
పసిడి ప్రియులకు ఊరట కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జూలై 1) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 72,280 వద్ద అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,250, కొనసాగుతన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.
పెరిగిన వెండి ధరలు
దేశవ్యాప్తంగా చాలా రోజుల తర్వాత వెండి ధరల్లో కదలిక వచ్చింది. ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో నేడు వెండి ధర కేజీకి రూ.200 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,700 లకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)