![govt announced policies to welcome highly skilled expat engineers to work in the country](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/skill01.jpg.webp?itok=D1LAamWk)
దేశంలో ప్రవాస ఇంజినీర్ల సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్రామిక కొరత సమస్యను పరిష్కరించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అధిక నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్ల(expat engineers)ను దేశంలోకి ఆహ్వానించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో నిపుణుల ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, వివిధ పరిశ్రమల్లో సాంకేతిక పురోగతి మెరుగుపడతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిపుణుల కొరతకు పరిష్కారం
ఇంజినీరింగ్ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాంకేతిక అభివృద్ధి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లను దేశంలోకి ఆహ్వానించడం ద్వారా ఈ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులు సకాలంలో, అత్యున్నత ప్రమాణాలతో పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: వేసవి కాలం కంపెనీలకు లాభం!
ప్రభుత్వ చర్యలు ఇలా..
ప్రవాస ఇంజినీర్లు భారత్లో పనిచేయడానికి వీలుగా వీసా ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. నిపుణులు అనవసరమైన ఆలస్యం లేకుండా శ్రామిక శక్తిలో భాగమయ్యేలా చర్యలు చేపడుతోంది. ప్రతిభావంతులను ఆకర్షించడానికి మెరుగైన జీతాలు, పునరావాసం, గృహ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. భాషా శిక్షణ, సాంస్కృతిక ఓరియెంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న శ్రామిక శక్తిలో నైపుణ్య అంతరాలను గుర్తించడానికి పరిశ్రమ నాయకులతో కలిసి పనిచేస్తోంది. ప్రవాస ఇంజినీర్లు అవసరాలకు తగిన విధంగా స్థానికులకు శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంజినీర్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అధునాతన ఇంజినీరింగ్ పనులకు అవసరమైన వనరులను అందించే అత్యాధునిక సౌకర్యాలు, పరిశోధనా కేంద్రాలు, టెక్నాలజీ పార్కుల అభివృద్ధి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment