సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం(ఫిబ్రవరి 4) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ, మేరుగ నాగార్జున, జోగి రమేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వైఎస్ జగన్ సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
వైఎస్ జగన్ ఏమన్నారంటే..
- చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలి
- వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలి
- కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం
- పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను బట్టబయలు చేయాలి
- సూపర్సిక్స్ హామీల అమలుపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టాలి
- ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా బాబు ప్రచారం చేయడంపై మనం నిలదీయాలి
- సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న బాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారు
- చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- బాబు మోసాలను చెప్పడం కోసం రోజూ ప్రజల్లో ఉండాలి
- ప్రజలతో మరింత మమేకం కావాలి
- కేంద్రం వచ్చే అయిదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు అదనంగా పెంచబోతోంది.
- కానీ, చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణం
- రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోత, నిల్చిపోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపైనా జనంలోకి తీసుకెళ్లాలి
- తొమ్మిది నెలల కూటమి పాలన, పేదల వ్యతిరేక పాలనలా మారింది
- దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
- మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల వ్యవహారం దారుణం
- ఇలాంటి అరాచకాలు ఎక్కడా ఎప్పుడూ చూడలేదు
- మెజారిటీ లేని చోట, అసలు ఒక్కోచోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారు
- ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారు
Comments
Please login to add a commentAdd a comment