flood effected areas
-
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025 -
210కి పెరిగిన స్పెయిన్ వరద మృతులు
మాడ్రిడ్: స్పెయిన్లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.Rescuer rescuing a women and her pet dog from flooded area in Spain.There is severe flash floor occurred serval region in Spain. The worst affected area is Valencia which records highest rainfall in 28 years. The death toll from the flood in Valencia alone has risen to 92.… pic.twitter.com/nUOcwBM4nW— Eagle EyE (@mkh_nyn) October 31, 2024 🤯The worst flood in the last 37 years: at least 72 people died in Spain, dozens went missing, RTVE.Three days of mourning have been declared in the country. There is still no normal access to some areas. pic.twitter.com/KLQQSuniCa— Nurlan Mededov (@mededov_nurlan) October 30, 2024Catastrophic flooding in Spain.#Flood#Spain pic.twitter.com/32Vwotrv4F— Jennifer Coffindaffer (@CoffindafferFBI) October 30, 2024⚠️Devastating images aftermath flood in the Alfafar in the province of Valencia, Spain63 reported deaths so far in Spain due to catastrophic floods…#Valencia #Spain pic.twitter.com/rnsexKKI3P— Culture War (@CultureWar2020) October 30, 2024 -
బాబుకు బాధిత అవ్వ మాస్ వార్నింగ్..
-
ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేశారన్నారు. ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. -
వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ నేతలు నిరాహార దీక్ష
-
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఆ తర్వాత ఏమైందంటే?
పాట్నా: వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన భారత ఆర్మీకి చెందిన ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. హెలికాప్టర్ వరద నీటిలో పడిపోవడంతో పైలట్, జవాన్లను స్థానికులు పడవల సాయంలో సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకరారం.. కొద్దిరోజులుగా బీహార్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. కోసీ బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల కారణంగా అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి సామాగ్రి ఇవ్వడానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ బయలుదేరింది. Bihar: IAF chopper carrying flood relief material from Sitamarhi crashes in Muzaffarpur#greaterjammu pic.twitter.com/blHtCpMtxe— Greater jammu (@greater_jammu) October 2, 2024 బుధవారం ఒక ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా సీతామర్హి నుంచి వరద సహాయ సామగ్రిని పంపారు. అయితే ఔరాయ్లోని నయా గావ్లో వరద మయమంగా మారిన ప్రాంతంలో ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ సడెన్గా వరద నీటిలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో నీటిలోనే సగం వరకు హెలికాప్టర్ మునిగిపోయింది. అయితే, పైలట్, అందులోని జవాన్లు సురక్షితంగా ఉన్నారు, దీంతో, స్థానికులు పడవల్లో హెలికాప్టర్ వద్దకు చేరుకుని వారిని కాపాడారు. ఆ హెలికాప్టర్లో ఉన్న సహాయ సామగ్రిని మరికొందరు ఎత్తుకెళ్లారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. मुजफ्फरपुर में वायु सेना का हेलीकॉप्टर हुआ क्रैश, बाढ़ राहत सामग्री पहुंचाने के लिए भरा था उड़ान, Watch Video #HelicopterCrash #Muzaffarpur #BiharNews #BiharFlood #FloodNews pic.twitter.com/DqteaZ4Fkp— News4Nation (@news4nations) October 2, 2024 మరోవైపు.. ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్, జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. ప్రమాదం ఎలా జరిగిందో అధికారులు విచారణ చేపట్టనున్నారు. An ALH helicopter of the #IAF, which was engaged in flood relief operations in the Sitamarhi sector in Bihar, executed a precautionary landing in inundated area due to a technical issue. All crew are reported to be safe, with no damage to civilian life or property reported. #IAF…— Indian Air Force (@IAF_MCC) October 2, 2024ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై బాంబు పేలుడు.. ఎగిరిపడిన ట్రాక్ -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్కు వచ్చారు. -
‘వరద’ సాయం పంపిణీలో హాహాకారాలు!
పాయకాపురం (విజయవాడరూరల్): వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కుక్కర్లు, గ్యాస్ స్టవ్ల పంపిణీ ప్రారంభించి.. ఒక్కసారిగా గేట్లు తీయడంతో బాధితులంతా కల్యాణ మండపంలోకి ప్రవేశించడంతో జరిగిన తొక్కిసలాటలో వృద్ధులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ కండ్రికలోని కల్యాణమండపంలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గ్యాస్స్టవ్లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అయితే గురువారం రాత్రే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కూపన్లు పంపిణీ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులంతా అక్కడికి చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా, అధికార ప్రతినిధి పట్టాభి, బుద్ధా వెంకన్న పంపిణీ ప్రారంభించారు. కల్యాణ మండపం గేట్లు తెరవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భారీ ఎత్తున తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోయారు. వారిపై బారికేడ్లు పడడం, వెనుక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లడంతో ఊపిరాడక హాహాకారాలు చేశారు. ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో వారు తోపులాటలో చిక్కుకుని గాయపడ్డారు. పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు. మహిళా పోలీసులు బారికేడ్లను తొలగించడంతో ప్రాణ నష్టం తప్పింది. టీడీపీ జనసేన కార్యకర్తలకే టోకెన్లు పంచుకున్నారు. ముఖాలు చూసి మరీ టోకెన్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలే వరద బాధితులా? మేం బాధితులం కాదా అంటూ కండ్రిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్షం ఎఫెక్ట్.. మీర్పేట్లో ఇళ్లలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్లోని మీర్పేట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ పరిధిలోని మిథిలా నగర్, సత్యసాయి నగర్ సహా పలు కాలనీల్లోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక.. ఎస్ఎన్డీపీ నాలా మూసుకుపోవడంతో మ్యాన్హోల్స్ నుంచి నీరు ఉప్పొంగుతోంది. రాత్రి నుంచి క్రమంగా నీరు పెరిగి ఉదయానికి నీరు ఇళ్లలోకి చేరుకుంది.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కాలనిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కారణంగా మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనీలోకి వస్తోంది. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. -
ఇంకా అందని సాయం..
-
వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్గా మార్చి..
చంపావత్: ఉత్తరాఖండ్లో హృదయవిదారక ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా చంపావత్ జిల్లాలోని సీల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే ఇదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మీదేవి(60)ని ఆస్పత్రికి తరలించడంలో చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్తులు.గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లే రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు డోలీ సాయంతో బాధితురాలు లక్ష్మీదేవిని సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్లి, ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీల్ గ్రామంలో ఉంటున్న జోగా సింగ్ భార్య లక్ష్మీదేవి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డోలీ సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గంగలి, నేత్ర సలాన్ల మధ్య రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. सड़क बंद एंबुलेंस बनी 'डोली'..उत्तराखंड: चंपावत में ग्रामीणों ने तीन किलोमीटर पैदल चलकर सड़क तक बीमार महिला को ऐसे पहुंचाया.#Uttarakhand । #Champawat । #Ambulance pic.twitter.com/7sL9cnRqCL— NDTV India (@ndtvindia) September 23, 2024ఇది కూడా చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం లడ్డూ వేలం విరాళాలు
-
7 వేల కోట్లు నష్టం..700 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు
-
వాళ్లకి సన్న బియ్యం.. దళితులకు కోటా బియ్యం.. పవన్ ఎంత మోసం చేశాడు...!
-
ఇదండీ ‘బాబు సర్కార్’ డొల్లతనం.. నారాయణను నిలదీసిన జనం
సాక్షి, విజయవాడ: ప్రచారార్భాటమే తప్ప.. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అసంపూర్తిగా సాగుతున్నాయి. వరదలు సంభవించి 15 రోజులైనా రోజులైనా వరద కష్టాలు వీడటంలేదు. నిన్న రాత్రి(శనివారం) కండ్రిగ సాయిబాబానగర్లో మంత్రి నారాయణ పర్యటనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. మంత్రి నారాయణను వరద బాధితులు నిలదీశారు. తమకు కనీసం మంచినీరు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఎక్కడ చెత్త అక్కడే వదిలేశారని ప్రజలు నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయిన మంత్రి నారాయణ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్నగర్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత వార్త: మానని గాయం.. తీరని నష్టంబుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్నారు. పాడైపోయిన విలువైన సామాగ్రితో వీధులన్నీ నిండిపోయాయి. డాబాలపైనే బాధితులు బతుకీడుస్తున్నారు. పేరుకున్న చెత్త, మురుగుతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎమ్మెల్యేలు, అధికారులు ఏమైపోయారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Vijayawada: సాయంలోనూ ‘పచ్చ’పాతం
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు దాతలు సమకూర్చిన సరుకులను సైతం టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. వరద బాధితులకు అందించే సాయంలోనూ టీడీపీ నేతలు పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలను స్వచ్ఛంద సంస్థలు భారీగా అందిస్తున్నాయి.అయితే, స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకులు.. దాతలు ఇస్తున్న సాయాన్ని తామే పంచుతామని నమ్మించి తీసుకుంటున్నారు. ఆ తరువాత వాటిని బాధితులకు ఇవ్వకుండా.. టీడీపీ కార్యకర్తలకు, తమ బంధువులు, స్నేహితులకే ఇచ్చుకుంటున్నారు. స్లిప్పులు ఇచ్చి మరీ టీడీపీ పార్టీ వారికే పంపిణీ చేయడంపై బోండా అనుచరులపై 62వ డివిజన్, హరిహరక్షేత్రం ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. బాధితులను వదిలేసి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మానని గాయం.. తీరని నష్టంబోండా ఉమా కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై బోండా ఉమా అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరోసారి తమ కార్యాలయం దగ్గరకు రానివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమా, టీడీపీ కార్యకర్తల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినపుడు మాత్రమే మేం కనిపిస్తామా అంటూ మహిళలు దుమ్మెత్తిపోశారు. ఇంటింటికి తిరిగి ఓట్లడిగిన వాళ్లు ఇప్పుడెందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వరదల సమయంలో మమ్మల్ని గాలికి వదిలేశారు. వరద తగ్గిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోరా అంటూ టీడీపీ నేతలపై మహిళలు మండిపడ్డారు. -
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
నీకు 15వేలు.. నీకు 15వేలు ఎక్కడ?
-
ఇక నా జగన్నామం ఆపవా చంద్రం
-
విజయవాడను ముంచేసినట్టే.. ఇక్కడా చేశారు.. జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
ధైర్యంగా ఉండండి నేనున్నా.
-
రైతులకు జగన్ భరోసా..
-
జగన్ అమలు చేసిన పథకాలు ఇప్పుడు లేవు.. బాగా నష్టపోతున్నాం
-
జగన్ పర్యటనలో జన సందోహం
-
Updates: అందని సాయం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
AP And Telangana Floods News Latest Updates In Teluguహైదరాబాద్ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్లు విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ.సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. నారాయణరెడ్డి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు క్రమంగా పెరుగుతున్న వరద10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 125943 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.90 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 311.7462 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిలీన మండలాల్లో తగ్గుముఖం పట్టిన వరద ప్రభావంజాతీయ రహదారి-30 పై కొనసాగుతున్న రాకపోకలుజాతీయరహదారిపై కొనసాగుతున్న వరద ఉధృతిఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలుచింతూరు డివిజన్ పరిధిలో వరదలకు ప్రభావితమైన 113 గ్రామాలలోని 19766 కుటుంబాలుముంపులో ఉన్న 54 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేతమొత్తం నాలుగు మండలాల్లో 38 చోట్ల రహదారులపై చేరిన వరదనీరుదిక్కుతోచని స్థితిలో అన్నదాతలుఏపీవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలుఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులుప్రభుత్వ నిర్వాకంతో విరుచుకు పడ్డ బుడమేరు, ఏలేరు, కొల్లేరు పంట పొలాలను ముంచెత్తాయిప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరదపాలైంది.దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలుప్రాథమిక అంచనా ప్రకారం 19 జిల్లాల్లో 5.93లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వీటిలో 18 రకాల ఆహార, వాణిజ్య పంటలు 5.42లక్షల ఎకరాల్లో, మరో 51వేల ఎకరాల్లో 21 రకాల ఉద్యాన పంటలు పాడైపోయాయిమొత్తం 3.08 లక్షల మంది రైతులు నష్టపోయారుముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం నేడు మరో అల్పపీడనం!బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు.ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు. -
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
నిండా మునిగాం.. ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: ‘‘అర్ధరాత్రి దాటాక అకస్మాత్తు వరద.. మెలకువ వచ్చి చూస్తే నీళ్లలో ఉన్నాం.. దిక్కుతోచని పరిస్థితిలో ఇంటిపైకి ఎక్కి, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తి ప్రాణాలు మాత్రం కాపాడుకున్నాం.. కానీ సర్వం కోల్పోయాం.. నిత్యావసరాల నుంచి ఇంట్లో వస్తువుల దాకా అన్నీ కొట్టుకుపోయాయి.. ఉన్నా పాడైపోయాయి.. మా బతుకులకు ఆధారమైన పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. నిండా మునిగిపోయాం.. ఆదుకోండి’’ అని ముంపు బాధితులు కేంద్ర బృందానికి గోడు వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించి, నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్ టీమ్లుగా విడిపోయి.. ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర వరద పరిశీలన బృందం.. తొలిరోజు బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి, హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్సింగ్ నేతృత్వంలోని ఈ బృందంలో.. ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్కుమార్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె.కుశ్వంగ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి టి.నియల్ ఖాన్సూన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త శశివర్ధన్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రెండు సబ్ టీమ్లుగా విడిపోయి.. ఒక సబ్ టీమ్ పంట, ఆస్తి నష్టాలను పరిశీలించగా, మరో సబ్ టీమ్ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు వంటివాటిని పరిశీలించింది. ఎక్కడిక్కడ రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు వరద నష్టాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఖమ్మంలో జిల్లాలో.. కేంద్ర బృందం సభ్యులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగవత్వీడ్ తండాలో కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం, సూర్యాపేట మధ్యలో దెబ్బతిన్న జాతీయ రహదారిని, మల్లాయిగూడెంలో దెబ్బతిన్న రోడ్డును, పాలేరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు పడిన గండిని, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పంపుహౌస్లను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు, తనకంపాడు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కస్నాతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాలేరు, మున్నేరు వరదలతో తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు కేంద్ర బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రాకాసితండాలో దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. సమీపంలో ఆకేరు వరదతో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని చూశారు. ఈ సందర్భంగా తమ ఇళ్లు, పంట పొలాలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయని.. తమను ఆదుకోవాలని మహిళలు కేంద్ర బృందం సభ్యులకు దండం పెట్టి వేడుకున్నారు. తమకు మరో ప్రాంతంలో నివాసం కల్పించాలని విన్నవించారు. మానుకోట జిల్లాలో పరిశీలించి.. కేంద్ర బృందం సభ్యులు మహబూబాబాద్ జిల్లాలోనూ రెండు సబ్ టీమ్లుగా పర్యటించారు. ఒక సబ్ టీమ్ సభ్యులు తొలుత మరిపెడ మండలం ఉల్లెపల్లిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. సీతారాంతండాలో వరదతో సర్వం కోల్పోయిన ఇస్లావత్ మంగీలాల్ కుటుంబంతో మాట్లాడారు. వరద వచ్చినప్పుడు సమయమెంత? మీకు మెలకువ ఎలా వచ్చింది? సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లారు? ఎంత నష్టం జరిగింది అంటూ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మరో సబ్ టీమ్ సభ్యులు.. మరిపెడ మండలం అబ్యాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమాయ గూడెం, ముల్కలపల్లి గ్రామాల్లో తెగిన చెరువులు, రోడ్లు, వరద ప్రవాహం తీరును పరిశీలించారు. నష్టం ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. నేడు మున్నేరు ముంపు, సూర్యాపేట జిల్లాలో పర్యటన కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు. -
చెరువుల ఆక్రమణలతోనే వరదలు: సీఎం రేవంత్
-
Updates: మళ్లీ గోదావరి ఉగ్రరూపం
AP And Telangana Floods News Latest Updates In Telugu తూర్పుగోదావరి జిల్లా:ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా పెరిగిన గోదావరి వరద15.10 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం15 లక్షల 6 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలకొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి,వశిష్ట, వైనతేయ నదులునీట మునిగిన కాజ్వేలులంక గ్రామాలకు నిలచిపోయిన రాకపోకలు కృష్ణాజిల్లాభారీవర్షాలు , వరదలతో కృష్ణాజిల్లాకు భారీ నష్టంజిల్లాలో 1200 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసిన అధికారులుజిల్లా వ్యాప్తంగా 2 లక్షల 37వేల మంది పై ప్రభావంవ్యవసాయం (44521 హెక్టార్లు) 385.24 కోట్లు నష్టంహార్టికల్చర్ (4070.26 హెక్టార్లు) 108 కోట్లు నష్టంఆక్వాకల్చర్ 4.23 కోట్లు నష్టంపశుసంవర్ధక(పశువులు , గొర్రెలు ,కోళ్లు) 22.1 లక్షలు నష్టంపరిశ్రమలకు నష్టం 34.43 లక్షలుఇరిగేషన్ కు నష్టం 506 కోట్లురోడ్లు , భవనాలు 69 కోట్లు నష్టంపంచాయతీరాజ్ 60 కోట్లు నష్టంగ్రామీణ నీటి సరఫరా విభాగం 51.40 కోట్లువిద్యుత్ శాఖకు 15 కోట్లు నష్టంమున్సిపాల్టీలకు 2.03 కోట్లు నష్టం నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 1,41,879 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 68,210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం : 884.10 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 210.5133 టీఎంసీలు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఅల్లూరి సీతారామరాజు జిల్లాకూనవరం గిన్నెల బజారులో వరద బాధితుల నిరసన... నడుము లోతు వరద నీటిలో నివాసాల ముందు నిర్వాసితుల జలదీక్ష... తక్షణం పోలవరం పరిహారం, పునరావాసం కల్పించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బాధిత మహిళలుకృష్ణా జిల్లా :విజయవాడ రూరల్ మండలం గుడవల్లి వద్ద బుడమేరు కాలువలో వ్యక్తి గల్లంతు. కేసరపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తిగా గుర్తింపు. చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బుడమేరులో గల్లంతైన వ్యక్తిఘటనా స్థలానికి చేరుకొని ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. జల దిగ్బంధంలో చింతూరు ఏజెన్సీఅల్లూరి జిల్లా: విలీన మండలాలను చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులునాలుగు మండలాల్లో 37 ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రధాన, అంతర్గత రహదారులుసుమారు 80కు పైగా గ్రామాలకు నిలిచిన రాకపోకలుపూర్తిగా ముంపునకు గురైన 18 గ్రామాలలోని 1467 కుటుంబాలువరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపుచింతూరు మండలంలో ఎన్ హెచ్-30, 326 లపై ప్రవహిస్తున్న వరద నీరుఆంధ్రా-తెలంగాణా-ఒడిశా-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య స్థంభించిన రవాణా వ్యవస్థ.. భారీగా నిలిచిన వాహనాలుముకునూరు వద్ద రహదారిపై ప్రవహిస్తున్న సోకిలేరు వాగుచింతూరు-వీఆర్ పురం మండలాల మధ్య పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్కూనవరం మండలం, పోలిపాక వద్ద కూనవరం-భద్రాచలం ప్రధాన రహదారిపై చేరిన గోదావరి వరదఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలుపండ్రాజుపల్లి వద్ద ప్రధాన రహదారిపై చేరిన వరద... కూనవరం-చింతూరు మధ్య రాకపోకలు బంద్కొండ్రాజుపేట కాజ్వే పై ప్రవహిస్తున్న వరదనీరు.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్వీఆర్ పురం మండలంలో పూర్తిగా వరదలకు ప్రభావితమైన శ్రీరామగిరి, రామవరం, చిన్నమాట్టపల్లి, తుమ్మిలేరు, జీడిగుప్ప గ్రామాలుగ్రామాల మధ్య నిలిచిన రాకపోకలువరదల దృష్ట్యా విలీన మండలాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులుపోటెత్తుతున్న గోదావరితూర్పుగోదావరి జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతున్న గోదావరిధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.2 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం13 లక్షల 37వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలబ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదులుకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలులోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసిన అధికారులుఅమలాపురం కలెక్టరేట్ కార్యాలయంతో ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు⇒గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీకి 10,31,640 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 12.10 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10,28,640 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతికి శబరి తోడవడంతో కూనవరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.⇒వరద నీటితో రహదారులు మునిగిపోవడంతో చింతూరు నుంచి చట్టి, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లకు అలాగే ఎటపాక, చింతూరు, వీఆర్పురం, కూనవరం మండలాల్లో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టులోకి 10.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఏలేరు, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ⇒మంగళవారం రాత్రి ఏలేరు రిజర్వాయర్లోకి 19,813 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 18,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 24,700 క్యూసెక్కులు చేరుతుండగా 27,283 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట నుంచి 12,900 క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలోకి కలుస్తున్నాయి.⇒పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణాలో వరద మరింత తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,93,237 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 1,512 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 1,91,725 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.ఉత్తరాంధ్ర: వర్షాలు తగ్గుముఖం పట్టినా..భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. -
నిండా మునిగిన పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
-
సీఎం వచ్చినా నో చేంజ్.. వరద బాధితుల ఆగ్రహం..
-
AP Floods: పట్టెడన్నం కోసం పరితపిస్తూ..
పటమట/చిట్టినగర్ (విజయవాడ): బుడమేరు వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్న జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు ఆహారం అందక అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారంతా తిండి, తాగునీరు, పాల కోసం అర్రులు చాస్తున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనం ఏది వచ్చిన ఆహారం పొట్లాలు ఇచ్చేందుకు వచ్చాయని భావించి వాటివెంట పరుగులు పెడుతున్నారు. జక్కంపూడి కాలనీలో సోమవారం ఉదయానికి కాలనీలో వరద నీరు అడుగు మేర తగ్గింది. బాధితులు తమ ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటూ భోజనం కోసం ఆతృతగా ఎదురు చూశారు.ఉదయం ఆల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందకపోవడంతో కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీలోకి ట్రాక్టర్, కారు వచ్చినా అందులో తమ కోసం భోజనం తీసుకొచ్చారేమోనని భావిస్తూ ఆతృతతో ఆ వాహనాలను చుట్టుముడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు పట్టుకుని పిల్లలతో కలిసి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి తాగేందుకు ఉపయోగించవద్దని ముందుగానే కార్పొరేషన్ అధికారులు మైక్లో ప్రచారం చేయడంతో వాటర్ బాటిళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు సైతం తమ సేవలను నిలిపివేశాయి.జక్కంపూడి కాలనీలో కారు వెంట పరుగులు పెడుతున్న వరద బాధితులు ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు కాలనీ వాసులకు భోజనం అందించేందుకు రాగా మహిళలు, యువకులు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలను చుట్టుముట్టి కదలనివ్వడం లేదు. సోమవారం కాలనీ మెయిన్ రోడ్డులో నివాసం ఉండే వారికే ఆహారం అందింది. శివారు ప్రాంతాలతో పాటు బుడమేరు కాలువకు అవతలి వైపున ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందలేదు. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు కాలనీలో నివాసం ఉండే కుటుంబాలకు ఆహారం అందించాలని అక్కడి వారంతా వేడుకుంటున్నారు.ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితిఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కూలి పనులు, ఆటోలు నడుపుకుంటేనే కానీ పొట్టగడవని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తామంతా యాచకుల మాదిరిగా తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఈ ప్రాంత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ కాలనీలో పేద, మధ్య తరగతికి చెందిన 600 కుటుంబాల్లో కనీసం రెండు వేల మంది నివాసం ఉంటున్నారు. వరద కారణంగా ఉండే వంట సామాగ్రితో, వస్త్రాలు, జీవనో«పాధి కల్పంచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. మహిళల స్వయం ఉపాధి ఆసరాగా నిలిచే కుట్టు మెషిన్లు, టిఫిన్ బండ్లతోపాటు ఇళ్లల్లోని గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ పొయ్యిలు మరమ్మతులకు గురయ్యాయి. ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా దాతలిచ్చే ఆహార పొట్లాలపైనే ఆధారపడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాయని భావించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం సరఫరాను చాలా వరకు తగ్గించేశాయి. దీంతో ఆహారం, పాలు, తాగునీరు దొరక్క ఇక్కడి పేదలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు ఈ రెండు కాలనీల్లోని కుటుంబాలకు ప్రభుత్వమే ఆహారం అందించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.అన్నీ కోల్పోయాం ఇదేం వరదో. కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కాలనీలోని ప్రతి ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి. ఆహారం దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. పేదలు పూర్తిగా తేరుకునే వరకు ప్రభుత్వమే ఆహారం, పాలు, నీళ్లు అందించాలి. ఇంటిసామగ్రి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. – వసంత, ఆంధ్రప్రభ కాలనీ జగనన్న ఇళ్లపట్టా కూడా కొట్టుకుపోయింది మాది చిన్న కుటుంబం. గృహోపకరణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఆధార్, రేషన్, పాన్ కార్డులు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, పుస్తకాలతోపాటు జగనన్న ఇచ్చిన ఇంటిపట్టా కూడా కొట్టుకుపోయింది. మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవాలన్నా కార్డులు అడుగుతున్నారు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయిన వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. – వెంకటదుర్గా సూర్యకుమారి, ఆంధ్రప్రభ కాలనీ అర్థగంటలో అంతా నాశనమయ్యింది. అర్థగంటలో మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఊహించలేనంత ముప్పు మా ఇంటిలోకి వచ్చింది. మా కష్టం అంతా బుడమేరులో కొట్టుకుపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే రక్షించాలి. – లక్ష్మీ సరోజ, ఆంధ్రప్రభ కాలనీ -
Updates: ఉగ్రగోదావరి
AP And Telangana Floods News Latest Updates In Teluguరేపు తెలంగాణకు కేంద్ర బృందంతెలంగాణకు రానున్నకేంద్ర బృందంవరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందంములుగుగోదావరికి బారీగా పెరుగుతున్న వరద ఉధృతిరామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ15.80 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి వరద ప్రవాహం15.83మీటర్లు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులుముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగంజాతీయ రహదారి పైకి చేరిన గోదావరి వరద నీరుఛత్తీస్గడ్-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ కష్టతరంగా బోట్ల తొలగింపుప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంరేపు కూడా కొనసాగనున్న చర్యలుబోట్లను రంధ్రాలు చేసి తొలగించేందుకు చూస్తున్న ఇంజనీర్లుకుదరకపోతే.. బెలూన్ల ద్వారా బోట్లను తరలించే యత్నంభద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టంక్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రవాహం53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు నల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పెరిగిన భారీ వరద26 క్రస్ట్ గేట్లు ఎత్తివేతఇన్ ఫ్లో:& అవుట్ ఫ్లో : 234810 క్యూసెక్కులుప్రస్తుత నీటి మట్టం: 589.40 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.2522 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎన్టీఆర్గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు తగ్గిన వరద ఉధృతిభారీ వర్షాలకు డైవర్షన్ రహదారిపై మూడుచోట్ల పడ్డ గండ్లుకృష్ణాఅవనిగడ్డ మండలం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్స్ కలకలం విషజ్వరాలతో బాధపడుతున్న 20 మందికి పైగా విద్యార్ధులు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పది మంది విద్యార్ధులను ఇళ్లకు పంపించేసిన ప్రిన్సిపల్పాఠశాలలోని విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వేకనూరు పీహెచ్.సీ వైద్య బృందం వరదల సమయంలో ఇళ్లకు వెళ్లి వచ్చిన వారిలోనే ఎక్కువ జ్వరాల తీవ్రత ఉందంటున్న ప్రిన్సిపల్ కుమార్జ్వరం ఉన్న వారందరికీ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేస్తున్న వైద్యులువాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించనున్న వైద్యులుప్రకాశం బ్యారేజ్..ఆ బోట్ల తొలగింపు యత్నంప్రకాశం బ్యారేజ్ను ఢీ కొట్టిన బోట్ల తొలగింపు ప్రయత్నాలురెండు భారీ క్రేన్లతో తొలగించేందుకు అధికారుల యత్నంబ్యారేజీకి ప్రమాదం లేకుండా వరదవైపు బోట్లను తిప్పేందుకు ప్రయత్నాలుముగ్గురు గజ ఈతగాళ్లతో పని చేయించిన ఇంజనీర్లుబ్యారేజ్ను ఢీ కొట్టాక బోల్తా పడ్డ పడవలుసంబంధిత వార్త: బ్యారేజ్ను ఢీ కొట్టిన బోట్లు టీడీపీ నేతలవే!అల్లూరి సీతారామరాజువరద ముంపు లోనే చింతూరు వాసులుపంపు ప్రాంతాలు ఖాళీ చేయాలని ఆలస్యంగా ప్రకటించిన అధికారులుఉన్నపలంగా చేతి కందిన సామాగ్రితో శబరివంతెనపై చేరి తల దాచుకున్న చింతూరు వాసులుతాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్న స్థానికులుఅధికారులు , ప్రజాప్రతినిధులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్న వరద బాధితులుతాగునీరు పాలు కూడా అందించలేదంటూ ఆవేదనవరద ప్రాంతాల పరిశీలనకే సమయం వెచ్చిస్తున్న అధికారులుచింతూరు మండల పరిధిలో 13 చోట్ల రహదారుల పైకి వచ్చిన వరద నీరువిజయవాడప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్ప్రకాశం బ్యారేజ్ కు క్రమంగా తగ్గుతున్న వరదఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో 2,02,409 క్యూసెక్కులు2 గేట్లు పూర్తిగా ఎత్తివేత,5 అడుగుల మేర 45 గేట్లు,4 అడుగుల మేర 20 గేట్లు ఎత్తివేతఅల్లూరిచింతపల్లి మండలం చింతలూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్న విష జ్వరాలు.విష జ్వరాలు వాంతులు విరేచనాలతో ఐదుగురు మృతి.వారం రోజుల వ్యవధిలో మృతి చెందిన ఐదుగురువిష జ్వరాలతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులుతమను ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదనఅధికారులు వెంటనే స్పందించి తమను కాపాడాలంటున్న గ్రామస్తులుచింతపల్లి, నర్సీపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న మరి కొంతమంది గ్రామస్తులువిజయవాడమాచవరంలో విరిగిపడ్డ కొండచరియలుఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలుకొనసాగుతున్న సహాయక చర్యలుమృతుడు రాముగా గుర్తింపుక్షతగాత్రులు దేవినేని నగర్కు చెందిన కూలీలుగా గుర్తింపుఅల్లూరి జిల్లా: జలదిగ్బంధంలో విలీన మండలాలుపోటెత్తి ప్రవహిస్తున్న శబరి సిలేరు, కొండబాగులుసీలేరు ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న శబరిచింతూరు-వీఆర్పురం-కూనవరం-ఎటపాక మండల కేంద్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలునాలుగు మండలాల పరిధిలో అనేక నివాస ప్రాంతాలు జలమయంనీట మునిగిన జాతీయ రహదారి 326ఆంధ్ర ఒరిస్సాల మధ్య రాకపోకలు బంద్చిట్టి వద్ద ఎన్హెచ్ 35 చేరుకున్న వరద నీరుఆంధ్ర- తెలంగాణ -ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు⇒ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.⇒అలాగే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది.⇒మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.⇒అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. -
నష్టం అంచనా.. 11న తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా కేంద్ర బృందం సభ్యులతో కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కేంద్ర బృందానికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేపీ సింగ్ నేతృత్వం వహించనున్నారు.ఇక, ఈనెల 11న(బుధవారం) రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరు పర్యటించి నష్టం అంచనా వేయనున్నారు. అలాగే, బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.అయితే, ఆరుగురు సభ్యులతో కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. -
TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.కాగా.. భారీ వర్షాలు, వరదలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తాం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం అందజేస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.5 లక్షల సహాయం చేస్తాం. వరద ముప్పునకు గురైన ప్రతీ ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తాం. వరదల కారణంగా తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం. యుద్ధ ప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు చేపడతాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందకండి. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
Updates: బలపడిన వాయుగుండం.. ఫ్లాష్ ఫ్లడ్స్ టెన్షన్!
AP And Telangana Floods News Latest Updates In Teluguవిశాఖ, గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు!వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది.విశాఖ, తూర్పు గోదావారి జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం.24 గంటలపాటు నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ప్రజలను విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అలర్ట్ చేసింది.పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం..మరో 24 గంటలపాటు ఉత్తరాంధ్రలో కొనసాగనున్న భారీ వర్షాలు.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలులు.మత్స్యకారులకు కొనసాగుతున్న హెచ్చరికలు.వైఎస్సార్ జిల్లా..మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి 1000 క్యూసెక్కుల నీటి విడుదలదశల వారీగా రోజు 5000వేల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్న అధికారులులోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలు ఏపీలో 46 మంది మృతి!ఏపీలో భారీ వర్షాలకు, వరదలతో ఇప్పటిదాకా 46 మంది మృతిఅత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోనే 36 మంది4,53, 845 వేల ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం49, 217వేల ఎకరాల్లో ఉద్యానవన పంట నష్టంరాష్ట్రవ్యాప్తంగా 3,913 కిలోమీటర్లు దెబ్బ తిన్న రోడ్లుఇదీ చదవండి: ‘విజయవాడ వరద మరణాలు.. సర్కారీ హత్యలే’తెలంగాణలో 33 మంది మృతితెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో 33 మంది మృతిఅధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంమృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లుతెలంగాణలో 358 గ్రామాలను ముంచెత్తిన వరదదాదాపు 2 లక్షల మంది జీవనంపై ప్రభావంతెలంగాణకు కేంద్రబృందంఈనెల 11న తెలంగాణలో పర్యటించనున్న కేంద్రబృందంహైదరాబాద్: ఈనెల 11న రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్రబృందంవరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్రబృందంరాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్రబృందంఅనంతరం వరద బాధితులు, అధికారులతో కేంద్రబృందం సమావేశంకీర్తిప్రతాప్ సింగ్ నేతృత్వంలో రానున్న ఆరుగురు సభ్యుల కేంద్రబృందంకీర్తిప్రతాప్ సింగ్తో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిముంపు ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: పవన్ కల్యాణ్పిఠాపురం: కాకినాడ జిల్లా ఏలేరు వదర ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటనగొల్లప్రోలు మండలంలో పర్యటించిన పవన్ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్తో మాట్లాడా: పవన్ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలిసుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం ఎన్టీఆర్ జిల్లాప్రాణాల మీదకు తెచ్చిన పందెంమున్నేరులో దూకి ఒడ్డుకు వస్తే రూ. 2 వేలు ఇస్తానంటూ పందెంనందిగామ పెద్ద బ్రిడ్జి వద్ద మున్నేరులో దూకిన ఇద్దరు యువకులుమద్యం మత్తులో రోశయ్యతో 2 వేలు పందెం కాసిన మాడుగుల గోపీచంద్(చంటి)పందెంలో భాగంగా గోపీచంద్ తో పాటు నీటిలో దూకిన రోశయ్యనీటిలో మునిగిపోయిన గోపీచంద్గోపీచంద్ ను కాపాడేందుకు యత్నించిన రోశయ్యసాధ్యం కాకపోవడంతో వెనక్కి వచ్చేసిన రోశయ్యనీటిలో మునిగిపోయిన గోపీచంద్ కోసం పోలీసుల గాలింపుప్రకాశం బ్యారేజ్ కేసు.. ఇద్దరి అరెస్ట్ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన.. ఇద్దరు అరెస్ట్ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనకుట్ర కోణం కేసుతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులులుకొట్టుకొచ్చిన మూడు పడవలూ.. గొల్లపూడి వాసి కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తింపు ఉషాద్రితోపాటు, సూరాయపాలెం వాసి కోమటి రెడ్డి రామ్మోహన్ అరెస్ట్నిందితులను విజయవాడలోని కోర్టుకు తరలించిన పోలీసులు14 రోజులు రిమాండ్ విధించిన సీఎంఎం కోర్టువిజయవాడ సబ్ జైలుకు నిందితులను తరలించిన పోలీసులు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కేసులో.. A1 గా ఉషాద్రి A2 గా కోమటి రామ్మోహన్సంబంధిత వార్త: ఆ బోట్లు టీడీపీ వాళ్లవే!ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తిప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద మరమ్మతులు పూర్తిదెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసిన ఇంజినీర్లు ఐదు రోజులు కష్టపడి మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటురేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను సన్మానించిన కన్నయ్యనాయుడు మార్గదదర్శనం చేసిన నిపుణుడు కన్నయ్యనాయుడిని సన్మానించిన ఇంజినీర్లు, అధికారులుప్రమాదకరంగా మూసీమూసీకి పోటెత్తిన వరదప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నీరుమూసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నకృష్ణాగన్నవరం మండలం కేసరపల్లి వద్ద మూడు రోజుల క్రితం బుడమేరు కాలువలో గల్లంతైన కలదిండి ఫణి ఆచూకీ లభ్యం.కారుకి కొద్ది దూరంలో మృతదేహాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.హైదరాబాదు నుండి స్వగ్రామం వెళుతుండగా కేసరపల్లి-ఉప్పులూరు మధ్య బుడమేరు వరదలో గల్లంతైన ఫణి.ఫణి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణికి భార్య, ఇద్దరు పిల్లలుమృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు.పోస్టుమార్టం అనంతరం ఫణి మృతదేహాన్ని స్వగ్రామం మచిలీపట్నం దగ్గర హుస్సేన్ నగర్కు తరలింపు కాకినాడ ఏలేరు ప్రాజెక్టు కు పెరుగుతున్న వరదఎగువ నుండి ప్రాజెక్టు లోకి చేరుతున్న 45,019 క్యూసెక్ ల వరద నీరుప్రాజెక్టు లో 22.96 టీఎంసీల నీటి నిల్వలుదిగువకు 21,775 క్యూసెక్ ల వరద నీరు.ఏలేశ్వరం-అప్పన్న పాలెం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువకిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి.పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద కొట్టుకుపోయిన డబ్బకాలువ తాత్కలిక వంతెనకిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం,గొల్లప్రోలు మండలాల్లో నీట మునిగిన పంట చేలు.గొల్లప్రోలు మండలంలో నీట మునిగిన కాలనీలను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ఏలేరు కాలువ ముంపు ప్రాంతాల్లో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు.పిఠాపురం మండలం గొర్రి ఖండి కాలువకు గండి ఏలేరు వరద.. వైస్సార్సీపీ శ్రేణులు సిద్ధంఏలేరు వరదను పరిశీలించిన పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జి వంగా గీతాపెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలిముంపు ప్రజలను శిబిరాలకు తరలించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ , అధికారులను కోరుతున్నాఏలేరు కాలువకు గండ్లు పడడంతో పంట చేలు నీట మునుగుతున్నాయినీరు లాగిన వెంటనే నష్టపరిహం త్వరిత గతిన అందించేలా ఎన్యూమరేషన్ చేపట్టాలి.ప్రజలకు ఇబ్బందులు వస్తే.. సహయం అందించేందుకు వైస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి నల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టు కు క్రమంగా తగ్గుతున్న వరద12 క్రస్ట్ గేట్లు ఎత్తివేతఇన్ ఫ్లో: & అవుట్ ఫ్లో : 137871 క్యూసెక్కులుప్రస్తుత నీటి మట్టం: 588.20 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 306.6922 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వోవిజయవాడలో వరద బాధితుడితో దురుసుగా ప్రవర్తించిన వీఆర్వో విజయలక్ష్మిఅజిత్ సింగ్ నగర్ షాదీఖానాలో ఆహారం, తాగునీరుఇవ్వలేదని బాధితుల ఆవేదనప్రభుత్వం చెప్పినా వీఆర్వో పట్టించుకోవడం లేదంటూ నిరన259 వార్డు వరద బాధితులకు, వీఆర్వోకు మధ్య తీవ్ర వాగ్వాదాంకోపంతో ఊగిపోతూ ఓ వ్యక్తి చెంపపై కొట్టిన వీఆర్వో విజయలక్ష్మి విశాఖ వద్ద పరిస్థితివిజయ పాల ఫ్యాక్టరీకి భారీ నష్టంసుమారు రూ.75 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కంపెనీ ప్రకటనఇంకా వరద నీటిలోనే పాల ఫ్యాక్టరీఫ్యాక్టరీకి మరమ్మత్తులు చేపట్టిన సిబ్బందిమరో యూనిట్తో ఉత్పత్తిని కొనసాగిస్తున్న కంపెనీ మరికొద్ది సేపట్లో పూరీ తీరం దాటనున్న తీవ్ర వాయుగుండంభూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడితీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలువిశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశంశ్రీకాకుళం, పార్వతి పురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్కాకినాడ, ఎన్టీఆర్ , ఏలూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్చింతపల్లిలో 13, పూసపాటిరేగ 10, వైజాగ్ ఎయిర్ పోర్ట్ 09 సెం.మీ వర్షపాతం నమోదుకళింగపట్నం నుంచి కాకినాడ వరకు పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అల్లూరి సీతారామ రాజు జిల్లాజీకే వీధి మండలం గాలికొండ పంచాయతి చట్రాపల్లిలో కొండ చరియలు విరిగిపడి మహిళ మృతిమరో ముగ్గురికి గాయాలుగాయపడిన కొర్ర పండన్న (60), కొర్ర సుమిత్ర (18), కొర్ర సుబ్బారావు (25)లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సవిజయవాడ:ప్రకాశం బ్యారేజ్ వరద అప్డేట్..ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరదమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,72,952 క్యూసెక్కులు70 గేట్లు ఎత్తివేతఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టుకు స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 30.110 మీటర్లుస్పిల్ వే దిగువన 20.995 మీటర్లు నీటిమట్టం48 రేడియల్ గేట్ల ద్వారా 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల పూరి వద్ద తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండంమరికొద్ది సేపట్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం..పూరి నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..తీరం దాటిన అనంతరం.. చత్తీస్ఘడ్ మీదుగా తీవ్రవాయుగుండం పయనించే అవకాశం విరిగిపడ్డ కొండచరియలుకొండ చరియలు విరిగిపడి గిరిజనుల ఇళ్లు ధ్వంసంముగ్గురు గల్లంతు,నలుగురిని రక్షించిన స్థానికులుసీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల విరిగిపడ్డ కొండచరియలుదాదాపు 16 కి.మీ మేర విరిగిపడ్డ కొండచరియలుగూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీలో ఘటనమధ్యాహ్నానికి తీరం దాటనున్న వాయుగుండంబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంపూరీ సమీపంలో తీరం దాటే అవకాశంవాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనఏపీలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలువిశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలుఉత్తర కోస్తా తీరంలో కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుకళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ హెచ్చరికభారీ వర్షాలతో ఏపీలో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలువుఅనకాపల్లి రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ 9491998293నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ 7075356563 పొంగి పొర్లుతున్న మహేంద్ర తనయ.. శ్రీకాకుళం: రణస్థలం మండలం వల్లభరావుపేటలో రెండు పూరిళ్లు నేలమట్టమయ్యాయిసుభలయ కాలనీలో పాఠశాల ప్రహరీ కూలిపోయింది.నాగావళి నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారుపొందూరు మండలం చిన్నబొడ్డేపల్లి గ్రా మం వద్ద రైల్వే అండర్ పాసేజ్లో భారీగా నీరు చేరడంతో కారు, ట్రాక్టర్, ద్విచక్రవాహనాలు చిక్కుకున్నాయనరసన్నపేట మండలంలోని గుండవల్లిపేటకు చెందిన ఓ ఆగ్రోఫుడ్ మిల్లుకు చెందిన ప్రహరీ కూలిందిపోలాకి మండలం, సారవకోట మండలాల్లో తంపర భూములు నీట మునిగాయిఅరసవల్లి సమీపంలో లక్ష్మీనగర్, కామేశ్వర నగర్, రాజీవ్నగర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీల గుండా వస్తు న్న మిర్తిబట్టి పొంగి పొర్లేలా ఉందికుప్పిలి ఊట గడ్డ పో టెత్తింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పశువైద్య కేందం, అంగన్ వాడీ కేంద్రాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది.మహేంద్ర తనయ నది పొంగి పొర్లుతుండడంతో పాతపట్నం నీలకంఠేశ్వరం ఆలయం వద్ద ఉన్న కాజ్వే బ్రిడ్జిపై నుంచి ఆదివారం సాయంత్రం మూడు అడుగుల మేరు నీరు పారింది.ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షంవాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.విద్యా సంస్థలకు సోమవారం సెలవుఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతోంది. గోపాలపట్నంలోని రామకృష్ణనగర్ వద్ద మట్టి కోతకు గురవుతుండటంతో.. 15కు పైగా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లన్నీ ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గడిచిన 48 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 168.5 మి.మీ., చీపురుపల్లిలో 167.75 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 158.75, ఆమదాలవలసలో 142 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా వై.రామవరంలో 133.5, నెల్లిమర్లలో 129.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
Telangana: మళ్లీ 'మున్నేరు' ముంపు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు, మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కనీవిని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈనెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 అడుగులుగా నమోదైంది. ఆదివారం 15.75 అడుగులకు చేరుకుని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, ఈనెల 1నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు కూడా ఇటీవలి భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ భారీ వర్షం.. ఇక్కడ భయం ఖమ్మం జిల్లాకు ఎగువన మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షం పడినా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. ఆ విధంగానే ఈ నెల 1న భారీయెత్తున వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్లో భారీ వర్షాలు కురిస్తే ఖమ్మం జిల్లాలోని 11 మండలాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఇక ఆకేరు పరీవాహకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మండలాలు, ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు ఉంటాయి. ఆకేరు వరద మున్నేరులోకి చేరుతుండటంతో మున్నేరు ఉధృతి మరింత తీవ్రమై ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత పది రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ రెండు రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెం.మీ. పైగా నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షం ఈ రెండు ఏర్ల పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలోనే వరద ఉప్పెనలా పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రెండు వాగుల వేగ ఉధృతి కూడా గతంతో పోలిస్తే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి వరదలతో ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్నగర్, ధంసలాపురం కాలనీ.. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. నాటి వరదతో అప్రమత్తం మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్కు గురి చేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిõÙక్ అగస్త్య.. వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. శనివారం రాత్రి కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి ముంపు ప్రాంతాల ఇళ్లల్లో ఉన్న వారందరినీ మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఆయా కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఆదివారం కొందరు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని రాత్రికి తిరిగి వచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, మందుల పంపిణీని వేగవంతం చేశారు. -
బాబు సర్కార్ మొద్దు నిద్ర.. విజయవాడ వరదల్లో భారీ ప్రాణనష్టం
సాక్షి, విజయవాడ: వరదలు సమాచారం ఉన్నా కానీ చంద్రబాబు సర్కార్ అలర్ట్ చేయకపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 45 మంది మరణించినట్టు కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్క విజయవాడ నగరం, రూరర్లోనే 25 మంది మృతి చెందగా, ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది. 8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఉపద్రవం ముంచుకొస్తుంటే పాలకులు మొద్దునిద్రలో ఉండటం వల్లనే విజయవాడలో వరదలకు భారీ నష్టం వాటిల్లింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం మూటకట్టుకుంది. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది.కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం(31వ తేదీ) రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.సంబంధింత వార్త: వరదను మించిన విపత్తు బాబే!విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో వేలాదిమంది బాధితులు ఆకలి కేకలు పెడుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది నాలుగైదు రోజులుగా కనీసం అన్నం కూడా కడుపునిండా తినకుండా వరదల్లో కొట్టుమిట్టాడిన దయనీయ దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి. -
Updates: భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పలు జిల్లాల్లో స్కూల్స్కు సెలవు
AP And Telangana Floods News Latest Updates In Teluguపలు జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు..భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ.రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. విశాఖలో భారీ వర్షం.. విశాఖపట్నం..ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం.విశాఖ నగరంలో అత్యధికంగా వర్షపాతం.జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు.అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాలతో నీట మునిగిన పంటలు.గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న పెద్దేరు, కోణం, రైవాడ కళ్యాణపులోవ తాండవ, మేఘాద్రి గడ్డ రిజర్వేయర్లు.ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి.ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు..కృష్ణా..ఉప్పులూరు వద్ద బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర రావు.కంకిపాడు - గన్నవరం మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలుబుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందిఅధికారులు అప్రమత్తంగా ఉండాలిఅలసత్వం వహిస్తే సహించేది లేదు.మంతెన, తెన్నేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత..విజయవాడప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్..ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,28,322 క్యూసెక్కులు70 గేట్లు పూర్తిగా ఎత్తివేతవిశాఖపట్నం..గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండ చరియలు.రెండు ఇళ్ళు కూలిపోయే ప్రమాదం.ఇంట్లో వారిని ఖాళీ చేయిస్తున్న అధికారులు. కృష్ణాజిల్లా:గన్నవరం మండలం కేసరపల్లి వద్ద గత రాత్రి బుడమేరు కాలువలో చిక్కుకున్న కారుకారులో ప్రయాణిస్తున్న వ్యక్తి గల్లంతుపెడన మండలం హుస్సేన్ పాలెంకు చెందిన ఫణి కృష్ణగా గుర్తింపుసంఘటనా స్థలానికి చేరుకున్న గుడివాడ ఆర్డీవో పద్మావతిఫణి కృష్ణ కోసం గాలిస్తున్న అధికారులువిజయవాడ వరదల్లో భారీ ప్రాణ నష్టం45 మంది మృత్యువాత45 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంఒక్క విజయవాడ నగరం, రూరల్ లోనే 25 మంది మృతిఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35.మంది మృతిఇంకా మరణాలు పెరిగే అవకాశం8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలుప్రభుత్వం వరదలు సమాచారం ఉన్నా అప్రమత్తం చేయకపోవడం తో సంభవించిన మరణాలువిజయవాడకు బుడమేరు టెన్షన్గన్నవరం-కంకిపాడు రహదారిపైకి బుడమేరు వరదగన్నవరం-కంకిపాడు రోడ్డులో నిలిచిన రాకపోకలుబంగాళాఖాతంలో వాయుగుండంవాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం..ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశంవాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిబారీ వర్షాలు..ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరో రెండు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలుతీరం వెంబడి బలమైన ఈదురు గాలులుకొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుకృష్ణానది వరద ఉధృతికాసేపట్లో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీశ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.86, ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులునాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులుపులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.75 ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులుప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులువాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలిలోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థఖమ్మం చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎంప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీసిన భట్టిప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించిన డిప్యూటీ సీఎంమళ్లీ మొదలైన భారీ వర్షాలుఎన్టీఆర్ జిల్లా: నందిగామ నియోజకవర్గవ్యాప్తంగా మళ్లీ మొదలైన భారీ వర్షాలుపొంగిపొర్లుతున్న నందిగామ మున్నేరులోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులువర్షాలు మళ్లీ భారీగా పడటంతో ఆందోళన చెందుతున్న రైతన్నలుబిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో లోతట్టు ప్రాంత ప్రజలుఖమ్మం జిల్లాలో భారీ వర్షంమున్నేరు వాగుకు పొంచిఉన్న వరద ముప్పులోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులుమైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు సూచనలుపరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపుఅధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటికలెక్టర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న మంత్రులు కోస్తా జిల్లాల్లో కుండపోత వానవిశాఖ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడననేడు వాయుగుండంగా మారే అవకాశంఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుమరో రెండు రోజులు కొనసాగనున్న వర్షాలుప్రకాశం బ్యారేజ్కు మళ్లీ పెరుగుతున్న వరదఎగువ నుంచి భారీగా కృష్ణానదికి వచ్చి చేరుతున్న వరదనందిగామ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులుభారీ వర్షాల నేపథ్యంలో తిరువూరు, నందిగామ, విజయవాడ రూరల్ మండలాల తహసీల్దార్లను, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజనలోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలుఓ వైపు వరద.. మరోవైపు వర్షాలతో భయపడుతున్న బెజవాడ ప్రజలుబుడమేరు గండ్లు పూడ్చినప్పటికీ భారీ వర్షంతో వరద ముంపు ప్రాంతాల్లో ఆందోళనవిజయవాడలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో బెజవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. 8 రోజులుగా నగర వాసులు వరద కష్టాలు పడుతున్నారు. ఇంకా వరద ముంపులోనే పలు కాలనీలు ఉన్నాయి.ఇదీ చదవండి: సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో తిరువూరులో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎనిమిది జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణాకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. -
సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా మూడు నాలుగు రోజుల నిష్క్రియాపరత్వంతో దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరు. కానీ.. ఆచంట మల్లన్న టైపు నేతలకు కూటమి ప్రభుత్వంలో లోటేమీ లేనట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంతి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా బాబును పొగడ్డమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ భజన కాస్తా వికటించి ఆయన పరువే తీసినట్టుగా కనిపిస్తోంది.ఐదు రోజుల క్రితం విజయవాడను వరద చుట్టేసిన తరువాత చంద్రబాబు చేయని విన్యాసమంటూ లేదు. రోజూ రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడటం, జేసీబీపై ఎక్కి ఒకసారి.. పడవలో వెళ్లి ఇంకోసారి, మోకాలి లోతు నీళ్లలో మరోసారి వెళ్లి తాను జనంలోనే ఉన్నట్లు.. వారి కోసమే పని చేస్తున్నట్లు గట్టి కృషే చేశారు. ఏదో ఒక పేరుతో వరద ప్రాంతాల్లో తిరుగుతూండటంతో అధికారులే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాబు గారు మాత్రం మీడియా కవరేజీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.భజన మీడియా కూడా తనవంతుగా బాబుగారి ప్రచారానికి పోటాపోటీలు పడుతున్నాయి. అదేదో సినిమాలో ఉన్నట్లు.. ‘‘అన్న నడిచొస్తే మాస్.. అన్న మడతేస్తే.. మాస్.. మ మ మాస్’’ అనేలా ఉంది వీరి రాతలు. వరదలొచ్చిన ఐదు రోజులకు ఈనాడు ఓ కథనంలో... బుడమేరు వరదకు చంద్రబాబు చలించిపోయారని, బాధితులు, రైతుల కష్టాలు విన్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయని, రాసుకొచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ఇప్పటి వరకూ యాభై మంది మరణించారన్న సమాచారానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంది.వరద సహాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే చర్యల గురించి రాయడం తప్పు కాదు. కానీ ప్రజల బాధల కన్నా చంద్రబాబు గురించే ఈనాడు, తదితర మీడియాలు కొన్ని తెగ దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతిగా చేసే ప్రచారం ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శ చేశారో, లేదో కాని, టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేశారు. వరద సహాయ చర్యలు బాగానే చేసిందని తేల్చేశారు. మిత్రపక్షం కనుక మర్యాద కోసం ఒక మాట అంటే ఫర్వాలేదు కాని, డబ్బా కొట్టినట్లు మాట్లాడితే ప్రజలలో బీజేపీ నవ్వులపాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని చౌహాన్ కితాబు ఇచ్చారు. ఇల్లు మునిగిపోయి చంద్రబాబు తన బస కలెక్టరేట్కు మార్చిన విషయాన్ని చెప్పకుండా చెప్పకుండా, ఆయన సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కలెక్టరేట్నే సచివాలయంగా మార్చుకుని చేస్తోందని వ్యాఖ్యానించడం విశేషం.వరదల వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినా ప్రాణ నష్టం మాత్రం స్వల్పంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెబితే ఏమని అనుకోవాలి? వరదల కారణంగా యాభై మంది మరణిస్తే అది తక్కువ సంఖ్య అవుతుందా? మృతులు ఎందరో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంటే... చౌహాన్ మాత్రం ఇలా విడ్డూరంగా మాట్లాడారు. పైగా తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించారన్న చౌహాన్ మెచ్చుకోలు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఉత్తరాఖండ్, కేరళల్లోనూ వరద సహాయక చర్యలకు డ్రోన్లను వాడిన విషయం కేంద్ర మంత్రికి తెలియదా? అని నెటిజన్లు ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వరద నీటిలో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తే వారి బాధలు తెలుస్తాయి.పైపైన తిరిగి, ఎగ్జిబిషన్ పోటోలు చూసి, చంద్రబాబును పొగిడి, తన బాధ్యత తీరిపోయిందని అయిందని అనుకున్నట్లుగా ఉంది చౌహాన్ వ్యవహారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయనతై బాధితులను స్వయంగా చూడలేదు కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. పవన్ ఈ స్థాయిలో బాబుకు లొంగిపోతారని ఊహించ లేదు. గతంలో నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం ఎమ్మెల్యే ఒకరు ఉండేవారు. పవన్ కళ్యాణ్లా లొంగిపోయే వారిపై సామెతలు కొన్ని చెబుతుండేవారు.. ‘‘పొగడరా, పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత’’ అని చెప్పాడని ఎద్దేవ చేసేవారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.ఒక వృద్దురాలు డ్రోన్ ద్వారా నడుం లోతు నీళ్లలో ఆహారపొట్లం అందుకున్నట్లు ఉన్న పోటోను పోస్టు చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ అది కృత్రిమ ఫోటో కావడంతో ఆయన నవ్వుల పాలవయ్యారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో పవన్ తన వ్యాఖ్యను మార్చేశారు. చంద్రబాబుతోపాటు తిరగకుండా ఈయన ఏమి నేర్చుకున్నారో అర్ధం కాదు. చంద్రబాబే అధికార యంత్రాంగం విఫలం అయిందని ఒప్పుకుంటే ఈయన మాత్రం ప్రభుత్వం బాగా పనిచేసిందని గొప్పలు చెబుతున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చి.. అవి అమలయ్యాక జనం వద్దకు వెళ్లడాన్ని కూడా పవన్ తప్పుపట్టిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వరదపీడిత ప్రాంతాలకు వెళితే అధికారుల విధులకు ఆటంకం అవుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు పదే,పదే తిరుగుతూ అధికారులకు ఇబ్బంది కలిగించడం లేదా అని అంటే మాత్రం బాజా వాయిస్తారు.మీడియా తలచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే ,ఆ పక్కగుండా రైలు వెళ్లింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా! చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్లింది. ఆ టైమ్ లో ఆయన చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన రైలు వస్తున్న విషయం గమనించి ,అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డారు. మరి ఇందులో ప్రమాదం ఏమిటో అర్థం కాదు. ఇలా రాయమని చంద్రబాబు చెప్పి ఉండకపోవచ్చు.అయినా అతి భక్తి కల మీడియా ఇలా ప్రచారం చేసిందన్నమాట. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నాయని ఎద్దేవ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో మాట్లాడి కృష్ణా కరకట్టే మీద ఉన్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని రాంబాబు సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది.తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. వరద ప్రాంతాలవారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోను, వరద బాధితులను ఆదుకోవడంలోను విఫలం అవడంతో నాలుగైదు రోజులపాటు ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లలోని సామానంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారుంటే చంద్రబాబు, ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకుని మురిసిపోతున్నారు.వరద బాధితులు అందరికి రేషన్ ఇవ్వలేకపోయామని అంటారు. వారి ఇళ్లకు రేషన్ చేర్చకుండా రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం మాత్రం శోచనీయం. ఇది పెద్ద వైఫల్యం కాదా! అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నేతలు ఒకరినొకరు పొగుడుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. జనం ఈ ప్రచారానికే అన్నీ బాధలు మర్చిపోతారా!- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు
-
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
విజయవాడ వరద బాధితుల కోసం వైఎస్ జగన్ రేషన్ వాహనాలు..
-
చంద్రబాబును బుడమేరులో ముంచిన ఈనాడు
-
విజయవాడ వరద ప్రమాదానికి చంద్రబాబే కారణం
-
ప్రభుత్వం ఫెయిల్ అంటూ, విజయవాడలో వరద బాధితుల ధర్నా
-
చంద్రబాబు వల్లే సహాయక చర్యలు ఆలస్యం: టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు వరదల్లో అల్లాడి పోతుంటే సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వరద్లలో ప్రజల మరణాలకు చంద్రబాబే కారణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, టీజేఆర్ సుధాకర్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కొంచెం కూడా బాధ్యత లేదు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ కాలం గడిపారు. ఆగస్టు 28వ తేదీనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలను కొనుగోలు చేయటం, ముంబై నటి వ్యవహారాల మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారు.సరైన సమయంలో ఎలాంటి నిర్ణయంలో తీసుకోకపోవడం వల్లే ప్రజల అవస్థలకు కారణమయ్యారు. వరదల్లో మరణాలకు చంద్రబాబే కారణం. బుడమేరు ఆధునికీకరణ పనులను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు?. టీడీపీ నేతలకు చెందిన భూములు పోతాయనే కారణంగానే భూసేకరణ కూడా చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణకు చెందిన పవర్ ప్రాజెక్టుకి నష్టం జరుగుతుందనే వరద నీటిని జనం మీదకు వదిలారు. రోజూ చంద్రబాబు అధికారులను వెంటేసుకుని తిరగటం వలనే సహాయ చర్యలు జరగటం లేదు. రాజకీయ క్రీడలను టీడీపీ నేతలు ఆపాలి. అధికార అహంకారంతో మంత్రులు వ్యవహరించవద్దు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.వరదల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్ళీ వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగమే నందిగం సురేష్ను అరెస్టు చేశారు. ఇలాంటివి ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. డైవర్షన్ రాజకీయాలు ఆపి బుడమేరు ముంపు ఎలా తప్పించాలో ఆలోచించండి. వరద రాకముందే చంద్రబాబు సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నారు. మరి జనాన్ని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు?. వరదకంటే ముందే పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోయారు. వారికి బాధ్యత అనేదే లేదా?. అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ఇన్ని రోజులుగా వరద సహాయ చర్యలు ఎందుకు చేపట్టలేదు? అని ప్రశ్నించారు. -
వాళ్ళ టార్గెట్ ఒక్కటే.. చంద్రబాబు నీచ రాజకీయం : MLC Bharath
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
-
వరద బాధితుల చిన్నారి సాయం.. వైఎస్ జగన్ ఫిదా..
-
వరద గుప్పిట్లో సర్వం కోల్పోయి
-
జగన్ కు ప్రాణహాని హైకోర్టుకు నివేదిక
-
చంద్రబాబు బిగ్ ఫెయిల్యూర్..
-
డ్రైనేజీలో బతుకుతున్నట్టుంది..అటు వరద నీరు - ఇటు మురుగు నీరు
-
వరద వస్తుందని ముందే తెలుసు: వెలగలేరు డీఈ మాధవ్
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. బుడమేరు కారణంగా విజయవాడ జల దిగ్భందమైంది. ఈ నేపథ్యంలో బుడమేరు, వరదల గురించి వెలగలేరు డీఈ మాధవ్ సంచలన కామెంట్స్ చేశారు.తాజాగా డీఈ మాధవ్ సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘బుడమేరు వరద మానవ తప్పిదమే. ఫ్లడ్ వస్తుందని మాకు ముందే తెలుసు. శనివారం మధ్యాహ్నమే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాం. గేట్లు తెరవాల్సి వస్తుందని అధికారులకు సమాచారం ఇచ్చాం. 45వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గేట్లు ఎత్తుతాం.. నీళ్లు వదులుతున్నాం అని కూడా చెప్పాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు విజయవాడ వరదలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. ఈ వరదలు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వచ్చినవేనని అన్నారు. ఇది ప్రకృతి విపత్తు కాదు. మానవ తప్పిదమే దీనికి కారణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు ఇలా చేశారని మండిపడ్డారు. విజయవాడ ప్రజలను ఇంతటి ఇబ్బందులకు గురిచేసి, 32 మంది ప్రాణాలను బలితీసుకున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఈ విజనరీ బాబు ఇంట్లో నిద్రపోతా వరదలు ముంచాకే మేల్కొన్నాడు
-
జగన్ను చూసి చిన్నారి భావోద్వేగం.. కన్నీళ్లు తుడిచిన జననేత
-
మీ సీఎంకు ఒక సారి చెప్పండి అంబటి రాంబాబు సెటైర్లు
-
AP: అల్పపీడనం టెన్షన్..
-
తండ్రి,కొడుకులు ఎన్ని కేసులు పెట్టిన తగ్గేదేలే నందిగామ సురేష్ రియాక్షన్
-
వరదబాధితులకు సాయం చేసిన బాలుడికి వైఎస్ జగన్ ప్రశంస
-
5 రోజుల నుండి నరకయాతన తిండి లేదు.. నీళ్లు లేవు..
-
నా 8 ఏళ్ళ కష్టం 30 లక్షలు వరదపాలు.
-
ప్రభుత్వం ముందే హెచ్చరిక చెయ్యాలి కదా మా ఇంట్లో మనిషిని కోల్పోయాం
-
వరద బాధితులకు చిన్నారి అభయ్ రామ్ విరాళం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాలకు వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జన జీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతో డబ్బును విరాళంగా ఇస్తున్నారు.తాజాగా విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం సాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చాడు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్ రామ్ కలిశాడు. ఈ సందర్భంగా విరాళం అందజేశాడు. తన వంతు సాయంగా కిడ్డీ బ్యాంక్లో ఉన్న నగదు రూ. 10వేలను వైఎస్ జగన్కు అందించాడు. వరద బాధితులకు సాయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ డబ్బు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అభయ్ రామ్ను వైఎస్ జగన్ అభినందించారు. భవిష్యత్లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. కాగా, అభయ్ ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్నాడు. విరాళం అందజేసిన సందర్భంగా బాలుడితో అభయ్ రామ్ కుటుంబ సభ్యులు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వైఎస్ జగన్ను కలిశారు.మరోవైపు.. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా పలువురు వైఎస్సార్సీపీ నేతలు కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్సార్సీపీ నేత కట్టా మహేష్ తన వంతు సాయంగా వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్ను వైఎస్ జగన్కు అందజేశారు. -
అధికారం అండతో అదనపు కట్నం కోసం కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత
-
రాజధాని మునిగిందా... లేదా..? అసలు నిజాలు
-
ఏపీలో కేంద్ర బృందం పర్యటన
-
ట్వీట్ చేశాడు.. డిలీట్ కొట్టేశాడు.. ‘పవన్’ దొరికిపోయాడు!
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. సీఎం చంద్రబాబును పైకెత్తబోయి బోల్తా పడ్డారు. వరదల సమయంలోనూ చంద్రబాబు భజన మానలేదు. వరద సహాయ చర్యలపై ఎక్స్లో పెట్టిన ట్వీట్తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యం బయటపడింది.సీఎం చంద్రబాబుని పొగిడేందుకు ఫేక్ ఫోటోలను పవన్ పోస్ట్ చేశారు. ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్.. విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేశారు. ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ విమర్శల పాలయ్యాడు.వరద బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడ పవన్ కల్యాణ్ తీరిగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. విమర్శలు రావడంతో కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులతో కలిసి మానిటరింగ్ నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో తప్పులు కప్పి పుచ్చుకునేందుకు పవన్.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ, అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
#VijayawadaFloods : చెప్పలేనంత కష్టం.. చెప్పుకోలేనంత నష్టం! (ఫొటోలు)
-
Updates: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. హైదరాబాద్లో వర్షం షురూ
Telugu States Heavy Rains Latest News Updates:వరద పరిస్థితిని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరించిన సీఎం చంద్రబాబు.చంద్రబాబు కామెంట్స్..ఊహించని వర్షాలు పడ్డాయి.భారీ వరదలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఈ సమస్యకు కారణాలు.కృష్ణా నది కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి.బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగుతోంది.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజ్ను పటిష్ట పరచాలి.వరదలు వచ్చిన పరిస్థితిని కేంద్రానికి వివరించాం.శివరాజ్సింగ్ కామెంట్స్..ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది.సహాయక చర్యలను చంద్రబాబు చూసుకుంటున్నారు.రైతులు, సామాన్యులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షంహైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది.వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.సాయంత్రం సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, యూసుఫ్గూడ, మెహిదీపట్నం,ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్ సహా తదితర ప్రాంతాల్లో వరద కురుస్తోంది.బుడమేరుకు పెరిగిన వరదబుడమేరులో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది.రామకృష్ణాపురంలోకి చేరిన వరద నీరుఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్లీ కాలనీలోకి వరద నీరు.రెండు అడుగులకు చేరుకున్న వరద నీరువరదల నుంచి ఇప్పుడే తేరుకుంటున్న రామకృష్ణకాలనీ.అంతలోనే వరద వస్తుందటంతో కాలనీవాసుల్లో ఆందోళనభారత్ బయోటెక్ భారీ విరాళంఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళంముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్ వెల్లడించిన భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్లఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్న భారత్ బయోటెక్త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్టు ప్రకటన విడుదల రేపు ఖమ్మంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పర్యటనరేపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లాలో పర్యటనభారీ వర్షాలు, వరదలతో నష్ట పోయిన పంట పొలాల పరిశీలనమధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటనకూసుమంచి మండలం జుజ్జులారావుపేటలో రైతులతో ముఖాముఖికేంద్రమంత్రి పర్యటన వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం!!విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్పై చంద్రబాబుకు తప్పిన ప్రమాదంట్రాక్పై చంద్రబాబు ఉండగానే వచ్చిన రైలు, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బందిరైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయిన సీఎం చంద్రబాబురైలు వెళ్లిపోయిన తర్వాత పర్యటన కొనసాగించిన చంద్రబాబుప్రకాశం బ్యారేజ్ను పరిశీలించిన కేంద్రమంత్రివిజయవాడ ప్రకాశం బ్యారేజ్ను పశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద పరిస్థితులను తెలుసుకుంటున్న కేంద్ర మంత్రిభారీ వర్షాలతో దెబ్బతిన్న పంటను పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులుగుంటూరు:తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గం వరద భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి మెరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుల శివకుమార్వేమూరు ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావుజూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.06 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో : 85 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 77 వేల 739 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 317.910 మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 8.434 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది.వరద బాధితులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆహార పంపిణీవిజయవాడ ముంపు గ్రామాల ప్రజలకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో10,000 వాటర్ బాటిళ్లు12 క్వింటాల పులిహార రైస్విజయవాడలో బాధితులకు పంపిణీభద్రాద్రి కొత్గూడెం జిల్లాభద్రాచలం వద్ద ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి 45.1 అడుగులు వద్ద ప్రవాహం ఏలూరు జిల్లాప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సుచిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహంజాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయంపాదచారులు,ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరికఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద3 గేట్లు ఎత్తి నీటిని విడుదలఇన్ ఫ్లో 15.000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో. 15.000పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17 టీఎంసీలుప్రస్తుత నీటిమట్టం 1404 అడుగులు, 17టీఎంసీలుతప్పులో కాలేసిన పవన్కల్యాణ్విజయవాడ:వరద సహాయ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంఫేక్ ఫోటోలతో అధికారులతో సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్అవ్వే ఫేక్ ఫొటోతో పబ్లిసిటీ చేసుకోబోయిన పవన్ ఎక్స్లో చేసిన ట్వీట్తో బయటపడ్డ అవగాహన రాహిత్యంసీఎం చంద్రబాబుని పొగిదేందుకు ఫేక్ ఫోటోలు పోస్ట్ చేసిన పవన్ ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేసిన పవన్ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసి విమర్శల పాలైన పవన్ కళ్యాణ్మరో అల్ప పీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్ప పీడనంరానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంకోస్తాంధ్ర అంతట విస్తారంగా వర్షాలు పడనున్నాయి.పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులురానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు. ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్లు..కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు.బోట్లు ఢీకొనడంతో డ్యామేజ్ అయిన బ్యారేజ్ 69వ గేటుధ్వంసమైన కౌంటర్ వెయిల్ స్థానంలో మరొకటి ఏర్పాటుకు అధికారుల చర్యలు. విజయవాడ:ఆరు రోజులుగా వరద నీటిలోనే పాయకాపురం,బర్మా కాలనీ వాసులునడుము లోతుకు పైగా ఇళ్ల చుట్టూ వరద నీరుఅరకొరగానే ప్రభుత్వ సహాయక కార్యక్రమాలుఇళ్ల వద్దకే అన్నీ పంపిస్తామని చెప్పిన సీఎంనడుము లోతు నీటిలో కిలోమీటర్ దూరం వెళితేకానీ దొరకని ఆహారం,నీరులోపల కాలనీ వాసులను పట్టించుకోకపోవడం పై వరద బాధితులు ఆగ్రహంసర్వం కోల్పోయామంటున్న వరద బాధితులువరద ఇళ్లల్లోకి చేరడంతో మొదలైన బురద కష్టాలుఇంట్లో వస్తువులు..సర్టిఫికెట్లు తడిచిపోవడంతో ఆందోళనలో వరద బాధితులుతమ కష్టార్జితం బురదపాలైందంటూ ఆవేదనతమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వరద బాధితులు ఏలూరు జిల్లా:ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సుచిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహంజాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయంపాదచారులు, ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరికఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశంఏపీలో కేంద్ర బృందం పర్యటన..వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందంభారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందంనేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్న కేంద్ర బృందంఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న కేంద్ర బృందంభారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి వివరిస్తున్న అధికారులుడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:లంక గ్రామాల ప్రజలకు మరల మొదలైన వరద కష్టాలువరద నీటిలో మునిగిన కనకాయలంక కాజ్ వేచాకలిపాలెం - కనకాయిలంక కాజ్వే మునిగి పోవడంతో నిలిచి పోయిన రాకపోకలు పడవల పైనే ప్రయాణం సాగిస్తున్న లంక ప్రజలుగత నెలలో నెల రోజులు పాటు వరద నీటిలో అవస్థలు పడ్డ లంక గ్రామాల ప్రజలువిజయవాడ: మళ్లీ పెరుగుతున్న వరదఅడుగు మేర పెరిగిన వరదభయాందోళనలో సింగ్నగర్, అజిత్నగర్, వాంబే కాలనీ వాసులుఇప్పటికే 5 రోజులుగా వరద నీటిలోనే ఉన్న ప్రజలువిజయవాడ: వరదల్లో మరణ మృదంగంమరో 15 మంది వరదలకు మృతినిన్న 15 మృతదేహాలు వరదల్లో తేలిన వైనం47 కి చేరిన మృతుల సంఖ్యనాలుగు రోజులు నీట ముంగడంతో గుర్తు పెట్టలేని రీతిలో పలు మృతదేహాలువరద తగ్గడంతో సింగ్ నగర్ నుండి వెళ్లిపోతున్న బాధితులునాలుగు రోజులు నరకం అనుభవించడంతో విజయవాడ వదిలి వెళ్లిపోతున్నా బాధితులుఇళ్లు బురదమయం, కాలనీలు దుర్గంధభరితం కావడంతో వెళ్లిపోతున్నా బాధితులుప్రభుత్వ పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితిప్రభుత్వ సేవలపై నమ్మకం లేక ఊళ్లకు, బంధువుల ఇళ్లకు కట్టు బట్టలతో వెళ్లిపోతున్న బాధితులు40 పునరావాస కేంద్రాలు మూసేసి ప్రభుత్వం3 లక్షల మంది బాధితుల్లో కనీసం 15 వేల మందికి కూడా పునరావాసం కల్పించని ప్రభుత్వంబురద, దుర్గంధమైన ఇళ్ళ ను, కాలనీలు ఫైర్ ఇంజన్ల తో శుభ్రం చేయాల్సిన దుస్థితికార్లు, బైక్ లు, ఆటో లు, ఫ్రీజ్లు, టీవీలు, మంచాలు అన్నీ వరద పాలువరద నీటిలో కలిసిపోయిన డ్రైనేజీలువ్యాధులు ప్రబలుతాయన్న ఆందోళనలో వరద బాధితులుగోదావరికి పెరుగుతున్న వరదధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.70 అడుగుల వరద నీటిమట్టం నమోదుఎనిమిది లక్షల 36 వేల క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరావరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులుమరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంక్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశంవాయుగుండం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశంఉత్తరాంధ్రకు భారీ వర్షసూచననేటి నుంచి 4 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుఆదివారం వరకు మత్స్యకారుల వేటపై నిషేధంవిజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఐదు రోజులుగా జల దిగ్భందంలోనే విజయవాడ ఉంది. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.వరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వీరి గోడు మాత్రం ఆలకించడం లేదు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా పలు మృతదేహాలు నీటిలో తేలియాడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ వాటి లెక్క తేలడం లేదు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎవరూ వెళ్లలేదు.ఆ ప్రాంతంలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఇంకెన్ని శవాలు బురదలో ఉన్నాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులు ప్రైవేటు అంబులెన్స్లలోనే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయలేదు. -
ఏపీలో వరద నష్టం.. కమిటీ వేసిన కేంద్రం
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారుకాగా, అమిత్ షా ట్విట్టర్ వేదికగా..‘విజయవాడ ముంపు, వరదలపై కేంద్ర కమిటీ నియామకం. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో ఈ కమిటీ పర్యటిస్తుంది. వరద నష్టం, వరద నివారణ, డ్యామ్ల భద్రతపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేపు(గురువారం) కమిటీ ఏపీకి రానున్నట్టు సమాచారం. The Modi government is closely monitoring the ongoing flood situation in Andhra Pradesh. The MHA today constituted a central team of experts, led by the Additional Secretary (Disaster Management), MHA. The team will visit the flood-affected areas for an on-the-spot assessment…— Amit Shah (@AmitShah) September 4, 2024 -
బాబూ.. ఇదేనా నీ అనుభవం?
సాక్షి, తాడేపల్లి: బుడమేరు కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుని ప్రజలు బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై ప్రజలు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలపై హెచ్చరించలేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు వరదల్లో చిక్కుకున్న తమకు కనీస సాయం కూడా అందించలేదని మండిపడుతున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు ఇదేనా నీ అనుభవం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.గత నెల 28వ తేదీన ఐఎండీ అలర్ట్ వస్తే ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారా?.ఐఎండీ హెచ్చరికలపై రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారా?.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారా?.వరదలు వచ్చిన తర్వాత ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు బోట్లు, హెలికాప్టర్లను సిద్ధం చేశారా?.వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలు, శిబిరాలకు తరలించే ఏర్పాట్లు జరిగాయా?.శిబిరాల దగ్గర వరద బాధితులకు నీళ్లు, ఆహారం, పాలు అందించే ఏర్పాట్లు చేశారా?.విపత్తు నిర్వహణకు సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నారా?. -
వరద బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
-
రిటైనింగ్ వాల్ లేకుంటే.. పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి
-
నా హయాంలో ఇదే చేశా.
-
చంద్రబాబు ఇలు మునిగిపోతుందని చేసిన పని