
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొత్తం కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం(ఉచిత దర్శనం) కోసం 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న(గురువారం, జులై 20) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,628గా ఉంది. హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లుగా లెక్క తేలింది.
Comments
Please login to add a commentAdd a comment