వందేభారత్‌కు ఏలూరులో హాల్ట్‌ | Vande Bharat has a halt at Eluru | Sakshi
Sakshi News home page

వందేభారత్‌కు ఏలూరులో హాల్ట్‌

Published Fri, Aug 23 2024 5:14 AM | Last Updated on Fri, Aug 23 2024 5:14 AM

Vande Bharat has a halt at Eluru

రైల్వేస్టేషన్‌ (విజయ­వాడ పశ్చిమ): ప్రయా­ణి­కుల సౌక­ర్యార్థం విశాఖపట్నం– సికింద్రా­బాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ (20708/­20707) ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్‌ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధి­కారులు ప్రకటించారు. 

ఈనెల 25 నుంచి సికింద్రా­బాద్‌ వెళ్లే వందేభారత్‌ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్‌ చేరుకుని, 9.50 గంటలకు బయ­లుదేరుతుంది. అదేవిధంగా 26 నుంచి విశాఖ­పట్నం వెళ్లే రైలు సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్‌ చేరుకుని, 5.55 గంటలకు బయలుదేరి వెళుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement