బేర్ ఉడుము పట్టు.. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు | Indices extend losses, Nifty around 17800 | Sakshi
Sakshi News home page

బేర్ ఉడుము పట్టు.. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

Published Thu, Jan 20 2022 11:26 AM | Last Updated on Thu, Jan 20 2022 11:26 AM

Indices extend losses, Nifty around 17800 - Sakshi

ముంబై: బేర్ ఉడుము పట్టు పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ట్రేడింగ్‌ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ కూడా 18వేల దిగువన ట్రేడ్‌ అవుతోంది. 

ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501.12 పాయింట్లు నష్టపోయి 59,597.70 వద్ద.. నిఫ్టీ 130.15 పాయింట్ల క్షీణించి 17,808.25 వద్ద కొనసాగుతున్నాయి. నిప్టీలో టాటా కన్ఫ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్యూ స్టీల్‌, అల్బాటెక్‌ సిమెంట్‌ షేర్లు రాణిస్తుండగా.. ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్తే, సిష్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

(చదవండి: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement