టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ | TTD decides to provide house sites to its employees | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

Dec 28 2023 8:29 AM | Updated on Dec 28 2023 2:59 PM

TTD decides to provide house sites to its employees - Sakshi

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు 65,361 దర్శించుకున్నారు.20,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.91 కోట్లు ఆదాయం వచ్చింది.   జనవరి 1 తేది వరకు వైకుంఠ ద్వార దర్శనం 

నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ 
ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేప‌డ‌తాం. మూడో దఫాలో ఏర్పేడు స‌మీపంలోని పాగాలి వ‌ద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగింది.

దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగులంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు అందించిన‌ట్టు అవుతుంది. ఈ ఇళ్ల‌స్థ‌లాల‌ను ప్ర‌భుత్వం నుండి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగుల‌కు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement