కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్‌ | Sakshi
Sakshi News home page

కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్‌

Published Fri, Nov 12 2021 4:57 AM

Govt receives Rs 566 crore as dividend tranches from 3 CPSEs - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.16,517.24 కోట్ల డివిడెండ్‌ లభించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. తాజాగా సెయిల్‌ నుంచి రూ.483 కోట్లు, మాంగనీస్‌ ఓర్‌ ఇండియా నుంచి రూ.63 కోట్లు, ఎంఎస్‌టీసీ నుంచి రూ.20 కోట్ల డివిడెండ్‌ అందినట్లు తుహిన్‌ కాంత పాండే వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement