ICICI Bank: Hikes Credit Card Charges With Effect From February 10, Details Inside - Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాక్‌..!

Published Mon, Jan 10 2022 3:05 PM | Last Updated on Mon, Jan 10 2022 3:59 PM

ICICI Bank Hikes Credit Card Charges With Effect From February 10 - Sakshi

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు కూడా ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపింది. ఇక నుంచి క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. 

ఫిబ్రవరి 10, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ మీద లావాదేవీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తామని ఐసీఐసీఐ పేర్కొంది. అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త క్రెడిట్ ఛార్జీలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

పైన పేర్కొన్న చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే ఈఎమ్ఐ మార్చుకోవడం లేదా రుణం తీసుకొని చెల్లిస్తే మంచిది అని నిపుణులు అంటున్నారు.

(చదవండి: దుబాయ్‌ దూకుడు.. సాహసోపేత అడుగులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement