రుణ పథకం కింద వ్యవసాయేతర చిన్న పరిశ్రమలకు గరిష్టంగా రూ పది లక్షల వరకూ రుణాలను అందచేస్తారు. ముద్ర పథకం కింద ఇప్పటివరకూ రూ 7.23 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని 2019-20 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
టాటా మోటార్స్ నష్టాలు రూ.26,961 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం టాటా మోటార్స్కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.1,215 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని టాటా మోటార్స్ తెలిపింది. ఒక్క త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి. వరుసగా మూడో క్వార్టర్లోనూ కంపెనీ నష్టాలనే ప్రకటించింది. విలాస కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) వన్టైమ్ అసెట్ ఇంపెయిర్మెంట్(రూ.27,838 కోట్లు) కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. జేఎల్ఆర్ మూలధన పెట్టుబడులకు సంబంధించిన పుస్తక విలువను తగ్గించడానికి ఈ అసాధారణమైన వ్యయాన్ని ప్రకటించామని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెత్ తెలిపారు. చైనాలో అమ్మకాలు తగ్గడం, తరుగుదల అధికంగా ఉండటం, పెట్టుబడి వ్యయాల అమోర్టైజేషన్ కారణంగా ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వాహన పరిశ్రమ మార్కెట్, సాంకేతిక, విధాన సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అంతే కాకుండా కొత్త మోడళ్లు, విద్యుదీకరణ, ఇతర టెక్నాలజీల కోసం పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వస్తోందని వివరించారు. 4 శాతం ఎగసిన ఆదాయం.... గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్ తెలిపింది. స్టాండెలోన్ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.212 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.618 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,186 కోట్ల నుంచి రూ.16,477 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ ఆదాయం 1 శాతం తగ్గి 620 కోట్ల పౌండ్లకు చేరింది. వడ్డీ వ్యయాలు రూ.321 కోట్లు పెరిగి రూ.1,568 కోట్లకు ఎగిశాయి. జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు 6% తగ్గి 1,44,602కు, హోల్సేల్ అమ్మకాలు 11 శాతం తగ్గి 1,41,552కు చేరాయి. దేశీయంగా అమ్మకాలు 0.5% తగ్గి 1,71,354కు చేరాయి. జేఎల్ఆర్ అంతర్జాతీయ అమ్మకాలు జనవరిలో 11 శాతం తగ్గి 43,733కు పడిపోయాయి. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 9 శాతం, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 12 శాతం చొప్పున తగ్గాయి. మార్కెట్ వాటా పెరుగుతోంది...: దేశీయ వ్యాపారం జోరు కొనసాగుతోందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. తమ మార్కెట్ వాటా పెరుగుతోందని, లాభదాయకత వృద్ది కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. టర్న్ అరౌండ్ 2.0 వ్యూహం మంచి ఫలితాలనిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. జేఎల్ఆర్ సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అయితే వ్యాపారం భవిష్యత్తులో బాగుండేలా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, బ్రెగ్జిట్ విషయమై ఎలాంటి ఒప్పందం కుదరలేనందున ఇంగ్లండ్లో జేఎల్ఆర్ ప్లాంట్లను 2–3 వారాల పాటు మూసివేయాల్సి వస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. బ్రెగ్జిట్తో ఉత్పత్తి సంబంధిత సమస్యలు తలెత్తి దీర్ఘకాలంలో జేఎల్ఆర్ లాభదాయకత దెబ్బతింటుందని పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. కంపెనీ షేర్ గురువారం బీఎస్ఈలో 2.6 శాతం లాభపడి రూ.183 వద్ద ముగిసింది. అమెరికాలో ఏడీఆర్ గురువారం ఒకానొకదశలో 10 శాతం క్షీణించి 11.35 డాలర్లను తాకింది. -
ఇప్పుడు బీమా కూడా బెటరే!!
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నపుడే అంతా హడావుడిగా పన్ను మినహాయింపులందించే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా ముందస్తుగానే కొంత ప్లానింగ్ ఉంటే ఇటు పన్ను ప్రయోజనాలతో పాటు అటు ఆర్థిక లక్ష్యాలనూ సులభంగా చేరుకోవచ్చు. ఇందుకు బీమా చక్కని సాధనమని చెప్పాలి. పన్నులపరమైన మినహాయింపులు పొందేందుకు ఇప్పటిదాకా చాలా మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలైన వాటివైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో రాబడులు, పన్నుల మినహాయింపులకు సంబంధించి పెట్టుబడుల తీరుతెన్నులు గణనీయంగా మారాయి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడులపైనా దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) పన్ను విధించారు. దీంతో ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. పీపీఎఫ్లో పెట్టుబడి పెడితే వాటి రాబడులపై పన్నులు లేకపోయినప్పటికీ.. ఈ సాధనం ద్వారా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. ఇక బ్యాంకుల్లో చేసే మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు.. సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపులున్నప్పటికీ.. వాటిపై వచ్చే వడ్డీలో కొంత భాగానికే ఈ ప్రయోజనం వర్తిస్తోంది. మరోవంక బీమా పథకాలు మాత్రం ఇటు పన్ను ఆదాకు... అటు చక్కని రాబడులిచ్చే ఫైనాన్షియల్ ప్లానింగ్ సాధనాలుగాను కూడా పనికొస్తున్నాయి. అవసరాన్ని బట్టి పాలసీలు... మీ అవసరాలు, పన్నులపరంగా పొందదల్చుకునే మినహాయింపులు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని తీసుకోదగిన వివిధ రకాల పాలసీలున్నాయి. అవి.. ♦ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్: దీన్ని ప్రధానంగా పెట్టుబడి సాధనంగా వర్గీకరించడానికి లేనప్పటికీ, భవిష్యత్లో పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగినా.. కుటుంబానికి ఇది ఆర్థిక భరోసా కల్పిస్తుంది. దీంతో మిగతా విషయాల గురించి తీవ్రంగా మథన పడాల్సిన పని లేకుండా పెట్టుబడులపై ఫోకస్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ పాలసీ వ్యవధిలో పాలసీదారు గానీ మరణించిన పక్షంలో నామినీకి సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. తద్వారా సదరు పాలసీదారు కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. దీనికి పన్ను పరమైన మినహాయింపులు ఉన్నాయి. టర్మ్ ప్లాన్కి కట్టే ప్రీమియానికి కూడా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. ♦ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్స్): ఇన్వెస్ట్మెంట్పైనా, రాబడులపైనా, విత్డ్రాయల్పైనా మొత్తం మూడు స్థాయిల్లోనూ పన్ను ప్రయోజనాలు అందించే ప్లాన్ ఇది. యులిప్స్లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. అలాగే, దీనిపై వచ్చే రాబడులు కూడా సెక్షన్ 10 (10డీ) కింద మినహాయింపు లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్పై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధించడం వల్ల కూడా... యులిప్ తరహా పెట్టుబడి సాధనం ఆకర్షణీయంగా మారింది. ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రాబడులు ఒక స్థాయిని దాటితే వాటిపైనా టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తున్న నేపథ్యంలో యులిప్లు ప్రయోజనకరమైనవేనని చెప్పొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీలు అందించే ఆరోగ్య బీమా పాలసీపైనే ఆధారపడుతుంటారు. అలా కంపెనీ ఇచ్చేది మాత్రమే కాకుండా సొంత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డి కింద హెల్త్ పాలసీకి కట్టే ప్రీమియంకు సంబంధించి రూ. 25,000 దాకా డిడక్షన్ పొందవచ్చు. వయస్సు 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రుల కోసం హెల్త్ పాలసీ తీసుకుంటే.. దానికి కట్టే ప్రీమియంపై ట్యాక్స్ రిబేట్ను కేంద్రం ఇటీవలి బడ్జెట్లో రూ. 30,000 నుంచి రూ. 50,000 దాకా పెంచింది. స్థూలంగా చెప్పేదేంటంటే .. పన్నులు కట్టాల్సిన బాధ్యత ఆదాయం అందుకునే వారందరిపైనా ఉంటుంది. అయితే, ఆదాయ పన్ను చట్టాల నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. చట్టబద్ధంగా పన్నులు ఆదా చేసుకోవడంతో పాటు మెరుగైన రాబడులొచ్చేలా స్మార్ట్గా పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. -
కొత్త ఏడాదీ... సర్కారీ ఐపీఓల జోరు!
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 2018–19లో కేంద్రం పెద్ద యెత్తున నిధులు సమీకరించనున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఐపీవోల జోరు కొనసాగనుంది. అన్నింటికన్నా ముందుగా రైట్స్, ఐఆర్ఎఫ్సీ పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది మేలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ఇదే కోవకి చెందిన మరో రెండు పీఎస్యూలు ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్ ఐపీవోలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నాయి. 2018–19లో పీఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీవోల జాబితాలో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థలు ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే వీటి పబ్లిక్ ఇష్యూలు ఉండొచ్చని అంచనా. అలాగే, సాధారణ బీమా పీఎస్యూలు మూడింటిని (నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్) కలిపేసి ఒకే సంస్థగా లిస్ట్ చేసే యోచన కూడా ఉంది. 2017–18లో రికార్డు స్థాయిలో ఆరు పీఎస్యూలు ఐపీవోకి వచ్చాయి. రూ. 24,000 కోట్లు సమీకరించాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కార్పొరేషన్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్యార్డ్, హడ్కో వీటిలో ఉన్నాయి. అన్నింటికన్నా ముందుగా రైట్స్.. ఐఆర్ఎఫ్సీ, రైట్స్ ఐపీవోలు మే నెలాఖరులోగా ఉండొచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటిలో ముందుగా రైట్స్ ఐపీవో ఉండనుంది. ఈ సంస్థ ఇష్యూలో కేంద్రం 12 శాతం మేర వాటాలు విక్రయించే అవకాశం ఉంది. ఇక ఐఆర్ఎఫ్సీ సంగతి తీసుకుంటే 10 శాతం వాటాలు విక్రయించవచ్చని అంచనా. ఆర్వీఎన్ఎల్లో 25 శాతం డిజిన్వెస్ట్మెంట్ ఉండవచ్చు. వాస్తవానికి పన్ను సంబంధ వివాదం కారణంగా ఐఆర్ఎఫ్సీ లిస్టింగ్ ప్రతిపాదనలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మినహాయింపు లభించడంతో ఐఆర్ఎఫ్సీ ఐపీవోకి మార్గం సుగమం చేసింది. రైట్స్ ఐపీవోకి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఎలార సెక్యూరిటీస్ ఇండియా, ఐడీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు అడ్వైజర్స్గా ఉండనున్నాయి. అటు ఐఆర్ఎఫ్సీ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాప్స్, ఐడీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ .. అడ్వైజర్స్గా ఉండనున్నాయి. ఐఆర్సీటీసీ ఇష్యూకి సర్వీస్ చార్జీల అడ్డంకి.. మిగతా పీఎస్యూల లిస్టింగ్ ప్రణాళికలు చకచకా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఐఆర్సీటీసీ ఐపీవో ప్రతిపాదనను మాత్రం నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ కీలక ఆదాయ వనరైన సర్వీసు చార్జీలను రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని భావిస్తుండటమే ఇందుకు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టికెట్లు, ఇతరత్రా సర్వీసుల బుకింగ్పై విధించే సర్వీస్ చార్జీలే కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైనప్పుడు.. ప్రభుత్వం దాన్నే తొలగించేస్తే, ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీ ద్వారా బుకింగ్స్పై సర్వీస్ చార్జీలను తొలగించింది. దీంతో ఐఆర్సీటీసీ వార్షికాదాయం రూ.500 కోట్ల మేర తగ్గింది. ఆర్థిక శాఖ దీన్ని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. రూ. 80 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. పవన్హన్స్లో పూర్తి వాటాల విక్రయం.. ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా పవన్హన్స్లోనూ వాటాల విక్రయంపై సమాలోచనలు చేస్తోంది. పవన్హన్స్లో కేంద్రం పూర్తి వాటాలను విక్రయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ సర్వీసులు అందించే ఈ కంపెనీలో కేంద్రానికి, ఓఎన్జీసీకి చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. ఐపీఓ పత్రాలు సమర్పించిన 4 పీఎస్యూలు న్యూఢిల్లీ: మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఐపీఓ పత్రాలను సెబీకి ఇటీవలే సమర్పించాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వే మౌలిక సదుపాయాల సంస్థ, ఇర్కాన్ ఇంటర్నేషనల్, యుద్ధ నౌకల తయారీ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్.. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తాజాగా ఐపీఓ పత్రాలను సమర్పించాయి. -
నోటీసులొస్తాయ్.. జాగ్రత్త!!
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ చెల్లింపులు, టీడీఎస్ వంటి వాటిని కచ్చితంగా చూసుకోండి. పన్ను రికవరీ చేసే అధికారులు/ సంస్థలు సరిగ్గా పనిచేయకపోవడం, రికవరీని బ్యాంకుల్లో చెల్లించకపోవడం, రిటర్నులను గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడం వలన ఆదాయపు పన్ను శాఖ వారు నిర్వహిస్తున్న మీ ఖాతాలో సమాచారం లేకపోవడం లేదా తప్పుడు సమాచారం ఉండడం కారణంగా నోటీసులు వచ్చే అవకాశముంది. ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయేమో ఒకసారి చూడండి... రిటైర్డ్ హెడ్మాస్టర్ ప్రసాద్కు పెన్షన్ వస్తుంది. చివరి మూడు నెలల్లోనే పన్ను కోత వేశారు. కానీ సమాచారం అప్లోడ్ చేసేటప్పుడు ఫారం 26ఏఎస్లో 3 నెలల పెన్షన్, సంవత్సరపు ఇన్కమ్ ట్యాక్స్ చూపించారు. మీరు రిటర్ను వేసేటప్పుడు 12 నెలల పెన్షన్ చూపించాలి. మీ రిటర్నుకి 26ఏఎస్కి సమాచారం పరంగా మిస్మాచ్. మీరు రిటర్ను సరిగ్గా వేసినా, పన్ను సరిగ్గా చెల్లించినా ఇలాంటి మిస్మాచ్ వలన సమస్యలు ఉత్పన్నమౌతాయి. నోటీసులు తథ్యం. చాలా మంది బ్యాంకులో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో అనాలోచితంగా ఆలోచిస్తున్నారు. ట్యాక్సబుల్ ఆదాయం ఉన్నప్పటికీ పన్ను రికవరీ చేయవద్దని ఫారాలు సబ్మిట్ చేస్తున్నారు. కొంత మంది ఈ అంశాన్ని కావాలని మరిచిపోతున్నారు. బ్యాంకర్లు పని ఒత్తిడి వలన వీలున్నప్పుడు రికవరీ చేయడం, వీలులేనప్పుడు మానేయడం చేస్తున్నారు. అసెసీలు కూడా ఫారం 26ఏఎస్ని చెక్ చేసుకోవడం లేదు. ఫలితంగా రిటర్నులు వేసేటప్పుడు బ్యాంకుల్లో వడ్డీ విషయం మరచిపోతున్నారు. 26ఏఎస్లో ఉన్న వడ్డీని, టీడీఎస్ని పరిగణనలోకి తీసుకోకుండా రిటర్నులు దాఖలు చేస్తున్నారు. కొంత మంది వడ్డీ మీద టీడీఎస్తో పన్ను భారం తీరిపోయిందని అనుకుంటున్నారు. అది మీరున్న శ్లాబును బట్టి ఉంటుంది. వీటి వలన అదే మిస్మాచ్ సమస్య. మళ్లీ నోటీసులు. కొత్త సంవత్సరంలో ఇటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి. ♦ 1–4–2017 నుంచి 31–3–2018 వరకూ మీకువచ్చే ఆదాయపు జాబితా రూపొందించుకోండి. ఉదాహరణకు.. జీతం/పెన్షన్, ఇంటి అద్దె, బ్యాంకుల వడ్డీ, ఇతరత్రా వడ్డీ, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ వంటివి. ♦ వీటికి సంబంధించిన జమలు, బ్యాంకుల్లో అన్ని అకౌంట్లని పరిశీలించండి. ♦ రావలసిన ఆదాయం కన్నా తక్కువగా అకౌంట్లో జమ అయిందంటే దానికి కారణం టీడీఎస్. చెక్ చేసుకోండి. అది పన్ను అయితే సంబంధిత సంస్థలను సంప్రదించండి. ♦ టీడీఎస్ ప్రక్రియకి మే 2018 దాకా సమయం ఉంది. సమాచారాన్ని సిద్ధంగా పెట్టుకొని మే నెలాఖరు నుంచి 26 ఏఎస్ కోసం లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ♦ తప్పుడు సమాచారం ఉన్నా.. లోటుపాట్లు ఉన్నా.. వెంటనే వారిని సంప్రదించండి. ♦ రిటర్ను వేయడానికి గడువు తేదీ జూలై 2018. ♦ వీలయితే ఫారం 16, 16ఏలు పొందండి. ♦ 26ఏఎస్ సమాచారమే మీకు మార్గదర్శకం. కానీ 26ఏఎస్లో తప్పులున్నా, మీకు సంబంధించని సమాచారం ఉన్నా మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. -
కొత్త ఏడాదైనా కాస్త ముందే!!
వేతన జీవులు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు ప్రతీ ఆర్థిక సంవత్సరం కీలకమైనదే. పన్ను ఆదా కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ప్రారంభం నుంచే చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎక్కువ మంది ఫిబ్రవరి, మార్చి మాసంలో పన్ను ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో అర్హత కలిగిన పథకాలలో ఏదో ఒకదానిలో పెట్టేస్తుంటారు. కానీ, తగిన ప్రణాళికతో తమకు అనువైన, లాభదాయకమైన సాధనాన్ని ముందే ఎంచుకుని ప్రతీ నెలా కొంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళితే ఆ సౌలభ్యమే వేరు. పైగా అదనపు రాబడి. ఈ విధంగా నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దృష్టి సారించాల్సిన అంశాలపై అందిస్తున్న ప్రాఫిట్ కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం తాజా బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్నును ప్రవేశపెట్టారు. కాకపోతే జనవరి వరకు ఆర్జించిన లాభాలకు మాత్రం మినహాయింపు (గ్రాండ్ఫాథర్డ్) కల్పించారు. ఇదో పెద్ద ఉపశమనమే. ఇప్పటికే మీకున్న పెట్టుబడులపై ఎల్టీసీజీని లెక్కించే విషయంలో కొంత శ్రమ అవసరమవుతుంది. అందుకే వాటిని ప్రత్యేకంగా ఒక డైరీ లేదా ఎక్సెల్ షీటులో పొందుపరచాలి. ఎల్టీసీజీని సులభంగా లెక్కించేందుకు ప్రభుత్వం మినహాయింపు కల్పించిన 2018 జనవరి 31 నాటి షేర్ల క్లోజింగ్ ధరలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి ఎన్ఏవీలను నమోదు చేసి ఉంచుకోవాలి. దీంతో ఆ తర్వాత వచ్చిన లాభం నుంచి నాటి క్లోజింగ్ ధరలను మినహాయించి మిగిలిన లాభంపైనే పన్ను చెల్లించేందుకు వీలవుతుంది. వ్యాల్యూ రీసెర్చ్ వంటి కంపెనీలు ఉచితంగా పోర్ట్ఫోలియో ట్రాకర్ సేవలను అందిస్తున్నాయి. జనవరి 31 నాటి ధరల ఆధారంగా మీ పెట్టుబడులపై ఎల్టీసీజీని ఈ సంస్థల సాఫ్ట్వేర్ సులభంగా లెక్కించి చూపిస్తుంది. స్టాక్స్లో లాభాల స్వీకరణ 2018 ఏప్రిల్ 1 నుంచి దీర్ఘకాలిక లాభాలపై 10 శాతం పన్ను అమల్లోకి వస్తుంది. లాభాలు అధికంగా ఆర్జించి ఉంటే కనుక, మార్చి 31లోపు వాటిని అమ్మేసి లాభాల స్వీకరణ చేయడం తెలివైన నిర్ణయమని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ దీర్ఘకాలిక లాభం ఒక ఏడాదిలో రూ.లక్షలోపు ఉంటే లాభాల స్వీకరణ అవసరం లేదని బీడీవో ఇండియా పార్ట్నర్ అశ్రుజిత్ మండల్ పేర్కొన్నారు. ఒకవేళ మంచి లాభాలు ఆర్జించినప్పటికీ, చక్కని పనితీరు చూపించే స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండి ఉంటే వాటిని మార్చి 31లోపు విక్రయించేసి, కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ వచ్చిన వెంటనే వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. ‘‘జనవరి 31 నాటి ధరల కంటే తక్కువకు ట్రేడ్ అవుతుంటే మంచి పనీతీరు చూపిస్తున్న వాటిని విక్రయించక్కర్లేదు. ఎందుకంటే జనవరి 31 తర్వాత ఆయా షేర్ల ధరల పతనాన్ని స్వల్ప కాలిక మూలధన నష్టంగా పన్ను అధికారులు పరిగణనలోకి తీసుకోరు. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలోని దీర్ఘకాలిక షేర్లు (ఏడాది దాటినవి) కొనుగోలు ధరల కంటే తక్కువకు ట్రేడ్ అవుతుంటే వాటిని ఏప్రిల్ 1 వరకు వేచి ఆ తర్వాత విక్రయించుకోవడం వల్ల వచ్చే నష్టాలను దీర్ఘకాలిక లాభాల నుంచి తగ్గించి చూపించుకోవచ్చు’’ అని క్వికో డాట్ కామ్ వ్యవస్థాపకుడు విశ్వజిత్ సొనంగర తెలిపారు. పన్ను రిటర్నులు ఒకేసారి వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఇక మీదట ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి గడిచిన అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించే రిటర్నులు దాఖలు చేయగలరు. అంటే 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు ఈ మార్చి 31 వరకే అవకాశం. రిటర్నులకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గానీ జూలై 31లోపు వాటిని దాఖలు చేసి అవసరమైతే మార్చి 31లోపు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని విశ్వజిత్ సొనంగర తెలిపారు. రిటర్నులు ఆలస్యం అయితే నష్టాల పరిగణింపు పరంగా సమస్య ఎదురవుతుంది. ఒకవేళ పెట్టుబడులపై నష్టాలు వస్తే, ఆ మేరకు మినహాయింపు పొందాలంటే సకాలంలో రిటర్నులు ఫైల్ చేయాలి. లేదంటే వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదలాయించుకోవాల్సి వస్తుంది. పోర్ట్ఫోలియో సమీక్ష మీ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను ఏడాదికోసారి, ఆరు నెలలకోసారి సమీక్షించుకోవాలని నిపుణుల సూచన. ఆ సమీక్షకు అనుగుణంగా నూతన ఆర్థిక సంవత్సరం నుంచి చర్యలు తీసుకోవాలి. . కేవలం పోర్ట్ఫోలియో మార్పునకే సమీక్ష అవసరమని భావించ కూడదు. మీరు వివి ధ సాధనాలకు చేసిన కేటాయింపుల్లో వ్యత్యాసాన్ని గమనించాలి. స్టాక్ మార్కెట్ గడిచిన రెండేళ్ల కాలంలో ర్యాలీ చేసి ఉన్నందున ఈక్విటీల్లో పెట్టుబడుల విలువ అధికమైతే ఆ మేరకు పోర్ట్పోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పన్ను ప్రణాళిక పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడులు అనేవి ఆర్థిక సంవత్సరం చివర్లో చూసుకుందాంలేనని చాలా మంది అనుకుంటుంటారు. చివర్లో తమకు సరిపోలని సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ విధమైన తప్పుడు నిర్ణయాలకు అవకాశం లేకుండా ఉండాలంటే పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడులను ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే మొదలు పెట్టడం మేలు. ఇందు కోసం తొలుత పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలన్నదానిపై స్పష్టతకు రావాలి. సెక్షన్ 80సీ కింద పిల్లల విద్యా ఫీజులు, గృహ రుణ అసలు చెల్లింపులు, బీమా పాలసీలపై ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకసారి 80సీ కింద పన్ను ఆదాకు ఎంత విలువ మేర ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకుంటే, ఆ తర్వాత దేనికి ఎంత మేర అన్నది కేటాయింపులు చేయాలి. ఈక్విటీ కేటాయింపులు అయితే ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో సిప్ విధానంలో పెట్టుబడులు కొనసాగించాలి. ఆయా అంశాల్లో స్పష్టమైన అభిప్రాయానికి రావడానికి నిపుణుల సలహాలను తీసుకోవాలి. వీపీఎఫ్ ఫండ్ ఇటీవల పీపీఎఫ్పై వడ్డీ రేటు తగ్గించినప్పటికీ (8.55 శాతం ప్రస్తుతం) వడ్డీ రేటు ఇప్పటికే ఎక్కువగానే ఉన్నట్టు. రాజకీయ పరమైన కారణాలతో ఈపీఎఫ్పై వడ్డీ రేటు మిగిలిన సాధనాల కంటే ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కనుక ఈపీఎఫ్ చందాదారులు అదనంగా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీనిపైనా ఈపీఎఫ్ వడ్డీ రేటే అమలవుతుంది. అయితే చాలా కంపెనీలు ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఇందుకు అనుమతిస్తాయనే విషయన్ని గుర్తుంచుకోవాలి. పేటీఎం ఖాతాదారులకు స్వల్పకాలిక రుణాలు.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా తమ యూజర్లకు స్వల్పకాలికంగా స్వల్పమొత్తాల రుణాలను సమకూర్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో జతకట్టింది. పేటీఎం–ఐసీఐసీఐ బ్యాంక్ పోస్ట్పెయిడ్ పేరిట ఈ సర్వీసు అందించనుంది. ఈ ఒప్పందం కింద.. బిల్లుల చెల్లింపులు, ఫ్లయిట్... సినిమా టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలైన వాటి కోసం పేటీఎం ఖాతా ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి డిజిటల్ క్రెడిట్ పొందవచ్చు. ఈ రుణమొత్తంపై 45 రోజుల దాకా వడ్డీ ఉండదు. రుణంగా తీసుకున్న మొత్తాన్ని 45 రోజుల్లోగా కట్టేస్తే.. వడ్డీ ప్రసక్తి ఉండదు. ఒకవేళ గడువు దాటితే రూ. 50 లేట్ ఫీజుతో పాటు 3 శాతం వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. రుణపరిమితి రూ. 3,000 నుంచి రూ. 10,000 దాకా ఉంటుంది. ఒకవేళ తీసుకున్న రుణమొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తూ మంచి ట్రాక్ రికార్డు ఉంటే.. రూ. 20,000 దాకా లిమిట్ పెంచుకోవచ్చు. రూ.20 లక్షల దాకా పన్ను రహిత గ్రాట్యుటీ ఉద్యోగులకు ఊరటనిచ్చే దిశగా పన్ను మినహాయింపు వర్తించే గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ. 10 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది. ఇప్పటిదాకా గ్రాట్యుటీ మొత్తం రూ. 10 లక్షలు దాటిన పక్షంలో పన్నులు వర్తించేవి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ (సవరణ) బిల్లు 2018.. అమల్లోకి వస్తుంది. పదిమంది పైగా సిబ్బంది ఉన్న సంస్థలో నిరాటంకంగా అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తిస్తుంది. సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఏడాదికి పదిహేను రోజుల జీతం గ్రాట్యుటీ కింద పొందవచ్చు. -
సమయం లేదు మిత్రమా... ఐదు రోజులే..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి నిండా నాలుగైదు రోజులే ఉంది. మార్చి 31తో ముగిసిపోతోంది. ఆదాయపన్ను జీవులు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు అవకాశం పొందాలంటే అర్హత కలిగిన సాధనాల్లో ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. బీమా, పీపీఎఫ్, ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో సాధనాలున్నాయి. ఇప్పటికే మీరు చేసిన పెట్టుబడులు ఆ మేరకు ఉంటే ఫర్వాలేదు. లేదంటే పన్ను ఆదా కోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో అనుకూలమైనవి ఎంచుకోవచ్చు. అందుకు పరిశీలించాల్సినవి ఇవే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈఎల్ఎస్ఎస్... ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) అన్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం. సెక్షన్ 80సీ కింద వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది. ఇవి మూడేళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటాయి. అప్పటి వరకు విక్రయించేందుకు అవకాశం ఉండదు. వీటిలో గ్రోత్, డివిడెండ్ ఆప్షన్లలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పూర్తిగా ఈక్విటీ మార్కెట్ ఆధారిత పథకాలు కనుక వీటిలో పెట్టుబడులపై రాబడులు ఎంతొస్తాయన్నది చెప్పడం కచ్చితంగా సాధ్యం కాదు. అయితే, గడిచిన ఐదేళ్లలో ఈఎల్ఎస్ఎస్ పథకాల సగటు రాబడులు వార్షికంగా 18.5 శాతం ఉన్నాయని గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు అధిక రాబడుల పరంగా ఇవి అనువైనవి. ఆర్థిక సలహాదారులు సైతం ఇతర పథకాల కంటే పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాలనే ఎక్కువగా సూచిస్తుంటారు. ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ లాకిన్ పీరియడ్ తక్కువగా ఉండటం ఆకర్షణీయ అంశం. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో సిప్ మోడ్ ఎంచుకోవడం ద్వారా సగటున అదనపు రాబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)... ఈ పింఛను పథకంలో ఎవరైనా చేరొచ్చు. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.50 లక్షలకు పన్ను మినహాయింపునకు ఇందులో ప్రయోజం పొందొచ్చు. అలాగే, మరో రూ.50,000 వరకు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ కింద కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. దీంతో మొత్తం రూ.2 లక్షలపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి దాటి చేసే పెట్టుబడులపైనే సెక్షన్ 80సీసీడీ కింద రూ.50,000కు ఎన్పీఎస్లో పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఉదాహరణకు సెక్షన్ 80సీ కింద మీరు ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పీఎస్లో రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేసినట్టయితే, మరో రూ.50,000లను ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టి దానిపైనా పన్ను ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ పథకంలో 60 ఏళ్లు కాల వ్యవధి. ఆ తర్వాత పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటి కార్పస్లో 60 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడుల ఉపసంహరణలో 40 శాతంపైనే పన్ను మినహాయింపు. మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 60 శాతాన్ని యాన్యుటీలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఉండదు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో డెట్, ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎందులో చూసినా రాబడులు 9–12 శాతం మధ్య ఉన్నాయి. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్).. ప్రభుత్వ హామీతో కూడిన పథకం. పెట్టుబడులపై పన్ను ఆదా, రాబడులకూ పన్ను మినహాయింపు ఉంది. పన్ను రహిత అధిక రాబడులను అందించే డెట్ పథకం. స్థిరాదాయ పన్ను రహిత సాధనం. పీపీఎఫ్లో వార్షికంగా చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్తో పీపీఎఫ్ పథకాన్నీ కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టడం, ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్లకు అనుగుణంగా త్రైమాసికంవారీగా వడ్డీ రేట్లను సమీక్షిస్తుండటం చిన్న ప్రతికూలత. అయితే, పీపీఎఫ్లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉండటంతో పన్ను ఆదాతో కూడిన మెరుగైన రాబడులకు ఇది ఇప్పటికీ మెరుగైన సాధనమేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం ఇందులో 7.9% వడ్డీ రేటు అమల్లో ఉంది. సుకన్య సమృద్ధి యోజన.. ఒకరిద్దరు కుమార్తెలున్నవారు వారి వయసు గనక 10 ఏళ్లలోపు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈక్విటీతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కాంపౌండింగ్ ప్రయోజనంతో కుమార్తె ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లయినా ఈ పరిమితికి లోబడి డిపాజిట్లు చేయొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు చిన్నారుల పేరిటే ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచాక 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా ఖాతా తెరిచాక 21 ఏళ్ల పాటు లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండి వివాహం అయ్యేంత వరకు ఖాతా మనుగడలో ఉంటుంది. 18 ఏళ్లు నిండినా లేక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఆ అవసరాల కోసం అప్పటి ఖాతా విలువలో 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అర్హత అవుతుంది. ఈ పథకంలో ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. మిగిలిన పన్ను ఆదా పథకాలతో పోలిస్తే ఎక్కువే. ప్రతీ త్రైమాసికానికీ ఈ పథకంపై వడ్డీరేటును కేంద్రం సమీక్షిస్తుంటుంది. ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. పెట్టుబడులపై వచ్చే వడ్డీకి, కాల వ్యవధి తీరాక చేతికందే మొత్తానికి కూడా పన్ను లేదు. పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు... బ్యాంకులో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే అన్ని రకాల డిపాజిట్లకు ఈ ప్రయోజనం లేదు. కేవలం పన్ను ఆదాతో కూడిన ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపైనే ఈ అవకాశం. వీటికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆలోపు విత్డ్రా చేసుకునేందుకు వీలుండదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ డిపాజిట్లను అందిస్తున్నాయి. వడ్డీ రేటు 6.5–7 శాతం వరకు లభిస్తోంది. పోస్టాఫీసుల ద్వారా కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా పథకాలు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల జీవిత బీమా పథకాలకు చేసే ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. యులిప్లు, టర్మ్ ప్లాన్లు, సంప్రదాయ బీమా పథకాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. బీమా పథకాల్లో చేసే పెట్టుబడులపై, జీవించి ఉంటే అందుకునే రాబడులు, అలాగే మరణ పరిహారంపైనా పన్ను లేదు. -
పార్లమెంటులో బిజినెస్
పసిడి దిగుమతి విధానం మారదు దేశంలో పసిడి దిగుమతి విధానాన్ని సమీక్షించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సీఆర్ చౌదరి లోక్సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. మెటల్స్పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి డిమాండ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ, బంగారం దిగుమతులు అధికంగానే ఉంటున్నట్లు తెలిపారు. సుంకాలు తగ్గిస్తే, అది ప్రభుత్వ ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందువల్ల సుంకాల విధాన సమీక్ష ప్రతిపాదనే లేదని అన్నారు. రక్షణ, నౌక, బొగ్గు రంగాల్లో ఎఫ్డీఐల్లేవ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రక్షణ, నౌక, బొగ్గు విభాగాలు సహా ఆరు రంగాలు అసలు విదేశీ ప్రత్య్యక్ష పెట్టుబడులనే (ఎఫ్డీఐ) ఆకర్షించలేకపోయాయి. మంత్రి సీఆర్ చౌదరి లోక్సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఫొటోగ్రాఫిక్ రా ఫిల్మ్ అండ్ పేపర్, పీచు, రంగుల్లో కలిపే రసాయనాల రంగాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించలేకపోయిన విభాగాల్లో ఉన్నాయి. రక్షణ, సింగిల్ బ్రాండ్ రిటైల్, పౌర విమానయానంసహా పలు రంగాల్లో కేంద్రం ఎఫ్డీఐ నిబంధనలను సడలించింది. 2017–18 ఏప్రిల్–డిసెంబర్ మధ్య దేశంలోకి ఎఫ్డీఐలు స్వల్పంగా 0.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో 35.94 బిలియన్ డాలర్లకు చేరాయి. -
‘ఉపాధి’లో కదలిక..
జిల్లాలో జాబ్కార్డులు 1,51,280 కూలీలు 3,21,283 మంది 2017–18 ఆర్థికసంవత్సర పనుల లక్ష్యం రూ.100కోట్లు ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల విలువ రూ.60 కోట్లు మిగతా పనులు పూర్తి చేసేందుకు ఉన్న గడువు 40 రోజులు ఆదిలాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.వంద కోట్ల లక్ష్యంతో అధికారులు పనులు ప్రారంభించగా.. కొంతకాలంగా జిల్లాలో ఇవి నిలిచిపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 40రోజులు మాత్రమే సమయం ఉండడంతో సోమవారం నుంచి ఉపాధి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి సంస్థలోని సిబ్బందికి ఉపాధి పథకంపై శిక్షణ కూడా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలకు ఏడాది పొడవున పనులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. జిల్లాలో 1,51,280 జాబ్కార్డులు ఉండగా, 3,21,283 మంది కూలీలు పని చేస్తున్నారు. మార్చి 31 తర్వాత 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ ప్రణాళిక కార్యాచరణ రూపొందించేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ లోగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న పనులను ప్రారంభించి కూలీలకు మరిన్ని పనిదినాలను కల్పించనున్నారు. అయితే ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఉపాధి పనులు జోరు గా సాగుతాయి. ఈ సమయంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు అంతగా ఉండవు. దీంతో కూలీలంతా ఉపాధి పనులవైపే మొగ్గుచూపుతారు. నీటి సంరక్షణకు పెద్దపీట.. ఉపాధి హామీ పథకంలో వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసి ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90శాతం సాగు వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడనున్నారు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్మాణం, ఫీడర్ చానళ్ల ఏర్పాటు, తదితర పనులకూ ప్రాధాన్యత ఇస్తామని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రూ.66 కోట్లు ఖర్చు.. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద రూ. 66కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.50 కోట్లు కూలీలకు, రూ.16 కోట్లు మెటీరియల్కు వెచ్చించారు. మార్చి 31లోగా మరో రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో లక్ష పదివేల పనిదినాలు కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 30.98 లక్షల పనిదినాలు కల్పించారు. కొంత కాలంగా గ్రామాల్లో ఉపాధి పనులు పెండింగ్లో పడ్డాయి. పనులన్నీ చాలా మట్టుకు వ్యవసాయ పొలాల్లోనే చేస్తున్నారు. దీంతో పొలంలో సాగు చేసిన పంట ఉండడంతో ఇన్ని రోజులు పనులు జరగలేదు. ఇప్పుడు వచ్చేది ఎండకాలం కావడం, పొలాల్లో వేసిన పంటలను తొలగిస్తుండడంతో మళ్లీ ఉపాధి పనులు ఊపందుకోనున్నాయి. ఇందులో వర్షాకాలంలో నీటిని సంరక్షించే పనులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. నేటి నుంచి జిల్లాలో పనులు.. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులను ప్రారంభించాలనే ఇప్పటికే ఉన్నతాధికారుల నుం చి ఆదేశాలు అందాయి. రూ.వంద కోట్ల ప్రణాళికతో ఈ ఆర్థిక సంవత్సరం ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేస్తున్నాం. ఇందులో నీటి సంరక్షణకు సంబంధించిన పనులు అధికంగా చేపట్టనున్నాం. వాటర్షెడ్ విధానం ప్రకారమే పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీఓ ఆదిలాబాద్ -
ఐటీ రిటర్న్ దాఖలు చేసే ముందు ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు: క్యాలెండర్ సంవత్సరం ముగిసి 20 రోజులు దాటింది. సుమారు మరో 70 రోజుల్లో అంటే 2018 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈలోపు పన్ను ప్లానింగ్ జరిగిపోవాలి. ఆఖరు నిమిషంలో కంగారు పడకుండా ముందస్తుగా అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవటం ద్వారా ఆదాయ పన్నుశాఖకు రిటర్న్ సమర్పించే విషయంలో అవగాహన ఉంటుంది. ఆఖరు నిమిషంలో చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉంటే ముందుగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పన్ను రాయితీల వినియోగంపై స్పష్టత ఉండాలని నిపుణులు చెబుతున్నారు. టీడీఎస్ వర్తించే ఉద్యోగులు రాయితీ పొందేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ముందే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం. సెక్షన్ 80 సీ కింద మినహాయింపుల కోసం ఈ సెక్షన్ కింద పెట్టే పెట్టుబడులపై ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. హౌసింగ్ లోన్ మూలధనం చెల్లింపులు, బీమాతో సహా అనేక రకాల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు వర్తిస్తాయి. వాటికి సంబంధించిన ఆధారాలు జాగ్రత్త చేసుకోవాలి. రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు ♦ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్), జీవిత బీమా పథకాలు, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తే ఓకే.. లేదంటే ఇప్పటికైనా 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిది. ♦ ఎక్కువ మొత్తంలో టీడీఎస్ కట్ కాకుండా, ఈఎల్ఎస్ఎస్ అయితే ఫండ్ స్టేట్మెంట్, జీవిత బీమా పాలసీ అయితే ప్రీమియం చెల్లించిన రసీదులను ఆఫీసు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సమర్పించాలి. ♦ పీపీఎప్ పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు సూచించే పాస్బుక్ జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ ద్వారా పీపీఎఫ్లో పెట్టుబడులు పెడితే ఖాతా వివరాలు, లావాదేవీల వివరాలు తెలిపే ఇ–రసీదు సమర్పించాలి. ఇవేకాకుండా సుకన్య సమృద్ధి యోజన లేదా ఐదేళ్ల కాలపరిమితి ఉండే టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఇచ్చే డిపాజిట్ రసీదు లేదా సర్టిఫికెట్ కాపీ సమర్పించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోని పక్షంలో టీడీఎస్ ఎక్కువ కట్ అవుతుంది. మళ్లీ రిటరŠన్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు.. మీ పిల్లలకు స్కూల్, కళాశాలల్లో చెల్లించే ట్యూషన్ ఫీజు కూడా 80సీ కింద మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ రాయితీ క్లెయిమ్ చేస్తుంటే ఫీజులకు సంబంధించిన రసీదులు జిరాక్స్ కాపీని అకౌంట్స్ సిబ్బందికి ఇవ్వాలి, ఈ రసీదుపై స్కూల్/కళాశాల అధికారి స్టాంప్, ఫీజు అందుకున్నవారి సంతకం తప్పకుండా ఉండాలి. తొలిసారి ఇల్లుకొన్న వ్యక్తులు.. కొత్తగా ఇల్లు కొన్నవారికి ఈసారి ప్రత్యేక రాయితీ ఉంది. సాధారణంగా సెక్షన్ 24 కింద గృహరుణాలపై చెల్లించే వడ్డీ మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలు వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ∙మొట్టమొదటిసారిగా ఇల్లు కొన్నవారికి అదనంగా మరో రూ.50 వేలు వరకు సెక్షన్ 80ఈఈ కింద ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అంటే తొలిసారి ఇల్లు కొన్నవారికి వడ్డీ చెల్లింపులపై రూ.2.5 లక్షల వరకూ పన్ను రాయితీ ఉంది. బ్యాంక్ నుండి మూలధనం ఎంత చెల్లించారు. వడ్డీ ఎంత చెల్లించారు తెలిపే సర్టిఫికెట్ సమర్పించాలి. హెచ్ఆర్ఏ మినహాయింపు ♦ హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసేవారు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటి వార్షిక అద్దె రూ.లక్ష (నెలకు 8,333) దాటితే ఇంటి యజమాని పాన్ నంబర్ కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. ఇంకా నిర్ణీత ఫారంలో ఇంటి యజమాని సంతకంతో కూడిన లీజు అగ్రిమెంట్, ఇంటి యాజమాన్యానికి సంబంధించిన ఆధారాలు కాపీలు ఇవ్వాలి. ♦ ఇంటి యాజమాన్యానికి సంబంధించి పన్ను రసీదు లేదా తాజా విద్యుత్ బిల్లు సరిపోతుంది. ఇల్లు ఏదైనా కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే ఆ సొసైటీ ఇచ్చే షేర్ సర్టిఫికెట్ అయినా సరిపోతుంది. ఏప్రిల్ 2017 నుంచి ఇప్పటివరకు అందుకున్న ఒరిజనల్ అద్దె రసీదులు కూడా సమర్పించాలి. గృహ రుణంతో కొన్న ఇంటిని అద్దెకిచ్చినా ఆ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీల వివరాలు విడివిడిగా పేర్కొంటూ బ్యాంకు ఇచ్చిన సర్టిఫికెట్ జతచేయాలి. ఎన్పీఎస్ పెట్టుబడులు.. మీరు పనిచేసే కంపెనీ, సంస్థ ద్వారా జాతీయ పింఛన్ పథకం (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలన్నీ మీ కంపెనీ దగ్గరే ఉంటాయి. కాబట్టి ఆ పెట్టుబడుల వివరాలు ప్రత్యేకంగా కంపెనీకి సమర్పించాల్సిన అవసరం లేదు. జీతం నుంచి కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం నుంచి ఎన్పీఎస్లో వ్యక్తిగత హోదాలో రూ.50 వేలు పెడితే మాత్రం ఆ వివరాలు ఆఫీసుకు సమర్పించాలి. ఇందుకోసం ఉద్యోగి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్), టైర్ 1 ఖాతాకు సంబంధించిన ఎన్పీఎస్ లావాదేవీల స్టేట్మెంట్ వివరాలు ఇవ్వాలి. మెడిక్లెయిమ్లు మెడిక్లెయిమ్ పాలసీ కింద చెల్లించిన ప్రీమియం ప్రూఫ్లు కంపెనీకి ఇవ్వాలి. ఈ చెల్లింపులకు సెక్షన్ 80డీ కింద సీనియర్ సిటిజన్లకు రూ.30 వేల వరకు ఇతరులకు రూ.25 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలకు మించి పరుగులు పెడుతున్నాయి. గతేడాది ఏప్రిల్తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిదిన్నర నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి జనవరి 15 వరకు) పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగి ఏకంగా 6.89 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) బుధవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9.8 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లను ఆదాయపన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జనవరి 15 నాటికి 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టయింది. స్థూల వసూళ్లు రూ.8.11 లక్షల కోట్లుగా ఉండగా, ఇందులో రూ.1.22 లక్షల కోట్లు రిఫండ్స్ (తిరిగి చెల్లింపులు) ఉన్నట్టు సీబీడీటీ తెలిపింది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన, చెప్పుకోతగ్గ పురోగతి ఉంది. స్థూల పన్ను వసూళ్లు జూన్ క్వార్టర్లో ఉన్న 10 శాతం నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో 10.3 శాతానికి, డిసెంబర్ క్వార్టర్లో 12.6 శాతానికి, ప్రస్తుత క్వార్టర్లో జనవరి 15 నాటికి 13.5 శాతానికి చేరాయి’’ అని సీబీడీటీ వెల్లడించింది. నికర పన్ను వసూళ్లు సైతం క్యూ1లో 14.8 శాతంగా ఉంటే, క్యూ2లో 15.8 శాతానికి, క్యూ3లో 18.7 శాతానికి, ప్రస్తుత క్వార్టర్లో జనవరి 15 నాటికి 18.7 శాతానికి పెరిగినట్టు వివరించింది. కార్పొరేట్ పన్ను వసూళ్లు సైతం ఇదే తీరులో వృద్ధి చెందాయి. జూన్ క్వార్టర్లో 4.8 శాతంగా ఉంటే, డిసెంబర్ క్వార్టర్ నాటికి 10.1 శాతానికి, ఆ తర్వాత 11.4 శాతానికి పెరిగాయని తెలిపింది. -
రుణ సమీకరణ రూ. 20వేల కోట్లే
న్యూఢిల్లీ: మార్కెట్ నుంచి అదనంగా రూ.50వేల కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని ముందుగా భావించినప్పటికీ.. ప్రస్తుతం దాన్ని రూ. 20,000 కోట్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటిదాకా వచ్చిన ఆదాయాలు, వ్యయాలను సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల జారీ ద్వారా ప్రస్తుత అవసరాల కోసం రూ.20,000 కోట్లు సమీకరిస్తే సరిపోతుందని సమీక్షలో తేలినట్లు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. మూడు సార్లు నిర్వహించిన సెక్యూరిటీస్ వేలంలో... రూ.15,000 కోట్ల మేర రుణాలను స్వీకరించలేదని పేర్కొంది. రాబోయే వారాల్లో మరో రూ.15,000 కోట్ల మొత్తాన్ని కూడా రుణ సమీకరణ నోటిఫికేషన్ నుంచి తగ్గించనున్నట్లు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 3.2%కి పరిమితం చేయాలనేది కేంద్రం లక్ష్యం. అయితే, గతేడాది నవంబర్ నాటికే బడ్జెట్లో నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్యం 112% మేర దాటిపోయింది. -
హెచ్యూఎల్ లాభం 1,326 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ (హెచ్యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,326 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,038 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని హెచ్యూఎల్ తెలిపింది. గత క్యూ3లో రూ.8,400 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.8,742 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ హరిశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.7,067 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ3లో రూ.7,036 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇబిటా రూ.1,162 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.1,680 కోట్లకు, ఇబిటా మార్జిన్ 15.5% నుంచి 19.6%కి పెరిగాయని పేర్కొన్నారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి... ఈ క్యూ3లో మంచి పనితీరు కనబరిచామని మన్వాని సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి సాధించామని, మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కీలక బ్రాండ్లపై మరింతగా పెట్టుబడులు పెడతామని, భవిష్యత్తు కోసం మరిన్ని కేటగిరీలను అభివృద్ధి చేస్తామని వివరించారు. కమోడిటీల ధరల పెరుగుదల సెగ ఇప్పుడిప్పుడే తగులుతోందని, వ్యయ నియంత్రణ పద్ధతులపై మరింతగా దృష్టిపెడుతున్నామని పేర్కొన్నారు. లాభదాయకతకను నిలకడగా కొనసాగించడానికి, పోటీని తట్టుకునేందుకు మరింత దూకుడుగా వ్యాపార నిర్వహణ సాగిస్తామని తెలిపారు. ఫెయిర్ అండ్ లవ్లీ కారణంగా స్కిన్ కేర్ సెగ్మెంట్, డవ్, పియర్స్ కారణంగా వ్యక్తిగత ఉత్పత్తుల సెగ్మెంట్లు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. పర్సనల్ కేర్ సెగ్మెంట్ ఆదాయం రూ.3,980 కోట్ల నుంచి రూ.4,090 కోట్లకు, హోమ్ కేర్ డివిజన్ రూ.2,689 కోట్ల నుంచి రూ.2,741 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో హెచ్యూఎల్ షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,390ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.7 శాతం క్షీణించి రూ.1,372 వద్ద ముగిసింది. -
పన్ను ఆదాకు ఏం చేద్దాం!
ఈ ఆర్థిక సంవత్సరం మరో ఐదు నెలల్లో ముగిసిపోతోంది. చివరి నిమిషంలో పన్ను ఆదాకోసం పరుగులు పెట్టే కంటే ముందుగానే స్పందిస్తే మెరుగైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవచ్చన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఎంచుకునే అవకాశం, సమయం చేతిలో ఉంటాయి. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.50 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపులున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 80సీ పరిధిలో పెట్టుబడి సాధనాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒకదానిలో పెట్టేయకుండా సరైన పథకాన్ని ఎంచుకోవడం వల్ల కాస్త మెరుగైన రాబడులు అందుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులో ఉన్న సాధనాలు, వాటి రాబడులు ఏ విధంగా ఉంటాయన్నది తెలియజేసేదే ఈ కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇవి మ్యూచువల్ ఫండ్ పథకాలు. సెక్షన్ 80సీ కింద అనుమతించిన మేర గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల మేర వీటిల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లానే ఈఎల్ఎస్ఎస్లలో కూడా రాబడులకు హామీ ఉండదు. దీర్ఘకాలంలో 12 నుంచి 18 శాతం మధ్యలో రాబడులను పొందడానికి అవకాశం ఉంటుందని గణాంకాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. పన్ను ఆదా చేసే పథకాల్లో అతి తక్కువ లాకిన్ పీరియడ్... అంటే మూడేళ్లున్నది ఈఎల్ఎస్ఎస్లోనే. పెట్టుబడి పెట్టిన తర్వాత మూడేళ్ల వరకు వెనక్కి తీసుకునే వీలుండదు. ఈఎల్ఎస్ఎస్లో చేసిన పెట్టుబడులపై ఆదాయం కోరుకుంటే డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీంతో లాకిన్ పీరియడ్ కాలంలోనూ రాబడుల నుంచి మీకు డివిడెండ్ చేతికి అందుతుంది. ఈఎల్ఎస్ఎస్లోనే నెలవారీ సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. పైగా నెలవారీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ ఆటుపోట్లను తట్టుకుని దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ అన్నది ప్రతీ వాయిదా ఇన్వెస్ట్మెంట్కు వేర్వేరుగా అమలవుతుంది. ఉదాహరణకు నవంబర్లో సిప్ చేశారనుకోండి. ఆ సిప్ మొత్తం 2020 అక్టోబర్తో గడువు తీరుతుంది. అదే ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తే 2020 నవంబర్తో ఆ సిప్ గడువు ముగుస్తుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. గత చరిత్రను బట్టి చూస్తే... వీటిలో మంచి పనితీరు గల పథకాలుగా యాక్సిస్ లాంగ్టర్మ్ ఈక్విటీ ఫండ్, రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్, డీఎస్పీ బ్లాక్రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్లను చెప్పుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ ఈక్విటీల్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పన్ను ఆదా చేసుకునేందుకు రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ పథకం ఓ మంచి ఆప్షన్. వార్షికంగా రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్న అందరూ దీనికి అర్హులు. కాకపోతే ఇంతకుముందు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండకూడదు. పెట్టుబడి ఎంత.. ఆర్జీఈఎస్ఎస్ కింద వార్షికంగా ఈక్విటీల్లో రూ.50,000 ఇన్వెస్ట్ చేయడానికి అనుమతి ఉంది. బీఎస్ఈ 100 స్టాక్స్ లేదా ఆర్జీఈఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా చేసిన పెట్టుబడుల్లో సగం మేర అంటే రూ.25,000 మొత్తానికి సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు మీరు 30 శాతం పన్ను పరిధిలో ఉన్నారనుకోండి రూ.25,000పై రూ.7,725 పన్ను భారాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇలా మూడేళ్ల పాటే పన్ను మినహాయింపు పొందేందుకు అనుమతి ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈక్విటీల్లో పెట్టుబడులు కనుక రాబడులకు ఎటువంటి హామీ ఉండదు. మార్కెట్లు, ఆయా స్టాక్స్, ఫండ్స్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పన్ను ఆదాకు ఆకర్షణీయమైన సాధనాల్లో ఇదీ ఒకటి. కానీ, కేంద్రంలో మోదీ సర్కారు కొలువు తీరిన తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుత వడ్డీ రేటు (2017 అక్టోబర్–డిసెంబర్) 7.8 శాతం. అయినా ఇతర సంప్రదాయ సాధనాలతో పోలిస్తే పన్ను ఆదా పరంగా పీపీఎఫ్ ఇప్పటికీ మెరుగైన సాధనమే. ఇందులో వార్షికంగా 1.50 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు గడువు తీరిన తర్వాత వచ్చే రాబడులు, అసలు మొత్తంపైనా పన్ను లేదు. పీపీఎఫ్ ఖాతా నుంచి అరుదైన సందర్భాల్లో తప్ప 15 ఏళ్లలోపు ముందుగా వైదొలిగే అవకాశం లేదు. అయితే, ప్రారంభించిన అనంతరం ఆరో ఆర్థిక సంవత్సరం నుంచి రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, ఖాతాలో బ్యాలెన్స్ పై మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఐదో ఆర్థిక సంవత్సరం లోపు అవసరమైతే రుణం కూడా పొందొచ్చు. ఆరో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ప్రవాస భారతీయులు పీపీఎఫ్ ప్రారంభించేందుకు అవకాశం లేదు. ఈ పథకంలో ఏటా కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ నెలా 5వ తేదీన ఇన్వెస్ట్ చేస్తే ఆ నెలలో మిగిలి ఉన్న రోజులకు వడ్డీ లభిస్తుంది. 5 తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మరుసటి నెల నుంచే ఆ మొత్తంపై వడ్డీ దక్కుతుంది. ప్రతీ నెలా కాకుండా ఏడాదికోసారి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఏప్రిల్ 5లోపు చేసినట్టయితే ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది. దాంతో 15 ఏళ్ల కాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. పన్ను ఆదాతోపాటు దీర్ఘకాలిక అవసరాలైన పిల్లల విద్య, వివాహాలు, ఇల్లు, రిటైర్మెంట్ అవసరాల కోసం ఈ పథకం అనువైనది. రిస్క్ వద్దనుకునేవారికి నప్పే పథకం. సుకన్య సమృద్ధి యోజన పన్ను ఆదాకు సుకన్య సమృద్ధి యోజన కూడా ఉపయోగపడే పథకమే. కుమార్తెల పేరిట ఇన్వెస్ట్ చేసేందుకు ఉద్దేశించిన పథకం ఇది. వారి వివాహం, ఉన్నత విద్యావసరాలకు ఉపయోగపడుతుంది. ఇందులో వార్షికంగా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిపై ప్రస్తుతం 8.8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆడపిల్ల వయసు 15 ఏళ్లు వచ్చే వరకు ఆమె పేరిట డిపాజిట్ చేయవచ్చు. 21 ఏళ్లు రాగానే కాల వ్యవధి తీరిపోతుంది. అమ్మాయి వయసు 16వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపై వచ్చే రాబడులు పూర్తిగా పన్ను రహితం. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత కలిగినవే. ఎఫ్డీ రేట్లు ప్రస్తుతం సగటున 6–7 శాతం మధ్యలో ఉన్నాయి. వార్షికంగా రూ.1.50 లక్షల వరకు బ్యాంకులో ఎఫ్డీ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాల వ్యవధి కలిగిన డిపాజిట్లకే ఇది వర్తిస్తుంది. ఐదేళ్లలోపు డిపాజిట్లకు పన్ను మినహాయింపు లేదు. పైగా ఇందులో పెట్టుబడులకే పన్ను మినహాయింపు ప్రయోజనం. అంటే డిపాజిట్పై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. సీనియర్ సిటిజన్స్ అయితే అరశాతం ఎక్కువ వడ్డీ రేటు అందుకోవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనం రూ.1.5 లక్షలకు అదనంగా సెక్షన్ 80సీసీడీ కింద మరో రూ.50,000 పన్ను ఆదా చేసుకునేందుకు ఉన్న చక్కని ఆప్షన్ ఎన్పీఎస్. అంటే రెండూ కలిపి బేసిక్ పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలకు అదనంగా రూ.2 లక్షలు మొత్తం రూ.4.5 లక్షల ఆదాయానికి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ సదుపాయం లేని వారు స్వచ్ఛందంగా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ విధమైన రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. నెలకు కనీసం రూ.500, ఏడాదిలో కనీసం రూ.6,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. ఎన్పీఎస్లో రాబడులు స్థిరంగా ఉండవు. ఎందుకంటే ఇందులో పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీ, గిల్ట్స్, కార్పొరేట్ బాండ్లు అంటూ మూడు విభాగాలున్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ స్థాయిలకు అనుగుణంగా ఒక్కో విభాగానికి నిర్ణీత మొత్తాన్ని కేటాయించుకోవచ్చు. అయితే ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతమే అనుమతి ఉంది. ఎన్పీఎస్లో ఈక్విటీ పోర్షన్తో కూడిన రాబడులు 10 నుంచి 15 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడుల పరంగా తక్కువ చార్జీలు ఉన్నటువంటి సాధనం ఇది. ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు పెట్టుబడుల విలువపై కేవలం 0.0009 శాతమే. పథకం కాల వ్యవధి ముగిసిన తర్వాత వచ్చే రాబడుల్లో 60 శాతంపై పన్ను పడుతుంది. ఆన్లైన్లోనే సులభంగా ఎన్పీఎస్ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు ప్రతీ నెలా తమ వేతనంలో 12 శాతాన్ని ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ సదుపాయం ఉన్న ఉద్యోగులు అదనంగా ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందుకు వీలు కల్పించేది వీపీఎఫ్. తమ బేసిక్ వేతనం, డీఏ మొత్తానికి సమాన స్థాయిలో వీపీఎఫ్లో గరిష్టంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈపీఎఫ్పై ఎంత వడ్డీ రేటు అమల్లో ఉంటే అదే వీపీఎఫ్ పెట్టబడులకూ అమలవుతుంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఇంకా నిర్ణయించాల్సి ఉంది. వీపీఎఫ్లో చేసే పెట్టుబడులను రిటైర్మెంట్ సమయంలోనే వెనక్కి తీసుకోగలుగుతారు. పన్ను ఆదా చేసుకునేందుకు ఉన్న సాధనాల్లో ఇది కూడా ఒకటి. రాబడులన్నీ పన్ను రహితం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వ హామీతో పోస్టాఫీసులు జారీ చేసేవి ఇవి. పూర్తి భద్రత ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఐదేళ్లు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. దీనిపై వార్షిక వడ్డీ రేటు 2017 అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్కు 7.8 శాతం అమల్లో ఉంది. ప్రతీ ఆరు నెలలకు ఓసారి వడ్డీ అసలుకు కలుస్తుంది. దీనిపై వచ్చే వడ్డీ రేటును ఇతర ఆదాయం కింద ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇలా చూపించడం ద్వారా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. కనుక పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. జీవిత బీమా పాలసీలు జీవిత బీమా పాలసీల్లో యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక రకం. ప్రీమియంలో బీమా రక్షణ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వచ్చిన రాబడులను ఫండ్ చార్జీలు, ఇతర వ్యయాలు మినహాయించుకుని ఇన్వెస్టర్లకు పంచుతాయి. ఒకవైపు జీవిత రక్షణ, మరోవైపు పెట్టుబడులపై రాబడులను అందించే పథకం యులిప్. ఇందులో రాబడులకు హామీ లేదు. పథకం పనితీరును బట్టి 5 నుంచి 11 శాతం మధ్య రాబడులను ఇవ్వొచ్చు. దీర్ఘకాలం పాటు (10 ఏళ్లు ఆపైన) పాలసీని కొనసాగించినట్టయితేనే మెరుగైన రాబడులకు వీలుంటుంది. అలాగే, సంప్రదాయ జీవిత బీమా పాలసీ కూడా పన్ను ప్రయోజనంతో కూడిన పెట్టుబడి సాధనమే. బీమా పాలసీ ఏదైనా చెల్లించే ప్రీమియంపై ఆదాయపన్ను చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సమ్ అష్యూరెన్స్లో గరిష్టంగా 10 శాతానికే ఇది పరిమితం. ఇంటి రుణం అద్దింట్లో ఉండేవారికి రుణం తీసుకుని సొంతిల్లు సమకూర్చుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఒకటి సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం. రెండోది పన్ను ఆదా చేసుకోవడం. పన్ను పరంగా కూడా రెండు ప్రయోజనాలున్నాయి. రుణంలో అసలుకు చేసే జమలు సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనికి అదనంగా ఇంటి రుణంపై ఓ ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీ ఆదాయం రూ.2 లక్షలకు రాయితీ పొందేందుకు ఆదాయ పన్ను చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ఇల్లును అద్దెకు ఇవ్వకుండా సొంతంగా నివాసం ఉంటేనే ఈ ప్రయోజనం. మొదటి సారిగా ఇంటిని రుణంపై తీసుకుని ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల వడ్డీ చెల్లించారనుకోండి. రూ.2 లక్షల రాయితీపై అదనంగా మరో రూ.50,000కూ సెక్షన్ 24 కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. హెచ్ఆర్ఏ అయితే... ఒకవేళ మీరు ఇంటి అద్దె చెల్లిస్తుంటే దాని నుంచి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు పనిచేసే సంస్థ హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అద్దెను చెక్ రూపంలో చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను దగ్గర పెట్టుకోండి. మీ ఇంటి అద్దె ఏడాదికి రూ.లక్ష దాటితే ఓనర్ పాన్ నంబర్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆదాయం నుంచి తగ్గించి చూపిస్తారు. వీటిలో 1. కంపెనీ ఇస్తున్న వాస్తవ హెచ్ఆర్ఏ అలవెన్స్. 2. చెల్లిస్తున్న అద్దెలోంచి బేసిక్ శాలరీలో 10% తీసివేయగా వచ్చే మొత్తం. 3. మెట్రోలో నివసిస్తుంటే బేసిక్ శాలరీలో 50%, ఇతర పట్టణాల్లో అయితే 40%. ఒకవేళ సొంతిల్లు ఉండి, అది పనిచేస్తున్న కార్యాలయానికి దూరంగా ఉండటం వల్ల అద్దె ఇంట్లో ఉంటే కూడా హెచ్ఆర్ఏ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. -
బంగారం దిగుమతులు పెరిగే చాన్స్!
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) పెరిగే అవకాశం ఉందని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) అంచనావేసింది. ఈ పరిమాణాన్ని 700 టన్నులుగా మండలి పేర్కొంది. 2016–17లో ఈ పరిమాణం 500 టన్నులు. ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మండలి చైర్మన్ ప్రవీణ్ శంకర్ పాండ్య మాట్లాడుతూ, 2017–18 వార్షిక బడ్జెట్లో దిగుమతుల సుంకాన్ని 4 నుంచి 5 శాతం శ్రేణికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 10 శాతం వల్ల బంగారం అక్రమ రవాణా సమస్య ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ వృద్ధికి కూడా ఈ స్థాయి దిగుమతి సుంకం సరికాదని అన్నారు. కాగా ఇదే సమావేశంలో మాట్లాడిన మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సవ్యసాచి రాయ్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం దిగుమతులు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పసిడి విధానాన్ని వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలకుగాను రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గింది. గత (2016– 17) ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,941.86 కోట్లు ఆదాయంరాగా.. ఈసారి సుమారు రూ.100 కోట్లు తక్కువగా రూ.1,841.58 కోట్లు సమకూరింది. ఇందులో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 4 రిజిస్ట్రేషన్ జిల్లాల నుంచే రూ.1,383 కోట్లు రావడం గమనార్హం. మిగతా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల బాగా తగ్గిపోయినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మహబూబ్నగర్లో ఏకంగా 35% తగ్గుదల నమోదైంది. మొత్తంగా మే, ఆగస్టుల్లో ఆదాయం బాగా తక్కువగా సమకూరింది. జూలై, సెప్టెంబర్ ల్లో ఎక్కువగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య బాగా తగ్గిపోయింది. గతేడాది తొలి 6 నెలల్లో 5,69,572 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా.. ఈసారి 5,07,697 లావాదేవీలే జరిగాయి. హైదరాబాద్లో లావాదేవీలు ఏకంగా మూ డొంతులు తగ్గిపోయినా.. ఆదాయం మాత్రం గతేడాది స్థాయిలో సమకూరడం గమనార్హం. -
టెక్ మహీంద్రా లాభం రూ.836 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.645 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.836 కోట్లకు పెరిగిందని టెక్ మహీంద్రా తెలిపింది. ఆదాయం రూ.7,167 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.7,606 కోట్లకు పెరిగిందని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. డాలర్ల పరంగా నికర లాభం 34 శాతం వృద్ధితో 12.9 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 117 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, పరిశ్రమ డిమాండ్లు అప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పటికీ, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ మంచి వృద్ధి సాధించామని వినీత్ నయ్యర్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.5,961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 75,587, బీపీఓ వ్యాపారానికి సంబంధించిన ఉద్యోగులు 35,287గా మొత్తం మీద తమ కంపెనీ ఉద్యోగులు 1.17 లక్షలుగా ఉన్నారని వివరించారు. డేవిడ్ వ్యూహంతో వృద్ధి... తమ డేవిడ్ (డిజిటైజేషన్, ఆటోమేషన్, వెర్టికలైజేషన్, ఇన్నోవేషన్, డిస్రప్షన్) వ్యూహం మంచి ఫలితాలనిస్తోందని, ఆదాయం, లాభం, కొత్త వ్యాపారాల్లో మంచి వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ ఎండీ, సీపీ, గుర్నాని పేర్కొన్నారు. ఫలి తాల నేపథ్యంలో మార్కెట్లో టెక్ మహీంద్రా షేరు 1.5 శాతం పెరిగి రూ.489 వద్ద ముగిసింది. -
ఫలితాలు, గణాంకాలే దిక్సూచి
ఈ వారం నుంచి కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ఈ నెల 12న (గురువారం) వెలువడే ఐటీ దిగ్గజం టీసీఎస్ క్యూ2 ఫలితాలు, అదే రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం స్టాక్మార్కెట్ను ప్రభావం చూపే కీలకాంశాలని నిపుణులంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, వీటికి ప్రపంచ మార్కెట్లు స్పందించే తీరు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల సరళి, డాలర్తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు తదితర అంశాలు కూడా స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. ఈ వారంలో దాదాపు 30కు పైగా కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నెల 12న టీసీఎస్ ఫలితాలు వస్తాయి. అదే రోజు బజాజ్ కార్ప్, సైయంట్, ఇండస్ఇంద్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా ఫలితాలు వస్తాయి. ఇక శుక్రవారం(13న) రిలయన్స్ ఇండస్ట్రీస్, కర్ణాటక బ్యాంక్, ఎంసీఎక్స్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. ఈ నెల 10న (మంగళవారం)సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫలితాలు వస్తాయి. 11న ఫెడ్ మినిట్స్... సమీప భవిష్యత్తులో మార్కెట్ గమనాన్ని కంపెనీల క్యూ2 ఫలితాలు నిర్దేశిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇక ఈ వారానికి పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు గమనించాల్సిన ముఖ్యాంశాలని వివరించారు. ఇటీవల జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు (మినట్స్) ఈ నెల 11న(బుధవారం) వెల్లడవుతాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ హెడ్ వి.కె. శర్మ పేర్కొన్నారు. ఈ సమావేశ వివరాలు ఎలా ఉన్నాయో అన్న విషయానికి కాక ఈ వివరాలకు అమెరికా మార్కెట్ స్పందనను బట్టి మన మార్కెట్ స్పందన ఉంటుందని వివరించారు. జీఎస్టీకి సంబంధించి కీలక నిర్ణయాల నేపథ్యంలో సోమవారం మార్కెట్కు ఊరట లభించగలదని ఆయన అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగానే ఫలితాలు..! వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) అమలు సందర్భంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మార్కెట్ దృష్టి ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(పీసీజీ రీసెర్చ్) సంజీవ్ జర్బాడే తెలిపారు. కంపెనీల క్యూ2 ఫలితాలు కూడా కీలకమైనని పేర్కొన్నారు.జీఎస్టీ అమలు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయని జైఫిన్ అడ్వైజర్స్ సీఈఓ దేవేంద్ర నేగి చెప్పారు. భారత ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉన్నాయని, మన మార్కెట్ వాల్యూయేషన్ అధికంగా ఉందని.. ఈ అంశాలు మన మార్కెట్ జోరుకు కళ్లెం వేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం నిఫ్టీ బాగా పెరగడంతో ఈ వారం ప్రారంభంలో నిఫ్టీ మరింతగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ చెప్పారు. నిఫ్టీ 9,980–10,000 పాయింట్లను అధిగమించగలిగితే, 1–2 వారాల్లోనే నిఫ్టీ ఆల్టైమ్ హై(10,179)ను అధిగమించే అవకాశాలున్నాయని వివరించారు. కాగా గత వారంలో సెన్సెక్స్ 530 పాయింట్లు (1.69 శాతం), నిఫ్టీ 191 పాయింట్లు(1.95 శాతం) చొప్పున లాభపడ్డాయి. కాగా ఈ నెల 3–6 కాలానికి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) నికరంగా రూ.551 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఆర్థిక వృద్ధి్ద మందగించడం, వాల్యూయేషన్లు అధికంగా ఉండటంతో గత రెండు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కితీసుకున్నారని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ అనింద్య బెనర్జీ చెప్పారు. అయితే, డెట్ మార్కెట్లో మాత్రం విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఎఫ్పీఐలు ఈ నెల 3–6 మధ్య డెట్ మార్కెట్లో రూ.4,886 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కొనసాగుతున్న విదేశీ విక్రయాలు ఈ వారం రెండు ఐపీఓలు.. ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ ఐపీఓ నేడు (సోమవారం) ప్రారంభమై ఈ నెల 11న ముగుస్తుంది. రూ.1,645–1,650 ప్రైస్బ్యాండ్ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,001 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఐపీఓలో భాగంగా 20 శాతం వాటాకు సమానమైన 60.65 లక్షల షేర్లను ఆఫర్ చేస్తోంది. యాక్సిస్ క్యాపిటల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ఇక ఈ నెల 11న ప్రారంభమై 13న ముగిసే ఐపీఓ ద్వారా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.11,370 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ప్రైస్బ్యాండ్ను రూ.855–912గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్, డాషే ఇండియా, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, కోటక్ క్యాపిటల్ సంస్థలు ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. -
మందులో ముందుకు!
-
మందులో ముందుకు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.21,764.34 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరింది. ఇది గతేడాది ఇదే సమయంలో నమోదైన ఆదాయం కంటే రూ.27,70.07 కోట్లు అధికం. ఇందులో వాణిజ్యపన్నుల తర్వాత అధికంగా మద్యం విక్రయాల ద్వారానే ఆదాయం నమోదయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు మద్యం ఆదాయం రూ. 1,956.52 కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి రూ. 2,927.59 కోట్లు సమకూరింది. అంటే గత ఆర్థిక సంవత్సర కన్నా అదనంగా రూ.971.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు స్పష్టమైంది. ఇది కేవలం మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే. దీనికి అదనంగా మద్యంపై వ్యాట్ రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 3,579 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు శూన్యంగా ఉన్నప్పటికీ మద్యం ఆదాయం వృద్ధిలో మాత్రం రాష్ట్రం దూసుకుపోతోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్షాపులను తొలగిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పాటు బెల్ట్షాపులు మరిన్ని పెరగడం, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడబడితే అక్కడ మద్యం టెట్రాప్యాకెట్లలో విక్రయించడం మొదలైంది. తాజాగా మద్యాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తూ ‘ఇంటింటికీ మద్యం’ సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మినహా మిగతా అన్ని చోట్లా మద్యం ఆదాయంలో వృద్ధి 40 శాతం పైగానే నమోదైంది. సీఎం చంద్రబాబు మాటలు వేరు, చేతలు వేరని ఈ అంకెలే స్పష్టం చేస్తున్నాయని మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు పేర్కొంటున్నారు. విశాఖలో అత్యధిక ఆదాయం విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా మద్యం ద్వారా రూ. 318.34 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో మద్యం ద్వారా తక్కువగా రూ. 141.96 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వృద్ధి రేటు 60.12 శాతంగా నమోదైంది. మద్యం వినియోగాన్ని నియంత్రించడం కన్నా వీలైనంత మేర వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందనడానికి మద్యం ఆదాయం పెరుగుదలే నిదర్శనమని ఎక్సైజ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పేరుకు మాత్రమే బెల్ట్ షాపుల నియంత్రణ అంటూ ప్రచారం సాగుతోంది తప్ప ఎక్కడా అలాంటి చర్యలు కనిపించడం లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పరిష్కార వేదిక పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలోనే మద్యం విక్రయాలను నియంత్రించాల్సిందిగా 92 శాతం మంది కోరటం గమనార్హం. బెల్ట్ షాపుల నియంత్రణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని... మెడికల్ షాపులు, లాడ్జీలు, కిరాణా షాపులు, కిల్లీ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని పరిష్కార వేదికకు ఫిర్యాదులు కోకొల్లలు వస్తున్నాయి. -
యూనియన్ బ్యాంక్ లాభం 30 శాతం డౌన్
ముంబై: మొండి బాకీలు, భారీ ప్రొవిజనింగ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 117 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్థులు ఏకంగా 10.16 శాతం నుంచి 12.63 శాతానికి ఎగిశాయి. నికర నిరర్థక ఆస్తులు 6.16 శాతం నుంచి 7.47 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం పెరిగినప్పటికీ మొండిబాకీలకు కేటాయింపుల వల్ల వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం క్షీణించిందని బ్యాంక్ సీఈవో రాజ్కిరణ్ రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రుణాల్లో మరో 4 శాతం కొత్తగా మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరో 10 ఎన్పీఏ ఖాతాలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు పంపాలని యోచిస్తున్నట్లు వివరించారు. -
ఆర్బీఐ డివిడెండ్ చిక్కి సగమైంది!
కేంద్రానికి రూ.30,659 చెల్లించడానికి ఓకే ♦ 2015–16లో మాత్రం ఈ మొత్తం 65,876 కోట్లు ♦ కొత్త నోట్ల ముద్రణకు భారీ వ్యయం ఓ కారణం ♦ రూపాయి విలువ పెరగటమూ మరో కారణం ♦ రాబడికి ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి! ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెల్లించే డివిడెండ్ గడిచిన ఆర్థిక సంవత్సరం భారీగా సగానికి సగం పడిపోయింది. ఆర్బీఐకి ఆర్థిక సంవత్సరం జూన్తో ముగుస్తుంది. ఈ కాలానికి సంబంధించి ఆర్బీఐ రూ.30,659 కోట్లు మాత్రమే కేంద్రానికి చెల్లించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.65,876 కోట్లు. కొత్త నోట్ల ముద్రణ కారణం... విశ్లేషకుల అంచనా ప్రకారం భారీగా డివిడెండ్ పడిపోడానికి ప్రధాన కారణాల్లో... డీమోనిటైజేషన్ నేపథ్యంలో– కొత్త నోట్ల ముద్రణకు అయిన వ్యయం ఒకటి. రూ.500 నోటు ముద్రణకు సగటున రూ.2.87 నుంచి రూ.3.09 శ్రేణిలో వ్యయమయితే రూ.2,000 నోటు ముద్రించడానికి సగటున రూ.3.54 నుంచి రూ.3.77 మధ్యలో ఖర్చయిందని ఇటీవలే ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. అయితే డీమోనిటైజేషన్ అనంతరం కొత్త నోట్ల ముద్రణకు ఆర్బీఐ మొత్తంగా ఎంత వెచ్చించిందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘గురువారం జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశంలో... కేంద్రానికి రూ.30,659 డివిడెండ్ చెల్లించడానికి బోర్డు ఆమోదముద్ర వేసింది’అని ఆర్బీఐ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. అయితే గత ఏడాదికన్నా తక్కువ డివిడెండ్ చెల్లించడానికి గల కారణాలను మాత్రం ప్రకటన వెల్లడించలేదు. అయితే కొత్త నోట్ల ముద్రణ, రివర్స్ రెపో ద్వారా అధిక చెల్లింపులు, డాలర్ మారకంలో రూపాయి విలువ గణనీయ పెరుగుదల వంటి అంశాలు కూడా కారణాలు కావచ్చని విశ్లేషణలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం చూపు... 2017–18లో కనీసం రూ.58,000 కోట్లు ఆర్బీఐ నుంచి వస్తాయని ప్రభుత్వం భావించింది. బడ్జెట్ అంచనాల ప్రకారం ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.74,901 కోట్లు డివిడెండ్ రూపంలో అందుకోవచ్చని భావించారు. ఆర్బీఐ నుంచి డివిడెండ్ భారీగా పడిపోవడంతో, కేంద్ర ఆర్థిక ప్రణాళికపై కొంత ఒత్తిడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. 2017–18 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం) నిర్దేశిత 3.2 శాతం వద్ద కట్టడి చేయడానికి అదనపు కసరత్తు చేయాల్సి ఉంది. తాజా పరిణామంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ మాట్లాడుతూ... గడచిన ఐదేళ్లలో బ్యాంకింగ్ రాబడి తగ్గుతూ వస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతికూల వడ్డీరేట్లు దీనికి కారణమని అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగడం వల్ల రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచిన డిపాజిట్పై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ), సంబంధిత చెల్లింపులు రెవెన్యూపై ప్రభావం చూపుతున్నట్లూ ఆయన విశ్లేషించారు. -
మరో పెద్ద మార్పు చేయనున్న కేంద్రం!
న్యూఢిల్లీ: పాత పద్ధతులు, పాత వ్యవస్థలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పాత సంప్రదాయానికి కూడా స్వస్థి పలికే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో మార్పులు చేయాలని భావిస్తోంది. ఇక నుంచి గతంలో మాదిరిగా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి కాకుండా జనవరి నుంచి డిసెంబర్కు లెక్కగట్టాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని శుక్రవారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు లోక్సభలో ప్రకటించారు. 'ఆర్థిక సంవత్సరం మార్పు అంశం ప్రస్తుతం పరిగణనలో ఉంది' అని ఆయన తెలిపారు. ఒక వేళ ఆర్థిక సంవత్సర షెడ్యూల్ మారిస్తే 2018 నుంచి బడ్జెట్ను ఫిబ్రవరిలో కాకుండా డిసెంబర్లో ప్రవేశ పెడతారా, నవంబర్లో ప్రవేశపెడతారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండగా ఆ విధానానికి స్వస్థి పలికి అంతా ఒకే బడ్జెట్గా మార్చిన విషయం తెలిసిందే. అలాగే, గతంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చారు. ఈ విధంగానే మరోసారి ఆర్థిక సంవత్సరం కూడా మార్పు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. -
బజాజ్ ఫైనాన్స్ లాభం 42% వృద్ధి
♦ క్యూ1లో రూ. 602 కోట్లు ♦ రూ. 4,500 కోట్ల సమీకరణకు షేర్హోల్డర్లు ఓకే న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 42 శాతం ఎగిసి రూ. 602 కోట్లుగా నమోదైంది. 2016–17 ఏప్రిల్–జూన్ వ్యవధిలో లాభం రూ. 424 కోట్లే. ఇక తాజాగా ఆదాయం సైతం 39 శాతం వృద్ధి చెంది రూ. 2,282 కోట్ల నుంచి రూ. 3,165 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. డెట్ సెక్యూరిటీస్ జారీ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు సమీకరించే ప్రతిపాదనకు షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. గతేడాది జూన్ ఆఖరు నాటికి రూ. 49,608 కోట్లుగా ఉన్న బజాజ్ ఫైనాన్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి 39 శాతం పెరిగి రూ. 68,883 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సంస్థ షేరు ధర సుమారు 2 శాతం లాభంతో రూ. 1,543 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ లాభం 10% అప్
♦ క్యూ1లో రూ.252 కోట్లు ♦ తగ్గిన వడ్డీ ఆదాయం ♦ 7.09 శాతానికి నికర ఎన్పీఏలు న్యూఢిల్లీ: వడ్డీ ఆదాయం తగ్గుదలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభ వృద్ధి 10 శాతానికి పరిమితమైంది. సుమారు రూ. 252 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంకు లాభం దాదాపు రూ. 229 కోట్లు. ఇక తాజాగా ఆదాయం రూ. 11,786 కోట్ల నుంచి రూ. 12,304 కోట్లకు పెరిగింది. మరోవైపు గత క్యూ1లో నమోదైన రూ. 10,202 కోట్లతో పోలిస్తే వడ్డీ ఆదాయం ఈసారి రూ. 10,196 కోట్లకు తగ్గింది. అటు మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 9.71 శాతం నుంచి 10.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 6.69 శాతం నుంచి 7.09 శాతానికి చేరాయి. ఫలితంగా మొండిబకాయిలకు చేయాల్సిన ప్రొవిజనింగ్ కూడా పెరిగి రూ. 1,469 కోట్ల నుంచి రూ. 2,270 కోట్లకు ఎగిసింది. బుధవారం బీఎస్ఈలో కెనరా బ్యాంకు షేరు ధర 0.58 శాతం పెరిగి రూ. 371 వద్ద ముగిసింది. -
ఐటీ రిటర్నులు వేస్తున్నారా?
గడిచిన ఏడాది కాలంలో ఆదాయపన్ను పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసేందుకు జులై నెలాఖరు వరకు గడువుంది. ఈనేపథ్యంలో ఆ మార్పులేంటన్నది తెలియకపోయినా కూడా కొన్ని తప్పులు జరిగే అవకాశముంది. ఆదాయపు పన్ను చెల్లించినా... లేక మినహాయింపులకు లోబడి పన్ను తప్పించుకున్నా... ఎవరైనా సరే!! ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే వారంతా ఏటా రిటర్నులు వెయ్యటం చట్ట ప్రకారం తప్పనిసరి. అయితే, కొందరు తెలిసో, తెలియకో రిటర్నుల పత్రాల్లో తప్పులు చేస్తుంటారు. వార్షికాదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన పన్ను ఈ వివరాలన్నింటినీ రిటర్నుల్లో తప్పనిసరిగా చెప్పాలి. అయితే, చివరి నిమిషంలో రిటర్నులు వేసే హడావిడిలోనో, నిబంధనలు పట్టించుకోకపోవడం వల్లనో తప్పులు జరుగుతుంటాయి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక, పెద్ద నోట్ల రద్దు తర్వాత... బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, విదేశాల్లోని ఆస్తులు, ఆదాయం వంటి కీలక సమాచారం తెలియజేయకపోతే చట్ట ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విధమైన సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే రిటర్నుల్లో తప్పులు, దాపరికాలకు అవకాశం లేకుండా జాగ్రత్తపడాలి. అందుకోసం ఏం చేయాలనే విషయమై పన్ను నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇస్తున్న కథనమిది... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రిటర్నులు ఎవరు ఫైల్ చేయాలి? ఆదాయపన్ను రిటర్నులు ఎవరు దాఖలు చేయాలన్న విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంటుంది. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏటా కనీస ఆదాయ పరిమితి (రూ.2.50 లక్షలు) దాటిన ప్రతి ఒక్కరూ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిమితి 60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని ఎలా చూడాలంటే స్థూల ఆదాయం నుంచి ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), కన్వేయన్స్, ఎల్టీఏ తదితర మినహాయింపులు తీసివేయగా వచ్చే నికర ఆదాయం కనీస ఆదాయ పరిమితి దాటితే రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80టీటీఏ కింద వివిధ బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి, పిల్లలకు చెల్లించిన స్కూలు ఫీజుల మొత్తానికి... ఇలా పలు రకాల ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులకు మినహాయింపు పొందవచ్చు. ఇలా మినహాయింపులన్నీ పొందాక కొందరు పన్ను చెల్లించాల్సి రాకపోవచ్చు. ఈ మినహాయింపులన్నీ పొందాక పన్ను పరిధిలోకి రాకపోయినా సరే... వారు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఉదాహరణకు రమణ (30) వార్షిక స్థూల వేతనం రూ.3 లక్షలు. ఇతడి వేతనంలో హెచ్ఆర్ఏ, కన్వేయన్స్తదితర మినహాయింపులు రూ.20,000 ఉన్నాయి. అదే సమయంలో 80సీ కింద పన్ను మినహాయింపులు పొందగలిగే రూ.40,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు హెచ్ఆర్ఏ, కన్వేయన్స్, ఎల్టీసీ రూపంలో ఉన్న రూ.20,000 స్థూల వేతనం నుంచి మినహాయిస్తే వార్షిక వేతనం రూ.2,80,000 అవుతుంది. కనీస ఆదాయ పరిమితి రూ.2.50లక్షల కంటే ఇది ఎక్కువే కనుక రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. ఇక సెక్షన్ 80 కింద చేసే పెట్టుబడులు, వ్యయాలు పన్ను పరమైన మినహాయింపులే కానీ, రిటర్నుల దాఖలుకు వర్తించవు. అంటే రూ.40,000పై రమణ పన్ను చెల్లించనక్కర్లేదు కానీ, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు ఈ నెల 31 ఆ లోపే వేస్తే మంచిది రిటర్నులో తప్పులు లేకుండా చూసుకోవాలి రద్దు తర్వాతి డిపాజిట్లను వెల్లడించాలి ఆధార్తో పాన్ అనుసంధానం తప్పనిసరి టీడీఎస్ వివరాలు పరిశీలించాలి మీరు ఉద్యోగులైతే మీ యజమాని ప్రతినెలా జీతంలో పన్ను కింద కొంత కోత వేస్తారు. అలాగే వ్యాపారులైతే మీకు చెల్లించేవారు వారే పన్ను చెల్లించేసి మిగిలిన సొమ్ము మీకిస్తూ ఉంటారు. అంటే ఆదాయంపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) విధించినట్టన్నమాట. అయితే ఈ టీడీఎస్ మీ పాన్ నంబర్పై జమ అయిందా, లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఉద్యోగ సంస్థ టీడీఎస్ విధించినట్టయితే అది ఫామ్ 16లో కనిపిస్తుంది. వ్యాపారులకు చెల్లించేవారు కూడా ఇపుడు ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు కనక అది కూడా పాన్ నంబరుపైనే జమవుతుంది. ఫామ్ 26ఏఎస్ను పరీశీలించడం ద్వారా ముందస్తు పన్ను, వడ్డీ, ఇతర ఆదాయంపై టీడీఎస్ మీ పాన్ నంబర్పై జమ అయిందీ, లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే దాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇవేమీ పరిశీలించకుండా యథాలాపంగా రిటర్నులు దాఖలు చేసేసి పనైపోయిందని అనుకుంటే కష్టమే. రిటర్నుల్లో పేర్కొన్న వివరాలకు, టీడీఎస్కు మధ్య వ్యత్యాసం కనిపిస్తే నోటీసు అందుకోవాల్సి వస్తుంది. నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండి, దానికి పాన్ నంబర్ లింక్ అయి ఉంటే ఫామ్ 26ఏఎస్ను పొందడం సులభమే. వడ్డీ, ఇతర ఆదాయం కూడా... ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయానికి పన్ను ఉండదని కొందరు అనుకుంటుంటారు. నిజానికి ఈ డిపాజిట్లు సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపునకు ఉపకరించేవి. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏటా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం కనక రూ.10 వేలు దాటితే దానిపై బ్యాంకులు టీడీఎస్ మినహాయించుకుని మిగిలిందే చెల్లిస్తాయి. కొందరు తెలివిగా ఈ కోత నుంచి తప్పించుకునేందుకు వివిధ శాఖల్లో డిపాజిట్లు చేస్తుంటారు. కానీ, ఇది గతంలో. ప్రస్తుతం ఓ బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తి ఎన్ని డిపాజిట్లు చేసినా అధికారులకు తెలిసిపోతుంది. అన్నింటి మొత్తాన్ని లెక్కించి టీడీఎస్ కత్తిరించేస్తున్నారు. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 దాటినా దానిపైనా టీడీఎస్ అమలవుతుంది. గడువుకు ముందే దాఖలు చేస్తే... ఏటా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలకు తుది గడువు జూలై 31. కనుక ఈ గడువులోపు రిటర్నులు ఫైల్ చేయాలి. గతంలో ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా ఉండేది కాదు. పన్నులు చెల్లించి ఉంటే గత రెండు సంవత్సరాలకు సంబంధించిన రిటర్నులు సైతం ఒకేసారి ఫైల్ చేసే అవకాశం ఉండేది. ఉదాహరణకు 2014–15 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలుకు 2015–16 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత ఏడాదిలోపు రిటర్నులు ఫైల్ చేయొచ్చు. అంటే 2015 మార్చితో ముగిసిన సంవత్సరానికి 2017 మార్చి వరకు రిటర్నులు ఫైల్ చేసేందుకు అవకాశం ఉండేది. ఇకపై ఈ అవకాశం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెస్మెంట్ సంవత్సరం ముగిసేలోపే రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏడాది కాలం తగ్గిపోయింది. ఎవరు ఏ పత్రాన్ని దాఖలు చేయాలి? ఐటీఆర్1 లేదా సహజ్: వేతనం లేదా పెన్షన్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు, ఒక ఇంటిపై ఆదాయం అందుకుంటున్నవారు, వడ్డీ, డివిడెండ్ల రూపంలో ఆదాయం అందుకుంటున్న వారు ఐటీఆర్1ను దాఖలు చేయాలి. అదే సమయలో ఆదాయం రూ.50 లక్షలు దాటిన వారు, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నష్టాలను తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్ చేసుకోవాలనుకునేవారు, విదేశీ ఆస్తులు కలిగి ఉన్నవారు, రూ.5,000 దాటిన వ్యవసాయ ఆదాయం ఉంటే, మూలధన లాభాల రూపంలో ఆదాయం ఉంటే, వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం అందుకుంటున్న వారు, ఒకటికి మించిన ఇళ్లపై ఆదాయం వస్తున్న వారు ఐటీఆర్1ను ఉపయోగించడానికి లేదు. ఐటీఆర్2: వేతనం లేదా పెన్షన్ రూపంలో ఆదాయం ఉన్న వారు, ఇల్లు లేదా ప్రాపర్టీపై ఆదాయం వస్తుంటే, మూలధన లాభాల రూపంలో ఆదాయం అందుకునే వారు, ఇతర వనరుల ద్వారా ఆదాయం ఉంటే, ఓ సంస్థలో భాగస్వామ్యం ద్వారా ఆదాయం ఉంటే, విదేశీ ఆస్తులు, ఆదాయం కలిగిన వారు, రూ.5,000 దాటి వ్యవసాయంపై ఆదాయం అందుకునే వారు ఐటీఆర్2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం అందుకునేవారికి ఇది వర్తించదు. ఐటీఆర్3: యాజమాన్య వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం కలిగిన వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్) ఐటీఆర్3 పరిధిలోకి వస్తారు. నోట్ల రద్దు తరవాత నగదు డిపాజిట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 30 వరకు ఈ రద్దయిన నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఆ సమయంలో రూ.2.5 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేసిన వారు ఆ వివరాలను పన్ను రిటర్నుల్లో తప్పనిసరిగా వెల్లడించాలి. ఒకవేళ దాచి పెడితే అది అధికారులకు తెలియదనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే రూ.2.5 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేసిన వారి వివరాలు అదాయపన్ను శాఖ వద్దకు ఎప్పుడో చేరాయి. డిపాజిట్ల వివరాలు, రిటర్నుల్లో పేర్కొన్న వివరాలతో సరిపోలకపోతే అధికారుల నుంచి నోటీసు వస్తుంది. తప్పుదోవ పట్టించే వివరాలు ఉంటే పెనాల్టీ కింద 50 నుంచి 200 శాతం కట్టాల్సి వస్తుంది. అలాగే, తప్పుడు వివరాలు ఇచ్చినందుకు విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకులు స్వచ్ఛందంగా భారీ డిపాజిట్ల వివరాలను పన్ను అధికారులకు తెలియజేస్తుంటాయి. కనుక తప్పించుకోవాలన్న ఆలోచన సరికాదు. ఆధార్ వివరాలూ చెప్పాలి... తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల మేరకు పన్ను రిటర్నులు వేసే ప్రతి ఒక్కరూ తమ ఆధార్ నంబర్ను తెలియజేయాల్సి ఉం టుంది. అలాగే, పాన్ నంబర్తో ఆధార్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం రిజిస్టర్ చేసుకుంటే ఆ వివరాలు ఇచ్చినా సరిపోతుంది. ఉద్యోగం మారినా... ఆర్థిక సంవత్సరం మధ్యలో ఓ కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారిపోతే... పాత కంపెనీలో పొందిన ఆదాయం, టీడీఎస్ వివరాలు సైతం వార్షిక పన్ను రిటర్నుల్లో భాగంగా చూపించాల్సి ఉంటుంది. దాచి ఉంచితే పన్ను చెల్లింపు నుంచి తప్పించుకోవచ్చు అని అనుకంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే మాజీ సంస్థలో టీడీఎస్ కోత విధించి ఉంటే అది ఫామ్ 26 ఏఎస్లో కనిపిస్తుంది. రిటర్నుల్లో ఆ వివరాలు లేకపోతే అధికారులు పన్ను పత్రాలను స్క్రూటినీ చేసే సమయంలో విషయం బయట పడుతుంది. దాంతో నోటీసు జారీ చేస్తారు. అందుకే కొత్తగా చేరిన సంస్థలో పాత సంస్థలో పొందిన ఆదాయం, టీడీఎస్ వివరాలు తెలియజేయడం మర్చిపోవద్దు లేదా దాచిపెట్టొద్దు. విదేశీ ఆస్తులు, ఆదాయం విదేశాల్లో బ్యాంకు ఖాతాలుంటే ఆ వివరాలు తెలియజేయాలి. అంటే ఖాతా ఎప్పుడు ప్రారంభించిందీ, ఓ ఆర్థిక సంవత్సరంలో పొందిన వడ్డీ ఆదాయం తదితర వివరాలు పేర్కొనాలి. రూ.50 లక్షలు దాటితే... గతంలో రూ.కోటి ఆదాయం దాటితే అదనంగా 10 శాతం సర్చార్జ్ విధించే వారు. దీన్ని గతేడాదే 15 శాతానికి పెంచడంతోపాటు రూ.కోటి పరిమితి కాస్తా రూ.50 లక్షలకు తగ్గించారు. కనుక రూ.50 లక్షలు దాటిన వారు తప్పకుండా తమ అన్ని రకాల ఆస్తుల వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే స్థిర, చరాస్తులెన భూమి, భవనం, నగదు, వాహనాలు (బోట్లు, విమానాలు), ఆభరణాలు, బంగారం, ఇతర విలువైన వస్తువుల గురించి వెల్లడించడం తప్పనిసరి. -
కార్గోలో 12 శాతం వృద్ధి: ఎస్సార్ పోర్ట్స్
విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్గో విభాగంలో 12 శాతం వృద్ధి సాధించామని ఎస్సార్ పోర్ట్స్ సీఎండీ రాజీవ్ అగర్వాల్ చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్ని ఆయన శుక్రవారమిక్కడ విడుదల చేశారు. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 19.62 మెట్రిక్ టన్నుల ఎగుమతులు సాధించామన్నారు. థర్డ్ పార్టీ కార్గోలోనూ 60 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. హజారియా పోర్ట్ యూనిట్లో 26 శాతం, పారాదీప్లో 131 శాతం, విశాఖలో 21 శాతం వృద్ధి సాధించామన్నారు. ఇదే ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ముందుకెళతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
టీసీఎస్ అంచనాలు మిస్!
జూన్ క్వార్టర్లో నికర లాభం 5.9 శాతం డౌన్; రూ.5,945 కోట్లు ♦ ఆదాయం 29,584 కోట్లు; వృద్ధి 1 శాతమే ♦ రూపాయి విలువ పెరుగుదల, వేతనాల పెంపు ఎఫెక్ట్ ♦ షేరుకి రూ. 7 మధ్యంతర డివిడెండ్ ఒకపక్క వీసా సమస్యలు... మరోపక్క రూపాయి అనూహ్య పెరుగుదల... వేతనాల పెంపు... ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ మందగమనం... ఇవన్నీ దేశీ ఐటీ రంగానికి పెను సవాల్నే విసురుతున్నాయి. తాజాగా భారత సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఫలితాలు ఐటీ పరిశ్రమ పరిస్థితిని కళ్లకు కట్టాయి. కంపెనీ నికర లాభం జూన్ క్వార్టర్లో అంచనాలకు మించి దిగజారింది. ఆర్థిక ఫలితాల సీజన్ను నిరుత్సాహకరంగా బోణీ చేసింది. గడిచిన రెండేళ్లలో లాభం ఇంత భారీగా తగ్గిపోవడం ఇదే తొలిసారి. ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో పేలవ పనితీరును నమోదుచేసింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.5,945 కోట్లకు పరిమితం అయింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.6,317 కోట్లతో పోలిస్తే 5.9% దిగజారింది. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా 1 శాతమే పెరిగి రూ.29,584 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.29,305 కోట్లు. ప్రధానంగా డాల రుతో రూపాయి మారకం విలువ పెరుగుదల(క్యూ1లో దాదాపు 3.5 శాతం పెరిగింది. ప్రస్తుతం 64.5 వద్ద కదలాడుతోంది), ఇతర ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ తగ్గుదల(క్రాస్ కరెన్సీ హెచ్చుతగ్గులు)తో పాటు సిబ్బంది వేతనాల పెంపు వంటివి కంపెనీ పనితీరుపై ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, క్యూ1లో విశ్లేషకులు కంపెనీ రూ.6,195 కోట్ల నికర లాభాన్ని రూ.29,580 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశారు. లాభాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా, ఆదాయం మాత్రం దాదాపు అదేస్థాయిలో నమోదైంది. సీక్వెన్షియల్గా చూస్తే... గత ఆర్థిక సంవత్సరం క్యూ4(డిసెంబర్–మార్చి)లో టీసీఎస్ రూ.6,608 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం క్యూ1లో 10% పడిపోయింది. ఇక ఆదాయం కూడా సీక్వెన్షియల్గా(క్యూ4లో రూ.29,642 కోట్లు) వృద్ధి లేకపోగా, 0.2% క్షీణించడం గమనార్హం. బ్లూంబర్గ్ వార్తా సంస్థ చేపట్టిన ఎనలిస్టుల సర్వేలో టీసీఎస్ క్యూ1 నికర లాభం 6 శాతం తగ్గొచ్చని అంచనా వేశారు. దీనికంటే అధికంగా లాభం దిగజారడం విశేషం. ఇక డాలరు రూపంలో ఆదాయం క్యూ1లో సీక్వెన్షియల్గా 3.1% వృద్ధితో 4,591 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ జూన్ క్వార్టర్లో మార్జిన్లు 2.3% దిగజారి 23.4 శాతానికి తగ్గాయి. ఆపరేటింగ్ మార్జిన్ లక్ష్యం 26–28 శాతంగా కంపెనీ నిర్దేశించుకుంది. స్థూల లాభం(పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు) 9.34 శాతం తగ్గింది. రూ.6,914 కోట్లుగా నమోదైంది. ⇔ రిటైల్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సేవల విభాగం(బీఎఫ్ఎస్ఐ) మినహా అన్ని పరిశ్రమ విభాగాల నుంచి సీక్వెన్షియల్గా 3.5 శాతం ఆదాయ వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, కంపెనీ మొత్తం ఆదాయంలో అత్యధిక వాటా కలిగిన బీఎఫ్ఎస్ఐ మాత్రం 2.3% వృద్ధినే నమోదు చేసింది. ఆదాయాల్లో ఈ విభాగం వాటా కూడా 40% నుంచి 33%కి తగ్గింది. ⇔ డిజిటల్ సేవల ఆదాయం భారీగా 26 శాతం వృద్ధి చెందింది. ఈ విభాగం వాటా మొత్తం ఆదాయంలో 19 శాతానికి చేరింది. ⇔ 50, 100 మిలియన్ డాలర్ల కేటగిరీల్లో క్యూ1లో కంపెనీ ఇద్దరు క్లయింట్లను దక్కించుకుంది. ఇక 10 మి. డాలర్ల కేటగిరీలో 12, మిలియన్ డాలర్ల కేటగిరీలో 8 కొత్త క్లయింట్లను జతచేసుకుంది. ⇔ రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.7 చొప్పున మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. ⇔ తీవ్రమైన కరెన్సీ హెచ్చుతగ్గులు (రూపాయి భారీ పెరుగుదలతో సహా) రూ.650 కోట్ల మేర ఆదాయ నష్టాలకు కారణమైనట్లు టీసీఎస్ సీఎఫ్ఓ వి.రామకృష్ణన్ పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో మరింత క్రమశిక్షణతో పాటు డిజిటల్ వ్యాపారంపై పెట్టుబడులు పెంచనున్నట్లు కూడా ఆయన తెలిపారు. వేతనాల పెంపు ప్రభావం ఉన్నప్పటికీ.. లాభదాయకత తాము అనుకున్న స్థాయిలోనే కొనసాగుతోందని చెప్పారు. ⇔ ఆర్తి సుబ్రమణియన్ను ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మార్చేందుకు(ఆగస్ట్ 17 నుంచి) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, ఆమెకు టాటా గ్రూప్(టాటా సన్స్) చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. ⇔ గురువారం టీసీఎస్ షేరు ధర బీఎస్ఈలో స్వల్పంగా 0.2 శాతం లాభపడి రూ.2,444 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ఉద్యోగాలు తొలగించలేదు: ముఖర్జీ కంపెనీ స్థూలంగా క్యూ–1లో 11,202 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 12,616 మంది కంపెనీని వీడిపోయారు. దీంతో నికరంగా 1,414 ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీంతో జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,85,809కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) కన్సాలిడేటెడ్గా 12.4 శాతం, ఐటీ సేవల్లో 11.6 శాతంగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఉద్యోగులెవరినీ తొలగించలేదని హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా నియామకాలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన కాస్త తక్కువగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ నైపుణ్యాల్లో 2.15 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా, లక్నోలోని తమ డెవలప్మెంట్ సెంటర్ను మూసేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. పలు ప్రాంతాల్లోని కార్యకలాపాలను స్థిరీకరించే చర్యల్లో భాగంగానే లక్నో సెంటర్ను మూసేస్తున్నామని.. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ(దాదాపు 1,000 మంది పనిచేస్తున్నారు) తొలగించడం లేదని స్పష్టం చేసింది. ఈ కార్యకలాపాలను నోయిడా సెంటర్కు తరలిస్తున్నట్లు వివరించింది. వివిధ పరిశ్రమలు, వ్యాపార విభాగాలకు సంబంధించి జూన్ క్వార్టర్లో నిలకడైన వృద్ధిని నమోదు చేశాం. చిన్న ప్రాజెక్టులకు ముఖ్యంగా డిజిటల్ సేవల్లో పటిష్టమైన డిమాండ్ నెలకొంది. అన్ని మార్కెట్ల నుంచి కాంట్రాక్టులను చేజిక్కించుకోవడంలో మంచి పురోగతి సాధించాం. మరిన్ని డీల్స్కు సిద్ధంగా ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆకర్షణీయమైన వృద్ధిని సాధిస్తామన్న నమ్మకం ఉంది. – రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ -
వాడేసిన వాహనాల ఫైనాన్స్పై దృష్టి
♦ ఈ ఏడాది రుణ లక్ష్యం 6 వేల కోట్లు ♦ ఏపీ, తెలంగాణలో రూ. 560 కోట్లు ♦ ట్రాక్టర్ల విభాగంలోనే ఎక్కువ ఎన్పీఏలు ♦ మాగ్మా ఫిన్కార్ప్ సీఈఓ కౌశిక్ బెనర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అసెట్ ఫైనాన్స్ కంపెనీ మాగ్మా ఫిన్కార్ప్ ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.6 వేల కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్షి్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.560 కోట్లు పంపిణీ చేయనుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో అసెట్ ఫైనాన్స్లో రూ.475 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల వంటి ఇతర విభాగాల్లో రుణాల పంపిణీ కంటే సెకండ్ హ్యాండ్ వాహనాలు (యూజ్డ్ వెహికల్స్) విభాగంలో ఎక్కువ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మాగ్మా ఫిన్కార్ప్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కౌశిక్ బెనర్జీ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ, తెలంగాణ హెడ్ చరణ్ కల్లూరితో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘మేం మొత్తం మంజూరు చేస్తున్న రుణాల్లో 35 శాతం వాటా చిన్న కార్లు, 27 శాతం వాటా ట్రాక్టర్లు, 15 శాతం వాటా వాణిజ్య వాహనాలది. మిగిలిన 23 శాతం వాటా యూజ్డ్ వెహికల్స్ విభాగానిది. అయితే అన్ని విభాగాల్లో సమానమైన వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా వినియోగించిన వాహనాల విభాగంలో రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఏటా యూజ్డ్ వెహికిల్స్ విభాగం 5–10% వృద్ధిని సాధిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 45 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం’’ అని కౌశిక్ బెనర్జీ వివరించారు. కొత్తగా 30 బ్రాంచీలు.. ప్రస్తుతం దేశంలో మాగ్మా ఫిన్కార్ప్కు 300 బ్రాంచీలున్నాయి. ఏపీ, తెలంగాణలో 22 బ్రాంచీలున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో మరో 30 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు కౌశిక్ తెలియజేశారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఇవి రానున్నట్లు చెప్పారు. తమ మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 11 శాతమని, గత ఆర్ధిక సంవత్సరంలో స్థూల నిరర్ధక ఆస్తులు 8.1 శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 6.7కి తగ్గాయని తెలియజేశారు. ఎన్పీఏలు ఎక్కువగా ట్రాక్టర్ల విభాగంలో ఉన్నాయని, అందుకే ఆ విభాగానికి రుణాలు తగ్గించుకోవాలని భావిస్తున్నామని తెలియజేశారు. -
ఇండస్ ఇండ్ లాభం 26% అప్
♦ జూన్ త్రైమాసికంలో రూ.837 కోట్లు ♦ వడ్డీ ఆదాయం దన్నుతో ♦ రూ.836 కోట్లుగా నమోదు ♦ స్వల్పంగా పెరిగిన ఎన్పీఏలు ముంబై: ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు అనుగుణంగా రాణించింది. నికర వడ్డీ ఆదాయం దన్నుతో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం 26 శాతం అధికంగా రూ.836.55 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.661 కోట్లే. నికర వడ్డీ ఆదాయమైతే 31 శాతం వృద్ధితో 1,774.06 కోట్లకు చేరుకుంది. గతంలో ఉన్న నికర వడ్డీ మార్జిన్ 4 శాతాన్ని బ్యాంకు తాజాగా ముగిసిన త్రైమాసికంలోనూ నిలబెట్టుకోగలిగింది. వడ్డీయేతర ఆదాయంలోనూ పెరుగుదల నమోదైంది. 20 శాతం అధికంగా రూ.1,167.26 కోట్లు ఆర్జించింది. రుణాల్లో 24 శాతం, డిపాజిట్లలో 31 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. తక్కువ వ్యయాలుండే కరెంట్, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లు కూడా 38 శాతానికి పెరిగాయి. తగ్గిన ఆస్తుల నాణ్యత స్థూల ఎన్పీఏలు అంతకుముందున్న 0.91 శాతం నుంచి 1.09 శాతానికి పెరిగాయి. పునరుద్ధరించిన రెండు రుణాలు మొండి బకాయిలుగా (ఎన్పీఏ) మారడమే దీనికి కారణమని బ్యాంకు ఎండీ రమేశ్ సోబ్తి తెలిపారు. ఈ కాలంలో బ్యాంకు ఎన్పీఏలకు చేసిన మొత్తం కేటాయింపులు రూ.230 కోట్ల నుంచి రూ.310 కోట్లకు పెరిగాయి. జేపీ సిమెంట్కు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడంతో అంతకుముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రూ.122 కోట్లను నష్టాలుగా చూపించి పక్కన పెట్టింది. జేపీ సిమెంట్ను రూ.16,000 కోట్లకు అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో, నష్టాల పేరుతో పక్కన పెట్టిన నిధులను అప్పుడే లాభాల్లోకి తీసుకోకూడదని బ్యాంకు నిర్ణయించింది. ఆర్బీఐ దివాలా చట్టం కింద చర్యలకు గుర్తించిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో ఇండస్ఇండ్ బ్యాంకు ఇచ్చిన రుణాలు రూ.50 కోట్ల మేర ఉండగా, వాటికి జూన్ త్రైమాసికంలో తగిన నిధుల కేటాయింపులు చేసినట్టు రమేశ్సోబ్తి తెలిపారు. జీఎస్టీ అమలు, బీఎస్–4 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు ట్రక్ సరఫరాలపై పడడంతో ఈ విభాగంలో రుణ వృద్ధి మందగించిందన్న ఆయన సెప్టెంబర్ క్వార్టర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. వాహనేతర వినియోగ రుణాల్లో మాత్రం 35–40 శాతం వృద్ధి ఉన్నట్టు చెప్పారు. -
జూలై 10న గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీము కింద ప్రభుత్వం జూలై 10న మలివిడత గోల్డ్ బాండ్ల ఇష్యూను ప్రారంభించనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10–14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని గురువారం విడుదలైన ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాముకాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. 8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.2015 నవంబర్లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 దఫాలు పుత్తడి బాండ్లను జారీచేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు. -
జీడీపీ వృద్ధి.. అంత గొప్పగా ఏమీ లేదు!!
బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 7.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మిగతా సంపన్న దేశాల కన్నా అధికంగానే కనిపిస్తున్నప్పటికీ.. అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదని వ్యాపార దిగ్గజం బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. గత 4–5 ఏళ్లుగా చెప్పుకోతగ్గ పెట్టుబడులేమీ రాకపోవడం, బ్యాంకుల్లో మొండి బకాయిల భారంతో కొత్త రుణాలు పుట్టక ప్రైవేట్ రంగం కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతుండటం.. వీటన్నింటికీ పెద్ద నోట్ల రద్దు కూడా తోడవడం మొదలైనవి వృద్ధి మందగించడానికి కారణాలని ఆయన పేర్కొన్నారు. ‘2016–17లో ప్రోత్సాహకరమైన దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలతో నా ప్రసంగం మొదలుపెట్టాలనుకున్నాను. కానీ వృద్ధి నేను అనుకున్నంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదని తాజా గణాంకాలన్నీ నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాక తెలిసింది’ అని 2016–17 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘కేంద్రీయ గణాంకాల సంస్థ తాజా లెక్కల ప్రకారం 2016–17లో 7.1 శాతంగా నమోదైన వృద్ధి నిస్సందేహంగా సంపన్న దేశాలు, చైనా వంటి వర్ధమాన దేశాల కన్నా కూడా ఎక్కువే. కాదనను. కానీ అంతకు ముందు ఆర్థిక సంవత్సరం సాధించిన 7.9 శాతం కన్నా ఇది తక్కువే‘ అని పేర్కొన్నారు. స్థిరంగా 7.5–8 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించడానికి ఇంకా చాలా కాలం పట్టేస్తుందని బజాజ్ తెలిపారు. -
ప్రభుత్వ బ్యాంకుల్లో మరో విలీనం?
♦ బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి దక్షిణాది బ్యాంకులు ♦ దేనా బ్యాంకు మాత్రం వేరొక బ్యాంకులోకి ♦ ఆర్థిక శాఖ అధ్యయనం; మార్చిలోగా నిర్ణయం! న్యూఢిల్లీ: ఎస్బీఐలో ఐదు బ్యాంకుల విలీనం సంపూర్ణం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో విడత ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో బలమైన, అతిపెద్ద బ్యాంకులుండాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో విలీన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 3–4 బ్యాంకుల్ని స్థిరకరించే ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. జూన్ 12న ఇందుకు సంబంధించి ఓ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. స్థిరీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను సెప్టెంబర్ నాటికి ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పిస్తామని, వచ్చే జనవరి–మార్చి నాటికి ఇది పూర్తి కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. నీతిఅయోగ్ రోడ్మ్యాప్..: భారీ స్థాయి బ్యాంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రెండో దశ స్థిరీకరణకున్న అవకాశాలను పరిశీలించి అభిప్రాయాలు చెప్పాలని నీతి ఆయోగ్, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కోరింది. భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి సంబంధించి నీతి ఆయోగ్ ఓ రోడ్మ్యాప్ను తీసుకురానుంది. పెద్ద బ్యాంకుల్లో విలీనానికి అనువైన చిన్న బ్యాంకులను గుర్తించే పనిని కూడా ఆర్థికశాఖ ప్రారంభించింది. అయితే బలహీన బ్యాంకుల్ని, బలమైన బ్యాంకుల్లో విలీనం చేయడం జరగదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దక్షిణాదిన టర్న్ అరౌండ్ అయిన బ్యాంకులను బ్యాంకు ఆఫ్ బరోడాలో... దేనా బ్యాంకును దక్షిణాదికే చెందిన మరో బ్యాంకులో విలీనం చేయడానికి అవకాశాలున్నాయని తెలిపారు. అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో కలిసిపోయిన విషయం తెలిసిందే. -
బంగారం దిగుమతులు డౌన్
గతేడాది 13 శాతం తగ్గిన విలువ న్యూఢిల్లీ: బంగారం దిగుమతుల విలువ గడచిన ఆర్థిక సంవత్సరం (2016–17) 14 శాతం తగ్గింది. దిగుమతుల విలువ రూపంలో 27.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది . కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, డీఐఐ, ఈసీబీలు కాకుండా దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం)కు సంబంధించి దేశ స్థూల ఆర్థిక వ్యవ స్థకు ఇది సానుకూల అంశమని అధికార వర్గాలు వివరించాయి. 2016–15లో దేశ పసిడి దిగుమతుల విలువ 31.7 బిలియన్ డాలర్లు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కరెంట్ అకౌంట్ విలువ 118.7 బిలియన్ డాలర్ల నుంచి 105.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. పసిడి దిగుమతులు చేసుకునే పెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం పసిడి దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తున్నారు. ఈ సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల పరిశ్రమతో పాటు వాణిజ్య మంత్రిత్వశాఖ సైతం ఆర్థిక శాఖను కోరుతున్నాయి. -
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
-
సన్ ఫార్మా లాభంలో 14% క్షీణత
అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిళ్ల ప్రభావం న్యూఢిల్లీ: సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 14 శాతం తక్కువగా లాభాన్ని నమోదు చేసింది. అమెరికా మార్కెట్లో ధరల పరంగా ఒత్తిళ్లు ప్రభావం చూపించడంతో లాభం రూ.1,223 కోట్లకు పరిమితం అయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.1,416 కోట్లుగా ఉంది. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలోనూ తగ్గుదల చోటు చేసుకుంది. 2016 మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.7,415 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో అది రూ.6,825 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2016–17)లో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.6,964 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,545 కోట్ల కంటే 53 శాతం వృద్ధి చెందింది. ఆదాయం సైతం రూ.27,888 కోట్ల నుంచి రూ.30,264 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుపై రూ.3.5 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. దిలీప్ సంఘ్విని తిరిగి ఐదేళ్ల పాటు 2023 మార్చి వరకు కంపెనీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన సీఎఫ్వోగా సీఎస్ మురళీధరన్ను నియమించింది. కొత్త ఔషధాలపై పెట్టుబడులు కొనసాగుతాయి అమెరికాలో జనరిక్ మందుల ధరల పరంగా ఎదురైన సవాళ్లు నాలుగో త్రైమాసికం పనితీరుపై ప్రభావం చూపించినట్టు సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి తెలిపారు. -
చందా కొచర్ వేతనం @ రూ. 7.85 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం చందా కొచర్ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 7.85 కోట్ల వేతనం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 64 శాతం అధి కం. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. ఆమె బేసిక్ శాలరీ 15 శాతం పెరిగి రూ. 2.67 కోట్లకు చేరింది. అంటే రోజువారీగా చూస్తే కొచర్ రోజుకు.. రూ. 2.18 లక్షల వేతనం అందుకున్నట్లవుతుంది. 2016–17లో ఆమె రూ. 2.2 కోట్ల బోనస్ అందుకున్నారు. వసతి, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, నీరు, గ్రూప్ ఇన్సూరెన్స్, క్లబ్ ఫీజు, నివాసం వద్ద వినియోగించేందుకు ఫోన్, కారు, రీయింబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీఏ), ప్రావిడెంట్ ఫండ్ మొదలైన వాటితో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ కలిపి రెమ్యూనరేషన్లో లెక్కేస్తారు. నెలవారీ కొచ్చర్ బేసిక్ శాలరీ రూ. 13,50,000– రూ. 26,00,000 శ్రేణిలో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక నివేదిక పేర్కొం ది. ప్రధాన సవాళ్లెదుర్కొంటూ.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని నివేదికలో కొచర్ తెలిపారు. బ్యాంకు పరిమాణం, భారీ స్థాయిలో నిధులు, వివిధ ఆర్థిక సేవలు అందిస్తుండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
తిరుగుడే తిరుగుడు
⇒పన్నుల వసూలుకు మిస్తున్న పంచాయతీ సిబ్బంది ⇒ఈనెల 30 వరకు గడువు పెంచడంతో కలెక్షన్కు చర్యలు ⇒మిగిలిన రూ.3.19 కోట్ల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక ⇒వంద శాతం లక్ష్యంగా అధికారుల కృషి వరంగల్ రూరల్: ఆర్థిక సంవత్సరం గతనెల 31వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వసూలు కావాల్సిన పన్నులు ఇంకా మిగిలిపోయాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండడంతో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇందులో భాగంగా జిల్లాలో మిగిలిపోయిన రూ.3.19 కోట్ల వసూలుకు అధికా రులు కృషి చేస్తు న్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని జిల్లా పంచాయతీ అధికారి నుంచి కారోబార్ వరకు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. 72.55 శాతం వసూళ్లు.. జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2016–17) రూ.11,64,00,173 మేరకు ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసిన మార్చి 31వ తేదీ వరకు రూ.8,44,47,385(72.55శాతం) పన్నులే వసూలయ్యాయి. అంటే ఇంకా రూ.3.19 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నగదు బకాయిగా పేరుకుపోతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి చాలా జిల్లాల్లో ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు పన్నుల వసూళ్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు బకాయిలు వంద శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పిండి కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు. నోట్లు రద్దుతోనే.. కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీంతో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఉద్యోగులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్యలో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ.11.64 కోట్ల వరకు ఉన్న పన్నుల్లో రూ. 8.44 కోట్ల వరకు వసూలయ్యాయి. అంటే నోట్ల రద్దు అంశం పన్నులు భారీగా వసూలయ్యేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అందరి సహకారంతో ముందుకు.. జిల్లాలో ఆస్తి, నీటి పన్నులు రూ.3 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు వసూలైన పన్నులు లెక్కిస్తే ఈ బాకీ తేలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పన్నుల స్వీకరణకు అవకాశం కల్పించగా అప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నాం. అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓ పీఆర్డీల సహకారం తీసుకుంటూ కార్యదర్శులు పన్నులు వసూళ్లలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన గడువు సద్వినియోగం చేసుకుని వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. -
11 నెలల్లో 67 లక్షల కొత్త కస్టమర్లు
మ్యూచువల్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ ⇒ 5.4 కోట్లకు ఫోలియోలు న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఆదరణ గణనీయంగా పెరిగిపోతోంది. భారీ సంఖ్యలో ఇన్వెస్టర్లు కొత్తగా వచ్చి చేరుతున్నారు. మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరం(2016–17)లోని మొదటి 11 నెలల్లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో నికరంగా 67 లక్షల కొత్త ఫోలియోలు (ఇన్వెస్టర్లకు కేటాయించే నంబర్) తోడయ్యాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు 5.4 కోట్లకు వృద్ధి చెందడం విశేషం. 2015–16 ఆర్థిక సంవత్సరంలోనూ ఇలా కొత్తగా వచ్చి చేరిన వారి సంఖ్య 59 లక్షలు. చివరి రెండు సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్లో చేరిన కొత్త ఖాతాదారుల్లో ఎక్కువ మంది చిన్న పట్టణాల నుంచే ఉండడం పెరుగుతున్న అవగాహనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫోలియో అన్నది ఇన్వెస్టర్లకు కేటాయించే ఓ గుర్తింపు నంబర్.దీని ఆధారంగా పెట్టుబడులు కొనసాగుతాయి. ఒక్కో ఇన్వెస్టర్కు ఎన్ని ఫోలియోలు అయినా ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం... 43 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో మొత్తం ఫోలియోల సంఖ్య 2016 మార్చి నాటికి 4,76,63,024గా ఉండగా, ఆ సంఖ్య 2017 ఫిబ్రవరి నాటికి 5,43,87,930కు పెరిగింది. దీంతో నికరంగా పెరిగిన ఫోలియోలు 67.25 లక్షలు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం పెరగడం, అందులోనూ చిన్న పట్టణాల నుంచి అధికంగా ఉండడం, ఈక్విటీ పథకాల్లోకి భారీగా పెట్టుబడుల రాక వృద్ధికి చోదకాలుగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కొత్తగా చేరిన 67.25 లక్షల ఫోలియోల్లో రిటైల్ ఇన్వెస్టర్లవి 40 లక్షలకు పైనే ఉన్నాయి. దీంతో మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు 4 కోట్లను చేరినట్టు లెక్క. -
జీహెచ్ఎంసీ ఆల్టైమ్ రికార్డ్
⇒పెరిగిన ఆస్తిపన్ను వసూళ్లు ⇒గత ఆర్థిక సంవత్సరం రూ.1025 కోట్లు ⇒ఈ మార్చి 30 నాటికి రూ.1137 కోట్లు ⇒నేడు అర్ధరాత్రి వరకు సీఎస్సీల సేవలు సిటీబ్యూరో: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ జీహెచ్ఎంసీకి మాత్రం కాసుల వర్షం కురిపించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆస్తిపన్నుగా రూ.180 కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. గతంలో ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెల చివరి వారం.. చివరి రెండు రోజుల్లోనే ఎక్కువ పన్ను వసూలయ్యేది. మార్చి 31న ఒక్కరోజే రూ.వందకోట్లకు పైగా వసూలైన ఘటనలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో పన్ను బకాయిలపై వడ్డీ రద్దు చేయడం వంటి కారణాలతో ప్రజలు చివరి వరకు వేచి చూసేవారు. ఈసారి వడ్డీ మాఫీ ఉండదని ముందే జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. పెద్దనోట్లరద్దు, వడ్డీ మాఫీ ఉండదని తెలియజేయడంతో ఆస్తిపన్ను చెల్లించేవారిలో మెజారిటీ ప్రజలు ఇప్పటికే చెల్లింపులు చేశారు. ఇంకా చెల్లించని వారుంటే గతంలో మాదిరిగా చివరిరోజు చెల్లిస్తారని భావిస్తున్నారు. ఇలా మరో రూ.50 కోట్లకు పైగా వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఆస్తిపన్ను వసూళ్లతో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.1200 కోట్లకు చేరే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు. అర్ధరాత్రి వరకు సీఎస్సీలు సేవలు ఆస్తిపన్ను చెల్లింపునకు శుక్రవారం చివరిరోజు కావడంతో జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఆన్లైన్లో చెల్లించండి.. ఆస్తిపన్ను చెల్లింపునకు చివరి రోజైన శుక్రవారం సీఎస్సీలు, మీసేవా కేంద్రాల్లో అధిక రద్దీ ఉండే దృష్ట్యా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి సూచించారు. ఇందుకు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.inÌZలోని పేమెంట్స్ ట్యాబ్పై క్లిక్చేసి, అందులోని సూచనలకు అనుగుణంగా పన్ను చెల్లించవచ్చని విజ్ఞప్తి చేశారు. -
ఆశల చిగుళ్లు!
►డబుల్ ఇళ్ల నిర్మాణంపై కదలిక ►వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా లక్ష ఇళ్ల నిర్మాణం ►ప్రత్యేకంగా పీఎంయూ ఏర్పాటు ►ఇప్పటికే 16,562 ఇళ్లకు టెండర్లు పూర్తి ►మరుసటి విడతలో 70 వేల ఇళ్లకు ఒకేసారి... మంత్రుల సమీక్షలో నిడబుల్ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 16562 ఇళ్లకు టెండర్లు పూర్తవగా..మిగతా వాటికి రెండు విడతల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేయాలని మంత్రులు భావిస్తున్నారు. డబుల్ ఇళ్ల నిర్మాణం పేదల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలని..ఇందుకు అనుగుణంగా పథకం మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలకు దక్కిన ఇళ్లను ఇతరులకు అమ్ముకోకుండా...తప్పనిసరిగా నివాసం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. తద్వారానే పేదల జీవన ప్రమాణాలు పెరిగి సామాజిక స్థాయి మెరుగవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తిచేయడం లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. మంగళవారం బేగంపేటలోని మెట్రోరైలు భవనంలో డబుల్ బెడ్రూమ్ అమలు తీరుపై మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీలో ఇప్పటికే 16,562 ఇళ్ల టెండర్లు పూర్తయి, చాలా చోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయన్నారు. మరో 16 వేల ఇళ్లకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. మిగతా దాదాపు 70 వేల ఇళ్లకు ఒకేసారి టెండర్లకు అనుమతి తీసుకుంటున్నామన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల తీరును నేరుగా పర్యవేక్షిస్తామని చెప్పారు. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు ముందుకొచ్చే బిల్డర్లకు జీహెచ్ఎంసీ తరపున కావాల్సినన్ని మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. ఎమ్మెల్యేలు నేరుగా వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడటంతో ప్రస్తుతం పలు కంపెనీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నాయన్నారు. ‘డబుల్’ఇళ్లతో పేదల జీవితాల్లో గుణాత్మకమార్పు: మంత్రులు డబుల్బెడ్రూమ్ పథకంతో పేద ప్రజల జీవితాల్లో గుణాత్మకమార్పు వస్తుందని మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డిలు అన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపి తమ నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. మురికివాడల్లోని పేదలను చైతన్యపరుస్తూ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. నగరంలో హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ఏర్పాటు చేయాల్సిందిగా హౌసింగ్ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కేటీఆర్ కోరారు. నగరంలోని ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కావాల్సిందిగా ఆయన హౌసింగ్శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో లక్షఇళ్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను నెరవేరుస్తామన్నారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ హౌసింగ్ స్కీమ్ను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. డబుల్బెడ్రూమ్ ఇళ్ల వల్ల ప్రజల జీవనప్రమాణాల్లో మార్పు వస్తుందని, లబ్ధిదారులు వీటిని అమ్ముకోకుండా కుటుంబానికి రక్షణఇచ్చేలా చూడాలన్నారు. ఈమేరకు ఈ హౌసింగ్స్కీమ్ పథకం మార్గదర్శకాల్లో ఈ నిబంధన చేర్చాలని మంత్రి కేటీఆర్ను కోరారు. ఈ నిబంధన లేకుంటే పేదల జీవితాల్లో మార్పు సాధ్యం కాదన్నారు. వారు ఈ ఇళ్లల్లో నివసించినప్పుడే వారి సామాజిక స్థాయిలో మార్పు వస్తుందని, ప్రభుత్వ లక్ష్యానికి సార్థకత చేకూరుతుందన్నారు. సమావేశంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, జంటనగరాల ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, హౌసింగ్శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎయిర్లైన్స్కు ఈ ఏడాది సూపర్!
ఇక్రా నివేదిక ముంబై: విమానయాన రంగానికి ప్రస్తుత ఆర్థిక సంత్సరం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీ విమానయాన సంస్థలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచటమే దీనిక్కారణం. ఈ ఏడాది విమాన ప్రయాణికుల్లో 22–23 శాతం వృద్ధి నమోదు కానున్నట్లు రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది. ‘‘తక్కువ విమాన టికెట్ ధరల వల్ల ఎయిర్లైన్స్కు ప్రయాణికుల రద్దీ బాగుంది. కానీ ముడిచమురు ధరలు పెరుగుతుండటం వల్ల క్యూ4లో లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉంటుంది’’ అని ఇక్రా నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ఈ ఏడాది 10 నెలల్లో విమానయాన స్థితిగతులను ఒకసారి చూస్తే.. ⇔ ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 84.4 శాతంగా నమోదయ్యింది. అంటే ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్ల కన్నా మనం మంచి వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది జనవరిలో పీఎల్ఎఫ్ 88.3 శాతంగా ఉంది. ⇔ వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల వృద్ది 23.2 శాతంగా ఉంది. గత ఐదేళ్లుగా దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 12.9%, 5.3%, 4.6%, 15.5%, 22.1 శాతంగా నమోదవుతూ వచ్చింది. ఈ సారి వృద్ధి ఈ గణాంకాలను అధిగమించొచ్చు. అంటే ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతోన్న దేశీ మార్కెట్గా భారత్ ఆవిర్భవించనుంది. కాగా జనవరిలో దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 25.3%, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల వృద్ధి 8.8 శాతంగా నమోదయ్యింది. -
క్రీడలకు రూ. 54.94 కోట్లు
హైదరాబాద్: రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత చూపించినట్టు బడ్జెట్లో కనిపించలేదు. నామమాత్రంగా నిధులు కేటాయించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రగతి పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.54.94 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో యూత్ అడ్వాన్స్, టూరిజం విభాగానికి రూ.2.41 కోట్లు, యువశక్తి పథకానికి రూ.19.40 కోట్లు, ఎన్సీసీ విభాగానికి రూ.21.91, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్)కు రూ.11.20 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద ఈ శాఖలకు రూ.49.36 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో యువజన సర్వీసులు, క్రీడ శాఖకు ప్రణాళిక బడ్జెట్ కింద రూ.62 కోట్లు కేటాయించగా, కేవలం రూ.15 కోట్లు మాత్రమే వినియోగించారు. మిగిలిన రూ.47 కోట్లను ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సవరించింది. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ.56.82 కోట్లను కేటాయించింది. -
దేశంలో మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పెద్దనోట్లరద్దు తరువాత దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్ల రూపాయలని శుక్రవారం పార్లమెంట్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి 16.41 లక్షలకోట్లు నోట్లు చలామణిలో ఉండగా, ఈ సంవత్సరం మార్చి 3 నాటికి నోట్ల విలువ 11.37లక్షలకోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంట్లో తెలియజేశారు. మార్కెట్లో నోట్ల ప్రవాహాం తగ్గడానికి పెద్ద నోట్ల రద్దు ప్రధాన కారణమని తెలిపారు. దేశంలో 190 కోట్లు రూ.5 నాణేల రూపంలో, రూ.130 కోట్లు రూ.10 నాణేల రూపంలో; రూ.260 కోట్లు రూ.10 నోట్ల రూపంలో; రూ.360 కోట్లు రూ.20 నోట్ల రూపంలో ఉండగా, మిగతా మొత్తం ద్రవ్యం రూ.100, రూ.500, రూ.2 వేల రూపాయల నోట్ల రూపంలో ఉందని తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రూ.500, రూ.2 వేల నోట్ల ముద్రణ ఖర్చు గురించి మాట్లాడుతూ ‘‘ఉద్యోగుల నైపుణ్యం, యంత్రాల సామర్థ్యాన్ని బట్టి ముద్రణ విలువ మారుతుంద’’న్నారు. రూ.500 నోటు ముద్రణకు రూ.2.87నుంచి రూ.3.09ల ఖర్చుకాగా, రూ.2వేల నోటుకు రూ.3.54నుంచి రూ. 3.77లుగా ఖర్చు అవుతుందని తెలిపారు. దేశం మొత్తం మీద నాలుగు ముద్రణాలయాలు ఉండగా రెండు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో రెండు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్నాయి. -
‘కిక్కు’పై వీడని సస్పెన్స్!
జాతీయ, రాష్ట్ర రహదారులపై 140 వైన్ షాపులు.. తరలించేందుకు ఈనెల ఆఖరుతో గడువు సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న 140 మద్యం దుకాణాలు, బార్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆయా రహదారులకు ఆనుకొని 500 మీటర్ల లోపల ఉన్న దుకాణాలను మార్చి నెలాఖరులోగా రహదారులకు దూరంగా మరోచోటకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద స్పందించిన ఆబ్కారీశాఖ.. ఈ ఏడాది సెప్టెంబరు వరకు లైసెన్సు గడువు ముగియనున్నందున ఆయా దుకాణాలను అప్పటివరకు యధాస్థానంలో కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఈ నెలలో వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఆయా దుకాణాలు ప్రధాన రహదారులు, అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాలే కావడంతో ఏకంగా 140 దుకాణాలను తొలగించే అవకాశం ఉంది. దీంతో మిగతా దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగించడం, సమయపాలన పాటించకపోయే ప్రమాదం కూడా ఉందని ఆబ్కారీశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న కల్లు దుకాణాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుండడంతో కల్లు సొసైటీల సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా దిల్సుఖ్నగర్– ఎస్.ఆర్.నగర్ రూట్లో అధికంగా మద్యం దుకాణాలు, బార్లు ఈ జాబితాలో ఉన్నట్లు ఎక్సైజ్శాఖ వర్గాలు తెలిపాయి. గత నెలలో చీప్ లిక్కర్ సేల్స్ అదుర్స్ సిటీని గుడంబా రహిత నగరంగా తీర్చిదిద్దడంలో నగర ఆబ్కారీశాఖ విజయం సాధించడంతో ఇప్పుడు అల్పాదాయ వర్గాలు, దినసరి కూలీలు చీప్ లిక్కర్పై మక్కువ చూపుతున్నట్లు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. దీంతో చీప్లిక్కర్ సేల్స్ బాగా పెరిగాయి. ప్రధానంగా గుడంబాకు అడ్డాగా ఉన్న ధూల్పేట్లో ఫిబ్రవరిలో ఏకంగా 273 శాతం అమ్మకాల్లో వృద్ధి నమోదవడం గమనార్హం. ఇక మలక్పేట్లో 61 శాతం, నారాయణగూడలో 48 శాతం, గోల్కొండలో 45 శాతం, చార్మినార్ ప్రాంతంలో 36 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదవడం విశేషం. మద్యం చీర్స్ ఇక్కడే అత్యధికం.. చీప్లిక్కర్ స్థాయిలో కాకపోయినా రూ.700 లోపు (ఫుల్ బాటిల్) ధర ఉన్న మద్యం అమ్మకాలు కూడా నగరంలో ఫిబ్రవరి నెలలో అధికంగా జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణ మద్యంలో ధూల్పేట్లో 27 శాతం, జూబ్లీహిల్స్లో 24 శాతం, ముషీరాబాద్లో 19, సికింద్రాబాద్లో 5శాతం, చార్మినార్లో 11 శాతం, గోల్కొండలో 17 శాతం మేర అమ్మకాలు పెరగడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. నగరంలో 2016 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు: రూ.1621 కోట్లు 2017లో మద్యం అమ్మకాలు: రూ.1756 కోట్లు బీర్ల అమ్మకాల్లో వృద్ధి: 0.1 శాతం మద్యం అమ్మకాల్లో వృద్ధి: 9 శాతం -
బడ్జెట్ ఆహా..! పనులు ఊహ!!
►అంచనా చేరని ఆదాయం ►ముందుకు సాగని పనులు ►ఇదీ జీహెచ్ఎంసీ సంప్రదాయం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అభివృద్ధికి వేస్తున్న బడ్జెట్ మహా గొప్పగా ఉంటోంది. కానీ, వస్తున్న నిధులకు.. చేస్తున్న ఖర్చుకు పొంతన కుదరడం లేదు. కలల బడ్జెట్ వాస్తవరూపం దాల్చకపోవడం ఏటా ఓ ప్రహసనంలా మారింది. ఊహిస్తున్న ఆదాయానికి.. వాస్తవంగా సమకూరుతున్న నిధులకు సంబంధం ఉండడం లేదు. దీంతో ఏటేటా జీహెచ్ఎంసీ బడ్జెట్కు, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేస్తున్న ఖర్చు మధ్య అంతరం భారీగా ఉంటోంది. ఈ సారీ అదే పునరావృతమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో ఇరవైరోజులే ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ శాసనసభ సమావేశాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ బడ్జెట్పై ‘సాక్షి’ విశ్లేషణ. సాక్షి, సిటీబ్యూరో : మహానగరంలో పలు చోట్ల బహుళ వరుసల ఫ్లైఓవర్లు, అండర్పాస్లు వంటి పనుల కోసం ఎస్సార్డీపీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్ లెక్కల్లో చూపారు. కానీ ఏడాది కాలంలో కేవలం రూ.125 కోట్లే ఖర్చు చేశారు. ఈ పనులకు నిధుల లేమి పెద్ద సమస్య అయితే.. భూసేకరణ, మెట్రోరైలు పనులు వంటి ఆటంకాలు మరోవైపు వచ్చిపడ్డాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి తప్ప, పురోగతి మాత్రం లేదు. మైండ్స్పేస్ జంక్షన్ వద్ద పనులు సాగుతుండగా.. చింతల్కుంట వద్ద మొదలయ్యాయి. మిగతా జంక్షన్లలో ప్రారంభమే కాలేదు. రోడ్లదీ అదేదారి.. నగర రోడ్లకు సైతం బడ్జెట్లో రూ.860 కోట్లు చూపించారు. కానీ ఈ ఆర్థిక సంవత్సర నిధుల్లోంచి రూ.209 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గత ఏడాది వేసిన రోడ్ల పనులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు తప్ప కొత్తవాటిపై దృష్టి పెట్టలేదు. వైట్ టాపింగ్, పేవర్బ్లాక్లు, ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు ప్రతిపాదనాలు చేసినప్పటికీ నిధుల లేమితో ముందడుగు పడలేదు. కదలని వరద కాలువ వరద కాలువల ఆధునీకరణకు బడ్జెట్లో రూ.257 కోట్లు చూపించారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో పలు ప్రాంతాల ముంపు నేపథ్యంలో తిరిగి సర్వే పనులు చేపట్టారు. ఇప్పటి వరకు సర్వే మాత్రమే జరిగింది. వరద కాలువలను ఆధునికీకరించేందుకు భారీసంఖ్యలో ఆస్తుల్ని తొలగించాల్సి రావడంతో పునరాలోచనలో పడ్డారు. తొలగించాల్సిన ఆస్తుల్ని వీలైనంతమేరకు తగ్గించాలనే యోచనలో ఉన్నారు. వరద కాలువల (నాలాల) వెంబడి నివాసాలు ఏర్పరచుకున్నవారితో పాటు స్థానిక నేతల ఒత్తిళ్ల వల్ల ప్రకటనలకు తగ్గట్లుగా పనులు సాగలేదు. దీంతో రూ.50 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. స్లాటర్ హౌస్లదీ ఆతీరే.. ఇక స్లాటర్హౌస్ల కోసం బడ్జెట్లో రూ.20 కోట్లు చూపించారు. వీటిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. నగరంలోని జీహెచ్ఎంసీ స్లాటర్హౌస్లు ప్రారంభమైనా తగిన విధంగా ప్రచారం చేయకపోవడంతో ఇప్పటికే ఎక్కువ మంది చెంగిచెర్లకే వెళ్తున్నారు. అయినా అధికారుల ఉదాసీనతకు కారణాలేమిటో వారికే తెలియాలి. పేదల ఇళ్లు మరింత ఆలస్యం నగరంలో నిరుపేదల ఇళ్ల కోసం రూ.250 కోట్లు బడ్జెట్లో ఉన్నప్పటికీ, స్థల సేకరణలో జాప్యం.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ఈ సంవత్సరం ఎలాంటి పనులూ జరగలేదు. ఈ పద్దులో కేవలం రూ.15 కోట్లే ఖర్చయ్యాయి. అన్నింటిదీ అదే పరిస్థితి.. మోడ్రన్ మార్కెట్లు.. బస్షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించారు. కానీ ఎలాంటి ఖర్చు చేయకపోవడంతో పథకాలు అమలుకు నోచుకోలేదు. చాలా పథకాలు ప్రారంభం కాకపోగా, మరికొన్ని కొంతమేర మాత్రమే జరిగాయి. ఇందుకు ఎన్ని కారణాలున్నా, ప్రధాన కారణం మాత్రం నిధుల సమస్యే. రాబడి పరిస్థితి ఇదీ.. రెవెన్యూ రసీదుల ద్వారా మొత్తం రూ.2,768.56 కోట్లు రాగలవని అంచనా వేస్తే, ఇప్పటి వరకు వచ్చింది రూ.1850 కోట్లు మాత్రమే. అలాగే క్యాపిటల్ రసీదుల ద్వారా రూ.4,938.43 కోట్లు రాగలవనేది అంచనా కాగా, వచ్చింది రూ.2,200 కోట్లు మాత్రమే. -
బ్యాంకులకు 10 వేల కోట్లు సరిపోతాయ్: రాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు రానున్న ఆర్థిక సంవత్సరం తాజా మూలధనంగా రూ.10,000 కోట్లు సరిపోతుందని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చీఫ్ వినోద్ రాయ్ గురువారంనాడు పేర్కొన్నారు. ఇక్కడ బంధన్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్కెట్ నుంచి మరిన్ని నిధుల సమీకరణకు రైట్స్ ఇష్యూకు కూడా అనుమతి ఉన్న నేపథ్యంలో 2017–18 సంవత్సరానికి రూ.10,000 కోట్ల మూలధనం సరిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాడ్ బ్యాంక్పై చెప్పలేం...! మొండిబకాయిల పరిష్కారం దిశలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై విభిన్న వాదనలు ఉన్నాయని అన్నారు. దీని అమలు ఇప్పటికి ప్రశ్నార్థకమేనని వెల్లడించారు. కాగా ఖాళీగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) సీఎండీ నియామకానికి ప్రభుత్వానికి బీబీబీ ఇప్పటికే తన ప్రతిపాదనలను పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్–రా
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికవృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.4 శాతంగా నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) మంగళవారం పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మాత్రం 7.9 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర గణాంకాల విభాగం అంచనా 7.1 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. వినియోగ డిమాండ్, ప్రభుత్వ వ్యయాల పెంపు వంటి కారణాల వల్ల వచ్చే ఏడాది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలో వృద్ధిరేటు వరుసగా 3%, 6.1%, 9.1%గా నమోదవుతాయన్న అంచనాలను వెలువరించింది. -
సన్ ఫార్మా లాభం రూ.1,472 కోట్లు
• క్యూ3లో 5 శాతం తగ్గుదల... • మొత్తం ఆదాయం రూ.7,913 కోట్లు న్యూఢిల్లీ: సన్ ఫార్మా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.1,472 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు సాధించిన నికర లాభం(రూ.1,545 కోట్లు)తో పోల్చితే 5 శాతం క్షీణత నమోదైంది. గత క్యూ3లో రూ.7,122 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.7,913 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వి తెలిపారు. ప్రస్తుత వ్యాపార వృద్ధిపై దృష్టిని కొనసాగిస్తున్నామని, తక్షణం ఆదాయం అందించకపోయినప్పటికీ, ప్రత్యేక విభాగాలపై పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. అదనపు డైరెక్టర్ నియామకం.. మొత్తం అమ్మకాల్లో 26 శాతం వాటా ఉన్న భారత బ్రాండెడ్ ఫార్ములేషన్స్ విభాగం అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,969 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆమ్మకాల్లో 45 శాతం వాటా ఉండే అమెరికా వ్యాపారం 4 శాతం వృద్ధితో 51 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. తమ కంపెనీలకు చెందిన 424 అండా(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లకు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలిపిందని, ఎఫ్డీఏ ఆమోదం కోసం 149 అండాలను దరఖాస్తు చేశామని, 14 అండాలకు తాత్కాలిక ఆమోదం పొందామని వివరించారు. ఇక తమ కంపెనీ అదనపు డైరెక్టర్గా కళ్యాణసుందరమ్ సుబ్రహ్మణ్యమ్ను నియమించామని సంఘ్వి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ 0.7 శాతం క్షీణించి రూ.650 వద్ద ముగిసింది. -
అపోలో హాస్పిటల్స్ లాభం 40 శాతం డౌన్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.73 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.122 కోట్లు)తో పోల్చితే 40% క్షీణత నమోదైంది. ఆదాయం రూ.1,425 కోట్ల నుంచి 1,681 కోట్ల కు పెరిగింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల ముఖ విలువ గల రేటెడ్, లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.200 కోట్ల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది.