![Tirumala Samachar June 28, 2024: Devotees Crowd, Darshan Latest News](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/28/tirumala_Latess_Telugu_News.jpg.webp?itok=RvbU8023)
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత సర్వ దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి.. బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్న ఉన్నారు. సుమారు 18గం. సమయం పడుతోంది. ఇక టైం స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. మరోవైపు రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 60,782 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 30,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment