![Gold and Silver Price Today 17 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/gold-.jpg.webp?itok=drOIZMKo)
దేశంలో పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు బుధవారం (జూలై 17) భారీగా పెరిగాయి. మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ.75వేల మార్కును తాకింది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర ఏకంగా రూ.900 ఎగిసింది. దీంతో రూ. 75,000లను తాకింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.980 ఎగిసి రూ.68,750 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే బంగారం ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.68,900 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 పెరిగి రూ.75,150 వద్దకు ఎగిశాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.900 పెరిగి రూ.69,200 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 ఎగిసి రూ.75,490 లకు చేరుకుంది.
ఎగిసిన వెండి ధరలు
దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలతో పాటు వెండి రేటు భారీగా ఎగిసింది. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,00,500 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment