Stamps and registration department
-
తూతూ మంత్రం.. ప్రజా సమస్యల పరిష్కారం!
సాక్షి, అమరావతి: ప్రజా వినతులకు సరైన పరిష్కారం చూపకుండా ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. చాలా వినతులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజా వినతుల పరిష్కారంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరు సక్రమంగా లేదని ప్రకటించారు.గత ఏడాది జూలై 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు 7.42 లక్షల ప్రజా వినతులు రాగా, అందులో ఇంకా 2.91 లక్షలు పెండింగ్లోనే మగ్గుతున్నాయి. మరోవైపు కొన్ని వినతులు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది. ప్రజా వినతుల పరిష్కార పరిస్థితి ఇదీ... » పోలీసు శాఖ ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరుపై 70 శాతం అర్జీదారులు అసంతృప్తి చేశారు. » మున్సిపల్ శాఖపై 69 శాతం మంది అసంతృప్తి. » స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై 67 శాతం సంతృప్తి వ్యక్తమైంది. » రెవెన్యూ శాఖలోను 60 శాతం అసంతృప్తి వ్యక్తంచేశారు. అత్యధికంగా రెవెన్యూలో మ్యుటేషన్, విస్తీర్ణంలో తేడాలపై సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీల సరవణలు, భూ కమతాల పంపిణీ, పట్టాదారు పాస్పుస్తకాల గురించి వినతులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా సంబంధిత వీఆర్వోలకు బదిలీ చేస్తున్నారు. వీఆర్వో నివేదిక ఆధారంగా అధికారులు ఎండార్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పిటీషనర్ల దగ్గరకు వెళ్లడం లేదు. ప్రాథమిక విచారణ చేయడం లేదు. » ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన కొన్ని కేసుల్లో అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండార్స్మెంట్లు ఇస్తున్నారు. కానీ, చాలా కేసుల్లో నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని ఫిర్యాదులను అప్లోడ్ చేయడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పేర్కొంటున్నారు. అటువంటి వాటిపై నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. » అర్జీదారుల వినతి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిచోట్ల ఫిర్యాదులను తిరిగి తెరిచినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. » వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి శాఖల వారీగా చేసిన సర్వేకు, సీఎంవో చేసిన సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సీఎంవో నిర్వహించి సర్వేలో ఎక్కువ శాఖల్లో ప్రజల వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. -
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి తావివ్వొద్దని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పనిచేయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే బకాయిల విడుదల ఇటీవల బదిలీలు జరిగిన విషయం గుర్తుచేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులందరూ వీలైనంత త్వరగా కొత్త స్థానాల్లో సర్దుబాటు కావాలని పొంగులేటి చెప్పారు. బాగా పని చేసిన వారికి పదోన్నతులు కల్పిస్తామని, బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. వచ్చే ఐదేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని, దశల వారీగా నిర్మాణాలు చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలకు అద్దెలు, విద్యుత్, వాటర్ చార్జీలు, వాహనాల అద్దె లాంటి బకాయిలను త్వరలోనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. భూముల విలువల సవరణ ప్రక్రియ విషయంలో థర్డ్ పార్టీ నివేదిక వచ్చిన తర్వాత త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ బుద్ధ ప్రకాశ్జ్యోతి శాఖ పనితీరు గురించి మంత్రికి వివరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను మంత్రి పొంగులేటి విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విలువలే కాదు.. తప్పులూ సవరణ..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది. ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి. నాలుగింటిలో మూడు క్లియర్ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. -
AP: పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలిరోజే పది వేల డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున వీఆర్ఓలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా ముద్రించారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో మొట్టమొదటగా తాతపూడి అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ విలువ రూ. 4.46 లక్షలు కాగా, భూసేకరణ విలువ రూ. 11.61 లక్షలుగా అందులో పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ, యూజర్ ఛార్జిలను ప్రభుత్వమే భరిస్తోంది. అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన రూ. 11.61 లక్షల విలువైన ఆస్తికి సాధారణంగా అయితే ఆమె రూ. 18,600 స్టాంప్ డ్యూటీ, రూ. 2,325 రిజిస్ట్రేషన్ ఛార్జి, రూ. 500 యూజర్ ఛార్జి కలిపి మొత్తం రూ. 21,425 చెల్లించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వమే భరించింది. రిజిస్ట్రేషన్ చేసిన కన్వేయన్స్ డీడ్ 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి.. పదిహేనురోజుల్లో 30.61 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రిజిస్ట్రేషన్లను మరింత వేగంగా చేయనున్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లను (కన్వేయన్స్ డీడ్స్) లబ్ధిదారులకు అందించనున్నారు. రూ. 10 స్టాంప్ పేపర్లపై ఈ డీడ్ల ప్రింటింగ్ను రిజిస్ట్రేషన్లు అయినదాన్ని బట్టి జిల్లాల్లోనే చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత నియోజకవర్గాలు, సచివాలయాల స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ డీడ్స్ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
చిట్ఫండ్ మోసాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి’ వంటి కంపెనీల మోసాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి కళ్లెం వేస్తోంది. చిట్ఫండ్ వ్యవహారాలను కట్టుదిట్టం చేసేందుకు.. ఈ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సదరు కంపెనీలు నిర్వహించే చిట్ల వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా ఆన్లైన్ విధానాన్ని రూపొందించి ‘ఈ–చిట్స్’ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ చిట్ఫండ్ కంపెనీల్లో చిట్లు కట్టే చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా దీన్ని అమలుచేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. ఇకపై చిట్ఫండ్ కంపెనీలు తమ చిట్స్ వివరాలన్నింటినీ ఈ అప్లికేషన్లో నమోదు చేయాల్సిందే. మొన్నటివరకు చిట్స్ రిజిస్ట్రార్ల అనుమతితో ఆ కంపెనీలు రికార్డులు నిర్వహించేవి. గ్రూపుల వారీగా అనుమతి తెచ్చుకుని వాటి రిజిస్టర్లను తమ ఇష్టానుసారం మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ రిజిస్టర్లకు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకపోవడం, తీసుకున్నా వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం, ఆ వివరాలను చందాదారులకు తెలియకుండా దాచడం వంటి అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ఆ కంపెనీల్లో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు చిట్ఫండ్ కంపెనీలు బోర్డు తిప్పేయడం, లక్షలాది మంది చందాదారులు తమ శ్రమను ధారపోసి కట్టిన సొమ్మును నష్టపోవడం చాలా సందర్భాల్లో జరిగాయి. ఇలాంటి చిట్ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. మోసాలు అరికట్టడమే లక్ష్యం.. దీంతో.. రాష్ట్రంలో చిట్ఫండ్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఆన్లైన్ చిట్స్ పర్యవేక్షణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నిర్వహించే ఈ నూతన ఎలక్ట్రానిక్ విధానాన్ని రాష్ట్రంలోని చిట్ఫండ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని స్పష్టంచేశారు. చిట్ఫండ్ కంపెనీలు తమ లావాదేవీలను ఈ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి వుంటుంది. ఏదైనా చిట్ఫండ్ కంపెనీ తమ చిట్లకు అనుమతులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వాటిని చిట్ రిజిస్ట్రార్లు ఆన్లైన్లోనే పరిశీలించి ఆమోదిస్తారు. ప్రతి చిట్కు సంబంధించిన గ్రూపు వివరాలు, మార్పులు, చేర్పులు, ప్రతినెలా జరిగే వేలం పాటలు వంటివన్నీ ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఈ వివరాలన్నింటినీ చందాదారులు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ప్రతినెలా తాను కట్టే చిట్ వివరాలను ఆన్లైన్లోనే చూసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిట్ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. చిట్ఫండ్ కంపెనీలను సమర్థవంతంగా నియంత్రించడంలోనూ వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడంలోనూ ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు. ఇప్పటికే ఉన్న చిట్ గ్రూపుల వివరాలను కూడా త్వరలో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయనున్నారు. చందాదారులు తమ అనుమానాలను దీనిద్వారానే నివృత్తి చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలున్నా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. -
ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం..
అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసికొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సాఫ్ట్వేర్(కార్డ్ ప్రైమ్) వాలాను ఎక్కడా అభ్యంతరాలు తలెత్తలేదన్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 23 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఈ కొత్త సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాతే కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని అయన తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేనివారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయచేసి ఆ అపోహలను నమ్మవద్దని కోరారు. కొత్త విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని ఎవ్వరూ చెప్పలేదని దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పాత,కొత్త రెండు విధానాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ఈ సిస్టమ్ మీద అవగాహన లేనివారే దీనిని జిరాక్స్ కాపీలంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు రోజులుగా సాగుతోన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొత్తం 700 రిజిస్ట్రేషన్లు చేస్తే అన్నిటినీ ఫిజికల్ డాక్యుమెంట్లతోనే చేశామని.. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆప్షనల్గా మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్ అర్హత ఏంటి’ -
‘ఘోస్ట్’ చందా.. మార్గదర్శి దందా!
సాక్షి, అమరావతి: ఈయన పేరు సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామస్తుడు. బాపట్ల జిల్లా చీరాలలోని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఓ చిట్టీ గ్రూపులో చందాదారుగా నమోదయ్యారు. ఈయన ఏనాడూ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయానికి వెళ్లలేదు. మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుగా చేరనే లేదు. కానీ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో మాత్రం ఆయన్ను చందాదారుగా నమోదు చేయడం గమనార్హం. విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిఖార్సైన నిజం. దేశంలో ఇంత వరకు ఏ చిట్ ఫండ్స్ సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేయని రీతిలో వినూత్న రీతిలో మార్గదర్శి సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు ఇది తాజా నిదర్శనం. ఇలా ఎందుకు చేశారంటే.. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా ఎలా చేసిందనే సందేహం రావడం సహజం. ఎలా అంటే సుబ్రహ్మణ్యం ఆధార్ కార్డును తమ ఏజంట్ల ద్వారా సేకరించి ఆయనకు తెలియకుండానే చిట్టీ గ్రూపులో చందాదారునిగా చేర్చింది. ఇలాంటి వారిని ‘ఘోస్ట్ చందాదారులు’ అని వ్యవహరిస్తారు. అంటే చందాదారులు లేకుండానే వారి పేరిట చిట్టీ గ్రూపుల్లో సభ్యత్వం కొనసాగిస్తారు. అయితే తాను చందాదారునిగా ఉన్నానని సుబ్రహ్మణ్యానికి తెలియదు కాబట్టి ఆయన చందా చెల్లించరు. ఆయన్ని ఎవరూ అడగరు కూడా. దాంతో అసలు విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పేరిట ఉన్న చిట్టీకి ప్రతి నెలా మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చందా చెల్లించకపోయినా, చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తుంది. ప్రతి నెల చందాదారునికి వచ్చే డివిడెండ్ను మాత్రం సుబ్రహ్మణ్యం పేరిట తానే తీసుకుంటుంది. ఒక నెల సుబ్రహ్మణ్యం పేరిట చిట్టీ పాట పాడతారు. ఆ చిట్టీ పాట మొత్తం (ప్రైజ్మనీ) మార్గదర్శి యాజమాన్యం తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది. అంటే రూపాయి చందా చెల్లించకుండానే.. ప్రతి నెల డివిడెండ్ మొత్తం తీసుకోవడంతోపాటు చిట్టీ పాట పేరిట ప్రైజ్ మనీ కూడా కొల్లగొడుతోంది. ఇలా వెలుగు చూసింది.. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాల్లో భాగంగా సందేహం కలిగిన చందాదారులను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆ విధంగా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం చీరాలలో చిట్టీ గ్రూపులో సభ్యుడిగా ఉండటం ఏంటనే సందేహం వచ్చి అధికారులు సంప్రదించడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచీల పరిధిలో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు భారీగా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఘోస్ట్ చందాదారుల దందాతోపాటు చందాదారులను దురుద్దేశంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా ఇక్కట్ల పాటు చేస్తోందని కూడా ఈ సోదాల్లో వెల్లడైంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘోస్ట్ చందాదారులు, చందాదారులకు తెలియకుండానే వారిని ష్యూరిటీగా చూపించడం తదితర మోసాలకు పాల్పడిన ఫిర్యాదులతో మార్గదర్శి చిట్ ఫండ్స్పై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘోస్ట్ చందాదారులతో భారీగా అక్రమాలు వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్ చందాదారుల పేరిట డివిడెండ్లతోపాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్ఫండ్ చట్టానికి విరుద్ధం. ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కూడా. ఎందుకంటే ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వారికి తక్కువ డివిడెండ్ వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ఘోస్ట్ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం (ప్రైజ్మనీ) వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు. అప్పుల ఊబిలోకి చందాదారులు చిట్టీ గ్రూపు ప్రారంభంలోనే చందాదారుల నుంచి సంతకాలు తీసుకుని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏకంగా చందాదారుల ఆస్తులను తమ పేరిట రాయించుకోవడం మార్గదర్శి చిట్ఫండ్స్ దారుణాలకు నిదర్శనం. ముందుగా తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేస్తూ ఓ చందాదారునికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను మరో చందాదారునికి ష్యూరిటీగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దాంతో చిట్టీ పాట పాడిన చందాదారుడు వాయిదాలు చెల్లించ లేదు కాబట్టి, ష్యూరిటీగా పేర్కొన్న చందాదారుడు చెల్లించాలని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఓ చిట్టీ పాట పాడిన చందాదారు ప్రైజ్మనీ తీసుకుని రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలిన వాయిదాలు చెల్లించకపోతే.. ఆ చిట్టీ పాటను రద్దు చేసి సంబంధిత నెలకు కొత్తగా చిట్టీ పాట నిర్వహించాలని చట్టం చెబుతోంది. కానీ దీన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్టించుకోవడం లేదు. చిట్టీ వాయిదాలు చెల్లించలేని చందాదారులతో మాట్లాడి వారిని మరో చిట్టీ గ్రూపులో సభ్యులుగా చేరుస్తోంది. ఆ కొత్త గ్రూపులో డివిడెండ్తో పాత గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చు అని చెబుతోంది. ఇలా ఒక చందాదారుని లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా చూపిస్తోంది. దాంతో ఆ చందాదారు మార్గదర్శి చిట్ ఫండ్స్కు భారీగా బకాయిలు పడేట్టు చేస్తోంది. అతి సామాన్య పూజారిని ఏకంగా 22 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చారు. మరో వ్యక్తిని ఏకంగా 60 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చూపించినట్టు సోదాల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమాలకు అంతే లేదు. ఆ చందాదారుడు ఓ చిట్టీలో పాటపాడినప్పటికీ అతి తక్కువ అంటే నామమాత్రంగానే ప్రైజ్మనీ పొందుతున్నారు. ఎంతగా అంటే రూ.50 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడైన ఓ చందాదారుడు రూ.46 లక్షలకు చిట్టీ పాట పాడితే ఆయనకు మార్గదర్శి చిట్ఫండ్స్ చేతికి ఇచ్చింది కేవలం రూ.20 మాత్రమే. మరో చందాదారుడు రూ.18 లక్షలకు చిట్టీ పాట పాడితే చేతికి వచ్చింది కేవలం రూ.200. మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఇలాంటి అక్రమాలు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. వందకుపైగా ఫిర్యాదులు చందాదారుల నుంచి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్ఫండ్స్పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఖండించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ పాల్పడుతున్న మోసాలపై పెద్ద సంఖ్యలో చందాదారులు పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మూడు రోజుల్లోనే దాదాపు వంద మందికిపైగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, చందాదారులు పూర్తి వివరాలతో ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9493174065 కేటాయించింది. మూడు చోట్ల చీటింగ్ కేసులు నమోదు చీరాల, అనకాపల్లి, రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో మార్గదర్శి చిట్ ఫండ్స్పై మూడు కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల బ్రాంచి మేనేజర్లు (ఫోర్మెన్)లతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమన్యాంపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ మూడు బ్రాంచిల మేనేజర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ► సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారునిగా నమోదు చేసినందుకు చీరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ► అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తర్వాత ఆయన రూ.4,61,989కు చిట్టీ పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తం ఆయన ష్యూరిటీ ఇచ్చిన మిగిలిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని చెప్పినా, బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు చూపించారు. ఆ కాపీలు కావాలని అడిగినా సరే ససేమిరా అన్నారు. దాంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ► కోరుకొండ విజయ్కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్ఫండ్స్ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించాక 2020 జూన్లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్ తిరస్కరించారు. విజయ్కుమార్ తన స్నేహితుడు మల్లికార్జున రావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ఆయనకు ప్రైజ్మనీ ఇవ్వమని చెప్పారు. అసలు మల్లికార్జునరావు చిట్టీ మొత్తం గడువు తీరనే లేదని తెలిసింది. తనను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం మోసం చేసిందని విజయ్కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఓ ‘నల్ల’ ఖజానా సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ నల్ల కుబేరుల అడ్డా అన్నది బట్టబయలైంది. తవ్వేకొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ సంపాదనను దాచుకునేందుకు రామోజీరావు సృష్టించిన ఓ మినీ స్విస్ బ్యాంకు అని ఆధారాలతో స్పష్టమవుతోంది. ఉభయతారకంగా నల్లకుబేరులు, రామోజీరావు ఈ బ్లాక్ మనీ దందా సాగిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మరోవైపు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు చందదారుల సొమ్మును భారీగా తమ సొంతానికి మళ్లించుకున్న గుట్టు కూడా రట్టు అవుతోంది. శని, ఆదివారాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా వెల్లడి కావడం గమనార్హం. రూ.కోటి కంటే అధికంగా చిట్టీలు వేసిన, అక్రమ డిపాజిట్లు చేసిన వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్టు ఇప్పటి వరకు గుర్తించినట్టు సమాచారం. వారి మార్గదర్శి లెడ్జర్ పుస్తకాల్లోగానీ, ఆ చందాదారులకు ఇచ్చిన పాస్బుక్లోగానీ వారి పాన్ నంబర్లు, ఆధార్ నంబర్లు నమోదు చేయనే లేదన్నది వెల్లడైంది. కొందరు చందాదారులను సీఐడీ అధికారులు పిలిచి విచారించగా వారికి అన్ని కోట్ల రూపాయలు ఏలా వచ్చాయన్నది చెప్పలేకపోయారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నిస్తే వారు విస్మయకర సమాధానమిచ్చారు. ఈ అక్రమాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలోని ఓ బ్రాంచి మేనేజర్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దాంతో రామోజీరావుతోసహా మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం హడలెత్తిపోయింది. ఆ మేనేజర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ మేనేజర్ చాలా మంది పెద్దలకు బినామీ అన్నది స్పష్టమవుతోంది. ఇలా పలువురు మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, కొందరు బ్రాంచి మేనేజర్లు చందాదారుల చందా మొత్తాలను తమ సొంతానికి వాడుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. విశాఖపట్నంలో దీనిని నిర్ధారించారు. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. పలు చోట్ల అవకతవకలకు సంబంధించి లెడ్జర్ ఖాతాలు, చిట్టీ పాటల మినిట్స్ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు. చీటింగ్కు ‘మార్గదర్శి’గా కడప మేనేజర్ కడప అర్బన్: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. చందాదారులను మోసం చేసి అక్రమార్జనకు పాల్పడటంలో మార్గదర్శి యాజమాన్యమే కాదు.. సంస్థలో కొందరు మేనేజర్లు కూడా సిద్ధహస్తులేనన్న విషయాన్ని ఆ సంస్థ పూర్వపు ఉద్యోగులు వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ వైఎస్ఆర్ జిల్లాలో కడప బ్రాంచి మేనేజర్గా పనిచేస్తున్న డి. శేషుబాబు అక్రమార్జనను వివరిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీబీఐ విజయవాడ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఏజెంట్స్ కోడ్లతో చిట్లు భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించాడని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలివీ.. శేషుబాబు ఆయన సొంత ఏజెంట్ వి. శ్రీనివాసులరెడ్డి (ఏజెంట్ కోడ్ నం: సిపి0000160) కోడ్ ద్వారా ఎక్కువ మంది చిట్ సభ్యులను చేర్పించారు. ఎన్.వి బాలాజీ (ఏజెంట్ కోడ్ నం. జె0000088), గౌరి (ఏజెంట్ కోడ్ నం: జె0000167), ఎ.వి మహేష్ (ఏజెంట్ కోడ్ నం: సిపి000077)తో పాటు ఇంకా ఇతర ఏజెంట్ కోడ్లలో కూడా చిట్లు వేసి విపరీతంగా సంపాదించాడు. తనకు అనుకూలమైన వారికి తక్కువ బిడ్ అమౌంట్ కేటాయిస్తారు. మిగిలిన వారికి (స్టాఫ్) ఎక్కువ బిడ్ను మేనేజరే ఇంత అని నిర్ణయిస్తారు. పాట సమయానికి కస్టమర్ వచ్చినప్పుడు కూడా బిడ్ ఎక్కువగా వచ్చేట్లు ఉద్యోగులతో పాడిస్తాడు. ఈ విధంగా సంపాదించిన సొమ్ముతో బంగారం, బెంగళూరులో సొంత ఇల్లు, కడపలో స్థలాలు, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు కూడా కొన్నారు. మిగిలిన మార్గదర్శి ఉద్యోగులను స్టాఫ్ కోడ్లతో చిట్స్ వేయమనీ వేధిస్తాడు. చెప్పినట్లు చేయకుంటే దుర్భాషలాడతాడు. దీంతో కొందరు సీనియర్ స్టాఫ్ వేరే సంస్థలకు వెళ్లిపోయారు. శేషుబాబు కొందరు ఖాతాదారులకు ఇవ్వాల్సిన గిఫ్ట్లను కూడా అమ్మేసుకున్నారు. ఆయనకు అనుకూలమైన ఉద్యోగులైన శివసతీష్, రిసెప్షనిస్టు వరలక్షుమ్మ కూడా ఏజెంట్ కోడ్లలో వేసుకోవడానికి ప్రాధాన్యత కల్పించాడు. శివసతీష్ చిట్టీ కమీషన్ డబ్బులను వడ్డీలకు ఇచ్చి మరింత సంపాదిస్తున్నాడు. పాట పాడటానికి ఎవ్వరూ రాకపోతే శేషుబాబు, శివసతీష్, వరలక్షుమ్మ కలిసి తక్కువ బిడ్ పోతున్నా ఎక్కువ బిడ్ పోయేలా చేస్తారు. దీనిద్వారా అసలైన చందాదారులకు వడ్డీ ఎక్కువ పడుతుంది. కస్టమర్లకు బిడ్ వచ్చిన తర్వాత కూడా డబ్బు ఇవ్వడానికి వీరు ఇబ్బందులకు గురిచేస్తారని వారు సీబీఐకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. మార్గదర్శి మేనేజర్ అరెస్ట్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్లో చిట్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్న వైనం బహిర్గతమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు బ్రాంచ్ మేనేజర్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రి ఏఆర్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కోరుకొండ విజయ్కుమార్ మార్గదర్శిలో మోసంపై శనివారం టూటౌన్ సీఐ గణేష్కు ఫిర్యాదు చేశారు. విజయ్కుమార్ మార్గదర్శి చిట్స్లో 2019లో రూ.5 లక్షల చిట్ వేశారు. 50 నెలల కాల వ్యవధిలో నెలకు రూ.10 వేల చొప్పున చిట్కు నగదు చెల్లించాలి. తనకున్న ఆర్థిక అవసరాల రీత్యా ఆయన 2020 జూన్ 21వ తేదీన రూ.3 లక్షలకు చిట్ పాడారు. చిట్ డబ్బులు చెల్లించాల్సిన మార్గదర్శి మేనేజర్, బ్రాంచ్ అధికారులు ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. అదేమని ప్రశ్నిస్తే ఇద్దరి ష్యూరిటీ కావాలన్నారు. వాళ్ల కోరిక మేరకే ఇద్దరి ష్యూరిటీ తీసుకువచ్చారు. ఇప్పుడైనా చీటీ డబ్బులు ఇవ్వాలని కోరగా.. మీరు ఇతరులకు ష్యూరిటీ పెట్టారు. అది క్లియర్ చేస్తే మీ చీటీ డబ్బులు ఇస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. ష్యూరిటీకి సంబంధించిన డబ్బులు హెడ్ కానిస్టేబుల్ స్నేహితుడు చెల్లించేశారు. అయినా.. ఇతనికి రావాల్సిన రూ.3 లక్షలు ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్లలో.. మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని లొసుగులు బయటపడ్డాయి. వేలంపాటలోనూ అవకతవకలు కనిపించాయి. సెక్షన్ 17 ప్రకారం.. చిట్ఫండ్ స్టార్టింగ్లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. ప్రజలకు, చందాదారులకు ఇలాంటి అవకతవకలను తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. మార్గదర్సి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ► మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పిఎస్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. ► అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు ► రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎంపై 179/23...409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్ కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని తెలిపారాయన. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని సీఐడీ ఎస్సీ అమిత్ బర్దార్ తెలిపారు. శారదా కుంభకోణం తర్వాత చిట్స్ చట్టంలో మార్పులు చేసినా.. మార్గదర్శిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. డిపాజిట్ దారులు కానివారి డాక్యుమెంట్స్ ఉపయోగించి అక్రమాలకి పాల్పడ్డారు. డిపాజిట్ దారులకి తెలియకుండా మార్గదర్సి చిట్ ఫండ్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కేసులో డిపాజిట్ దారుడికి తెలియకుండానే అతనిని మరో డిపాజిట్ దారుడికి ష్యూరిటీగా పెట్టారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఫోర్ మెన్లకి నిర్దిష్టమైన విధులువున్నాయి. డిపాజిట్ దారులకి అవగాహన కల్పించాల్సిన ఫోర్ మెన్ లు మోసం చేస్తున్నారని తెలిపారాయన. చిట్ ఫండ్ మోసాలు, అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. చిట్ఫండ్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరించింది. బ్రాంచ్ మేనేజర్లు తమకేమీ తెలియదని చెబుతున్నారు. రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర రికార్డ్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9493174065 అని అధికారులు తెలిపారు. -
మార్గదర్శిలో రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం
-
రిజిస్ట్రేషన్ కాగానే యాజమాన్య హక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మ్యుటేషన్ (యాజమాన్య హక్కు బదిలీ) విధానాన్ని సులభతరం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇప్పుడున్న విధానంలో క్లిష్టతరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, నిర్దిష్ట గడువులో ఆ శాఖ దాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోంది. మధ్యలో కొన్ని వివాదాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎంతో ప్రహసనంగా ఉన్న మ్యుటేషన్ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం సమీక్షలతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తీసుకు రానున్నారు. రూపొందిన ప్రత్యేక అప్లికేషన్.. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్కు, రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్ను రూపొందించారు. తత్ఫలితంగా ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లోనూ యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. రెవెన్యూ వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన మార్పుగా చెబుతున్నారు. ఆటో మ్యుటేషన్ విధానాన్ని తొలుత భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యుటేషన్ను అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
23 మార్గదర్శి చిట్ గ్రూపులు రద్దు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్లు, ఆడిటర్లు పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది. అనంతపురం బ్రాంచిలో రెండు, అరండల్పేటలో 1, నరసరావుపేటలో 3, రాజమహేంద్రవరంలో 2, తణుకులో 1, విశాఖ డాబా గార్డెన్స్, కూర్మన్నపాలేల్లో ఒక్కొక్కటి, విశాఖ ఎన్ఏడీ బ్రాంచిలో రెండు, విశాఖ సీతంపేట బ్రాంచిలో 10 చిట్ గ్రూపులు రద్దయ్యాయి. ఈ చిట్ గ్రూపులు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. తాజా అక్రమాలివే గ్రూపు ప్రారంభించినప్పుడు అన్ని టికెట్లు నిండకపోయినా నిండినట్లు చిట్ రిజిస్ట్రార్కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్మెన్లు డిక్లరేషన్లు ఇచ్చారు. అలాగే చిట్ గ్రూపులు ప్రారంభమైనప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను కంపెనీ తనపేరు మీదే ఉంచుకుంటుంది. అలా తన పేరున ఉన్న టికెట్లకు సంబంధించిన చందాలను కట్టాల్సి ఉన్నా.. కమిషన్పోగా కట్టాల్సిన సొమ్మును కట్టకుండా కంపెనీ చందాదారులను మోసం చేసింది. అలా డబ్బు కట్టకపోవడం వల్ల మిగతా గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పాట పాడుకున్న చందాదారులకు ఆ సొమ్ము ఇవ్వకుండా రశీదుల పేరుతో ఆ సొమ్మును డిపాజిట్లుగా ఉంచారు. అన్ని నెలలు చిట్ చందా కట్టినవారినే పాటకు అనుమతించాలి. కానీ మార్గదర్శిలో కొన్ని నెలలు కట్టి మధ్యలో కట్టకుండా ఉన్న వారిని కూడా పాటకు అనుమతించి, వారు పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును తమకు చెల్లించాల్సిన దానిగా కట్టించుకున్నారు. కొన్ని గ్రూపుల్లో వేలం పాట నిర్వహించకుండానే ప్రతినెలా చందాలు కట్టించుకున్నారు. ఇవన్నీ చిట్ఫండ్ చట్టానికి విరు ద్ధమే. ఈ ఉల్లంఘనలున్న చిట్ గ్రూపులను రద్దు చేశారు. దీంతో రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తా యి. వాటితో కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రామోజీరావు సహా పలువురిపై కేసు నమోదు ఇప్పటికే మార్గదర్శిలో భారీగా అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్ ఆడిటర్ తని ఖీలు చేసి ఇచ్చిన నివేదికలో మార్గదర్శి యాజమా న్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్ర భుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొ మ్మును తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీల సమయంలో కంపెనీ మేనేజర్లు రిజి స్ట్రేషన్ల శాఖకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టారు. అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. సమాచా రం, వివరాలన్నీ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీ సులోనే ఉన్నాయంటూ తనిఖీ బృందాలకు సహక రించలేదు. దీంతో అధికారులు కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. బ్యాలెన్స్షీట్లు, వెబ్సైట్లో వివరాలను బట్టి మరి కొంత సమాచారం సేకరించారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్గదర్శికి చెందిన విశాఖ, కాకి నాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం బ్రాంచిలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ సహా పలువురు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసులు నమోదు చేసి అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తోంది. జరిగిన ఆడిట్లో మరిన్ని మోసాలు బయటపడడంతో 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చదవండి: Margadarsi: 1982 చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు -
20% గ్రామాల్లోనే స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో మాత్రమే స్థిరాస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 80 శాతం గ్రామాల్లో మార్కెట్ విలువలను సవరించడం లేదు. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో మాత్రమే మార్కెట్ విలువలను సవరించనున్నారు. అదికూడా ఆయా ప్రాంతాల్లో పెరిగిన భూముల విలువలను బట్టి స్వల్పంగానే సవరించాలని నిర్ణయించారు. ఈ సవరణ 10 నుంచి 30 శాతం లోపే ఉండనుంది. రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆయా ప్రాంతాల్లో పెరిగిన మార్కెట్ విలువను అక్కడి రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ శాఖాధికారుల కమిటీలు నిర్థారించాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కొత్తగా ఏర్పడిన రహదారులు, విస్తరిస్తున్న అర్బన్ ఏరియాల్లో రిజిస్టర్ విలువలకు, మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ జిల్లాల్లో భారీగా మార్కెట్ విలువ పార్వతీపురం మన్యం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల అయితే మార్కెట్ విలువల, రిజిస్టర్ విలువల మధ్య వ్యత్యాసం 75 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా గతం కంటే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిన గ్రామాలు, అర్బన్ ఏరియాల్లోనే మార్కెట్ విలువల్ని సవరించనున్నారు. ఈ ఏడాది సవరణలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ 1వ తేదీ నుంచి మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. కమిటీల ప్రతిపాదనలు ఇలా.. సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు లేదా పట్టణాల్లో వచ్చిన మార్పులను బట్టి అర్బన్ ఏరియాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరిస్తుంది. మూడేళ్లుగా కరోనా ఇతర కారణాల రాష్ట్రంలో పూర్తిస్థాయి సవరణ చేపట్టలేదు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేక సవరణ నిర్వహించింది. ఈ పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ రివిజన్ చేపట్టింది. అర్బన్ ఏరియాల్లో జాయింట్ కలెక్టర్ కన్వీనర్గా.. మునిసిపల్ కమిషనర్/వుడా/సీఆర్డీఏ అధికారులు, సంబంధిత ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా ఉండే కమిటీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే దానిపై పరిశీలన జరిపాయి. గ్రామాల్లో ఆర్డీవోలు కన్వీనర్లుగా.. జిల్లా పరిషత్ సీఈవో, సంబంధిత ఎండీపీడీవో, ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్లతో ఏర్పడిన కమిటీలు ఆయా ప్రాంతాల్లోన్ని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే విషయాన్ని పరిశీలించాయి. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గడచిన ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగిన పట్టణ ప్రాంతాలు, గ్రామాలను ఈ కమిటీలు గుర్తించాయి. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి (ఏదైనా పరిశ్రమ, సంస్థ రావడం, హైవేలు, ప్రధాన రహదారులు ఏర్పాటు కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వంటి అనేక కారణాలు) అనే వివరాలను కమిటీలు సేకరించాయి. ఆయా కారణాలను విశ్లేషిస్తూ.. లావాదేవీలు ఎక్కువ జరుగుతున్న సర్వే నంబర్లను బట్టి మార్కెట్ విలువలను ప్రతిపాదించాయి. ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్న 20 శాతం ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి. జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు లేదా ఆర్డీవోల ఆధ్వర్యంలోని కమిటీలు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు సంబంధిత ప్రతిపాదనలు పంపించగా.. వాటిని ఉన్నతాధికారులు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించారు. -
మార్గదర్శి అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నోటీసులు
గుంటూరు: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు(మంగళవారం) మార్గదర్శి చిట్స్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటకొచ్చాయి. నేటి తనిఖీల్లో ఖాళీ చిట్ల నిర్వహణలో మార్గదర్శి గోల్మాల్ను గుర్తించారు. గుంటూరు 5 చిట్ గ్రూప్లను పరిశీలించగా 6 కోట్ల 98 లక్షల చెల్లింపుల రికార్డులను అధికారులకు మార్గదర్శి చూపించలేదు. శ్రీకాకుళం బ్రాంచ్లో 28 చిట్స్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. 2 కోట్ల 88 లక్షల పేమెంట్స్కి మార్గదర్శి ఆధారాలు చూపలేదు. ఇక విజయనగరంలో 12 చిట్లను పరిశీలించగా, 54 లక్షల 85 వేల చెల్లింపులకు సైతం ఆధారాలు చూపించలేదు మార్గదర్శి. ఈ అక్రమాలపై మార్గదర్శికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. -
మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం
విజయవాడ: మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.మార్గదర్శి చిట్ ఫండ్ లో నిధుల మల్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. మార్గదర్శి చిట్ఫండ్ 37 బ్రాంచ్లలో ఆడిటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దానిలో భాగంగా ప్రత్యేక ఆడిటర్ నియమించింది. కాగా, మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సీఐడీ విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
చందాదారుల సొమ్ముతో దందా!
సాక్షి, అమరావతి: మార్గదర్శి యాజమాన్యం చందాదారుల డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చట్ట ప్రకారం చిట్ఫండ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే చిట్స్ రిజిస్ట్రార్కు మార్గదర్శి యాజమాన్యం సహకరించడం లేదని తెలిపారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తమ బాధ్యతని, ఇదే ధోరణి కొనసాగితే మార్గదర్శి చిట్ఫండ్స్పై కఠిన చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో నిధుల దుర్వినియోగం, మోసం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తాము నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు న్యాయస్థానం కూడా రిమాండ్కు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో చందాదారుల సొమ్మును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. అందుకు ఇక్కడ బాధ్యులు ఉండరు. ఇతర రాష్ట్రాల్లో అడిగితే మీకు సంబంధం లేదంటున్నారు. అంటే చందాదారులు చెల్లిస్తున్న సొమ్ముకు ఎలాంటి భద్రతా లేదు’ అని పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను వివరించారు. ♦ చిట్ఫండ్ చట్టం సామాజిక, ఆర్థికపరమైన చట్టమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. చందాదారుల హక్కుల పరిరక్షణ, చిట్ఫండ్ కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఈ చట్టం చేశారని పేర్కొంది. చిట్ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చిట్ఫండ్ కంపెనీ బ్రాంచిలోని మేనేజర్ (ఫోర్మేన్) చందాదారులు చెల్లించే సొమ్ముకు పరిరక్షకుడు. చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్యవేక్షకుడు. ♦ బ్యాంక్ లావాదేవీల నిర్వహణ, నిధుల చెల్లింపులన్నీ ఫోర్మేన్ నిర్వహించాలి. రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉన్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో తనిఖీలు చేశాం. చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదన్న విషయం అందులో వెల్లడైంది. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేశారు. ♦ మార్గదర్శి ఫోర్మేన్కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తోసహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. ♦ఇక్కడున్న చందాదారుల సొమ్ముల భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే తెలంగాణలో ఉన్న ప్రధాన కార్యాలయం ఏపీ అధికారుల పరిధిలోది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన చందాదారులు చెల్లిస్తున్న డబ్బులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. సొమ్ము రాష్ట్ర ప్రజలది...పెత్తనం పక్క రాష్ట్రంలో వారిది. ♦మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులకు చెందిన సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చారెŠట్డ్ అకౌంటెంట్ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. ♦ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో మార్గదర్శి చిట్ఫండ్స్ ఫోర్మెన్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. గుంటూరు మినహా మిగతా మూడు చోట్లా న్యాయస్థానాలు నిందితులకు రిమాండ్ విధించాయి. నిందితులపై సీఐడీ మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని రిమాండ్కు అనుమతిస్తూ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సీఐడీ కేసు డైరీలో పేర్కొన్న అంశాలతో తాము సంతృప్తి చెందినట్లు, వారిని అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొన్నాయి. ♦ మార్గదర్శి యాజమాన్యం నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ, చిట్స్ రిజిస్ట్రార్కు సహాయ నిరాకరణ కొనసాగిస్తే చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్న అంశంతో మాకు నిమిత్తం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే మా విధి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. కేసు దర్యాప్తులో పురోగతికి అనుగుణంగా ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 చెరుకూరి శైలజను కూడా విచారించడంతోపాటు ఇతర చర్యలను తగిన సమయంలో తీసుకుంటాం. ఇదో.. పోంజీ తరహా స్కామ్ మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమాన్యం పోంజీ స్కామ్ తరహా అక్రమాలకు పాల్పడుతోంది. చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15 వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. చందాదారుల నుంచి ఫిర్యాదులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ చిట్ఫండ్ చట్టం, ఇతర చట్టాలను అనుసరించి మార్గదర్శిపై స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఒక్క చిట్ఫండ్ చట్టమే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించారు. సీఐడీ కేసు నమోదు చేయగానే పలువురు చందాదారులు తాము మోసపోయామని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 8 మంది చందాదారులు ఫిర్యాదు చేశారు. ఓ చందాదారుడు తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలను ఆర్నెల్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. మార్గదర్శి మేనేజర్లకు రిమాండ్ సాక్షి ప్రతినిధి, విజయవాడ/కాకినాడ లీగల్/విశాఖ లీగల్: నిబంధనలకు విరుద్ధంగా చిట్స్ నిర్వహిస్తున్న కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన మార్గదర్శి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ (ఫోర్మెన్)ను రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి స్ట్రేట్ సునందమ్మ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మార్గదర్శి మేనేజర్కు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. కాగా, మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్ను కాకినాడ రెండో అదనను జూనియర్ సివిల్ జడ్జి కమ్ సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఎం.ప్రసన్నలక్ష్మి ఎదుట సీఐడీ పోలీసులు సోమవారం హాజరుపర్చారు. రవిశంకర్కు ఒకరోజు రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కాకినాడ సీఐడీ కోర్టు పరిధిలో విచారణ చేయకూడని కొన్ని సెక్షన్లు ఉండటంతో.. సంబంధిత రికార్డును రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ను రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టులో హాజరు పరచనున్నారు. పోలీస్ కస్టడీకి అనుమతి విశాఖపట్నం సీతంపేటలోని మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ కామినేని రామకృష్ణను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సోమవారం అంగీకరించింది. మంగళ, బుధవారాలలో రెండు రోజులపాటు ఆయనను పోలీసులు విచారించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. -
రిజిస్ట్రేషన్లూ ఆన్లైన్లోనే.. కర్నూలుకు ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్
ఆస్తుల క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయమూ ఎక్కువే. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రజలకు సులభంగా.. అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రీమియం రిరిజిస్ట్రేషన్ సర్వీసు సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పాసుపోర్టు సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయి హంగులతో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో మొత్తం 9 ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రీమియం రిజస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ సేవలు విజయవంతం కావడంతో మిగిలిన ఏడు చోట్ల ప్రీమి యం రిజిస్ట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలులో ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు కర్నూలు నగరంలో ప్రజలకు అనువైన ప్రాంతం, 1,000 చదరపు అడుగుల భవనం కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచి ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు.. ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ ఫ్రంట్ ఎండ్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ఉండి పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్లైన్ సేవలు అందించినా.. తర్వాత అన్ని ఆన్లైన్ సేవలే ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అంతేకాక ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సెంటర్కు వెళ్లి సింగిల్విండో కింద రిక్వెస్టు పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినయోగదారులే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్కి వెళ్తుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఆస్తుల వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెస్సేజ్ వెళ్తుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అవినీతికి తావుండదు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – కల్యాణి, డీఐజీ, రిజిస్ట్రేషన్ అండ్స్టాంప్స్ -
‘మార్గదర్శి’ ప్రధాన కార్యాలయంలో సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మార్గదర్శి హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సోదాలు నిర్వహించాక కూడా ఎలాంటి రికార్డులు ఇవ్వలేదని, 8 ఏళ్లుగా ఎలాంటి రికార్డులు సమర్పించలేదని అధికారులు తెలిపారు. డిపాజిటర్ల సమాచారం సైతం ఇవ్వలేదన్నారు. మరోవైపు.. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నారు. ఆర్థిక అక్రమాలు, నిధులు మళ్లింపుపై దర్యాప్తు చేపట్టనున్నారు. తనిఖీల అనంతరం మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో 35 కంపెనీలలో అక్రమాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో 18 యూనిట్స్లో సోదాలు నిర్వహించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు. ఇదీ చదవండి: ‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు -
‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ చిట్స్ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా, అడిగిన సమాచారం ఇవ్వకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఏమిటని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి రామకృష్ణ ప్రశ్నించారు. తాము అడిగిన సమాచారం వారు ఇచ్చి ఉంటే, అది తాము సంతృప్తి చెందేలా ఉంటే సంతోషించే వారిలో తానే ప్రథముడినని చెప్పారు. అలా జరగనందునే పలు సందేహాలొస్తున్నాయని, అందువల్ల చిట్స్ వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన చిట్ఫండ్ చట్టంపై చిట్స్ డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నమ్మకం, అవమానం, నిప్పు, అబద్ధాలు.. వంటి కొన్ని పదాలు వాడారని, వాటితో తమకు పని లేదన్నారు. నిజాలు, సమాచారం, అంకెలు ఆధారంగానే తాము పని చేస్తామని చెప్పారు. వాస్తవాలు చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు ఇచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటే సరిపోదని, తాము అడిగిన సమాచారం ఇవ్వాలని, బ్యాలెన్స్ షీట్లు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐజీ ఇంకా ఏమన్నారంటే.. అది మా బాధ్యత.. – ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేయాలని లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు మేము ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చు.. చేస్తాం కూడా. ప్రతి ఏడాది వారు వివరాలు సమర్పించాలి. మేము అడిగిన సమాచారం ఇవ్వనందునే ఇదంతా చెప్పాల్సి వస్తోంది. వారు సమాచారాన్ని ఇవ్వక పోవడం వల్లే సందేహించాల్సి వస్తోంది. తప్పులు జరిగాయని భావించాల్సి వస్తోంది. అందువల్ల చిట్లు వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఒకవేళ ఫిర్యాదు వస్తే.. సీబీఐ, ఈడీ, పోలీసు వంటి సంస్థలు దర్యాప్తు చేస్తాయి. – మార్గదర్శి కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీకి సమాచారం ఇచ్చేది లేదని ప్రకటనలో పేర్కొంటే కుదరదు. ఏపీలో మార్గదర్శి కంపెనీ లక్ష మంది చందాదారులతో 2,345 చిట్లు నిర్వహిస్తోంది. వాటన్నింటినీ ఇక్కడి నుంచి నిర్వహిస్తూ బ్యాలెన్స్ షీట్లు ఎక్కడ ఇస్తారు? రిజిస్ట్రార్కి రికార్డులు ఇచ్చామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ లెక్కన వాటిని తెలంగాణ, కర్ణాటక అధికారులకు ఇచ్చారా? – మార్గదర్శి యాజమాన్యం వారికి అనుకూలంగా నిబంధనలను చూపిస్తోంది. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 21ని చూపిస్తూ తమ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీకి జవాబుదారీ కాదనడం సరికాదు. సెక్షన్ 19, 24లను కూడా వారు చదవాలి. ఇక్కడి కార్యకలాపాలకు మాకు బ్యాలెన్స్ షీట్లు ఇవ్వాల్సిందే. ఫోర్మెన్స్కు అధికారాలు లేవంటే ఎలా? – ఏపీలో మార్గదర్శి నిర్వహించే కార్యకలాపాలపై ఏదైనా సమస్య వస్తే తెలంగాణ, కర్ణాటక అధికారులు చూస్తారా? ఫోర్మెన్స్కు ఎటువంటి అధికారాలు లేవని చెబుతున్నారు. ఇది సరికాదు. అలాగైతే కొత్త చిట్స్కు అనుమతి ఇవ్వం. డిపాజిట్లు ఎక్కడున్నాయో, వాటిని ఎలా వినియోగిస్తున్నారో ఫోర్మెన్లకు తెలియాల్సిందే. – ఎవరూ అడక్కుండానే చిట్ఫండ్ కంపెనీలు తమ కార్యకలాపాలు, బ్యాలెన్స్ షీట్ల వివరాలను చిట్స్ రిజిస్ట్రార్లకు ఇవ్వాలి. కానీ ఎనిమిదేళ్లుగా మార్గదర్శి రికార్డులను సమర్పించడం లేదు. అందువల్ల త్వరలో హైదరాబాద్లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో నిపుణులతో ఆడిట్ నిర్వహిస్తాం. – అన్నీ సక్రమంగా నిర్వహిస్తుంటే ఎందుకు భయపడుతున్నట్లు? ఆ కంపెనీ పబ్లిక్ డొమైన్లో ఉంచిన డాక్యుమెంట్ ప్రకారం చిట్ఫండ్ నిధులు ఇతర సంస్థలకు మళ్లించినట్లు స్పష్టమైంది. మార్గదర్శి సహా రాష్ట్రంలోని 35 చిట్ఫండ్ కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించాం. ఒక్క మార్గదర్శి తో తప్ప మిగిలిన కంపెనీలతో ఎటువంటి సమస్యా రాలేదు. ఈ ప్రశ్నలకు బదులేదీ? – చిట్స్ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఏమిటి? – అందులో మీకు అనుకూలంగా చెప్పుకుంటారా? మీకు మీరే సెల్ఫ్ సర్టిఫికేషనా? – మీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంటే ఏపీలో రికార్డులు చూపరా? – మీరు ఏపీలోనూ చిట్ఫండ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది నిజం కాదా? – ఏ రిజిస్ట్రార్కు బ్యాలెన్స్ షీట్లు ఇచ్చారు? కర్ణాటక రిజిస్ట్రార్కా.. లేక తెలంగాణ రిజిస్ట్రార్కా? – ఎలాంటి అధికారాలు ఇవ్వకుండానే ఫోర్మెన్ (మేనేజర్ తరహా పోస్టు)లను నియమించారా? – రాష్ట్ర విభజన తర్వాత నుంచి మీరు ఏపీలో రికార్డులు చూపక పోవడం నిజం కాదా? – చిట్ఫండ్ నిధులు ఇతర సంస్థలకు మళ్లించడం నిజం కాదా? – రాష్ట్రంలో 35 చిట్ఫండ్ కంపెనీల్లో మీరొక్కరే ఎందుకు సహకరించడం లేదు? – అంతా సరిగ్గా ఉంటే ఎందుకు భయపడుతున్నారు?. -
చిట్ ఫండ్ కంపెనీలకు కొంత గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది
-
మోసాల మార్గదర్శి
-
మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా?.. ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: మార్గదర్శిలో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ అన్నారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉంది. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్ చేయలేదని.. మార్గదర్శి ఆర్థికస్థితిపై అనుమానాలున్నాయి. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుంది. ఒక చిట్కు సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదని ఐజీ తెలిపారు. ‘‘ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టినట్టు పేర్కొన్నారు. మార్గదర్శి ప్రజలను చీట్ చేసినట్టుగానే పరిగణించాలి. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని తప్పుడు వార్తలు రాశారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇస్తాం. మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్ ఆడిట్ చేయాలని ఆదేశించాం’’ అని ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. ‘‘తెలంగాణ అధికారుల సహకారంతో హైదరాబాద్ సంస్థలో తనిఖీలు చేస్తాం. మాకు ఏ సంస్థపైనా వివక్ష ఉండదు. 2018లో కపిల్చిట్ఫండ్స్పై చర్యలు తీసుకున్నాం. 2022 వరకు కపిల్ చిట్ఫండ్స్కు కొత్త చిట్కు అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఈ రోజుకి కూడా మార్గదర్శి సెకండ్ అకౌండ్ వివరాలు ఇవ్వలేదు’’ అని ఐజీ రామకృష్ణ తెలిపారు. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? -
రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కార్యాలయాల్లో సోదాలు చేశాం
-
బయటపడిన మార్గదర్శి మోసాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీలో మోసాలు బట్టబయలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందాలు మూడు రోజులపాటు చేసిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణయ్యాయి. రాష్ట్రంలోని పలు చిట్ఫండ్ కంపెనీల్లో అధికారులు మూడు విడతలుగా తనిఖీలు చేశారు. మూడో విడతలో మార్గదర్శి సంస్థల్లో మూడురోజులు తనిఖీలు నిర్వహించారు. 1982 చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఉన్న రికార్డులు, మెటీరియల్ను అధికారులు సీజ్ చేశారు. చిట్ల రూపంలో కట్టిన నిధులను మళ్లించడం, జీఎస్టీ ఎగవేయడం, కంపెనీ పాడిన చిట్లకు గ్యారెంటీ చూపకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో వాటిపై పూర్తి ఆధారాలను సేకరించారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ ఆదేశించారు. కాగా తనిఖీల సందర్భంగా మార్గదర్శి అన్ని బ్రాంచీలలోనూ తమ గ్రూపు సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులను మోహరించారు. సాధారణంగా ఇలా దాడులు జరిగే సమయంలో అధికారులే వీడియో సాక్ష్యాలను చిత్రీకరిస్తుంటారు. కానీ మార్గదర్శి బ్రాంచీలలో ఈ మీడియా ప్రతినిధులు కూడా వీడియోలు తీస్తూ అధికారులను బెదిరించే ధోరణిలో హల్చల్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు తనిఖీల సందర్భంగా జరిపే పంచనామా పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా మార్గదర్శి సిబ్బంది నిరాకరించారని అధికారులు తెలిపారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా సంతకాలకు నిరాకరించి ఉంటారని, తమకు తెలియకుండానే పంచనామా తతంగాన్ని పూర్తి చేశారని ఆరోపించేందుకే అలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. -
చిట్ఫండ్ కంపెనీల్లో కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి/తణుకు/ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని చిట్ఫండ్ సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు మార్గదర్శి చిట్ఫండ్ కార్యాలయాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చిట్ల రిజిస్టర్లు, అకౌంట్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పలు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ కంపెనీల ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండడంతో వెంటనే సమాచారం రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అనుమానాల నివృత్తి, ఉల్లంఘనలు తెలుసుకునేందుకు తనిఖీ అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది. చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లించిన తీరుపై లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరే రకంగా వినియోగించుకున్నట్లు ఈ తనిఖీల్లో స్పష్టమైనట్లు తెలిసింది. గ్యారెంటీ చూపించలేని చందాదారులుఎ పాడుకున్న సొమ్మును ప్రత్యేక ఖాతాల్లో ఉంచి అదే రోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టుగా తేలింది. ఈ కంపెనీల నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు, ఓచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు నిర్థారించుకున్నట్లు తెలిసింది. జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో జీఎస్టీ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత సొమ్ము దారి మళ్లింది, ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేర నష్టం కలిగిందనే అంశాలను పూర్తిగా అంచనా వేస్తున్నారు. తనిఖీల్లో అధికారులకు అవసరమైన సమాచారం ఇంకా రావాల్సి ఉండడంతో గురువారం కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉంది. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని మార్గదర్శి చిట్ఫండ్ కార్యాలయంలో బుధవారం కూడా తనిఖీలు కొనసాగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. రెండ్రోజులుగా కార్యాలయంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్ములు కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీను చెల్లిస్తున్నట్లుగా గుర్తించారు. మరోవైపు డిపాజిట్దారుల నుంచి సేకరించిన మొత్తానికి జీఎస్టీ ఎగవేస్తున్నట్లుగా గుర్తించారు. పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నట్టు తేలింది. అలాగే ఏలూరు నగరంలోని నరసింహరావుపేటలో ఉన్న మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చిట్స్ సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఉదయం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. -
వెలుగులోకి ‘చీట్’ ఫండ్స్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తిరుపతి: చిట్ఫండ్ కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొద్దిరోజులుగా రాష్ట్రంలోని చిట్ఫండ్ కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అక్టోబర్ 21, 31 తేదీల్లో డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులతో కలిసి రెండు విడతలుగా తనిఖీలు చేసి పలు అవకతవకలను గుర్తించింది. దానికి కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలోని 18 సంస్థల్లో తనిఖీలు చేసింది. ప్రాథమిక పరిశీలనలో ఆయా కంపెనీల 2021–22 బ్యాలెన్స్ షీట్లను పరిశీలించినప్పుడు పెద్దఎత్తున నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్మును కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్టు తేలింది. చిట్ పాడుకున్న చందాదారుల నుంచి గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీలు, తాము చిట్ను పాడినప్పుడు మాత్రం ప్రభుత్వానికి గ్యారంటీ చూపించడంలేదని స్పష్టమైంది. చందాదారులు ఆలస్యంగా చిట్ సొమ్ము కట్టారనే సాకు చూపించి పెనాల్టీలు వసూలు చేసి దానికి జీఎస్టీ చెల్లించకపోవడం, పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి ఎక్కువ సొమ్మును వసూలు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉల్లంఘనలెన్నో! పలు చిట్ కంపెనీలు 1982 చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో స్పష్టమైంది. చిట్ల సొమ్మును ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు గుర్తించారు. చిట్ల సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, రుణాలు ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఈ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెందిన చిట్ల సొమ్మును అనుబంధంగా కంపెనీలకు మళ్లించి వాడుకుంటున్నాయి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. మార్గదర్శిలోనూ సోదాలు విశాఖ జిల్లాలోని మార్గదర్శితో పాటు ఇతర చిట్ఫండ్ కంపెనీల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంటున్నారని, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తేల్చారు. -
ఏపీ వ్యాప్తంగా చిట్ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు
-
మార్గదర్శి సహా చిట్ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు
అమరావతి: ఆంధప్రదేశ వ్యాప్తంగా చిట్ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. మార్గదర్శి సహా పలు చిట్ఫండ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. చిట్ఫండ్, ఫైనాన్స్ అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో తీవ్ర అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ప్రజల కష్టార్జితాన్ని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా అక్టోబరు 21న 12 చిట్ఫండ్ కంపెనీల్లో, అక్టోబరు 31న 5 చిట్ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్రి జిస్ట్రేషన్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహించగా.. ఈ దాడుల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా తప్పిదాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు మంగళవారం రాష్ట్రంలో మొత్తం 18 చోట్ల అధికారులు తనిఖీలు జరిపారు. 2021-22 మధ్య చిట్స్ మొత్తాలను మళ్లించినట్టుగా, మందస్తు పద్ధతిలో డబ్బులు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి 5శాతం వడ్డీని చెల్లించనట్టు కూడా గుర్తించామని అధికారులు తెలిపారు. చిట్ఫండ్ చట్టంలో సెక్షన్ 31ని ఉల్లంఘన, పాటపాడుకున్న వ్యక్తి నుంచి సరిగ్గా సెక్యూరిటీ తీసుకోకపోవడం, కంపెనీలుకూడా సెక్యూరిటీ ఇవ్వకపోవడాన్ని కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆలస్యంగా చిట్టీలు కట్టినవారిపై వేసిన పెనాల్టీలకు జీఎస్టీ చెల్లించకపోవడం కూడా తెలిసిందని తెలిపారు. -
త్వరలో ఈ–స్టాంప్ డ్యూటీ విధానం
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను ప్రజలు మరింత సులభంగా ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధానాన్ని మరింత సులభతరంగా మార్చేందుకు స్టాంప్ వెండర్లు, గ్రామ–వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఆన్లైన్లో చార్జీలను కట్టించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత కొందరు స్టాంప్ వెండర్ల వద్ద ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 71 మంది స్టాంప్ వెండర్లకు అవకాశం ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్ (ఏసీసీ) అనుమతిని వారికి మంజూరు చేశారు. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకు చలానాలు కాకుండా స్టాంప్ వెండర్ల వద్ద ఆన్లైన్లో స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కట్టేయవచ్చు. వాటి రశీదులను (స్లిప్లు) వారికిస్తారు. వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే రిజిస్ట్రేషన్ను పూర్తి చేస్తారు. ఎస్హెచ్సీఐ ద్వారా అమలు ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ సంస్థతో అనుసంధానమై ఉంటాయి. ఈ సంస్థ స్టాంప్ వెండర్లతో విడిగా ఒప్పందం కుదుర్చుకుని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను కట్టించుకునేందుకు వారికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఏరోజు కట్టించుకున్న చార్జీల మొత్తాన్ని ఆ రోజే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీనివల్ల వినియోగదారులు చలానాలు కట్టేందుకు డాక్యుమెంట్ రైటర్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే నకిలీ చలానాల సమస్య కూడా ఉండదు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో అధికారికంగా స్టాంప్ వెండర్ల వద్ద స్టాంప్ డ్యూటీ కట్టే సౌలభ్యం అందుబాటులోకి రానున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చెల్లింపులు మలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి స్టాంప్ వెండర్ల కంటే ముందు వాటిలోనే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు. సాంకేతిక అంశాల కారణంగా తర్వాత దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్టాంప్ డ్యూటీని కట్టించుకునే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆసక్తిగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లకు ఈ అవకాశం ఇవ్వనున్నారు. వినియోగదారులు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందడానికి వీలుగా ఈ–స్టాంప్ డ్యూటీ విధానాన్ని తీసుకువస్తున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. -
రిజిస్ట్రేషన్ల డీఐజీలు, డీఆర్ల బదిలీలు
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ (డీఐజీలు), డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లను (డీఆర్లను) ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు. -
ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్
సాక్షి, విజయవాడ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ సృష్టించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.వెయ్యి కోట్ల ఆదాయం దాటింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా మార్చి నెల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7,327 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది కంటే 2 వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. చదవండి: ట్రావెల్ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ సీన్.. రాష్ట్ర విభజన అనంతరం అత్యధికంగా రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోయిన ఆదాయం పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ రావడంతో ఆదాయం పెరిగినట్లు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ(స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ) తెలిపారు. -
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు ఆ శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ప్రజల దృష్టిలో రిజిస్ట్రేషన్ల శాఖపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేలా చర్యలు తీసుకోవాలని, సేవలు కిందిస్థాయి వరకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. అలాగే, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లతో రామకృష్ణ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అవినీతి లేని నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా అదనపు ఆదాయ వనరులను గుర్తించాలని ఆదేశించారు. -
ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు
సాక్షి, అమరావతి: కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్లో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. -
రిజిస్ట్రేషన్లకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు సోమవారం నుంచి యథాతథంగా జరగనున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించి పరిష్కరించడంతో రిజిస్ట్రేషన్ లావాదేవీలకు ఇబ్బంది తొలగిపోయింది. రెండు రోజులుగా ఈ సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నానికిగానీ ఫలించలేదు. దీంతో ఐదు రోజులుగా నెమ్మదించిన రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మళ్లీ సోమ వా రం నుంచి ఊపందుకోనున్నాయి. ఆదివారం మధ్యాహ్నమే సమస్యను పరిష్కరించి రాష్ట్రం లోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నెట్వర్క్ను పరిశీలించారు. అంతా సజావుగా పనిచేస్తుండడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. సర్వర్ మొరాయించడంతో ఐదు రోజులుగా పెండింగ్లో పడిన లావాదేవీలతోపాటు సోమవారం బుక్ చేసుకునే స్లాట్లకు సంబంధించిన లావాదేవీలను కూడా చేపడతామని వెల్లడించారు. వామ్మో.. సాఫ్ట్వేర్ రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఐదు రోజులపాటు ఇబ్బంది పెట్టిన సమస్య చాలా చిన్నదని, అయితే దాన్ని గుర్తించడానికే సమయం పట్టిందని తెలుస్తోంది. ఎస్డీసీలో ఉన్న ప్రధాన సర్వర్ రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను సమన్వయం చేస్తుంది. ఈ సర్వర్ ద్వారానే డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డాటా ట్రాన్స్ఫర్ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్లోని ఒక ఫైలు కరప్ట్ అయిందని సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రెండు రోజులుగా ఎంత కుస్తీ పడుతున్నా ఈ ఫైల్ను గుర్తించలేకపోయారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ నిపుణుల టీం ప్రతి ఫైలును చెక్ చేయడంతో ఈ కరప్ట్ ఫైల్ దొరికింది. దీన్ని సరిచేయడంతో సమస్య పరిష్కారమైంది. -
Telangana: రిజిస్ట్రేషన్లకు ‘అంతుచిక్కని’ సమస్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసే ప్రధాన సర్వర్లో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్లో సరి సంఖ్యలో నమోదై ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శుక్రవారం వరకు సజావుగానే పనిచేసినా, శనివారం సరి, బేసి సంఖ్యలో (రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల క్రమసంఖ్యలోని సరి, బేసి సంఖ్యలు) ఉన్న అన్ని కార్యాలయాలకూ సమస్య వచ్చింది. దీంతో శనివారం అరకొరగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొదలైన మూడురోజులకే.. లాక్డౌన్ వేళలు సవరించిన తర్వాత మే 31 నుంచే రిజిస్ట్రేషన్ లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. రెండు, మూడు రోజుల పాటు సజావుగానే జరిగిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. తొలుత చిన్నదే అనుకున్నా తర్వాత పెద్దది అయ్యింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాల కోసం సబ్ రిజిస్ట్రార్ల లాగిన్లోని కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఏం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో గచ్చిబౌలి స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్ నెట్వర్క్లో సాంకేతిక సమస్య వచ్చిందని తేలింది. తొలుత ఐటీ శాఖతో కలిసి ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ సిబ్బంది చేసిన ప్రయత్నం మేరకు గురు, శుక్రవారాల్లో కొన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ప్రధాన సర్వర్లో సరి సంఖ్యతో ఉన్న కార్యాలయాల్లో ఇబ్బంది లేకుండానే కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక, బేసి సంఖ్యతో కూడిన కార్యాలయాల సమస్యను కూడా పరిష్కరించేందుకు సిబ్బంది యత్నించడంతో శనివారం సరి సంఖ్యలోని కార్యాలయాల్లో కూడా సర్వర్ డౌన్ అయినట్టు తెలుస్తోంది. సమస్య ఏమిటో తేలకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 3,500కు పైగా లావాదేవీలు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 900 వరకు మాత్రమే జరుగుతున్నాయి. శనివారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 500కు మించి జరగలేదని తెలుస్తోంది. అయితే ఆదివారం కల్లా సమస్య పరిష్కారమవుతుందని, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్లకు లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ అమల్లో ఉన్న కాలంలో స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఈ నెల 9 వరకు registration. telangana.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకుని ముందుగా ఫీజు చెల్లించిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు మంత్రివర్గం అనుమతించిన నేపథ్యంలో లాక్డౌన్ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం... పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఒక సబ్ రిజిస్ట్రార్ పనిచేసే కార్యాలయాల్లో రోజుకు 24 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేసే చోట 48 స్లాట్లు మాత్రమే మంజూరు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు నిర్దేశిత సమయానికి 5 నిమిషాల ముందు సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు చేరుకోవాలి. దీనికి అవసరమైన ఈ–పాస్లు స్లాట్ బుక్ కాగానే జారీ అవుతాయి. వాటిని చూపిస్తే సం బంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం కేవలం అమ్మకందారులు, కొనుగోలుదారులతో పాటు ఇద్దరు సాక్షులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గుంపులుగా గుమికూడకూడదు. రిజిస్ట్రేషన్కు వేలిముద్రలు తీసుకునే ముందు చేతులను శానిటైజ్ చేయాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈసీలు/సీసీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో ఇవ్వరు. ఆన్లైన్లో లేదా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని తీసుకోవచ్చు. పనివేళల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. -
డాక్యుమెంట్లను స్వీకరించాల్సిందే
సాక్షి, అమరావతి: ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సమర్పించే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు స్వీకరించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. పౌరులు సమర్పించే డాక్యుమెంట్ల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉండి ఆ డాక్యుమెంట్లను తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేసి తీరాలని ఆదేశించింది. లిఖితపూర్వకంగా కారణాలు తెలియజేయకుండా డాక్యుమెంట్లను తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలా చేయడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఇది విధి నిర్వహణలో దు్రష్పవర్తన కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాల అమలు నిమిత్తం ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ పంపేందుకు వీలుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్కు పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఇటీవల తీర్పునిచ్చారు. డాక్యుమెంట్ల స్వీకరణ, తిరస్కరణ విషయంలో ఇకపై హైకోర్టులో ఇదే తరహా వ్యాజ్యాలు దాఖలైతే, అందుకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లను బాధ్యులుగా చేసి వారిని కోర్టు ముందుకు పిలిపించాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు. కావలి రిజిస్ట్రేషన్ తీరుపై ఆక్షేపణ నెల్లూరు జిల్లా కావలి మునిసిపాలిటీ పరిధిలో ఇల్లు రిజిస్ట్రేషన్ నిమిత్తం తాను సమర్పించిన డాక్యుమెంట్ను సబ్ రిజిస్ట్రేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నాగసూరి మహేశ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీసీ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ.. డాక్యుమెంట్ సమర్పించినప్పుడు దాన్ని స్వీకరించి, పరిశీలన చేసి, ఒకవేళ అభ్యంతరాలుంటే సరైన స్టాంప్ ఫీజు వసూలు చేసి, తరువాత రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఒకవేళ సమర్పించిన డాక్యుమెంట్లోని ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్–22ఏ పరిధిలోకి వస్తే, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ డాక్యుమెంట్ను తిరస్కరించాల్సి ఉంటుందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. సబ్ రిజిస్ట్రార్లు కారణాలు లేకుండా డాక్యుమెంట్లను తిరస్కరిస్తుండటంపై హైకోర్టులో పెద్దఎత్తున పిటిషన్లు దాఖలవుతున్నాయన్నారు. ఈ కేసులో కావలి సబ్ రిజిస్ట్రార్ చట్ట నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. పిటిషనర్ సమర్పించే డాక్యుమెంట్ను చట్ట ప్రకారం రిజిస్టర్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ను ఆదేశించారు. -
సెకండ్ శాటర్ డే, సండే కూడా..
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మార్చి నెలలోని నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సోమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో మహాశివరాత్రి, హోలీ సెలవులు మినహాయించి మిగతా రోజులు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరపాలని ఆయన సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉద్యోగ సంఘ ఆఫీస్ బేరర్లు బీఆర్కేఆర్ భవన్లో సీఎస్ను గురువారం కలిశారు. శాఖ పరిధిలో ఇటీవల పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది పనితీరు పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ నేతలు పరిష్కరించాలని కోరిన సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కన్వీనర్ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, సభ్యులు ప్రణయ్కుమార్, సిరాజ్ అన్వర్, నరేశ్గౌడ్ తదితరులున్నారు. -
ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3,950 కోట్ల ఆదాయం
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అడిషనల్ ఐజీ ఎం.ఉదయభాస్కరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం తమ శాఖ ఆదాయ లక్ష్యం సుమారు రూ.6,336 కోట్లుగా తెలిపారు. అంతకు ముందు డిసెంబర్ నెలలో సుమారు రూ.421 కోట్ల ఆదాయం వస్తే, గతేడాది డిసెంబర్లో రూ.599 కోట్లు వచ్చిందని ఉదయభాస్కరరావు వెల్లడించారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఐజీ బదిలీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కీలక అధికారి, రిజిస్ట్రేషన్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులును బదిలీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను విజయవంతం చేయాలనే కోణంలోనే శ్రీనివాసులును తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్ టీఎస్) ఓఎస్డీగా నియమించినట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి సాంకేతిక, శాఖాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న ఉద్దేశంతోనే సమర్థ అధికారికి ఈ బాధ్యత అప్పగించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విలీనమేనా? శ్రీనివాసులు బదిలీతో రిజిస్ట్రేషన్ల శాఖలో కలవరం మొదలైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి సమక్షంలో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలుగులోకి రావడంతో చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో అంతర్భాగం చేస్తారని, తమను సీసీఎల్ఏ పరిధిలోకి తెస్తారనే చర్చ మొదలైంది. అయితే, శ్రీనివాసులు సమర్థత మేరకే ఆయన్ను ఐటీ శాఖకు బదిలీ చేశారా? 110 ఏళ్ల చరిత్ర గల రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో అంతర్భాగం చేస్తారా? రాబడిపై ప్రభావం లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖను యథాతథంగా కొనసాగిస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడేంతవరకు వేచి చూడాల్సిందే. -
అంచనాలకు మించి.. ఆదాయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలి నాళ్లలో కొంత ఒడిదొడుకులకు లోనైనా గత మూడేళ్లుగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానా కు కాసుల పంట పండుతోంది. రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి కొనసాగుతుండటం.. రియల్ రంగం కూడా ఊపందుకోవడంతో రిజిస్ట్రేషన్ల పంట పండుతోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల ప్రకారం 2020 మార్చి చివరి నాటికి రూ.6,146 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, మరో 2 నెలలు మిగిలి ఉండగానే 2020 జనవరి నాటికే రూ.5,261 కోట్లు (85 శాతం) ఆదాయం లభించింది. మాంద్యం ప్రభావం రియల్ రంగంపై పడుతుందనే అపోహలను పటాపంచలు చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుండటం విశేషం. తొలి మూడేళ్లు.. ఆ తర్వాతి మూడేళ్లు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో గత మూడేళ్లలో గణనీయ అభివృద్ధి కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో బడ్జెట్ అంచనాల్లో 84 శాతమే రిజిస్ట్రేషన్ల రాబడి వచ్చింది. మొత్తం ఆ ఏడాది రూ.2,583 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.2,175 కోట్ల వద్ద ఆగిపోయింది. ఆ తర్వాతి ఏడాది కూడా అదే స్థాయిలో 83.92 శాతం ఆదాయం రాగా, మరుసటి ఏడాది (2016–17)లో 89 శాతానికి పెరిగింది. ఇక 2017–18 సంవత్సరానికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైంది. ఆ ఏడాది మొత్తం రూ.3 వేల కోట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సమకూరుతాయని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొనగా, ఏకంగా రూ.4,200 కోట్లకు పైగా రాబడి వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో దాదాపు 140 శాతం ఆదాయం రావడం గమనార్హం. ఆ తర్వాతి ఏడాది కూడా రిజిస్ట్రేషన్ రాబడుల్లో పెరుగుదలే కన్పించింది. మొత్తం అంచనాలకు మించి 113 శాతం ఆదాయం లభించింది. రిజిస్ట్రేషన్ల ఆదాయంపై బడ్జెట్ అంచనాలు, రాబడుల వివరాలు (రూ. కోట్లలో) ఈ ఏడాది ఇప్పటివరకు బడ్జెట్ అంచనాల్లో 85 శాతం మరో 2 నెలల మిగిలి ఉండగానే వచ్చేసింది. మొత్తం రూ.6,146 కోట్లు ఈ ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, 2020 జనవరి నాటికే రూ.5,261.85 కోట్లు వచ్చింది. మరో 2 నెలల్లో ఈ ఏడాది కూడా అంచనాలను మించుతుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఆరేళ్ల రాబడులను పరిశీలిస్తే ఏటేటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గుదల ఒక్క ఏడాది కూడా నమోదు కాలేదు. గతేడాది జనవరి వరకు రూ.4,574 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా దాదాపు రూ.700 కోట్లు అధికంగా రూ.5,261 కోట్లు ఆదాయం లభించింది. తొలి ఏడాది రూ.2,175 కోట్లున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ ఏడాది రూ.6 వేల కోట్లు దాటి పోయే పరిస్థితి వచ్చింది. ఏటేటా పెరుగుదల నమోదు చేసుకుంటున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.23,910 కోట్లు ఆర్జించడం గమనార్హం. ఆ రెండు ఒక లెక్క రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ రాబడులను పరిశీలిస్తే.. మొత్తం 12 రిజిస్ట్రేషన్ జిల్లాలకు గాను రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. ఈ 2 జిల్లాల్లోనే మొత్తం ఆదాయంలో 50 శాతానికి పైగా ఆదాయం వస్తోంది. ఈ ఏడాది లెక్కలను పరిశీలిస్తే ఇప్పటివరకు మొత్తం రూ.5,261.85 కోట్ల ఆదాయం రాగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి రూ.3 వేల కోట్లకు పైగా వచ్చింది. అంటే వచ్చిన మొత్తం ఆదాయంలో ఈ రెండు జిల్లాల నుంచే 57 శాతం వరకు వచ్చిందన్న మాట. మిగిలిన జిల్లాల విషయానికి వస్తే మెదక్, హైదరాబాద్ (సౌత్), వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలు స్థిరమైన ఆదాయాన్ని సాధించి పెడుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆదాయం లభించేందుకు రియల్ జోరే కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఏటా లావాదేవీలు పెరిగిపోతున్నాయని వారంటున్నారు. భూముల క్రయవిక్రయాలకు తోడు శాఖాపరంగా చేపట్టిన సంస్కరణలు కూడా ఆదాయానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ ప్రక్రియను సులభతరం చేయడం, తొలినాళ్లలో జరిగిన విధంగా రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించడం లాంటి సమస్యలను విజయవంతంగా అధిగమించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకు రిజిస్ట్రేషన్ జిల్లాల వారీగా రాబడులు: రిజిస్ట్రేషన్ జిల్లా ఆదాయం (రూ.కోట్లలో) రంగారెడ్డి 1,976.77 మేడ్చల్ 1,055.86 మెదక్ 470.64 మహబూబ్నగర్ 147.51 హైదరాబాద్ 233.78 హైదరాబాద్ (సౌత్) 459.50 నిజామాబాద్ 93.19 కరీంనగర్ 154.69 వరంగల్ 222.53 నల్లగొండ 272.65 ఖమ్మం 107.68 ఆదిలాబాద్ 66.99 మొత్తం 5,261.85 -
పారదర్శక పాలనలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు
-
పారదర్శక పాలనలో సీఎం జగన్ మరో అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలతో అస్తవ్యస్తంగా వున్న రిజిస్ట్రేషన్స్ శాఖలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకుని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందని రాష్ట్ర ప్రభుఏత్వం భావిస్తోంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆన్లైన్లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి పూర్తి స్థాయిలో స్వస్తి చెబుతున్నారు. ఆన్లైన్ లో తమకు సంబంధించి క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంట్ను తయారు చేసుకోవడంతో పాటు, దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్లోడ్ చేయడం ద్వారా టైం స్లాట్ను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాష్ట్రంలో ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాసస్థలాలకు సంబంధించి సేల్డీడ్, సేల్అగ్రిమెంట్, తాకట్టు రిజిస్ర్టేషన్, బహుమతి రిజిస్ర్టేషన్లు, జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వివిధ అవసరాలకు తగినట్లు దాదాపు 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ డాక్యుమెంట్లలో క్రయ, విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్లోడ్ చేయాల్సి వుంటుంది. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్ రైటర్లు చేసేవారు. ఇప్పుడు వారితో అసవరం లేకుండానే క్రయ, విక్రయదారులే నేరుగా చేసుకునే వీలు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు ఉన్నా కూడా దీనిలో నమోదు చేసుకునే అవకాశం వుంది. సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్ను ప్రింట్ తీసుకోవాలి. దానితో రిజిస్ర్టేషన కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి, వాటిని సవరించారు. నవంబర్ ఒకటో తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ శాఖ కమిషనర్ సిద్దార్ధా జైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలను ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, రియాల్టర్లు, బిల్డర్లు, పురప్రముఖులు, సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి అవసరమైన సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. తిరస్కరించే డాక్యుమెంట్లపై అప్పీల్కు అవకాశం నూతన విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్లను ఏదైనా కారణం వల్ల తిరస్కరిస్తే, దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకోవచ్చ. ఏ కారణాల వల్ల డాక్యుమెంట్ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ అందిస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
పైరవీలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న ఈ శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దళారులు, పైరవీకారుల ప్రభావం శాఖపై లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ విషయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. ఈసీల జారీ నుంచి నగదు రహిత లావాదేవీల అమలు వరకు జరుగుతున్న సమూల మార్పు లు శాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇక అంత వీజీ కాదు గతంలో ఫలానా భూములకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (సీసీ)ల జారీ అడ్డగోలుగా జరిగేది. ఒక్క చలానా మీదనే పలు ఈసీలు, సీసీలు తీసుకునే వెసులుబాటుండేది. కానీ, ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకురావడం ద్వారా ఈ విధానానికి చెక్ పెట్టారు. ఈసీ లేదా సీసీ కావాలంటే చలానా నెంబర్ను ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్రిజిస్ట్రార్ల లాగిన్ ద్వారానే వీటిని జారీ చేస్తున్నారు. దీంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. దీనికితోడు డాక్యుమెంట్ రైటర్ల ప్రభావం శాఖ పనితీరుపై పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రయ, విక్రయ లావాదేవీల రిజిస్ట్రేషన్కు సంబంధించి డాక్యుమెంట్ల స్కానింగ్ ప్రక్రియలో ఆటోమేటెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగు డాక్యుమెం ట్లను మాత్రమే స్కానింగ్ వరుసలో ఉంచి వాటి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే మరో డాక్యుమెంట్కు అవకాశం లభించే విధానాన్ని తీసుకువచ్చారు. తద్వారా డాక్యుమెంట్ రైట ర్లు, శాఖ సిబ్బంది తమ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్లను వెనుకా ముందు చేసే ఆస్కారం లేకుండా పోయింది. దీనికి తోడు స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చిన లావాదేవీలను బుకింగ్ కన్ఫర్మ్ అయిన రోజు మధ్యాహ్నం ఒంటిగంటలోపే రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ తర్వాతే మాన్యువల్గా వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీంతో దాదాపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా పోయింది. వచ్చే నెల డబ్బులతో పనికాదు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ టి.చిరంజీవులు ఆదేశాలతో సంయుక్త ఐజీ వి.శ్రీనివాసులు పర్యవేక్షణలో మరో కీలక నిర్ణయాన్ని కూడా అమలు చేయనున్నారు. ఈ జూన్ మాసం నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యా లెట్ యాప్ను రూపొందించే పనిలో పడ్డారు. ఈ యాప్ ద్వారానే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.1000లోపు విలువైన లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగనుంది. మొత్తంమీద ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అమలవుతున్న సంస్కరణలు శాఖ పనితీరును మెరుగుపర్చడంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటం గమనార్హం. మార్పు ఇలా.. డాక్యుమెంట్ల స్కానింగ్లో అటోమేటెడ్ విధానంతో దళారులు, డాక్యుమెంటు రైటర్ల ప్రభావం లేకుండా మార్పులకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. జూన్ నుంచి పూర్తిగా నగదురహిత లావాదేవీలే నిర్వహిస్తారు. వ్యవహారమంతా ఆన్లైన్లో జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ లాగిన్ ద్వారా సేవలు అందిస్తుండటంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. -
ఏప్రిల్ @ రూ.500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. నెలకు లక్షల సంఖ్యలో జరుగుతున్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జనవరి మినహా గత ఐదు నెలల్లో రూ.400 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం రాగా, ఏప్రిల్లో మాత్రం రికార్డు ఆదాయం రానుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇంకా నాలుగు రోజుల కార్యకలాపాలు మిగిలి ఉండగానే రూ.436 కోట్ల రాబడి సమకూరింది. దీంతో ఏప్రిల్ ఆదాయం ఏకంగా రూ.500 కోట్లు దాటి రిజిస్ట్రేషన్ల శాఖ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లు.. రూ.13 వేల కోట్లు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యేటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూనే వస్తోంది. ఈ నాలుగేళ్లలో రూ.13 వేల కోట్ల వరకు ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ లావాదేవీలు గణనీయంగా పుంజుకున్నాయి. డిసెంబర్లో తొలిసారిగా ఆదాయం రూ.400 కోట్లు దాటింది. ఆ తర్వాతి నెలలో రూ.367 కోట్లకు తగ్గినా, ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రూ.453 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదే రికార్డు స్థాయి రాబడి కావడం గమనార్హం. మార్చిలో స్వల్ప తగ్గుదలతో రూ.441 కోట్లు వచ్చింది. ఏప్రిల్లో మాత్రం ఊహించని రీతిలో రూ.500 కోట్లు దాటే పరిస్థితి కనిపిస్తోంది. లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు.. ఈనెల 25వ తేదీ వరకు రూ.436.4 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.409.277 కోట్లు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటికే లక్షకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగడం ఉన్నతాధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. బుధవారం నాటికి 1,03,231 లావాదేవీలు జరిగాయని, ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఒక్క రోజే రూ.23.2 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు పని దినాలు మిగిలి ఉన్న నేపథ్యంలో రూ.500 కోట్ల మార్కుకు చేరుకుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. -
బాదుడుకు రెడీ..
♦ నేటి నుంచి భూ విలువల పెంపునకు ప్రభుత్వ ఆదేశాలు ♦ జిల్లా వాసులపై రూ. 30 కోట్ల రూపాయల భారం విజయనగరం రూరల్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి పట్టణ, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో భూములు, భవనాలు, కట్టడాలకు సంబంధించి మార్కెట్ విలువ భారీగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అధికాదాయం పొందడానికి స్థిరాస్తుల ధరలపై 20 నుంచి 30 శాతం పెంచడానికి చర్యలు చేపడుతోంది. మార్కెట్ విలువల సవరణ ద్వారా జిల్లా వాసులపై 25 కోట్ల రూపాయల భారం పడనుంది. భూముల విలువల పెంపుపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బి. లఠ్కర్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరలపై కమిటీ సూచించిన అంశాల ఆధారంగా భూముల ధరలు పెంచనున్నారు. గతేడాది ఆగస్టు ఒకటో తేదీన భూముల ధరలకు సంబంధించి సవరణలు చేశారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని «భూములు, భవనాల ధరలకు రెక్కలు రానున్నాయి. వీటి పరిధిలో ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో స్థిరాస్తులకు మార్కెట్ సవరణ చేయడం ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా రానుంది. రూ. 275.44 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యం జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం 2016– 17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 275.44 కోట్ల రూపాయల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. 2015– 16 సంవత్సరంలో 148 కోట్ల రూపాయల లక్ష్యాన్ని రిజిస్ట్రేషన్ శాఖకు కేటాయించగా 174.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఉత్తర్వులు అందాయి. పట్టణ, మున్సిపాలిటీల పరిధిలో మార్కెట్ విలువల సవరణపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. ఆదివారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో స్థిరాస్తుల సవరణ కమిటీ సమావేశమైంది. ఆగస్టు ఒకటి నుంచి సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి. – ఎం.శ్రీనివాసమూర్తి, జిల్లా రిజిస్ట్రార్, విజయనగరం -
ఆదాయం అదిరింది...
గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే రూ. 279 కోట్ల రాబడి ప్రభుత్వం భూముల విలువ పెంచినా జోరు తగ్గని రిజిస్ట్రేషన్లు రాజధాని నేపథ్యంలో భూక్రయ విక్రయాల్లో అదే ఊపు ముందుచూపుతో వాలిపోతున్న రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారసంస్థలు గుంటూరు : జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండుతోంది. అంచనాలు మించి ఆదాయం వచ్చి పడుతోంది. కోట్లలో విధించుకున్న రాబడి లక్ష్యాలను అవలీలగా దాటేందుకు ఉరకలు పెడుతోంది. ఇంతకాలం నిర్దేశించిన లక్ష్యాన్ని సైతం చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డ ఈ శాఖ ఇప్పుడు రాజధాని అమరావతి పుణ్యమా అని లెక్కకుమిక్కిలి భూ క్రయవిక్రయాలతో దూసుకు పోతోంది. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు ప్రభుత్వం రూ.675 కోట్ల రాబడి లక్ష్యం విధిస్తే, సెప్టెంబర్తో ముగిసిన ఆరునెలల కాలానికి ఏకంగా రూ.279 కోట్లను ఆర్జించింది. రానున్న ఆరునెలల్లోనూ నూరుశాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది. వాస్తవానికి రాజధాని ప్రకటనతర్వాత జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం భూముల విలువను నూరు శాతం పెంచినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం విశేషం. పిసరంతైనా భూమి చాలు.. అమరావతి కేంద్రంగా ప్రభుత్వం రాజధానిని ప్రకటించడంతో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి భారీగా ఇప్పుడు ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయి. రాజధాని శంకుస్థాపన తరువాత ఆస్తుల విలువ అమాంతం పెరిగే అవకాశాలు ఉంటాయనే భావనతో చాలామంది వ్యాపారులు, బడా వ్యక్తులు ముందుగానే భూములను కొనుగోలు చేస్తున్నారు. సొంతంగా ల్యాండ్బ్యాంకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ధనికులు సైతం రాజధానిలో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ కారణాలన్నింటితో ఇప్పుడు భూముల క్రయవిక్రయాలు జిల్లాలో బాగా పెరిగాయి. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా 2015-2016 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు ప్రభుత్వం రూ.675 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా విధించగా, సెప్టెంబర్ నాటికి రూ.279 కోట్ల ఆదాయం రావడంతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు రిజిస్ట్రార్ పరిధికి రూ.371.99కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యం విధిస్తే ఆరు నెలల్లోనే రూ.139.69 కోట్ల రాబడి వచ్చింది. నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రూ.214 కోట్ల లక్ష్యానికి రూ.99.55కోట్లు జమైంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.67.55 కోట్లు మాత్రమే. తెనాలి రిజిస్ట్రార్ కార్యాలయ పరిధికి రూ.89 కోట్ల లక్ష్యానికి రూ. 38.95 కోట్లు వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.32.41 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. మున్ముందు ఇంకా... జిల్లాలో భూ క్రయవిక్రయాలు రెట్టింపవుతాయని ముందే ఊహించిన ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి వందశాతం మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల రిజిస్ట్రేషన్ల ఫీజు భారీగా పెరిగి క్రయవిక్రయాలు కొంతవరకు తగ్గుతాయని అధికారులు అంచనావేశారు. కాని రాజధాని ప్రాంతం కావడంతో ఇవేం లెక్కచేయకుండా క్రయవిక్రయదారులు ఊపులో ఉండడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పరుగులు తీస్తోంది. ఫలితంగా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు వద్దన్నా ఆదాయం వచ్చి పడుతోంది. ముఖ్యంగా సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. ఈ 29 గ్రామాల్లో ఎటువంటి క్రయవిక్రయాలు జరిగినా, వెబ్సైట్ వివరాలను ఆధారంగా చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖను కొద్దిరోజుల కిందట ఆదేశించింది. ఈనేపథ్యంలో మున్ముందు రిజిస్ట్రేషన్లు మరింత ఊపందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ప్చ్..‘మామూలే’!
విజయనగరం రూరల్: రాష్ట్ర విభజన నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. ఇదే అదునుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మామూళ్ల వసూలు పర్వం పతాక స్థాయికి చేరుకుంది. భూములకు గిరాకీ పెరగడంతో జోరుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్లు జరగడం లేదని క్రయ విక్రయదారులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఏడాదికి రూ.20 కోట్ల వరకు వసూలు క్రయవిక్రయదారుల నుంచి అనధికారికంగా ఏడాదికి ముడుపుల రూపంలో రూ.20 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరు వరకు రిజిస్ట్రేషన్ల ఫీజు 0.5 శాతం ఉంటే ప్రభుత్వానికి సుమారు రూ.10కోట్ల ఆదాయం లభించింది. అదే ఒక్కో డాక్యుమెంటుకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ముడుపుల రూపంలో ఒకశాతం క్రయవిక్రయదారులు సమ ర్పించాల్సిందే. ముడుపులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటును సిబ్బంది గానీ, అధికారులు గానీ ముట్టడం లేదని క్రమవిక్రయ దారులు ఆరోపిస్తున్నారు. భూముల ధరలు పెంచి ప్రభుత్వం ఫీజు వసూలు చేస్తుండడంతో ముడుపుల రూపంలో తడిపిమోపెడవు తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారిక సిబ్బందే కలక్షన్ కింగ్లు జిల్లావ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 30 మంది వరకు అనధికార సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని నియమించడానికి ప్రభుత్వం నుంచి గాని జిల్లా అధికారుల నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకపోయినా సబ్ రిజిస్ట్రార్లు వారికి అనుకూలురైన వ్యక్తులను నియమించుకుని వారితోనే మామూళ్లు వసూలు చేయిస్తున్నారని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం విశేషం. ప్రతి నెలా ముడుపుల రూపంలో అందుకున్న మొత్తాన్ని జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు పంపకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కిందిస్థాయి సిబ్బంది ఒక్కొక్కరూ ప్రతిరోజూ ఇంటికి వెళ్లేటప్పుడు మూడు వందలు తీసుకుని వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బందే రూ.మూడు వందలు ఇంటికి పట్టుకు వెళితే అధికారులకు ఎంత చేరుతుందో, ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల బంధువులే డాక్యుమెంట్ రైటర్లు గతంలో కేవలం లెసైన్స్ ఉన్న డాక్యుమెంట్ రైటర్లే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఎవరైనా డాక్యుమెంట్లు రాయవచ్చని ఆదేశాలు రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు వారి బంధువులను, స్నేహితులను, వారి రక్త సంబంధీకులను డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకుని వారితోనే పనులు కానిచ్చేస్తున్నారు. వీరే అధికారులకు క్రయవిక్రయదారులకు మధ్యవర్తులుగా ఉండి మామూళ్లు వసూలు చేసిపెడుతున్నారు. వారు తెచ్చిన డాక్యుమెంట్లకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ వారి దగ్గరే డాక్యుమెంట్లు తయారు చేయించుకోవడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఇదే వృ త్తిపై జీవిస్తున్న డాక్యుమెంటు రైటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించాలి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న వసూళ్ల పర్వంపై జిల్లా ఉన్నతాధికారులు, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్శాఖకు బదిలీపై వచ్చిన అధికారులు దృష్టి సారించి నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. -
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్
సాక్షి, ఒంగోలు : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో నూతన సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి, అన్ని సేవలను మాతృభాష తెలుగులోకి తీసుకొచ్చేందుకు యూనిక్కోడ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే సెంట్రల్ సర్వర్లో మార్పులు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ లావాదేవీలను బుధవారం నుంచి ఆరురోజుల పాటు నిలిపివేయనున్నారు. అక్టోబర్ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం 7.30 గంటల నుంచి ఆ శాఖ సెంట్రల్ సర్వర్ నిలిచిపోయింది. ఒంగోలు, మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 18 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం ఒక్కరోజునే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇదిలా ఉంటే, త్వరలో అమలుకానున్న సంస్కరణల ప్రకారం భూముల క్రయవిక్రయాలకు స్లాట్ విధానం ప్రవేశపెట్టారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం క్రయవిక్రయదారులు ముందుగా ఆన్లైన్లో స్లాట్బుక్ చేసుకోవాలి. అనంతరం స్లాట్లో ఇచ్చిన సమయంలో సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిని రూపొందించారు. అన్ని సేవలను ఒక ఫార్మెట్లోకి తీసుకొచ్చారు. తద్వారా యూనిక్కోడ్ అమలవుతుందని ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ ఎం.అబ్రహాం వివరించారు. సేల్డీడ్, గిఫ్ట్డీడ్, మార్టిగేజ్ వంటి సేవలు అన్నీ ఒకే ఫార్మెట్లోకి వచ్చేలా సెంట్రల్ సర్వర్లో మార్పులు తెస్తున్నారు. దీంతో ఏ ప్రాంతం నుంచైనా ఆన్లైన్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల రికార్డులనూ అనుసంధానం చేస్తున్నారు. తద్వారా భూమి విలువ, భూమి సర్వే, స్వరూపం తెలుసుకోవడానికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లకుండానే.. ఆన్లైన్లో పూర్తిగా భూమి విలువ, సర్వే రూపం అందుబాటులోకి వస్తాయి. తెలుగు భాషలో సేవలు.. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొందే సేవలన్నీ తెలుగులోనే ఇవ్వనున్నారు. ఈసీలు, నకలుతో పాటుగా క్రయవిక్రయాదుల రిజిస్ట్రేషన్ తెలుగులో అందుబాటులోకి వస్తాయి. దళారుల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఈ చర్యలు చేపట్టింది. గతంలో ఈసీలు, నకలు ఈసేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.