వీడియో: సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం | TDP Supporter Emotional Comments Over Govt Help In Vijayawada Floods | Sakshi
Sakshi News home page

వీడియో: సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం

Published Mon, Sep 2 2024 5:51 PM | Last Updated on Mon, Sep 2 2024 7:02 PM

TDP Supporter Emotional Comments Over Govt Help In Vijayawada Floods

సాక్షి, విజయవాడ: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ వరద నీటిలో మునిగిపోయింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల్ని ఆదుకోవడంలో  కూటమి ప్రభుత్వం విఫలమైందని టీడీపీ కార్యకర్తలు, బాధితులు మండిపడుతున్నారు.

వరద బాధితులు(టీడీపీ అభిమాని) మాట్లాడుతూ.. విజయవాడలో వర్షాలు, వరద ముంపుపై మాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరూ అలర్ట్‌ చేయలేదు. బాధితులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫేయిల్‌ అయ్యింది. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము వెళ్లి వారిని తీసుకువస్తాం అంటే వెళ్లనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క బోటు కూడా మా కోసం రాలేదు. కనీసం ప్రైవేటు బోట్లు అయినా తెప్పించాల్సింది. అది కూడా ప్రభుత్వం చేయడం లేదు. ప్రైవేటు బోట్లకు మేమే డబ్బులు ఇస్తాం. మా వాళ్లను రక్షించుకుంటాం. ఇప్పటికైనా వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడండి అంటూ వేడుకున్నాడు. 

 

మరోవైపు.. కనీసం వరద ఉద్ధృతిపై అప్రమత్తం చేసి ఉన్నా జాగ్రత్తలు తీసుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి తిండి, నీరు లేదని.. కూటమి నేతలు తమని అస్సలు పట్టించుకోలేదని ఎల్లో మీడియా ముందే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement