బాబూ.. ఇదేనా నీ అనుభవం? | Netizens Questioned CM Chandrababu Over Floods | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇదేనా నీ అనుభవం?

Published Wed, Sep 4 2024 7:28 PM | Last Updated on Wed, Sep 4 2024 8:00 PM

Netizens Questioned CM Chandrababu Over Floods

సాక్షి, తాడేపల్లి: బుడమేరు కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుని ప్రజలు బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై ప్రజలు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలపై హెచ్చరించలేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు వరదల్లో చిక్కుకున్న తమకు కనీస సాయం కూడా అందించలేదని మండిపడుతున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు ఇదేనా నీ అనుభవం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  • గత నెల 28వ తేదీన ఐఎండీ అలర్ట్‌ వస్తే ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారా?.

  • ఐఎండీ హెచ్చరికలపై రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారా?.

  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారా?.

  • వరదలు వచ్చిన తర్వాత ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు బోట్లు, హెలికాప్టర్లను సిద్ధం చేశారా?.

  • వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలు, శిబిరాలకు తరలించే ఏర్పాట్లు జరిగాయా?.

  • శిబిరాల దగ్గర వరద బాధితులకు నీళ్లు, ఆహారం, పాలు అందించే ఏర్పాట్లు చేశారా?.

  • విపత్తు నిర్వహణకు సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నారా?. 
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement