
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ఈరోజు (జూలై 27) ఉన్నంటుండి ఎగిశాయి. దీంతో వరుస తగ్గింపులతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.250 పెరిగి రూ.63,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ. 69,000 వద్దకు ఎగిసింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే ధరలు ఊపందుకున్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.250 హెచ్చి రూ.63,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.69,150 వద్దకు ఎగిసింది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.64,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగి రూ.70,530 వద్దకు హెచ్చింది.
స్థిరంగా వెండి
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది. రెండు రోజులుగా ఇక్కడ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)