నిమజ్జనంలో పచ్చ మంద బరితెగింపు.. రంగులు చల్లుతూ దాడి | TDP Leaders Attack On YSRCP Supporters In Ganesh Immersion At Prakasham | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో పచ్చ మంద బరితెగింపు.. రంగులు చల్లుతూ దాడి

Published Fri, Sep 13 2024 2:43 PM | Last Updated on Fri, Sep 13 2024 3:07 PM

TDP Leaders Attack On YSRCP Supporters In Ganesh Immersion At Prakasham

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చే అనే భావనతో ఎగబడి దాడులకు పాల్పడుతున్నారు. కవ్వింపు చర్యలకు దిగుతూ పచ్చ బ్యాచ్‌.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలను దారుణానికి ఒడిగట్టారు. యర్రగొండపాలెం పంచాయితీ పందినివానిపల్లి గ్రామంలో గురువారం రాత్రి వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో పచ్చ గూండాలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగారు. ఉద్దేశ్యపూర్వకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రంగులు చల్లారు.

అంతటితో ఆగకుండా.. బూతులు తిడుతూ నోటికి పనిచేప్పారు. ఇదేంటని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రశ్నించగా పోలీసుల ముందే దాడి చేశారు. ఇక, పోలీసులు దాడి చేస్తున్న వారిని ఆపకపోగా.. పచ్చ బ్యాచ్‌కు వత్తాసు పలికారు. టీడీపీ కార్యకర్తలకు కొమ్ముకాస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పోలీసులు తీరును ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement