వైఎస్‌ జగన్‌: సీఎంని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి | Vasupalli Ganesh Kumar Meets YS Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి 

Oct 16 2020 10:13 AM | Updated on Oct 16 2020 12:21 PM

Vasupalli Ganesh Kumar Meets CM YS Jagan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ఆయనకు విన్నవించారు. వీటితోపాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పడం సంతోషం అనిపించిందని వాసుపల్లి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సీఎం కోరారని చెప్పారు.  (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం‌ కీలక నిర్ణయం)

Advertisement
 
Advertisement
Advertisement