NSE Nifty
-
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్యూఎల్, యాక్సిస్, పవర్గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్నిచ్చాయి. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి. చివరి దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దలాల్ స్ట్రీట్ ముందుగా దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్ఐసీ, ఐఆర్టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. ఎన్నికల ఓటింగ్ శాతంపై దృష్టి దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జపాన్ మే కన్జూమర్ కన్ఫిడెన్స్ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్ ఏప్రిల్ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్ నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్పీఐలు రూ.178 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్లో రూ.2,009 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్అండ్గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్అండ్గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్అండ్గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్సెషన్ నుంచి ఆయిల్అండ్గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
5 కంపెనీల్లో రూ.1,67,936 కోట్ల ఆవిరి
ముంబై: మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి 10 కంపెనీల్లో అయిదింటి విలువ గతవారం భారీగా క్షీణించింది. గడిచిన వారం రోజుల్లో ఈ అయిదు కంపెనీల మార్కెట్ విలువ రూ.1,67,936 కోట్లు హరించుకుపోయాయి. గతవారం సెన్సెక్స్ 1,144 పాయింట్లు (1.57%) నష్టపోయింది. ఈ నెల 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సాధారణ ట్రేడింగ్ నిర్వహించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీవీఎస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. ► అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో ఈ షేరు బుధ, గురు, శుక్రవారాల్లో 12% నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్ లో తిరిగి పుంజుకుని 0.54% లాభ పడింది. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,199.35 కోట్లు నష్టపోయి రూ.18,35,665.82 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీలివర్ (హెచ్ యూఎల్) మార్కెట్ క్యాప్ రూ.17,845.15 కోట్ల పతనంతో రూ.5,80,184.57 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,720.6 కోట్లు కోల్పోయి రూ.14,12,613.37 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,008.04 కోట్లు నష్టపోయి రూ.5,63,589. 24 కోట్ల వద్ద ముగిసింది. ► ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎస్బీఐని దాటేయడంతో పాటు దేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.26,380.94 కోట్లు పెరిగి రూ.6,31, 679.96 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,170.75 కోట్లు పుంజుకుని రూ.6,84,305.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,163.72 కోట్లు పెరిగి రూ.7,07,373.79 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,058.48 కోట్లు పుంజుకుని రూ.5,84,170.38 కోట్లకు పెరిగింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్టీఐమైండ్ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
దలాల్ స్ట్రీట్లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్అండ్టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
70,000 వాలా!
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీలో భాగంగా సెన్సెక్స్ సరికొత్త మైలురాయిని తాకింది. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 70,000 పాయింట్లను తాకింది. మరో సూచీ నిఫ్టీ 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచింది. కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది., ఆర్బీఐ వరుసగా అయిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు దేశీయ వృద్ధి అవుట్లుక్ను పెంచింది. అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. దీంతో కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్లో కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) నిర్ణయాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఒడిదుడుకులున్నా.., సరికొత్త శిఖరాలకు .... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 69,926 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 20,965 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లకు రాణించడంతో ప్రథమార్ధంలోనే 232 పాయింట్లు పెరిగి 70,000 స్థాయిపై 70,058 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 21,026 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ద్వితీయార్ధంలో రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు కొంతమేర లాభాలు కొల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో 20,997 నిలిచింది. ‘‘కొత్త ఏడాదికి సరిగ్గా 20 రోజుల ముందు సెన్సెక్స్ 70 వేల పాయింట్ల ధమాకా ఇచి్చంది. అయితే నేడు(మంగళవారం) అమెరికా, భారత్ల నవంబర్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరో ఏడాది కాలంలో సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ప్రభుత్వ రంగాల షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం వహించవచ్చు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కొంత అస్థిరతర ఉండొచ్చు.’’ అని మార్కెట్ నిపుణుడు విజయ్ కేడియా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నిధుల సమీకరణ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టింగ్ ప్రణాళికల నేపథ్యంలో స్పైస్జెట్ షేరు. బీఎస్ఈలో 10%పైగా లాభపడి రూ.60.57 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 16% ఎగసి రూ.63.69 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► అమెరికా నియంత్రణ సంస్థ హైదరాబాద్ రీసెర్చ్ ఫ్యాకల్టీ యూనిట్కు 3 అభ్యంతరాలు జారీ చేయడంతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5% నష్టపోయి రూ.5,473 వద్ద స్థిరపడింది. ► ఓఎన్జీసీ నుంచి రూ.1,145 కోట్ల ఆర్డరు దక్కించుకోవడంతో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ షేరు 3% పెరిగి రూ.2118 వద్ద నిలిచింది. ► సెన్సెక్స్ 65,000 స్థాయి నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు కేవలం 110 రోజుల సమయం పట్టింది. ► 1979లో 100 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 వేల స్థాయికి చేరుకుంది. అంటే 44 ఏళ్లలో సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు 700 రెట్ల లాభాలు పంచింది. ► సెన్సెక్స్ కొత్త రికార్డు స్థాయి నెలకొల్పడంతో సోమవారం రూ.1.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.351.09 లక్షల కోట్లకు చేరింది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. హెచ్డీఎఫ్సీ వీలినం, గిఫ్ట్నిఫ్టీ ఇండెక్స్ కార్యకలాపాల ప్రారంభం(సోమవారం) అంశాలు కీలకం కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. గతవారంలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు, నిఫ్టీ 524 చొప్పున లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా వర్షపాత నమోదు, ప్రోత్సాహకర ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, హెచ్డీఫ్సీ–హెచ్డీఫ్సీ బ్యాంక్ విలీనం నుంచి సానుకూల అప్డేట్ అంశాల నేపథ్యంలో గతవారం సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత నెలకొని ఉన్న సానుకూల పరిమాణాల దృష్ట్యా సూచీలు స్వల్పకాలం పాటు ముందుకే కదిలే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 19250–19500 స్థాయిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడే వీలుంది. దిగువ స్థాయిలో 19000 వద్ద బలమైన తక్షణ మద్దతును కలిగి ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా మార్కెట్ శనివారం విడుదలైన ఆటో కంపెనీల జూన్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇవాళ భారత, అమెరికా దేశాల జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. దేశీయ సేవారంగ పీఎంఐ, అమెరికా మే ఫ్యాక్టరీ ఆర్డర్లు డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. యూరోజోన్, యూకే దేశాలూ ఇదే వారంలో తయారీ, సేవారంగ డేటాలను విడుదల చేయనున్నాయి. శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావం చూపగలవు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జూన్లో మొత్తం రూ. 47,148 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రికార్డు స్థాయిని చేరుకోగలిగాయి. ‘‘భారత ఈక్విటీ మార్కెట్పై ఎఫ్ఐఐలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోవిడ్ అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం నేపథ్యంలో ఈ ఏడాది తొలి రెండు నెలలు భారత్లో విక్రయించి, చైనాలో కొనుగోలు చేశారు. అయితే ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందనేందుకు సూచికగా వెలువడి ఆర్థిక డేటాతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని వీకే విజయ్ కుమార్ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
64,000 బుల్ 19,000 కొత్త రికార్డుల్..!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ట్రేడింగ్లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్లో 44,508 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది. -
5 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు, ఉపశమించిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ దూకుడు చూపాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్చేసి 62,346కు చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 18,399 వద్ద నిలిచింది. వెరసి గతేడాది డిసెంబర్ 14 తర్వాత తిరిగి మార్కెట్లు గరిష్టాలకు చేరాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహానికితోడు.. ఏప్రిల్లో టోకు ధరలు మైనస్కు చేరడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్సెషన్కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు పురోగమించి 62,563కు చేరింది. నిఫ్టీ 18,459ను తాకింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 4.3 శాతం జంప్చేసింది. రిటైల్, టోకు ధరలు తగ్గడంతో వడ్డీ రేట్లకు చెక్ పడనున్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 2–0.7 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యథాతథంగా నిలిచింది. రియల్టీ కౌంటర్లలో శోభా 11.5 శాతం దూసుకెళ్లగా.. డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా 7.4–3.4 శాతం మధ్య జంప్ చేశాయి. టాటా మోటార్స్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, టాటా మోటార్స్ 3 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, ఐషర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అదానీ ఎంటర్, సిప్లా, బీపీసీఎల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, మారుతీ, అదానీ పోర్ట్స్, టీసీఎస్ 3–0.7 శాతం మధ్య నీరసించాయి. చిన్న షేర్లు ఓకే మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ కనిపించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,856 లాభపడితే, 1,802 డీలాపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) సోమవారం మరింత అధికంగా రూ. 1,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్పీఐలు రూ. 23,152 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! విదేశీ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ 0.25 శాతం బలపడి 74.34 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు నీరసించి 82.31కు చేరింది. సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్లు మళ్లీ ప్రారంభం స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ తాజాగా సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్లను సోమవారం పునఃప్రారంభించింది. ఈ కాంట్రాక్టులకు సంబంధించిన ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజును తగ్గించడంతో పాటు ఎక్స్పైరీ రోజును కూడా గురువారం నుంచి శుక్రవారానికి మార్చినట్లు సంస్థ ఎండీ సుందరరామన్ రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. సెన్సెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజు 15 నుంచి 10కి, బ్యాంకెక్స్ లాట్ సైజును 20 నుంచి 15కి తగ్గించారు. అధిక రాబడులిచ్చేందుకు ఆస్కారమున్న అత్యంత రిస్కీ సాధనాలుగా డెరివేటివ్స్ను పరిగణిస్తారు. 2000లో బీఎస్ఈ తొలిసారిగా సెన్సెక్స్–30 డెరివేటివ్స్ (ఆప్షన్స్, ఫ్యూచర్స్)ను ప్రవేశపెట్టింది. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది. -
Sensex: ఆఖరి గంటలో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో ఇంధన, టెలికాం, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభం తర్వాత కొద్దిసేపు ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ తర్వాత సానుకూలంగా కదిలాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి గంటవరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించి పరిమిత లాభాలతో ట్రేడింగ్ను ముగించాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,587 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 347 పాయింట్ల పరిధిలో 59,490 వద్ద కనిష్టాన్ని, 59,837 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 66 పాయింట్లు లాభపడి 59,632 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,584 – 17,684 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఆరు పాయింట్లు స్వల్ప లాభంతో 17,624 వద్ద నిలిచింది. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, కమోడిటీ, ఐటీ, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 82.14 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,169 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.833 కోట్ల షేర్లను అమ్మేశారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించడంతో బ్రోకరేజ్ దిగ్గజం ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.80 వద్ద లాకయ్యింది. ► క్యూ4 పలితాలు మెప్పించకపోవడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 5% పడి రూ. 439 వద్ద స్థిరపడింది. -
తొమ్మిదో రోజూ లాభాలే
ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు, అవుట్లుక్పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
వారాంతాన బుల్ రంకెలు
ముంబై: దలాల్ స్ట్రీట్లో వారాంతాన బుల్ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో శుక్రవారం స్టాక్ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది. చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజంతా లాభాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్ జీక్యూజీ పాట్నర్ అదానీ గ్రూప్నకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్ తెలపడంతో ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు.. ► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్నర్స్ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్ 10%, అంబుజా సిమెంట్స్ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), అల్ట్రాటెక్ (1%), ఏషియన్ పేయింట్స్ (0.19%), నెస్లే లిమిటెడ్ (0.17%) మాత్రమే నష్టపోయాయి. ► ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి
ముంబై: దేశీయంగా నెలకొన్న సానుకూల పరిణామాల దృష్ట్యా ఈ వారంలోనూ స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువపై దృష్టి సారించవచ్చంటున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం(నంబర్ 6న) సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఇంగ్లాండ్లు కఠిన ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపినప్పటికీ.., దేశీయ కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం, భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆశావహ ధృక్పథంతో గతవారంలో సూచీలు రెండు శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 991 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్లు బలపడ్డాయి. ‘‘రెండు వారాల పాటు స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్ షేర్లలో తాజాగా కొనుగోళ్లు నెలకొన్నాయి. దీంతో సూచీలు క్రమంగా రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. అన్ని రంగాల్లో మూమెంటమ్ కన్పిస్తున్నందున.., స్థిరీకరణలో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,200 స్థాయి వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,900–18,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్పై సైనిక చర్యను తీవ్రతరం చేసే ప్రయత్నాల్లో భాగంగా రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే వీలుందనే వార్తలు ప్రపంచ మార్కెట్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. చైనా జీరో కోవిడ్ విధానంపై డ్రాగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఇక చైనా అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా రేపు(మంగళవారం), అమెరికా అక్టోబర్ ద్రవ్యోల్బణం గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం బ్రిటన్ జీడీపీ, యూఎస్ కన్జూమర్ సెంటిమెంట్ డేటా వెల్లడి అవుతాయి. తొలివారంలో రూ.15,280 కోట్లు పెట్టుబడులు గడిచిన రెండు నెలల్లో నికర అమ్మందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్ తొలి వారంలో దేశీయ మార్కెట్లో రూ.15,280 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి అనూహ్యంగా రూ.2,410 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఎఫ్పీఐలు అక్టోబర్లో రూ.1,586 కోట్లు, సెప్టెంబర్లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. ఈ ఏడాదిలో నికరంగా 1.53 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 85కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ముందుగా నేడు మార్కెట్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, పేటీఎం, గోద్రేజ్ కన్జూమర్, పీఐ ఇండస్ట్రీస్, భాష్, పిడిలైట్ ఇండస్ట్రీస్, స్టార్ హెల్త్, జొమాటో అదానీ పవర్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. -
స్పందన స్ఫూర్తి వివాదానికి ముగింపు..సెబీకి రూ.25లక్షలు చెల్లింపు
న్యూఢిల్లీ: నియంత్రణ పరమైన నిబంధనల అమలులో విఫలమైన కేసును స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ పరిష్కరించుకుంది. సెబీకి రూ.25 లక్షలు చెల్లించడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలికింది. ‘‘ప్రతిపాదిత ఉల్లంఘనల ఆరోపణల విషయంలో పరిష్కారానికి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సెబీని సంప్రదించింది. సెబీ గుర్తించిన వాస్తవాలను అంగీకరించ లేదు. అలా అని తిరస్కరించ లేదు. నిబంధనల అమలులో వైఫల్యాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న చర్యలపై దరఖాస్తుదారుతో పరిష్కారం కుదిరింది’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 2015 ఏప్రిల్ నుంచి ఆర్బీఐ వద్ద నమోదిత సంస్థగా ఉంది. 2019 ఆగస్ట్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఐపీవో ద్వారా లిస్ట్ అయింది. ఆడిటర్ విషయంలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్థ, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ డిస్క్లోజర్ నిబంధనల అమలులో విఫలమైందన్నది సెబీ ఆరోపణగా ఉంది. -
ఈ ప్రకటనలు నమ్మొద్దు.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరిక
ముంబై: ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఎయిమర్స్ ట్రేడర్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘సురజ్ మౌర్య అనే వ్యక్తి ఎయిమర్స్ ట్రేడర్ పేరుతో టెలిగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టి మోసవద్దు. దీనికి ఎక్ఛేంజీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో ఈ ఆగస్టులో రియల్ ట్రేడర్, గ్రో స్టాక్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్లను సైతం స్టాక్ ఎక్ఛేంజీ నిషేధించింది. -
ఫ్లాట్గా దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఆయా కార్పొరేట్ కంపెనీల వార్షిక ఫలితాలు , చమురు ధరలు దిగిరావడంతో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు సిద్ధమయ్యారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సెన్సెక్స్ అత్యంత స్వల్పంగా 10 పాయింట్లు నష్టపోయి 60287 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ కేవలం 3పాయింట్ల నష్టపోయి 39527పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక అదానీ పోర్ట్,టెక్ మహీంద్రా,లార్సెన్, కొటక్ మహీంద్రా,ఇన్ఫోసిస్,హెచ్సీఎల్ టెక్, విప్రో, ఎథేర్ మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, శ్రీరామ్ సిమెంట్,టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,హెడ్ఎఫ్సీ లైఫ్,అపోలో హాస్పటల్,కోల్ ఇండియా, సన్ ఫార్మా,బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
‘ఈ టిప్స్ పాటిస్తే స్టాక్ మార్కెట్లో మీరే మెగాస్టార్లు!’
1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ ఝున్ఝున్వాలా మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఓ సందర్భంల్లో స్టాక్ మార్కెట్లో రాణించేందుకు ఆయన చెప్పిన విజయ సూత్రాల్ని ఒక్కసారి చూద్దాం. ► మహిళలు, మార్కెట్లు, మరణం, వాతావరణం గురించి ఎవరూ అంచనా వేయలేరు. ► కెరటాలకు ఎదురెళ్లండి. అంతా అమ్మేస్తున్నప్పుడు కొనండి, అంతా కొంటున్నప్పుడు అమ్మేయండి. ► నష్టాలకు సిద్ధపడి ఉండండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు జీవితంలో నష్టాలు కూడా భాగమే. ► మార్కెట్ను గౌరవించండి. ఎంత ఒడ్డాలి. నష్టపోతే ఎప్పుడు తప్పుకోవాలి గుర్తెరగాలి. బాధ్యతగా ఉండాలి. ► అసమంజసమైన వేల్యుయేషన్లలో ఇన్వెస్ట్ చేయొద్దు. ప్రస్తుతం వెలుగులో ఉన్న కంపెనీల వెంట పరుగులు తీయొద్దు. ► తొందరపాటు నిర్ణయాలు ఎల్లప్పుడూ నష్టాలే తెచ్చిపెడతాయి. తగినంత సమయం తీసుకుని, అధ్యయనం చేశాకే ఏ షేరులో ఇన్వెస్ట్ చేయాలి. ► ఎల్లప్పుడూ స్టాక్ మార్కెట్లే కరెక్ట్. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చోవద్దు. ► భావోద్వేగాలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, కచ్చితంగా నష్టాలే మిగులుతాయి. ► నష్టాలను భరించే సత్తా లేకపోతే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందలేరు. ► సమర్ధమైన, పోటీతత్వం ఉన్న మేనేజ్మెంట్ గల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ► మంచి ట్రేడరు, ఇన్వెస్టరుగా ఉండదల్చుకుంటే.. రెంటినీ వేర్వేరుగానే ఉంచాలి. ► ట్రేడింగ్ చేయాలంటే మనిషి తన అహాన్ని తగ్గించుకోగలగాలి. అలాంటి సామర్థ్యాలు చాలా కొద్దిమందికే ఉంటాయి. కాబట్టే 10 లక్షల మందిలో 9.99 లక్షల మంది నష్టపోతుంటారు. అందుకే ట్రేడింగ్ చేయొద్దన్నది నా వ్యక్తిగత సలహా. ► ఆర్థికవేత్తల మాటలను పట్టించుకుని ఉంటే నేను ఇంత సంపద ఆర్జించి ఉండేవాణ్ని కాను. ► మార్కెట్ అసంబద్ధమైనదని, మీరే శ్రేష్ఠమైన వారు అని మీకు మీరు అనుకుంటే తప్పుల నుంచి ఎన్నటికీ నేర్చుకోలేరు. చదవండి👉 రాకేష్ ఝున్ఝున్వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు! -
రాకేష్ ఝున్ఝున్వాలా మాటే పెట్టు'బడి'..!
కంపెనీల ఎంపిక... ఝున్ఝున్వాలా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారంటే స్టాక్ మార్కెట్లో ఎంతో మంది ఇన్వెస్టర్లకు అది అనుసరణీయంగా మారుతుందనడంలో అతిశయోక్తి కాదు. మరో ఆలోచన లేకుండా అవే కంపెనీల్లో పెట్టుబడి పెట్టి గుడ్డిగా అనుసరించే వారూ ఉన్నారు. కానీ, ఎవరైనా స్వీయ అధ్యయనంతో పెట్టుబడి పెట్టినప్పుడే దాన్ని కొనసాగించగలరు. పెట్టుబడికి ముందు ఒక కంపెనీకి సంబంధించి ఎన్నింటినో ఝున్ఝున్వాలా చూస్తారు. ఎదుగూ, బొదుగూ లేని వ్యాపారంతో కూడిన క్రిసిల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? అన్నది అప్పట్లో చాలా మంది నిపుణులు, ఇన్వెస్టర్లకు అర్థం కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా వృద్ధి సాధిస్తుంటే, విశ్వసనీయమైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల సేవలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. అదే నిజమైంది. రేటింగ్ ఏజెన్సీ మార్కెట్లో ఇప్పటికీ క్రిసిల్ లీడర్. 2002లో రూ.200 పెట్టి ఒక్కో క్రిసిల్ షేరు కొంటే, దాని విలువ ఇప్పుడు రూ.3,250. అన్ని సందర్భాల్లో ‘రైట్’ కానక్కర్లేదు విజయవంతమైన ఇన్వెస్టర్లు ఆచితూచి, సరైన స్టాక్స్ ఎంపిక చేసుకుంటారని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ, ఎంతో తలపండిన వారెన్ బఫెట్ దగ్గర్నుంచి ఝున్ఝున్వాలా వరకు స్టాక్స్ పెట్టుబడుల్లో ఎదురుదెబ్బలు సహజం. కనుక వైఫల్యాలను ఆమోదించి, పాఠాన్ని నేర్వడమే ఇన్వెస్టర్ చేయాల్సింది. ఝున్ఝున్వాలా ట్రాక్ రికార్డును పరిశీలిస్తే డిష్ టీవీ, డీహెచ్ఎఫ్ఎల్, మంధన రిటైల్ వెంచర్స్ ఇవన్నీ పెట్టుబడులను హరించివేసినవి. ఆయన పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న జియోజిత్ ఫైనాన్షియల్, బిల్కేర్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ ఇలా చాలా కంపెనీలు విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అదే సమయంలో ఝున్ఝున్వాలా పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీల్లో మిగిలినవి గొప్ప రాబడులను ఇచ్చాయి. అందుకే ఆయన నష్టపోయిదానికంటే కూడబెట్టుకున్నది ఎక్కువ. టైటాన్ ఒక్కో షేరును రూ.5 కొనుగోలు చేశారు. నేడు అదే షేరు ధర రూ.2,472. ఈ ఒక్క పెట్టుబడి రాకేశ్ ఝున్ఝున్వాలా మొత్తం స్టాక్ మార్కెట్ జర్నీలో నష్టాలను పూడ్చేసి, అదనపు సంపదను తెచ్చిపెట్టింది. కనుక తప్పిదాలను గుర్తించి, అవసరమైతే ఆ కంపెనీల నుంచి తప్పుకోవడం, రానున్న రోజుల్లో సంపద సృష్టికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెట్టడం కీలకం. ట్రేడింగ్/ఇన్వెస్టింగ్... చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ వేర్వేరు అని భావించరు. నిజానికి ఈ రెండూ విరుద్ధమైనవి. వీటికి అనుసరించే సూత్రాలూ భిన్నమైనవే. రాకేశ్ రూ.5,000తోనే ఇంతటి సంపద సాధించగలిగారా..? కాదు. పెట్టుబడికి నిధి కావాలి. ఆ విషయం ఝున్ఝున్వాలా త్వరగానే గుర్తించారు. మంచి పెట్టుబడి నిధి కోసం ఆయన ఆరంభంలో దశాబ్దం పాటు ట్రేడింగ్ను వృత్తిగా మలుచుకున్నారు.ఎదురుదెబ్బలు తగిలినా, కిటుకులు పట్టుకున్నారు. భారీ నిధితో పాటు, మార్కెట్ గురించి మంచి విజ్ఞానాన్నీ సంపాదించారు. ట్రేడింగ్ స్వల్పకాల రాబడిని ఇస్తుందని.. స్టాక్స్లో పెట్టుబడి పెడితే, దీర్ఘకాల సంపదగా మారుతుందని ఆయన చెప్పేవారు. అధ్యయనం/ప్యాషన్... జీవితం అంటే పశ్చాత్తాపాలు కాదు.. ప్రతి తప్పిదం నుంచి నేర్చుకునే మజిలీ అని ఝున్ఝున్వాలా చెబుతారు. తప్పులే తనను మెరుగైన ఇన్వెస్టర్గా మార్చాయని ఆయన స్వయంగా చెప్పారు. వేరే వారిని గుడ్డిగా అనుసరించి ఇన్వెస్ట్ చేయడం విజయాన్ని ఇవ్వదు. ఎవరికి వారు మార్కెట్ను అధ్యయనం చేయాలి. ప్రముఖ ఇన్వెస్టర్లు చేసిన తప్పులు, వారి విజయానికి దోహదం చేసిన అంశాలను నేర్చుకోవాలి. దీనివల్ల మరింత పరిణతితో లాభాలు పెంచుకోవడం సాధ్యం. రాకేశ్కు స్టాక్స్లో పెట్టుబడి అంటే ఓ ప్యాషన్. ఆయన సంపదలో 99 శాతం స్టాక్స్లోనే ఉందంటే ఈక్విటీల పట్ల ఆయనకున్న విశ్వాసం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘మార్కెట్లో సంపద కూడబెట్టుకోవాలంటే సొంతంగా పరిశోధన చేయాలి. నేర్చుకోవడాన్ని అభిరుచిగా మార్చుకోవాలి’ అని ఆయన సూచిస్తారు. నమ్మకం ఉంచాలి.. సరైన అవకాశం అని భావించినప్పుడు భారీగా పెట్టుబడి పెట్టడం ఝున్ఝున్వాలా విధానం. 1980ల్లో సెసాగోవా (ఇప్పుడు వేదాంతలో భాగం) అనే ఐరన్ఓర్ కంపెనీ షేరు రూ.24–25లో ఉన్న సందర్భంలో రాకేశ్ ఝున్ఝున్వాలా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఐరన్ఓర్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉన్న రోజులవి. కానీ, ఆ కంపెనీలో ఎంతో విలువ దాగుందని ఆయన భావించి పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ, అదే షేరు తర్వాతి కాలంలో ఎన్నో రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టైటాన్లోనూ అంతే. కంపెనీ అంతర్గత విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంటే అలాంటి కంపెనీలను ఝున్ఝున్వాలా విస్మరించరు. 2020 మార్కెట్ పతనంలో టాటా మోటార్స్ షేరు రూ.65కు పడిపోయింది. మార్కెట్ విలువ రూ.24,000 కోట్లకు దిగొచ్చింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్తోపాటు, రూ.2,00,000 కోట్ల అమ్మకాలు కలిగిన కంపెనీ ఇంత తక్కువలో ట్రేడ్ అవ్వడం చాలా చౌక అని భావించి ఎక్స్పోజర్ తీసుకున్నారు. అక్కడి నుంచి టాటా మోటార్స్ ఏడు రెట్లకు పైగా పెరిగింది. సహనం ఓర్పు అన్నది ఈక్విటీ మార్కెట్లో రెండువైపులా పదునైన కత్తి వంటిది. మంచి యాజమాన్యం, ఆర్థిక బలం, కంపెనీ ఉత్పత్తి లేదా సేవల పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఇలాంటి ఎన్నో బలాలున్న కంపెనీని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టామంటే.. మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ, అంచనాలు నిజమై మంచి రాబడినిచ్చే వరకు ఆగే ఓపిక కూడా ఉండాలి. ‘స్టాక్ మార్కెట్ ఓపిక లేని వాడి పెట్టుబడిని తీసుకెళ్లి ఓపిక వహించిన వాడికి రాబడిగా ఇస్తుంది’అన్నది వారెన్ బఫెట్ చెప్పేమాట. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్ది రాబడికే విక్రయించడం, బాగా నష్టం వచ్చిందని వెంటనే విక్రయించి బయటపడడం సక్సెస్ను ఇవ్వదు. రాకేశ్ ఝున్ఝున్వాలా పెట్టుబడుల ప్రయాణాన్ని గమనిస్తే చాలా స్టాక్స్లో ఆయన దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినట్టు తెలుస్తుంది. తాను కొనుగోలు చేసింది వ్యాపారాన్నే కానీ, స్టాక్ను కాదని ఆయన నమ్ముతారు. కంపెనీ పనితీరు బాగుండి, ఆర్థిక మూలాలు బలంగా ఉన్నంత కాలం.. భవిష్యత్తు బాగుంటుందన్న విశ్వాసం ఉన్నంత కాలం ఆ పెట్టుబడులను ఓపిగ్గా కొనసాగిస్తారు. అదే రూ.5లో కొన్న టైటాన్ స్టాక్ రూ.2,500 అయినా అమ్మకుండా ఆయన్ను కొనసాగించేలా చేసింది. చదవండి👉 ఈ టిప్స్ పాటిస్తే స్టాక్ మార్కెట్లో మీరే మెగాస్టార్లు : రాకేశ్ ఝున్ఝున్వాలా -
మళ్లీ 59 వేల పైకి సెన్సెక్స్!
ముంబై: ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం ఒక శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 515 పాయింట్లు పెరిగి 59,333 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 తర్వాత ఈ సూచీ 59 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ 124 పాయింట్లు బలపడి 17,659 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 503 పాయింట్లు పెరిగి 59,320 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 17,711 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. మార్కెట్ను ప్రభావితం చేసే ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో కొంత మేర లాభాలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,298 కోట్ల షేర్లను కొనడంతో పదోరోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.730 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో జపాన్, యూరప్లో బ్రిటన్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. లాభాలు ఎందుకంటే... అమెరికా జూలై ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయి. దీంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే సమీక్షా సమావేశాల్లో కఠినతర ద్రవ్య పాలసీ వైఖరికి స్వస్తి పలుకుతూ.., వడ్డీరేట్లపై దూకుడు విధానాన్ని ప్రదర్శించకపోవచ్చనే ఆశావహ అంచనాలు మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు తగ్గడం, క్రూడ్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు పదోరోజూ దేశీయ ఈక్విటీలను కొనేందుకు మొగ్గుచూపడం తదితర అంశాలను నుంచీ సానుకూల సంకేతాలను అందాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦బ్యాంకింగ్ షేర్ల ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకు రెండుశాతం పెరిగి రూ.866 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. 6 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్ ముగిసే సరికి షేరు 1.5% లాభంతో రూ.859 వద్ద ముగిసింది. ♦జూన్ క్వార్టర్ ఫలితాలు మెప్పించడంతో కోల్ ఇండియా షేరు ఇంట్రాడేలో మూడుశాతం లాభపడి రూ.226 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. అనంతరం లాభాల స్వీకరణతో చివరికి అరశాతం స్వల్ప లాభపడి రూ.219 వద్ద స్థిరపడింది. ♦కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం రెండు రెట్లు వృద్ధి చెందడంతో ఐషర్ మోటార్స్ షేరు 3% పైగా రాణించి రూ.3261 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి అర శాతం లాభంతో రూ.3,175 వద్ద నిలిచింది. రూపాయి బలహీన ధోరణి... డాలర్ మారకంలో రూపాయి బలహీనత ధోరణిని ప్రతిబింబిస్తూ గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ 37 పైసలు నష్టపోయి 79.62 వద్ద ముగిసింది. దేశంలోకి క్యాపిటల్ఇన్ఫ్లోస్, ఈక్విటీ మార్కెట్ల సానుకూలతలు ఉన్నా రూపాయి బలహీనపడ్డం గమనార్హం. -
నష్టాల నుంచి కోలుకున్నాయ్
ముంబై: అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో జోరు మీదున్న బుల్స్ మంగళవారం తడబడ్డాయి. తొలి సెషన్లో విక్రయాల ఒత్తిడికిలోనైన స్టాక్ సూచీలు.., మిడ్సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకొని ఫ్లాట్గా ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 370 పాయింట్లు క్షీణించింది. చివరికి 21 పాయింట్ల లాభంతో 58,136 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 125 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్లు పెరిగి 17,345 దగ్గర స్థిరపడింది. సూచీలకిది ఇది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఐటీ, మెటల్, ఆర్థిక, రియల్టీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆటో, ఇంధన షేర్లు రాణించి సూచీల రికవరీకి సహకరించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.825 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.118 కోట్ల షేర్లను కొన్నారు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా చైనాల మధ్య తైవాన్ వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► తొలి త్రైమాసికంలో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గడంతో జొమాటో షేరు 20% లాభపడి రూ. 55.60 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది. జొమాటోలోని మొత్తం వాటాను వదిలించుకునేందుకు ఉబెర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బ్లాక్ డీల్ ద్వారా 7.8% వాటాకు సమానమైన షేర్లను రూ.48–54 ధర శ్రేణిలో రూ.2,939 కోట్లకు విక్రయించనుందని మర్చెంట్ బ్యాంకింగ్ వర్గాల సమాచారం. ► క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో యూపీఎల్ షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.737 వద్ద స్థిరపడింది. ► హెచ్డీఎఫ్సీ మాజీ ఎండీ ఆదిత్య పురి యస్ బ్యాంక్ బోర్డులోకి రావొచ్చనే అంచనాలతో యస్ బ్యాంక్ 13% లాభపడి రూ.17.14 వద్ద క్లోజైంది. రూపాయికి విదేశీ నిధుల దన్ను 53 పైసలు లాభంతో 78.53కు అప్ డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 53 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 53 పైసలు బలపడి, 78.53 వద్ద ముగిసింది. రూపాయికి ఇది నెల గరిష్ట స్థాయికాగా, 11 నెలల్లో ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలోపేతం కావడం ఇదే తొలిసారి. జూలై 20వ తేదీన రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ట స్థాయి 80.06ను చూసిన సంగతి తెలిసిందే. -
'జొమాటో షేర్లలో అల్లకల్లోలం' రాకేష్ ఝున్ఝున్ వాలా మాటే నిజమైందే!
వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేష్ ఝున్ఝున్ వాలా చేసిన ప్రిడిక్షన్ నిజమైంది. ఏడాది క్రితమే జొమాటో షేర్ల పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో మదుపర్లను జొమాటో షేర్లను కొనవద్దని చెబితే వారు నన్ను ఫూల్ అంటారని వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ మంచి జోరుమీదున్న సమయంలో హఠాత్తుగా ‘జొమాటో’ షేర్లు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ట్రేడింగ్ జరిగే 3గంటల సమయానికి జొమాటో షేర్ ధర రూ.45.90గా ఉండగా.. జులై 23,2021 నుంచి ఆ సంస్థ షేర్లు 61.33శాతం పతనమయ్యాయి. అదే సమయంలో గతేడాది స్టాక్ మార్కెట్లో ఐపీవో లిస్టింగ్కు వెళ్లిన ఇతర సంస్థల షేర్లు జోరుమీద ఉండడం..పేటీఎం, నైకా షేర్లు, జొమాటో షేర్లు భారీగా పతనం కావడంతో మదపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో గతేడాది జరిగిన 'ఇండియా టుడే కన్లక్లేవ్'లో పాల్గొన్న ఝున్ఝున్ వాలా చేసిన వ్యాఖ్యల్ని మదుపర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇండియా టుడే కార్యక్రమంలో..జొమాటోతో సహా కొత్తగా లిస్టైన ఇతర కంపెనీల వాల్యుయేషన్పై ఝున్ఝున్ వాలా ఆందోళన వ్యక్తం చేశారు. జొమాటో స్టాక్స్ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరించారు. ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు.హెచ్చరించారు. "ఈ రోజు నేను జొమాటో షేర్ని కొనవద్దు అని చెబితే, ప్రజలు నన్ను ఫూల్ అంటారు" అని వ్యాఖ్యానించారు. కారణం అదేనా గత ఏడాది జూలై 23న ఐపీవోకి వెళ్లిన జొమాటో ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారులకు ఈ ఏడాది జులై 23కి లాక్ ఇన్ పిరియడ్ ముగిసింది. జూలై 25 ,జూలై 26 ఈ రెండు రోజుల్లో స్టాక్ 20 శాతం భారీగా పడిపోయింది. నాటి నుంచి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్ల పతనం కొనసాగుతుంది. దీంతో మదుపర్లు తమ పెట్టుబడులపై ఆందోళన చెందుతుండగా..నాడు జొమాటో స్టాక్స్ విషయంలో రాకేష్ ఝున్ఝున్ వాలా మాట విని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐపీవోకు ఇన్నోవా క్యాప్ట్యాబ్
ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్నోవా క్యాప్ట్యాబ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
షార్ట్ రికవరింగ్.. లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
ముంబై : గత వారం భారీ నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలతో ఆరంభమైంది. కనిష్టాల వద్ద షేర్లు లభిస్తుండటంతో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా సోమవారం ఉదయం మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఉన్నాయి. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా మార్కెట్కు ఊపును తెచ్చే ఘటనలు ఏమీ చోటు చేసుకోపోయినా ప్రస్తుతానికి సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభంతో 51,470 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు ఉండటంతో వరుసగా పాయింట్లు పెరుగుతూ పోతోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 212 పాయింట్లు లాభపడి 51,572 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది,. మరోవైపు నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 15,334 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. సన్ఫార్మా, ఏషియన్ పేయింట్స్, అపోలో హస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడగా ఎఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, పవర్గ్రిడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీ షేర్లు కూడా లాభాల్లో కదలాడుతున్నాయి. -
ఫెడ్వడ్డీ రేట్ల పెంపు.. అయినా లాభాల్లో సూచీలు
ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడంతో క్రితం రోజు మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. దీంతో కనిష్టాల వద్ద షేర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి మళ్లుతుంటూ ఆ స్థానాన్ని దేశీ ఇన్వెస్టర్లు ఆక్రమిస్తున్నారు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ భారీ లాభాలతో ఆరంభమైంది. క్రితం రోజు ఎనిమిది నెలల కనిష్టాలకు పడిపోయి 52,541 పాయింట్లకు పడిపోయింది. కానీ గురువారం ఉదయం నాలుగు వందలకు పైగా పాయింట్ల లాభంతో 53,018 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9:20 గంటలకు 498 పాయింట్ల లాభంతో 53,040 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 15,850 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్..కోట్ల సంపద కోల్పోతున్న ఇన్వెస్టర్లు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు స్టాక్మార్కెట్ను కలవర పెడుతున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్ ఆయిల్ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం 9:30 గంటల సమయంలో 1459 పాయింట్లు నష్టపోయి 2.46 శాతం క్షీణించి 52,843 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 396 పాయింట్లు నష్టపోయి 15,805 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. బ్లాక్మండే ఎఫెక్ట్తో మార్కట్ ఆరంభమైన అరగంటలోనే సెన్సెక్స్ 53 వేల దిగువకు పడిపోగా నిఫ్టీ 16వేల కిందకు పడిపోయింది. లార్జ్, స్మాల్, మిడ్ అన్ని రంగాల్లో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్మార్కెట్ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారను. గడిచిన పది రోజుల్లో ఏకంగా 14 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. డిపాజిటరీ గణాంకాల ప్రకారం జూ 1 నుంచి 10 మధ్యలో ఏకంగా రూ.13,888 కోట్ల నగదు మార్కెట్ నుంచి బయటకు వెళ్లింది. అయితే దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రావడం కొంత ఊరట కలిగించింది. అయితే సోమవారం కూడా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహారణ బాటలోనే ఉండటం ఒకింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. -
విలవిలాడుతున్న ఇన్వెస్టర్లు.. భారీగా నష్టపోతున్న మార్కెట్ సూచీలు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల పాలిట శాపంగా మారాయి. ద్రవ్యోల్బణ కట్టడికి యూఎస్ ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంకుai వడ్డీరేట్లు పెంచవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీ స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో శుక్రవారం ఆరంభం నుంచే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం ఆరంభం కావడమే ఆరు వందలకు పైగా పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ జర్నీ మొదలైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల నష్టంతో 54,760 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో నష్టాలు తప్పడం లేదు. ఉదయం 9:50 గంటల సమయంలో 735 పాయింట్లు కోల్పోయి 1.28 శాతం క్షీణించి 54,607 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయి 1.29 క్షీణించి 16,265 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గంట వ్యవధిలోనే రెండు సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చత్త పరిస్థితులకు ఇన్వెస్టర్లు విలవిలాడుతున్నారు. హెవీ వెయిట్ కలిగిన కంపెనీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మారుతి సుజూకి, టైటాన్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం క్షీణించింది. -
‘రెపో’ ఎఫెక్ట్.. నష్టాలతోనే ఆరంభం
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ రెపోరేటు పెంపు, ఆర్థిక వృద్ధి కుదింపు, అంతర్జాతీయంగా భయపెడుతున్న చమురు ధరల ఎఫెక్ట్తో దేశీ సూచీలు నష్టాలతో ఆరంభం అయ్యాయి. పైగా రాబోయే నెలల్లో వడ్డీరేట్లు మరింతగా పెరుగుతాయనే అంచనాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. క్రితం రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడి చివరకు నష్టాలతో మార్కెట్ ముగిసింది. ఈ రోజు ఉదయం కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తూ నష్టాలతోనే ఆరంభం అయ్యింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ మూడు వందల పాయింట్లకు పైగా నష్టంతో ఆరంభమైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 378 పాయింట్లు నష్టపోయి 54,514 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి 16,209 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. -
లాభాలు కొద్ది సేపే.. వెంటాడుతున్న నష్టాలు
ముంబై: స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాలతో మొదలైంది. ఆరంభంలో లాభాలు కనిపించినా వెనువెంటనే నష్టాల్లోకి జారుకుంది. గత మూడునాలుగు రోజులుగా నిత్యం మార్కెట్ నష్టాలతోనే ముగుస్తోంది. దీంతో అనేక స్టాక్స్ కనిష్టాల వద్ద లభిస్తుండటంతో బుధవారం ఉదయం కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే అది కొద్ది సేపటికే పరిమితం అయ్యింది. రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ కమిటీ సమావేశాలు జరుగుతుండటం.. రేపోరేటు పెంచవచ్చనే నిర్ణయాలు మరోసారి ప్రభావం చూపాయి. దీంతో మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం రోజు ముగింపుతో పోల్చితే రెండు వందలకు పైగా పాయింట్ల లాభంతో 55,345 పాయింట్లతో మొదలైంది. కొద్ది సేపటి వరకు ఇదే జోరు కనిపించింది. కానీ అరగంట తర్వాత అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:14 గంటల సమయంలో 267 పాయింట్లు నష్టపోయి 54,840 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 16,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
సర్రున కిందికి జారిన సూచీలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: ఆర్బీఐ వడ్డీరేటు వార్తలు, ఉక్రెయిన్లో భూభాగాలను రష్యా ఆక్రమించుకోవచ్చనే వార్తల నేపథ్యం, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వెరసి ఇన్వెస్టర్లలో ఆందోళనల రేకెత్తించాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, కన్సుమర్స్ గూడ్స్ విభాగంలో షేర్లు భారీగా నష్టపోయాయి. ఈరోజు ఉదయం 55,373 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆరంభంలోనే మూడు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10:15 గంటల సమయంలో 634 పాయింట్లు నష్టపోయి 55,041 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 16,404 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ , యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టైటాన్ కంపెనీ, ఏషియన్ పేయింట్స్, హిందూస్థాన్ యూనిలీవర్, సన్ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. -
ఝలక్ ఇచ్చిన ఐటీ షేర్లు.. నష్టాలతో మొదలైన మార్కెట్
ముంబై: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ఆరంభమయ్యాయి. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. రుతుపవనాలు సకాలంలో వస్తాయి సమృద్ధిగా వర్షాలు పడతాయనే సానుకూల వార్తలు ఉన్నా మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు పెంచవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 55,610 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. ఉదయం 9:50 గంటల సమయంలో 393 పాయింట్లు నష్టపోయి 55,375 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 16,475 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఈ రోజు ఉదయం సెషన్లో స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు షేర్లకు నష్టాలు తప్పలేదు. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్కేర్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు అందుతున్నాయి. మరోవైపు దేశీ సూచీలు నాలుగు నెలల కనిష్టాలకు పడిపోయాయి. స్టాక్లు తక్కువ ధరకే వస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఈ రోజు ఉదయం ఆరంభంలోనే దేశీ సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు ఏడు వందల పాయింట్ల లాభంతో 53,513 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 721 పాయింట్ల లాభంతో 997 పాయింట్లు లాభపడి 53,790 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 283 పాయింట్లు లాభపడి 16,093 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈరోజు ఈ ముద్ర ఐపీవోకి రానుంది. -
దేశీ సూచీల నేల చూపులు.. ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చేశాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. మార్కెట్ ఆరంభం నుంచి ముగింపు వరకు షేర్లు తమ విలువలను కోల్పోతూనే ఉన్నాయి. సెన్సెక్స్ 30, నిఫ్టీ 50లోని ప్రముఖ కంపెనీల షేర్లు ఢమాల్ అన్నాయి. ఈరోజు ఉదయం ఇంచుమించు వెయ్యి పాయింట్ల నష్టంతో 53,070 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లను కోల్పోతూనే వచ్చింది, ఒక దశలో 52,669 పాయింట్ల కనిష్టాలను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1416 పాయింట్ల నష్టంతో 2.61 క్షీణత నమోదు చేసి 52,792 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే సెన్సెక్స్ను మించి నష్టాలను చవి చూసింది. 520 పాయింట్లు నష్టపోయి 3.18 శాతం క్షీణించి 15,836 పాయింట్ల దగ్గర ముగిసింది. మార్కెట్ విశేషాలు - బాంబే స్టాక్ ఎక్సేంజీలో 278 స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. - బీఎస్ఈలో బీ కేటగిరీలో 47 స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. - 82 స్టాక్స్ ఇయర్లోను చూశాయి - నిఫ్టీ 50 మిడ్క్యాప్లో 3.50 లక్షల కోట్ల సందప ఆవిరైంది - టాప్ 5 ఐటీ కంపెనీల మార్కెట్క్యాప్కి రూ.1.40 లక్షల కోట్ల మేర కోత పడింది - ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు బాగా లాభపడ్డాయి, ఇవాల ఒక్కరోజే ఐటీసీ మార్కెట్ క్యాప్ 11 వేల కోట్లు పెరిగింది. - ఇష్యూ ప్రైస్తో పోల్చితే ఎల్ఐసీ షేర్ వ్యాల్యూకి మరింత కోత పడింది. మొత్తంగా పది శాతం మేర క్షీణించింది -
లాభాలు మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్లపై నేరుగా పడింది. దీంతో ఈ రోజు మార్కెట్ నష్టాలతోనే ఆరంభమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది.యుక్రెయిన్ వార్ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోవడం, చైనా జీరో కోవిడ్ పాలసీలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంచుమించు వెయ్యి పాయింట్ల నష్టంతో 53,070 దగ్గర ట్రేడింగ్ మొదలైంది. మార్కెట్లో అస్థిరత నెలకొనడంతో సూచీలు అక్కడి నుంచి అటుఇటుగా కదలాడుతోంది. ఉదయం 9:40 గంటల సమయంలో 994 నష్టపోయి 1.83 శాతం క్షీణించి 53,214 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ భారీగా కుదేలవుతోంది. 421 పాయింట్ల నష్టంతో 2.58 శాతం క్షీణించి 15,935 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియా వీఐఎక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. -
జోరుమీదున్న సూచీలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు జోరుమీదున్నాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉండటం, షార్ట్ రికవరింగ్కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాలతో ఆరంభమయ్యాయి. ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో 54,554 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత 54,692 పాయింట్ల గరిష్టాలును టచ్ చేసింది. ఉదయం 9:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 54,653 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,356 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. -
లాభాల్లో దేశీ సూచీలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ఆరంభమయ్యాయి. ఏషియన్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదులుతుండటం దేశీ మార్కెట్లకు కలిసి వచ్చింది. దీంతో ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ రెండు సూచీలు దూసుకుపోతున్నాయి. ఈ రోజు ఎల్ఐసీ ఐపీవో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుండటంతో ఇన్వెస్టర్ల ఫోకస్ దానిపై కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53,285 పాయింట్లతో మొదలైంది. ఒక దశంలో 53,400 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసినా.. అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. ఉదయం 9:45 గంటల సమయానికి 366 పాయింట్ల లాభంతో 53,340 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 124 పాయింట్లు లాభపడి 15,966 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
సుదీర్ఘ నష్టాలకు సోమవారం స్టాక్మార్కెట్లో బ్రేక పడింది. మార్కెట్ సూచీలను తక్షణ కలవరపాటుకు గురి చేసే అంశాలేవీ అంతర్జాతీయంగా, జాతీయంగా చోటు చేసుకోలేదు. మరోవైపు షేర్లు కనిష్టాల దగ్గర లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాల్లో మొదలయ్యాయి. కీలకమైన పదిహేను విభాగాల్లో షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. స్మాల్, మిడ్, లార్జ్ అని తేడా లేకుండా అంతటా సానుకూల వాతావారణమే కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో ఆరంభమైంది. ఉదయం 10 గంటల సమయంలో 53,405 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోల్చితే ఇప్పటికే సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 1.16 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 0.96 శాతం వృద్ధితో 15,926 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
దేశీ ఇన్వెస్టర్ల మద్దతు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది. ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి దేశీ సూచీలు పడిపోవడంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో లేకపోవడం, ఫిన్లాండ్ తాజా నిర్ణయంలో ముదిరిన అంతర్జాతీయ ఉద్రిక్తలు , పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇంకా ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53,565 పాయింట్ల దగ్గర లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత కాసేపటికి 53,625 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. కానీ ఆ తర్వాత అక్కడే ఎక్కువ సేపు ఉండేలేక కిందకు జారుకుంది. ఉదయం 10:15 గంటల సమయంలో 340 పాయింట్ల లాభంతో 53,270 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,950 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. సన్ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాబపడిగా.. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాలను చవి చూశాయి. -
బేర్ పంజా.. ఆరంభంలోనే భారీ పతనం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: మార్కెట్లో బేర్ పంజా కొనసాగుతోంది. చాలా కంపెనీల నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధ భయాల నడుమ స్టాక్ మార్కెట్పై బేర్ పట్టు సాధించింది. దీంతో వరుసగా మార్కెట్ నష్టాల పాలు అవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దేశీ ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఏ వైపు నుంచి మార్కెట్కు జోష్ అందించే పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53,608 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో వేగంగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:20 గంటల సమయంలో బీఎఉస్ఈ సెనెక్స్ 782 పాయింట్ల నష్టంతో 1.45 క్షీణత నమోదు చేసి 53,305 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 1.48 శాతం క్షీణత నమోదు చేసి 15,927 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కనాకష్టంగా 54 వేలు, 16 వేల పాయింట్ల మార్క్ను కాపాడుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం రోజు ఆరంభంలోనే వాటిని కోల్పోయాయి. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్ కొనసాగి కొనుగోళ్ల మద్దతు లభించకపోతే భారీ నష్టాలు తప్పేలా లేవు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోనుంది. -
తప్పని నష్టాలు.. కీలక బెంచ్మార్క్ పాయింట్లు కోల్పోయిన సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి. తగ్గని యుద్ధ భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం కొద్ది సేపుల లాభాలు కనిపించినా ఆ వెంటనే నష్టాలు వెంటాడాయి. మరోవైపు రేపటితో ఫ్యూచర్స్, ఆప్షన్స్ గడువు తీరిపోతుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. పైగా మార్కెట్లో హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్, ఐటీసీ, ఎల్ అండ్ , బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. అయితే మార్కెట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు కీలక బెంచ్మార్క్లను నిలబెట్టుకోగలిగాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,544 పాయింట్లతో లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాలు పలకరించాయి. వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది సెన్సెక్స్. ఒక దశలో 53,519 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 226 పాయింట్లు నష్టపోయి 54,088 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 72 పాయింట్లు నష్టపోయి16,167 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. -
మార్కెట్లో అస్థిరత.. మళ్లీ నష్టాల్లో సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్లో అనిశ్చిత్తి నెలకొంది. దేశీ సూచీలు ఉదయం లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ను ఉత్తేజ పరిచే పరిణామాలేవీ అంతర్జాతీయ, దేశీయంగా చోటు చేసుకోకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,544 పాయింట్లలో లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత 54,598 పాయింట్లను టచ్ చేసింది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడుతుందనే నమ్మకం కుదిరింది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:20 గంటల సమయంలో 293 పాయింట్లు నష్టపోయి 54,071 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నష్టాలు ఇలాగే కొనసాగితే సెన్సెక్స్ 53 వేల దిగువకు పడిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇదే తరహాలో నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,178 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
మార్కెట్లో అస్థిరత.. ఒత్తిడిలో ఇన్వెస్టర్లు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో మంగళవారం మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా నష్టంతో 54,309 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత మరింతగా నష్టపోతూ 54,269 పాయింట్లకు చేరుకుంది. ఇక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 112 పాయింట్ల లాభంతో 54,582 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభంలో నష్టాలు ఎదురైనా ఆ తర్వాత పుంజుకుంది. 29 పాయింట్ల లాభంతో 16,331 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉండగా ఇండియా వీఐఎక్స్, ఏషియన్ పేయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజూకి ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలు పొందాయి. -
నష్టాలతోనే ముగింపు.. అయితే చివర్లో ఊరట
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా నష్టాలతోనే మొదలైంది. ద్రవ్యోల్బణ కట్టడికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, చల్లారని ఉక్రెయిన్ యుద్ధ వేడి, చైనాలో కంట్రోలోకి రాని కరోనాతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత వారంలో మొదలైన నష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,188 పాయింట్లతో భారీ నష్టాలతో మొదలైంది. ఒక దశలో 54 వేల మార్క్ను కోల్పోయి 53.918 పాయింట్లకు పడిపోయింది. షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతు పెరిగింది. దీంతో చివరకు మార్కెట్ ముగిసే సమయానికి నష్టాల తీవ్రత తగ్గింది. 364 పాయింట్లు నష్టపోయి 54,470 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరంభంతో పోల్చితే మెరుగైన స్థితిలోనే సెన్సెక్స్ ముగించింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 109 పాయింట్లు నష్టపోయి 16,301 వద్ద క్లోజయ్యింది. చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతులో సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16 వేల మార్క్ను నిలబెట్టుకోగలిగాయి. పవర్గ్రిడ్, హెచ్సీఎల్టెక్, ఇన్ఫోసిస్, మారుతి, బజాజ్ ఫిన్ సర్వీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, సన్ఫార్మా షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్టల్ ఇండియా, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఎల్ఐసీ ఐపీవోలో 2.88 నిష్పత్తిలో సబ్స్క్రైబ్ అయ్యింది. -
బేర్ పంజా.. ఆరంభంలోనే భారీ నష్టాలు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్కు ప్రతికూలంగా మారుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటి ప్రభావం దేశీ ఇన్వెస్టర్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. షాంగైలో లాక్డౌన్ కొనసాగుతుండం, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేయడం, వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు పెంచడం తదితర కారణాలు ఇందుకు కారణం. దీంతో ఈ రోజు ఉదయం మార్కెట్ ఆరంభం కావడంతోనే భారీ నష్టాలను చవి చూసింది. గత వారమే దాదాపు 4 శాతం వరకు మార్కెట్లు క్షీణించాయి. ఈ రోజు ఉయదం బీఎస్ఈ సెన్సెక్స్ 54,188 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలెట్టింది. ఆరంభంలోనే ఆరు వందలకు పైగా పాయింట్లను నష్టపోయింది. ఉదయం 9:51 గంటల సమయంలో 658 పాయింట్లు నష్టపోయి 54,177 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయి 16,161 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నష్టాలు ఇదే తీరున కొనసాగితే సెక్సెక్స్ 54 వేల మార్క్ని, నిఫ్టీ 16 వేల మార్క్ దిగువకు పడిపోయే అవకాశం ఉంది. -
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్ దేశీ స్టాక్ మార్కెట్లపై పడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిశాయి. దాని ప్రభావం ఈ రోజు ఏషియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు ముడి చమురు ఉత్పత్తి పెంపుపై ఒపెక్ దేశాల మొండిపట్టుదల కూడా తోడైంది. ఫలితంగా ముడి చమురు బ్యారెల్ ధర 110 డాలర్లకు ఎగిసింది. మరోవైపు ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఉదయం ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు నిఫ్టీలు నష్టాలతో మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 800 పాయింట్ల నష్టంతో 54,928 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్ను ఉత్తేజ పరిచే ఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 760 పాయింట్లు నష్టపోయి 54,941 దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయి 16,428 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్లూచిప్, మిడ్, స్మాల్ క్యాప్ అన్ని కేటగిరిల్లో నష్టాలు నమోదు అయ్యాయి. చదవండి: బ్యాంకుల వడ్డింపు షురూ.. -
Stock Market: బొటాబొటి లాభాలతో ముగింపు
ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఈ రోజు స్టాక్ మార్కెట్లో జోష్ కనిపించింది. అయితే ఆ ఉత్సాహాం కొద్ది సేపే ఉంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఈ రోజు మార్కెట్ ఆరంభంలో షేర్ల ధరలు తక్కువగా ఉండటంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ ఐదు వందలు, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా నష్టాలతో మొదలయ్యాయి. అయితే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొలంది. దీంతో ఆరంభంలో కనిపించిన భారీ లాభం కరిగిపోయింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,255 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 56,566 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 55,702 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ కేవలం ఐదు పాయింట్లే లాభపడి 16,682 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్ల ధరలు కుంగిపోవడంతో భారీ లాభాలకు గండిపడింది. -
మార్కెట్కు ఆర్బీఐ షాక్..
ముంబై: ఊహించని విధంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్ఐసీ ఐపీఓ ప్రారంభం నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ హోల్డింగ్స్ నుంచి పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్పై మరింత ఒత్తిడిని పెంచాయి. వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో బాండ్ మార్కెట్ వణికింది. పదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై రాబడి రెండేళ్ల గరిష్ట స్థాయి 7.41 శాతానికి చేరింది. యూఎస్ ఫెడ్ ద్రవ్యపాలసీ ప్రకటన (బుధవారం రాత్రి)కు ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఈ అంశాలూ ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక, రియల్టీ షేర్లలో భారీ స్థాయిలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,307 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయి 16,680 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఎనిమిది వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. సెన్సెక్స్ సూచీలో పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ రెండున్నర శాతం, స్మాల్ క్యాప్ సూచీ రెండుశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 76.40 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటకు ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వేచిచూచే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్కాంగ్, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా, ఇండోనేషియా, జపాన్ మార్కెట్లకు సెలవు. యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు ఆర్బీఐ రెపో రేటు 40 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయంతో వడ్డీరేట్ల ఆధారిత కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు కుప్పుకూలాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం నుంచి అరశాతం వరకు క్షీణించాయి.అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, మారుతీ, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు నాలుగున్నర శాతం నుంచి రెండు శాతం పతనమయ్యాయి. రూ.6.27 లక్షల కోట్లు సంపద ఆవిరి ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో సోమవారం ఒక్కరోజే రూ.6.27 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.259 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
చివర్లో తేరుకున్న మార్కెట్.. అయినా తప్పని నష్టాలు
ముంబై: ఈ రోజు భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ చివర్లో కోలుకుంది. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు, పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా మొదలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి కనబరచడంతో ఉదయం ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్ మరో గంటలో ముగుస్తుందనగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా మార్కెట్ పుంజుకుంది. ఫలితంగా భారీ నష్టాల నుంచి తప్పించుకున్న రెండు సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదారు ఆరు వందల పాయింట్ల నష్టంతో 56,429 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత మరింత నష్టాలను చవి చూస్తూ ఓ దశంలో 56,412 పాయింట్లకు పడిపోయింది. అయితే మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఒక్కసారిగా పుంజుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 85 పాయింట్ల నష్టంతో 56,975 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్లు నష్టపోయి 17,069 పాయింట్ల దగ్గర ముగిసింది. కోల్పోయిన 17 వేల పాయింట్లను నిఫ్టీ తిరిగి సాధించగా సెన్సెక్స్ 57 వేల పాయింట్లు క్రాస్ చేసేందుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. చదవండి: వృద్ధులకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ మార్గాలివే! -
వీడిన బేర్ పంజా.. దుమ్మురేపుతున్న బుల్..
చైనాలో కరోనా భయాలు వెంటాడుతున్నా ద్రవ్యోల్బణం ఛాయలు వీడకున్నా స్టాక్ మార్కెట్ ఈ రోజు బేర్ పంజా నుంచి తప్పించుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్లు అందించిన ఉత్సాహం, మార్కెట్పై ఇన్వెస్టర్లలో నెలకొన్న సానుకూల వాతావరణంతో గురువారం మార్కెట్లో బుల్ దుమ్మురేపింది. గత వారం కొనసాగిన అనిశ్చిత్తి కారణంగా నష్టపోయిన సూచీలు మళ్లీ బలపడ్డాయి. ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 57,296 పాయింట్ల దగ్గర లాభాలతో మొదలైంది. ఆ తర్వాత ఇదే జోరు కనబరుస్తూ ఓ దశలో 57,790 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 701 పాయింట్ల లాభంతో 1.23 శాతం వృద్ధి కనబరుస్తూ 57,521 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 206 పాయింట్లు లాభపడి 17,245 పాయింట్ల దగ్గర ముగిసింది. -
స్వరం పెంచిన రష్యా.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు నష్టాలను చవి చూశారు. మార్కెట్ పెద్దన్న రిలయన్స్ షేర్ల ధర ఆల్టైం హైకి చేరుకున్నా.. మిగిలిన అంశాలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా మరింత దూకుడు పెంచింది. పోలాండ్, బల్గేరియా దేశాలకు ఆయిల్ సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదుపుకు గురయ్యాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎలా అదుపు చేయాలో తెలియక సతమతం అవుతుంటే యుద్ధం మరింతగా ముదురుతుండటం ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీ, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో అయితే కేవలం 3 కంపెనీలు మినహా మిగతా అన్ని నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ఉయదం బీఎస్ఈ సెన్సెక్స్ 56,983 పాయింట్ల దగ్గర నష్టాలతో మొదలైంది. అబుదాబీ కంపెనీతో కుదిరిన డీల్ కారణంగా రిలయన్స్ షేర్లు ఆల్టైం హైంని తాకాయి. మరోవైపు అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో నష్టాలు మొదలయ్యాయి. ఒక దశలో 56,583 పాయింట్ల కనిష్టాలకు చేరుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 556 పాయింట్ల నష్టంతో 56,800ల పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 17,032 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. -
బుల్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకుపోతుంది. గత రెండు రోజులకు భిన్నంగా ఈరోజు బ్లూచిప్ కంపెనీలకు తోడు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల షేర్లు కూడా లాభాలు అందించాయి. హెవీ వెయిట్ రిలయన్స్ షేర్లు ఈ రోజు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ మూడు వందల పాయింట్లు పైగా లాభమంతో మొదలైంది ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో గంటగంటకు లాభపడుతూ పోయింది. ఉదయం 57,458 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 57,991 పాయింట్లను టచ్ చేసింది. చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 57,911 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 256 పాయింట్ల లాభంతో 17,392 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, మారుతి సుజూకి ఇండియా, బజాజ్ ఫిన్ సర్వీసెస్, రిలయన్స్ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. -
లాభాలు కొద్ది సేపే.. వరుసగా మూడో రోజు నష్టాలతోనే ముగింపు
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ప్రతికూల ఫలితాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. ఈ రోజుతో ఈ వారం మార్కెట్ ముగిసిపోతుండటంతో ఆరంభంలో కొనుగోళ్ల జోరు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఇన్వెస్టర్లను రిస్క్ నుంచి వెనుకడుగు వేసేలా చేసింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,910 పాయింట్ల దగ్గర ఫుల్ జోష్లో ప్రారంభమైంది. ఒక దశలో 59,003 పాయింట్ల గరిష్టాలను తాకింది. ఆ తర్వాత గంటన్న తర్వాత ఒడిదుడుకులు మొదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా పాయింట్లూ కోల్పోతూ వచ్చింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 237 పాయింట్లు నష్టపోయి 58,338 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభం జోరు కొద్ది సేపే నిలిచి ఉంది. మార్కెట్ ముగిసే సమయానికి 54 పాయింట్లు నష్టపోయి 17,475 పాయింట్ల దగ్గర ఆగింది. - ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుందనే ప్రకటన రావడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగిశాయి. - గడిచిన 17 నెలల్లో అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం (6.95 శాతం) దేశీయంగా నమోదు అయ్యింది. - అమెరికాలో పదహారు నెలల తర్వాత మంత్లీ కన్సుమర్ ప్రైసెస్ పెరిగాయి - బ్రిటన్లో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టాలకు చేరుకుంది -
స్టాక్ మార్కెట్కి నష్టాల కుదుపు.. భారీగా నష్టపోతున్న సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం దేశీ స్టాక్ మార్కెట్పై పడింది. ఉదయం మార్కెట్ ఆరంభం అయినప్పటి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యవిధానం కట్టుదిట్టం చేయడంతో ఇన్వెస్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఈరోజు స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాలతోనే ఆరంభమైంది. క్రితం రోజు 60,176 పాయింట్ల దగ్గర మార్కెట్ ముగియగా.. ఈ రోజు ఉదయం నష్టాల మధ్య 59,815 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత నష్టాలు కొనసాగుతూ ఉదయం 10 గంటల సమయానికి 403 పాయింట్లు నష్టపోయి 59,773 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 17,876 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చూడగా కోల్ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు పొందాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగాల్లో 0.17 శాతం క్షీణించాయి. -
స్టాక్ మార్కెట్లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం మార్కెట్ ఆరంభమైన తర్వాత జపాన్ నిక్కీ, సౌత్కొరియా కొప్సీ సూచీలు నష్టపోయాయి. ఇదే సమయంలో షాంగై స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. బుల్ర్యాలీ మరికొంత కాలం కొనసాగుతుందా? లేక కరెక్షన్ను ఛాన్స్ ఉందా అనే కోణంలో బేరిజు వేసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో మార్కెట్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 60,582 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మొదటి అరగంటలో వచ్చిన లాభాలు హుష్కాకి అయ్యాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 11 పాయింట్లు నష్టపోయి 18,042 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉండగా నిన్న గణనీయంగా లాభపడిన హెచ్డీఎఫ్సీ షేర్లు ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీతో పాటు బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
మార్కెట్లో అస్థితర.. చివరకు నష్టాలతో ముగింపు
ముంబై : దేశీ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో రెండు సూచీలు కొంత దూకుడు చూపించినా.. ఆ తర్వాత అస్థితర మార్కెట్లో రాజ్యమేలింది. మూడు సెషన్లలోనూ రెండు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు రెండు సూచీలు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58779 పాయింట్లతో మొదలైంది. ఒక దశలో 58,890 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఒక దశలో 58,485 పాయింట్ల కనిష్టాలను తాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 115 పాయింట్లు నష్టపోయి 58,568 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్లు నష్టపోయి 17,464 పాయింట్ల దగ్గర ముగిసింది. రిలయన్స్, రెడ్డీస్, విప్రో, మారుతి, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వీస్, కోటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోగా ఎం అండ్ ఎం, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సూచీలు సానుకూలంగా కదలాడుతుండటంతో దేశీ మార్కెట్ సూచీలు సైతం జోరు చూపిస్తున్నాయి. మరోవైపు ఎగిసిపడతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆయిల్ రిజర్వ్లు ఉపయోగిస్తామని ప్రకటించింది. దీంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలను నాలుగు శాతం తగ్గాయి. ఇటు సింగపూర్, జపాన్, మార్కెట్లు సైతం పాజిటివ్గానే స్పందిస్తున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58779 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదైలంది. ఆ తర్వాత గరిష్టంగా 58,804 పాయింట్లను టచ్ చేసింది. అయితే ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయింది. ఉదయం 9:27 గంటల సమయంలో 91 పాయింట్ల లాభంతో 58,775 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 21 పాయింట్లు లాభపడి 17,519 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
ఎన్నాలకెన్నాళ్లకు.. మళ్లీ 58 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్ ఆరంభం నుంచి చివరి వరకు దేశీ సూచీలు లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దానికి తగ్గట్టే దేశీ సూచీలు సైతం లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి 58 వేల మార్క్ని క్రాస్ చేసింది. చివరిసారి ఫిబ్రవరి 10న సెన్సెక్స్ 58 వేలు పాయింట్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత వరుస నష్టాలతో ఒక దశలో 52 వేలకు పడిపోయింది. కాగా బుధవారం దేశీ సూచీలు జోరు చూపించడంతో 58 వేలు దాటింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,362 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ముగిసే సమయానికి 740 పాయింట్లు లాభపడి 58,683 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 17,498 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. బజాజ్ ఫిన్ సర్వీస్, మహీంద్రా అండ్ మమీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల హోరు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తల కారణంగా నెల రోజులకు పైగా లాభానష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు ఈ రోజు ఎంతో నమ్మకంగా లాభాల బాట పట్టాయి. జపాన్ నిక్కీ 0.60 శాతం లాభపడగా దక్షిన కోరియా కోస్పీ సూచీ 0.26 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు హాంగ్కాంగ్కి సంబంధించి హాంగ్సెంగ్ ఇండెక్స్ 0.39 శాతం, యూఎస్ నాస్డాక్ 1.31 శాతం వృద్ధిని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్టే దేశీ సూచీలు జోరు చూపిస్తున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 183 పాయింట్లు లాభంతో 0.32 శాతం వృద్ధితో 57,777 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 0.44 శాతం వృద్ధి కనబరుస్తూ 17,297 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్, నిఫ్టీల కీలక నిరోధక పాయింట్లను దాటినందున మరికొద్ది రోజుల పాటు మార్కెట్లో బుల్ జోరు కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత తిరిగి పుంజుకోవడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఆటో, బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, మెటల్ స్టాక్స్ మద్దతుతో భారతీయ బెంచ్మార్క్ సూచీలు ఈ రోజు లాభాలలో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 231.29 పాయింట్లు(0.40 శాతం) పెరిగి 57,593.49 వద్ద ఉంటే, నిఫ్టీ 69 పాయింట్లు(0.40 శాతం) పెరిగి 17222 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.16 వద్ద ఉంది. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. యూపీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి.బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కో శాతం చొప్పున లాభపడగా.. ఆటో, మెటల్ సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, క్యాపిటల్ గూడ్స్, ఐటీ & ఫార్మా పేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు నష్టాలలో ముగిశాయి. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి తమిళనాడుతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం(ఎమ్ఒయు) పై సంతకం చేసిన తరువాత ఆస్టర్ డిఎం హెల్త్కేర్ షేరు ధర 10 శాతం పెరిగింది. మల్టీప్లెక్స్ బ్రాండ్స్ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సంస్థల విలీనంతో వాటి షేర్ల ధరలు 52 వారాల గరిష్టాలను తాకాయి. కంపెనీ పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి మార్చి 31న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుండటంతో గెయిల్ ఇండియా షేరు ధర 3 శాతం పెరిగింది. (చదవండి: జియో యూజర్లకు గుడ్న్యూస్..! ఎన్నడూ లేని విధంగా యూజర్లకు బెనిఫిట్స్..!) -
వరుసగా మూడో రోజూ నష్టాలే..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలపాలయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే రీతిలో కొనసాగాయి. సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా పడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల భారత్పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం(యూఎన్సీటీఏడీ) కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశీయ ముదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, సూచీలు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 233.48 పాయింట్లు(0.41%) క్షీణించి 57362.20 వద్ద ఉంటే, నిఫ్టీ 69.80 పాయింట్లు(0.41%) నష్టపోయి 17153 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 76.20 వద్ద ముగిసింది. టైటాన్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, టీసీఎస్ ఎక్కువగా నష్టపోతే.. ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ సూచీలు రాణించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ షేర్లు అర శాతానికి పైగా నష్టపోగా.. రియల్టీ లాభాల్లో ముగిసింది. (చదవండి: పంక్చర్లకీ చెక్..!ఈ టైర్లు వాటంతంటా అవే సెల్ఫ్ హీల్..!) -
యుద్ధ భయాలు..నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఆ యుద్ధం వల్ల భారత్పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్సీటీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు దేశీయ ముదుపర్ల సెంటిమెంట్ను దెబ్బ తీశాయి. దీంతో శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సెన్సెక్స్ 124పాయింట్లు నష్టపోయి 57471 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17204తో ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. బజాజ్ ఆటో, యూపీఎల్, హీరో మోటో కార్పొ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కాన్స్, టైటాన్ కంపెనీ, మారుతి సుజికీ, టెక్ మహీంద్రా,ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఒడుదొడుకుల్లో సూచీలు.. సెన్సెక్స్ 90 మైనస్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదోడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరుగుతుండటం మదుపర్లపై ప్రభావం చూపింది. దీంతో, సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 89.14 పాయింట్లు(0.15) శాతం క్షీణించి 57,595.68 వద్ద ఉంటే, నిఫ్టీ 22.90 పాయింట్లు(0.13 శాతం) నష్టపోయి 17,222.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.38 వద్ద ఉంది. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువ లాభపడితే.. కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా ఇండెక్స్లు 1 శాతం చొప్పున పెరిగితే, బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ & స్మాల్క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. (చదవండి: అమెజాన్ బంపరాఫర్, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు!) -
ఆటో, బ్యాంకు షేర్లు పడేశాయ్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 57,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. క్రూడాయిల్ ధరలు తగ్గినా.., ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం, యూరప్లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్ను బలహీనపరిచా యి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.418 కోట్ల షేర్లను కొన్నా రు. దేశీ ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో ఒక్క ఇండోనేíసియ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పావు శాతం క్షీణించగా., బ్రిటన్ సూచీ అరశాతం పెరిగింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగింపు ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 58,198 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు బలపడి 17,405 ట్రేడింగ్ను ప్రారంభించాయి. మార్కెట్ లాభాలతో మొదలైనా.., గరిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు లేకపోవడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్సెషన్ నుంచి లాభాల స్వీకరణ మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పతనమై 57,569 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 17,200 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు సూచీలు అరశాతం నష్టంతో దాదాపు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి. ‘‘ఒడిదుడుకులు పెరగడంతో కొన్ని రోజులుగా సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతున్నాయి. చైనా పెరుగుతున్న కోవిడ్ కేసులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు రానున్న రోజుల్లో ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మరికొంత కాలం సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించవచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు. ► పేటీఎం షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో నాలుగు శాతం క్షీణించి తాజా జీవితకాల కనిష్టస్థాయి రూ.524 వద్ద ముగిసింది. ► క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కావడంతో ఇండియన్ హోటల్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ► గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల రిటైల్ గృహ రుణాలను కేటాయించినప్పటికీ., హెచ్డీఎఫ్సీ షేరు రెండున్నర శాతం క్షీణించి రూ.2,346 వద్ద ముగిసింది. -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత అదే తిరుతో చివరి వరకు కొనసాగాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా ఇంధన రిటైల్ ధరల పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వంటి ప్రతికూల పరిణామాలతో మదుపరులు ఆచీ తూచీ అడుగులు వేశారు. దీంతో, సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 304.48 పాయింట్లు(0.53 శాతం) క్షీణించి 57,684.82 వద్ద ఉంటే, నిఫ్టీ 69.80 పాయింట్లు(0.40 శాతం) నష్టపోయి 17,245.70 వద్ద ముగిసింది. ఈరోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.33 వద్ద ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టాటా స్టీల్, యూపీఎల్ షేర్లు రాణిస్తే.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, సిప్లా షేర్లు నష్టాలతో ముగిశాయి. హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ & గ్యాస్, పవర్ సూచీలలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగితే.. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీలో అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా రెండవ రోజు ఫ్లాట్'గా ముగిశాయి. (చదవండి: బాదుడే..బాదుడు! సామాన్యులకు మరో షాక్.. వీటి ధరలు పెరగనున్నాయ్!) -
లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. ఏషియన్ మార్కెట్లు లాభాల్లో ఉండటం, ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా చర్యలు తీసుకోవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. దీంతో మార్కెట్లోకి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా బాండ్ల కొనుగోళ్లు జోరుమీదున్నాయి. ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 58,194 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 17,379 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక లిస్టింగ్ మొదలైంది ఇప్పటి వరకు వరుసగా నష్టాలే తప్ప లాభాలంటూ ఎరుగని పేటీఎం షేరు ధర ఈ రోజు స్వల్పంగా పుంజుకుంది. -
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్నాయి. విదేశీయ సంస్థాగత మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగడం, అత్యధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ భరోసా ఇవ్వడం నేడు మార్కెట్లకు సానుకూలాంశంగా కనిపిస్తోంది. దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలు రిటైల్ ధరల్ని, అలాగే వంటగ్యాస్ ధరలు పెంచిన మార్కెట్లు దూసుకెళ్లడం గమనర్హం. రిలయన్స్, ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 696.81 పాయింట్లు(1.22 శాతం) పెరిగి 57,989.30 వద్ద నిలిస్తే, నిఫ్టీ 197.90 పాయింట్లు(1.16 శాతం) లాభపడి 17,315.50 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద ఉంది. టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్ షేర్లు రాణిస్తే.. హెచ్యూఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా, సిప్లా, ఐచర్ మోటార్స్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగితే, రియాల్టీ ఇండెక్స్ 1 శాతం పడిపోయింది. బీఎస్ఈ 30 ప్యాక్లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి. (చదవండి: టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం..!) -
ఫ్లాట్గా కదులుతున్న సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా కదులుతున్నాయి. మార్కెట్ను ప్రతికూలంగా లేదా సానుకూలంగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు అంతర్జాతీయ సూచీలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. అదే ట్రెండ్ ఇక్కడా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9:35 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 57,310 దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 17,105 దగ్గర కొనసాగుతోంది. టాటాస్టీల్, విప్రో, టీసీఎస్, మారుతి సుజూకి, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. హెచ్యూఎల్, నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: బేర్ పంజాతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి చమురు ధరలు పెరుగుతుండడం మదుపరులను కలవరపెడుతోంది. గత వారం 99 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ చమురు ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరింది. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, కొన్ని దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, లాక్డౌన్ల విధింపు వంటి అంశాలు మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలను భారీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ముగింపులో, సెన్సెక్స్ 571.44 పాయింట్లు(0.99 శాతం) క్షీణించి 57292.49 వద్ద నిలిస్తే, నిఫ్టీ 69.40 పాయింట్లు(0.98 శాతం) నష్టపోయి 17,117.60 వద్ద ట్రేడవుతున్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.17 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ఇండియా, హిందాల్కో, యూపీఎల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బ్రిటానియా, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, పవర్గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, టాటా కంజ్యూమర్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆటో, బ్యాంకులు, రియాల్టీ, పవర్ షేర్లు ఒక్కొక్కటి ఒక్కో శాతం మేర క్షీణించాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, చమురు, విద్యుత్ రంగాల షేర్లు నష్టాల బాట పట్టడం మార్కెట్పై ప్రభావం చూపించింది. మరోవైపు ఫార్మా, స్టీల్ రంగాల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతానికి పైగా పెరిగింది. (చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం..) -
చమురు దెబ్బ..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లే దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ అంశాల ప్రభావం పడింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల సంక్షోభం,చైనాలో తలెత్తిన కరోనా, బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరడంతో దేశీయ ఇన్వెస్ట్ర్లు పెట్టుబడులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టపోయి 57626 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్ట పోయి 17227వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. హిందాల్కో,మారుతి సుజికీ, టాటా స్టీల్,ఓఎన్జీసీ, జేఎస్డ్ల్యూ స్టీల్,సన్ ఫార్మా, కిప్లా,విప్రో, యూపీఎల్,కోల్ ఇండియా,టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..కొటాక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్,అదానీ పోర్ట్,హెచ్యూఎల్, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
బుల్ జోరు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సూచీలు..!
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత కూడా బెంచ్ మార్క్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత స్వల్ప ఒడుదొడుకులకు లోనైంది. అయితే, మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానూకూల పవనాలుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించటమూ విశేషం. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గచూపడమూ సానుకూలంగా మారింది. ముగింపులో, సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు(1.84%) పెరిగి 57,863.93 వద్ద ఉంటే, నిఫ్టీ 311.70 పాయింట్లు(1.84%) పెరిగి 17,287.00 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.89 వద్ద ఉంది. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ బీమా, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, టాటా స్టీల్, మారుతీ షేర్లు రాణిస్తే.. ఇన్ఫోసిస్, సిప్లా, కోల్ ఇండియా, ఐఓసీ, హెచ్సీఎల్ టెక్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. ఆటో ఇండెక్స్ 2 శాతం, రియాల్టీ ఇండెక్స్ ఒక్కొక్కటి 3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. (చదవండి: దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు.. !) -
బుల్ జోరు... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: నిన్న భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. నేడు అంతే స్థాయిలో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. మొదటి నుంచి లాభాల్లో ప్రారంభం అయిన సూచీలకు ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దన్నుగా నిలిచాయి. దీనికి తోడు నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో సూచీలు భారీ లాభాల దిశగా అడుగులు వేశాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,039.80 పాయింట్లు(1.86%) పెరిగి 56,816.65 వద్ద ఉంటే, నిఫ్టీ 312.30 పాయింట్లు(1.87%) లాభపడి 16,975.30 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.21 వద్ద ఉంది. నిఫ్టీలో అల్ట్రాటెక్ సీమెంట్, యాక్సిస్ బ్యాంక్, శ్రీ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు రాణిస్తే.. సీప్లా, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ & రియాల్టీ సూచీలు 2-3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, పవర్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా జోడించాయి. (చదవండి: ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర..అమెజాన్, ఫ్లిప్కార్ట్కు షాక్?!) -
జోష్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: హోలి పండగ ముందు స్టాక్ మార్కెట్లో జోష్ నెలకొంది. క్రూడ్ ఆయిల్ రేట్లు దిగిరావడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా పడవచ్చనే అంచనాల నడుమ దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. ఏషియా స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల వాతావరణం దేశీ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది ఫలితంగా మార్కెట్ మొదలైన గంటకే భారీ లాభాలు నమోదు అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఊగిసలాట ధోరణిలో ఉన్న దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 945 పాయింట్లు లాభపడి 56,721 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 267 పాయింట్లు లాభపడి 16,928 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా.. కుప్పకూలిన సూచీలు!
స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసరడంతో సూచీలు నేడు భారీగా నష్టపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత హెవీ వెయిట్ షేర్ల పతనంతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన పవనాలు, ఆసియా మార్కెట్లు డీలా పడటం వంటి కారణాలతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది. అలాగే, వరుసగా 5 సెషన్లు లాభాలతో ముగియడంతో మదుపరులు తమ లాభాలను వెనక్కి తీసుకున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 709.17 పాయింట్లు(1.26%) క్షీణించి 55,776.85 వద్ద ఉంటే, నిఫ్టీ 208.30 పాయింట్లు(1.23%) క్షీణించి 16,663 వద్ద స్థిరపడింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు భారీగా పతనమవుతోంది. బీఎస్ఈలో మార్చి 14న 13 శాతం వరకు క్షీణించిన పేటీఎం.. నేడు మరో 12.74 శాతం పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ పడిపోయింది. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా.. నేడు ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.589.30కి దిగివచ్చింది. డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.76.53 వద్ద ఉంది. 30 షేర్ల ఇండెక్స్లో టాటా స్టీల్, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, ఎమ్ & ఎమ్, సిప్లా, శ్రీ సిమెంట్స్, మారుతి సుజుకి షేర్లు రాణించాయి. ఆటో మినహా ఇతర అన్ని సెక్టార్ సూచీలు(ఐటి, మెటల్, పవర్ ఆయిల్ & గ్యాస్) 1-4 శాతం నష్టపోవడంతో మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం నష్టపోయాయి. (చదవండి: ఆ రెండు నగరాల మధ్య.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే!) -
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
ముంబై: ఫిబ్రవరి ద్రవ్యోల్బణం ఫలితాలు పెరిగినా అంతర్జాతీయ చమురు ధరలు దిగిరావడం, రష్యా, ఉక్రెయిన్ల మధ్య మరోసారి వర్చువల్గా చర్చలు ప్రారంభం అవుతాయనే వార్తల నేపథ్యంలో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో మరోరోజు దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:10 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 56,663 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 16,900 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. 1700 పాయింట్ల దగ్గర తీవ్ర నిరోధకం ఎదురుకావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
NSE Co-Location Scam: 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి చిత్ర రామకృష్ణ..!
ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణను ఢిల్లీ కోర్టు నేడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి నిచ్చింది. చిత్ర రామకృష్ణ తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో రామకృష్ణ కోసం ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు న్యాయవాది కోరారు. అయితే, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆహారం కూడా మంచిదని న్యాయమూర్తి చెప్పారు. విచారణ సమయంలో వీఐపీ సౌకర్యాలు కల్పించాలని ఆమె న్యాయమూర్తి కోర్టును కోరారు. దీనిని కూడా కోర్టు తిరస్కరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో(ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. (చదవండి: కో-లొకేషన్ కుంభకోణంలో హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..!) -
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే వరకు అంతకంతకూ పెరుగుతూ లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్ల అండతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 935.72 పాయింట్లు (1.68%) పెరిగి 56,486.02 వద్ద ఉంటే, నిఫ్టీ 240.80 పాయింట్లు (1.45%) పెరిగి 16,871.30 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.50 వద్ద ఉంది. నిఫ్టీలో ఇన్ఫోసీస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. ఐఓసీ, ఓఎన్జీసీ, హెచ్యుఎల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. ఐటీ, బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగితే, రియాల్టీ ఇండెక్స్ దాదాపు 2 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిస్తే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం లాభపడింది. (చదవండి: ప్రపంచ దేశాల్లో కరోనా కలవరం, చైనాకు యాపిల్ భారీ షాక్!) -
ద్రవ్యోల్బణం, ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలతో (బుధవారం వెలువడనున్న) పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీయ మార్కెట్ గమ నాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ అంశాలూ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. హోళీ సందర్భంగా శుక్రవారం(మార్చి 18న) ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గతవారంలో సెన్సెక్స్ 1,216 పాయింట్లు, నిఫ్టీ 386 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు తగ్గేంత వరకు ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగవచ్చు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మార్కెట్లను నడిపించనున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు క్రూడాయిల్ ధరలు కూడా కీలకం కానున్నాయి. ఇక దేశీయంగా సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ టోకు, రిటైల్ గణాంకాలు, ఎఫ్ఐఐల అమ్మకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించవచ్చు. సాంకేతికంగా దిగువస్థాయిలో నిఫ్టీకి 16,400 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ మార్చి మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–4 తేదీల మధ్య ఎఫ్ఐఐలు మొత్తం రూ.45,608 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల రూపంలో రూ. 41,168 కోట్లు, డెట్ విభాగం నుండి రూ. 4,431 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. ‘‘పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం భారత్ మార్కెట్పై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ తెలిపారు. ఐపీవోకు నవీ టెక్నాలజీస్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సహవ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,350 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవో నిధుల కోసం పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్ బన్సల్ ఐపీవోలో భాగంగా ఎలాంటి వాటాను విక్రయించబోవడంలేదని ప్రాస్పెక్టస్ ద్వారా కంపెనీ వెల్లడించింది. -
'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది. రుగ్యజుర్సామ @అవుట్లుక్డాట్కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్ఎస్ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది. చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ఆ తర్వాత వెంటనే లాభాల బట్టి 200 పాయింట్ల వరకు పైకి దూసుకెళ్లాయి. మళ్లీ కాసేపటికే మార్కెట్ ఫ్లాట్గా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో లాభాల బాట పట్టిన మార్కెట్.. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ సూచీల ఫలితాలతో చిన్న కుదుపులకు లోనైంది. రోజంతా సూచీలు ఊగిసలాటలో కొనసాగాయి. ముగింపులో, సెన్సెక్స్ 85.91 పాయింట్లు (0.15%) పెరిగి 55,550.30 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 35.60 పాయింట్లు లేదా 0.21% పెరిగి 16,630.50 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.59 వద్ద ఉంది. నిఫ్టీలో సీప్లా, బిపీసీఎల్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐఓసీఎల్ షేర్లు రాణిస్తే.. టాటా మోటార్స్, మారుతీ సుజుకి, నెస్లే ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఫార్మా ఇండెక్స్ 2 శాతం పెరిగితే, చమురు & గ్యాస్ సూచీలు 1 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
మార్కెట్లో చిన్న ఝలక్.. ఆపై సెట్రైట్
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో లాభాల బాట పట్టిన మార్కెట్.. ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ సూచీల ఫలితాలతో చిన్న కుదుపులకు లోనైంది. యూఎస్, ఇంగ్లండ్, ఏషియన్ మార్కెట్లు శుక్రవారం ప్రతికూలంగా మొదలవడంతో దేశీ సూచీలు సైతం ఆరంభంలో నష్టాలు చవి చూశాయి. అయితే అరగంట తర్వాత క్రమంగా మార్కెట్ పుంజుకోవడం మొదలు పెట్టింది. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 55,218 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. క్రితం రోజు 55,464 పాయింట్ల దగ్గర ముగిసింది. దీంతో ఆరంభంలో సుమారు రెండు వందల పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. కానీ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 113 పాయింట్ల లాభంతో 55,577 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ముందు నుంచి మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్టే 16,500 పాయింట్ల దగ్గర నిఫ్టీకి తీవ్ర రెసిస్టెన్స్ ఎదురైంది. మార్కెట్ ప్రారంభం అయిన కాసేపటికే 70 పాయింట్ల వరకు నష్టపోయినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9:45 గంటల సమయానికి 54 పాయింట్లు లాభపడి 16,649 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
మార్కెట్కు బీజేపీ విన్నింగ్ కిక్
ముంబై: ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు ఎన్నికల ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వెలువడటంతో స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు దిగిరావడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 817 పాయింట్లు పెరిగి 55,464 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250 పాయింట్లు ఎగసి 16,595 వద్ద నిలిచింది. రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లకు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ సూచీలో టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్తో సహా నాలుగు రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం తలపెట్టదలిచిన ఆర్థిక సంస్కరణల వేగం మరింత పుంజుకోవచ్చని ఇన్వెస్టర్లు భావించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ సంధికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇరాక్, యూఏఈలతో పాటు ఒపెక్ దేశాల నుంచి అదనపు చమురు అందుబాటులోకి వస్తుందనే వార్తలతో క్రూడ్ ధరలు చల్లబడ్డాయి. ఇప్పుడు సాంకేతికంగా నిఫ్టీ 16,800 స్థాయి వద్ద నిరోధాన్ని కలిగి ఉంది. బలమైన ఈ స్థాయిని ఛేదిస్తేనే మార్కెట్ మూమెంటమ్ కొనసాగుతుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 19 పైసలు బలపడి 76.43 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,981 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.946 కోట్ల షేర్లను కొన్నారు. దాదాపు సగం లాభాలు మాయం ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,595 పాయింట్ల లాభంతో 56,242 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు పెరిగి 16,757 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. అయితే యూరప్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం, యూఎస్ సీపీఐ డేటా గణాంకాల వెల్లడి నేపథ్యంలో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు మిడ్సెషన్ నుంచి లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు సగం లాభాలు మాయమయ్యాయి. మూడు రోజుల్లో రూ.10.83 లక్షల కోట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,621 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) రూ.10.83 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా బీఎస్ఈ ఎక్సే్చంజీ మార్కెట్ క్యాప్ రూ.251 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ట్రేడింగ్ సమయంలో రూ.2,689 కోట్ల షేర్లు చేతులు మారడంతో కోపోర్జ్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.4,234 వద్ద స్థిరపడింది. ► పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ)లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంటుందనే వార్తలతో పేటీఎం షేరు మూడుశాతం పెరిగి రూ.774 వద్ద నిలిచింది. గత రెండురోజుల్లో ఈ షేరు 9% ర్యాలీ చేసింది. ► క్రూడ్ ధరలు తగ్గడంతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు వరుసగా అరశాతం, 3% చొప్పున బలపడ్డాయి. ► ఎఫ్ఎంసీజీ షేర్లకు నెలకొన్న డిమాండ్తో హెచ్యూఎల్ షేరు ఐదు శాతం బలపడి రూ.2,101 వద్ద ముగిసింది. సూచీల్లో అత్యధికంగా బలపడిన షేరు ఇదే. (చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!) -
బుల్ జోరు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మంచి జోరు మీద ఉన్నాయి. ఈ రోజు సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ముగింపు వరకు అదే జోరును కొనసాగించాయి. ఆటో, బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్, ఫార్మ, ఐటీ రంగ షేర్ల అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధ భయాలు ఉన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. నాటోలో చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేసిన ప్రకటన మార్కెట్లో కొత్త ఆశలు నింపింది. ముగింపులో, సెన్సెక్స్ 1,223.24 పాయింట్లు(2.29%) పెరిగి 54,647.33 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 331.90 పాయింట్లు(2.07%) లాభపడి 16,345.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.54 వద్ద ఉంది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంకుల షేర్లు భారీ లాభాలతో ముగిస్తే.. శ్రీ సిమెంట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మెటల్ మినహా ఇతర అన్ని క్యాపిటల్ గూడ్స్, ఆటో & రియాల్టీ సెక్టోరల్ సూచీలు 2-3 శాతంతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి. (చదవండి: గృహిణులకు యాక్సిస్ బ్యాంక్ తీపికబురు..!) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత లాభాల్లో పయనించాయి. రియాల్టీ, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సూచీలు లాభాలలో ముగిశాయి. అలాగే, కనిష్ట ధరల వద్ద షేర్లు అందుబాటులో ఉండటంతో మదుపరులు కొనుగోలుకు మొగ్గుచూపారు. ముగింపులో, సెన్సెక్స్ 581.34 పాయింట్లు(1.10%) పెరిగి 53,424.09 వద్ద ఉంటే, నిఫ్టీ 150.30 పాయింట్లు(0.95%) లాభపడి 16,013.50 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.92 వద్ద ఉంది. నిఫ్టీలో ఐఓసీ, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సీప్లా, టీసీఎస్ షేర్లు రాణిస్తే.. మరోవైపు హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్ జీసీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయాయి. లోహపు షేర్లు మినహా మిగిలిన రంగాలన్నీ చివరకు భారీగా లాభాలు నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు ఒక శాతం చొప్పున వృద్ధి సాధించాయి. (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?) -
వెంటాడుతున్న భయాలు.. కుప్పకూలిన దేశీయ మార్కెట్లు..!
ముంబై: ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొలుకొన్నట్లు కనిపించిన మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా భగ్గుమంటున్నాయి. సోమవారం బ్యారెల్ చమురు ధర 9 డాలర్లకు పైగా పెరిగింది. ముగింపులో, బీఎస్ఈ సెన్సెక్స్ 1491 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 52,842.75 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 382.20 పాయింట్లు(-2.35 శాతం) క్షీణించి 15,863.15 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.99 వద్ద ఉంది. ఇక ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరంకావడం సహా రష్యాపై మరిన్ని ఆంక్షలకు పశ్చిమదేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్మార్క్ యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్పై 9 డాలర్లు పెరిగి 124 డాలర్లకు ఎగబాకింది. లిబియాలోని రెండు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్ను సాయుధులు మూసివేశారని ఆ దేశ జాతీయ ఆయిల్ కంపెనీ ప్రకటన కూడా చమురు ధరలపై మరింత ఒత్తిడి పడింది. మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే తక్కువ లాభాలను అర్జీస్తే.. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండ్ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 7.48శాతం క్షీణించాయి. (చదవండి: మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!) -
రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముగింపులో, సెన్సెక్స్ 366.22 పాయింట్లు (0.66%) క్షీణించి 55,102.68 వద్ద స్థిరపడితే , నిఫ్టీ 108 పాయింట్లు లేదా 0.65% క్షీణించి 16,498 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.97 వద్ద ఉంది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు రాణిస్తే.. అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ డీలాపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ & బ్యాంక్ రంగాలలో సూచీలు 1-2 శాతం పడిపోగా, ఎఫ్ఎంసిజి & రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. అయితే మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగాయి. (చదవండి: ఫ్లిప్కార్ట్ మరో సరికొత్త సేల్.. వాటిపై అదిరిపోయే ఆఫర్స్!) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాట దొరణి కనబరిచాయి. చివరిలో కొద్ది పుంజుకోవడంతో అతి భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల మంట, నిత్యావసర ధరల పేరుగుతాయని అనే భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది. ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయని ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 689.78 పాయింట్లు(1.23%) క్షీణించడంతో 55557.50 పాయింట్ల వద్ద స్థిర పడితే, నిఫ్టీ 165.10 పాయింట్లు(0.98%) నష్టపోయి 16628.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 75.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటాస్టీల్స్, టైటాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు రాణిస్తే.. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాలలో ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతం పడిపోయాయి. (చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!) -
ఎవరీ మాధవీ పురీ.. కీలక పదవి దక్కించుకున్న తొలి మహిళగా రికార్డ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారి ఒక మహిళ నాయకత్వం వహించనున్నారు. కేబినెట్ ఎంపికల కమిటీ.. మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్ను సెబీ కొత్త చైర్పర్సన్గా ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీకాలం సోమవారం(28న) ముగియనుంది. దీంతో నేటి(మార్చి1) నుంచి 57 ఏళ్ల మాధవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిగా మూడేళ్లపాటు సెబీ చీఫ్గా వ్యవహరించనున్నారు. వెరసి సెబీ నిర్వహణకు ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవనున్నారు. సెబీకి పూర్తికాలపు తొలి మహిళా సభ్యురాలిగా కూడా మాధవి సేవలందించడం గమనార్హం! 30 ఏళ్ల అనుభవం.. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల కెరీర్ను సొంతం చేసుకున్న మాధవీ పురీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కన్సల్టెంట్గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా. త్యాగి ఐదేళ్లు...: 1984 బ్యాచ్ హిమాచల్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ త్యాగి 2017 మార్చి 1న సెబీ చైర్మన్గా ఎంపికయ్యారు. తొలుత మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాక తదుపరి ఆరు నెలలపాటు, ఆపై మరో 18 నెలలపాటు చైర్మన్ పదవీ నిర్వహణకు గడువును పొందారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్థుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి ప్రస్తుత చైర్మన్ త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4 వరకూ పలు కీలక విధులను నిర్వర్తించారు. మాధవీ పురీ కెరీర్... సెబీకి తొలి మహిళా సారథిగా బాధ్యతలు చేపట్టనున్న మాధవీ పురీ ఐసీఐసీఐ బ్యాంక్సహా ప్రైవేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 2008 నవంబర్ 26న ముంబైలోని ఓ హోటల్పై టెర్రిరిస్టుల దాడి జరిగినప్పుడు చిక్కుకుపోయిన కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా ఉన్నారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్లో ముగిసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. సెకండరీ మార్కెట్ల రక్షణ, సామర్థ్యం, పారదర్శకత తదితర అంశాల మెరుగుపై సలహా కమిటీ ద్వారా సెబీకి సేవలందించారు. -
–1026 నుంచి +389
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య జరిగిన పోరులో సోమవారం బుల్స్ ధాటికి బేర్స్ తలవంచాయి. ఆరంభంలోనే 1026 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ మెటల్, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో 389 పాయింట్లు లాభంతో 56,247 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 16,800 పాయింట్ల చేరువలో 16,794 వద్ద ముగిసింది. సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకవైపు భీకర యుద్ధం జరుగుతున్నా.., మరోవైపు బెలారస్ సరిహద్దు ఫ్యాపిట్ వేదికగా రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన ఈ చర్చలతో యుద్ధ ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చనే ఆశలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలను నెలకొల్పాయి. ఆసియా మార్కెట్లు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. సింగపూర్, హాంగ్కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన యూరప్ సూచీలు మన మార్కెట్ ముగిసిన తర్వాత అనూహ్యంగా నష్టాలబాటపట్టాయి. దేశీ ఇన్వెస్టర్లు రూ.3,948 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,143 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు ఐదుశాతం పెరగడంతో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రెండు పైసలు స్వల్పంగా క్షీణించి ఫ్లాట్గా 75.33 వద్ద స్థిరపడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం(నేడు) స్టాక్, ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లకు సెలవు. బుధవారం మార్కెట్లు మళ్లీ యథాతథంగా పనిచేస్తాయి. భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి... ఉక్రెయిన్– రష్యా యుద్ధ భయాల నేపథ్యంలో స్టాక్మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 530 పాయింట్లు పతనమైన 55,329 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు క్షీణతతో 16,482 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలి గంటలో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1026 పాయింట్లను కోల్పోయి 54,834 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 16,356 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెరతీశారు. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నించింది. ట్రేడింగ్ ముగిసే వరకు స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా రెండోరోజూ లాభాలతో ముగిశాయి. సూచీల రికవరీకి మెటల్ షేర్ల దన్ను మెటల్ షేర్లు రాణించి సూచీల రికవరీలో ప్రధాన పాత్ర పోషించాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రష్యా మెటల్ ఎగుమతులు తగ్గొచ్చనే అంచనాలతో దేశీయ మెటల్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. హిందాల్కో ఏడు శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్ 6%, జేఎస్డబ్ల్యూ ఐదుశాతం రాణించాయి. నాల్కో, వేదాంత, హిందూస్తాన్ కాపర్ షేర్లు 4–3% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అన్నిరంగాల సూచీల్లోకెల్లా మెటల్ ఇండెక్స్ ఐదుశాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల కనిష్టానికి ఇన్వెస్టర్ల సంపద ఫిబ్రవరిలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 1,767 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల రూ.26.41 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఫిబ్రవరి చివరిరోజు(28 తేదీ)నాటికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ ఆరునెలల కనిష్ట స్థాయి రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఇదే ఫిబ్రవరి ముగింపు నాటితో నమోదైన రూ.200 లక్షల కోట్లతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద 25.68 శాతం వృద్ధి చెందింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రిలయన్స్ ఇండస్ట్రీస్ 200 స్టోర్స్ను టేకోవర్ చేసుకోవడంతో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు రాణించాయి. ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్ షేర్లు ఎనిమిది శాతం నుంచి 16% లాభపడ్డాయి. ► డిసెంబర్ క్వార్టక్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో రైన్ ఇండస్ట్రీస్ షేరు ఎనిమిది శాతం క్షీణించి రూ.185 వద్ద ముగిసింది. ► పలు బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్ను అప్గ్రేడ్ చేయడంతో రిలయన్స్ షేరు మూడు శాతం బలపడి రూ.2359 వద్ద స్థిరపడింది. (చదవండి: మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త..!) -
వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: రికార్డు స్థాయి నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నా.. దేశీయ సూచీలు తేరుకోవడం విశేషం. క్రితం సెషన్లో సెన్సెక్స్ 2700 పాయింట్లు పతనం కావడం గమనార్హం. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ గురువారం భారీగా కుదేలైన నేఫథ్యంలో స్వల్పకాల లాభాలను ఆర్జించేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. షేర్ల కనిష్ఠాల వద్ద భారీ కొనుగోళ్లు చేస్తుండడం కారణంగా సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అలాగే, రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఇతర దేశాలు ప్రత్యక్షంగా పాల్గొనక పోవడం కూడా మదుపరులకు ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభలో బాటలో పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,328.61 పాయింట్లు (2.44%) పెరిగి 55,858.52 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 410.40 పాయింట్లు(2.53%) పెరిగి 16,658.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్ షేర్లు డీలా పడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు పిఎస్యు బ్యాంక్, పవర్, మెటల్, రియాల్టీ సూచీలు 4-6 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం పెరిగాయి. (చదవండి: అదిరిపోయే ఫీచర్లతో, దేశీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్!!) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే పడింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. 55 వేల 997 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో 2,850 పాయింట్లు పతనమై 54 వేల 383 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్పై సైనిక చర్య మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి సైనిక చర్య మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యల(పరోక్షంగా అమెరికాతో) మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక మదుపరులు తమ పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం భారీగానే కనిపించింది. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు కనుకు ప్రతిచర్యలకు దిగితే మార్కెట్లు మరింత పడిపోయ అవకాశం ఉంది. ముగింపులో, సెన్సెక్స్ 2,702.15 పాయింట్లు (4.72%) క్షీణించి 54,529.91 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 815.30 పాయింట్లు(4.78%) నష్టపోయి 16,248.00 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగి రూ.75.69 వద్ద ఉంది. ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. టాటా మోటార్స్ 10 శాతానికిపైగా పడిపోయింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతానికిపైగా డీలాపడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు 3-8 శాతం నష్టంతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు 2-6 శాతం మేర పడిపోయాయి.బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి. (చదవండి: బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!) -
స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం 3 తర్వాత ఒక్కసారిగా కుప్పకులాయి. గత కొద్ది రోజుల నుంచి నష్టాల్లో కొనసాగడంతో కనిష్ట ధరల వద్ద షేర్లను కొనుగోలు చేయాలని చూసిన రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం వల్ల చివరలో కొద్దిగా వెనక్కి తగ్గారు. దీంతో రోజంతా లాభాల్లోనే ఉన్నా.. మార్కెట్ మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. ముగింపులో, సెన్సెక్స్ 68.62 పాయింట్లు(0.12%) క్షీణించి 57,232.06 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 28.95 పాయింట్లు(0.17%) క్షీణించి 17,063.25 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద ఉంది. కోటక్ మహీంద్రా, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు రాణిస్తే.. ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు డీలాపడ్డాయి. రియాల్టీ ఇండెక్స్ 3 శాతం మేర పుంజుకుంది. ఆటో, ఐటీ రంగం షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. చాలా వరకు నష్టాలు నమోదుచేశాయి. (చదవండి: హైటెక్స్లో 26, 27 తేదీల్లో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో..!) -
అటు ఉక్రెయిన్ ఒడిదుడుకులు.. ఇటు లాభాల్లో సూచీలు
ముంబై: ఉక్రెయిన్పై రష్యా ఎక్కుపెట్టిన రాకెట్ లాంఛర్లు, తుపాకి తుటాల ప్రభావం ఇండియా స్టాక్మార్కెట్పై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆయిల్ ధరల పెరుగుదలతో ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ద్రవ్యోల్బణం దారి పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా దేశీ స్టాక్మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో చాలా షేర్లు కనిస్ట ధరల దగ్గర లభిస్తున్నాయి. దీంతో దేశీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మొత్తంగా విదేశీ ఇన్వెస్టర్ల షేర్లు దేశీ ఇన్వెస్టర్లకు చేరుతున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య కూడా ఈ రోజు మార్కెట్లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. రెండు సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 332 పాయింట్లు లాభపడి 57,632 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 17,194 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుత్ను ట్రెండ్ ఈ రోజు కూడా మార్కెట్లో కనిపిస్తోంది. -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన రోజంతా అదే తీరును కొనసాగించింది. 1200 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్56 వేల 395 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం అనంతరం.. కాస్త కోలుకొని నష్టం 200 పాయింట్లకు దిగివచ్చింది. చివరలో మళ్లీ అమ్మకాలతో ఒడుదొడుకులకు లోనైంది. ఉక్రెయిన్ కేంద్రంగా నాటో, రష్యాల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్పై కనిపించింది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 382.91 పాయింట్లు(0.66%) క్షీణించి 57300.68 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 114.50 పాయింట్లు(0.67%) క్షీణించి 17092.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.84 వద్ద ఉంది. ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు స్వల్పంగా లాభపడితే.. బీపీసీఎల్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ & పిఎస్యు బ్యాంక్ సూచీలు 1-3 శాతం తగ్గడంతో నష్టాల్లో ముగిశాయి. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1.6 శాతం పడిపోయాయి. (చదవండి: గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!) -
స్టాక్ మార్కెట్పై యుద్ధ మేఘాలు.. భారీగా నష్టపోతున్న సూచీలు
Daily Stock market: ఉక్రెయిన్ కేంద్రంగా నాటో, రష్యాల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్పై మంగళవారం కనిపించింది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు ఈ వివాదం కారణంగానే విదేశీ మార్కెట్లు సైతం అతలాకుతలం అవుతున్నాయి. క్రితం రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 57,683 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కావడంతోనే నష్టాలు మొదలయ్యాయి. మొదటి పది నిమిషాల లోపే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1261 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 358 పాయింట్లు నష్టపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో నిఫ్టీ 17 వేల దిగువకు చేరుకోగా సెన్సెక్స్ 57 వేల కిందకు పడిపోయింది. ఉదయం 9:20 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 916 పాయింట్ల నష్టంతో 1.59 శాతం క్షీణించి 56,767 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 287 పాయింట్లు నష్టంతో 1.67 శాతం క్షీణించి 16,919 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ వివాదంపై ఈ రోజు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో మార్కెట్ నష్టాలకు కొంతైనా బ్రేక్ పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ఆరంభించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కొలుకున్నట్లు కనిపించిన ఆ తర్వాత తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 149.38 పాయింట్లు (0.26%) క్షీణించి 57,683.59 వద్ద ఉంటే, నిఫ్టీ 69.60 పాయింట్లు లేదా 0.40% నష్టపోయి 17,206.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద ఉంది. పవర్ గ్రిడ్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. కోల్ ఇండియా, హిందాల్కోలు 3 శాతానికిపైగా.. యూపీఎల్, ఓఎన్జీసీ, సన్ఫార్మాలు 2.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకు సెక్టార్ మినహా.. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలు 1-2 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి. (చదవండి: రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!) -
స్టాక్ మార్కెట్పై విదేశీ ఎఫెక్ట్.. నష్టాలతో మొదలు
ముంబై: స్టాక్ మార్కెట్పై విదేశీ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో గత కొంత కాలంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తూ తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు ఉక్రెయిన్ వివాదం రోజుకోమలుపు తీసుకోవడం దానికి తగ్గట్టుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. మరోవైపు దేశీయంగా క్యూ 3 ఫలితాల ప్రకటన దాదాపు చివరి దశకు చేరుకుంది. బడ్జెట్ మెరుపులు తెలిసిపోయాయి. దీంతో మార్కెట్కు ఉత్తేజాన్ని అందించే అంశాలేవీ కానరావడం ఫలితంగా అమ్మకాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:15 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 57,551 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 17,192 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నించింది. ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్గా ఆనంద్ సుబ్రమణియన్ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాలపై ఆమెను విచారించింది. అయితే, ఈ కేసులో చిత్రా రామకృష్ణతో పాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్ దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటానికి సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది. ఎన్ఎస్ఈలో అవినీతి, అక్రమాలు పాల్పడినందుకు 2018లోనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె ఎన్ఎస్ఈ సీఈఓగా కొనసాగుతున్న కాలంలో ఒక గుర్తు తెలియని హిమాలయన్ "యోగి" చెప్పినందుకు ఆనంద్ సుబ్రమణియన్ను ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించడంతో పాటు సుబ్రమణియన్కు ఏడాది కాలంలోనే పదోన్నతులు ఇచ్చినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. చిత్ర రామకృష్ణ గత 20 ఏళ్లుగా ఓ 'అదృశ్య' యోగి ప్రభావానికి లోనైనట్లు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయన చేతిలో కీలుబొమ్మగా మారి యోగి చెప్పినట్లు నిర్ణయాలు తీసుకున్నారని దర్యాప్తులో వెలుగుచూసింది. (చదవండి: చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది సీబీఐ. స్టాక్ మార్కెట్లో ముందస్తుగా యాక్సెస్ పొందడం ద్వారా లాభాలు పొందడానికి ఎన్ఎస్ఈలో కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చినందుకు ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని & ప్రమోటర్ సంజయ్ గుప్తా, ఇతరసంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎన్ఎస్ఈ సర్వర్ ఆర్కిటెక్చర్గా పనిచేసే సంజయ్.. గుర్తు తెలియని అధికారులతో కలిసి కుట్రలో పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎన్ఎస్ఈ, సెబీకి చెందిన మరికొంతమందిని ప్రశ్నించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా సూపర్..!) -
వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం పుంజుకొని లాభాల్లోకి మళ్లింది. 250 పాయింట్లకుపైగా పెరిగి 58 వేల 175 వద్ద గరిష్ఠం నమోదుచేసింది. గత సెషన్ల మాదిరిగానే ఆఖరి గంటలో మళ్లీ భారీ కుదుపునకు లోనైంది. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ భారీగా పడిపోవడం చేత మూడో సెషన్లో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 59.04 పాయింట్లు(0.10%) క్షీణించి 57,832.97 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 28.30 పాయింట్లు (0.16%) నష్టపోయి 17,276.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.66 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గ్రేసిమ్, లార్సెన్ & టౌబ్రో రాణిస్తే.. సిప్లా, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్ డీలాపడ్డాయి. శుక్రవారం సెషన్లో బ్యాంకింగ్ రంగం షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడితే.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ షేర్లు 1 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. (చదవండి: ప్రముఖ కంపెనీతో మారుతీ సుజుకీ కీలక ఒప్పందం..!) -
రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు తిరగి కోలుకున్న కూడా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు దారుణంగా 1 శాతం మేర పడిపోయాయి. విద్యుత్తు రంగం షేర్లు రాణించాయి. ముగింపులో, సెన్సెక్స్ 104.67 పాయింట్లు(0.18%) క్షీణించి 57,892.01 వద్ద ఉంటే, నిఫ్టీ 17.60 పాయింట్లు(0.10%) నష్టపోయి 17,304.60 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు రాణిస్తే.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. సెక్టోరల్ ఫ్రంట్లో బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోతే, పవర్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడింది. ఇక బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ప్రతికూలంగా ట్రేడయ్యాయి. (చదవండి: అంతరిక్షయానం టికెట్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమ నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్లో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. ఆఖరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఓ దశలో 350 పాయింట్లకుపైగా కోల్పోయింది. చివర్లో మళ్లీ పుంజుకుంది. చివరలో, సెన్సెక్స్ 145.37 పాయింట్లు(0.25%) క్షీణించి 57,996.68 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 30.30 పాయింట్లు (0.17%) నష్ట పోయి 17,322.20 వద్ద ముగిసింది. ఉక్రెయిన్- రష్యా సంఘర్షణ ప్రభావం మార్కెట్లపై పడింది. తమ బలగాలను డ్రిల్స్ అనంతరం వెనక్కి పిలిపించినట్లు రష్యా ప్రకటించినా.. అమెరికా, నాటో సహా పలు దేశాధినేతలు దీనిని నమ్మడం లేదు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే అవకాశాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దీంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొనడంతో ఆ ప్రభావం దేశీయ సూచీల మీద పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద ఉంది. నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభ పడితే.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ డీలాపడ్డాయి. ఆటో, ఐటీ, పవర్, మెటల్, పిఎస్యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ రంగాలలో అమ్మకాలు కనిపించాయి. ఆరోగ్య సంరక్షణ, చమురు & గ్యాస్, రియాల్టీ సూచీలు లాభాల్లో ముగిశాయి. (చదవండి: బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. గత కొద్ది రోజులుగా షేర్ల ధరలు భారీగా పడిపోవడంతో తక్కువ ధరలో షేర్లు లభిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు వస్తున్న, ఆర్బీఐతో జరిగిన సమావేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్కి ఊరట కలిగించాయి. రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలలో తాత్కాలిక ఉపశమనం మార్కెట్కి మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,736.21 పాయింట్లు(3.08%) పెరిగి 58,142.05 వద్ద నిలిస్తే, నిఫ్టీ 509.70 పాయింట్లు(3.03%) పెరిగి 17,352.50 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.32 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్ షేర్లు రాణిస్తే.. సీప్లా, ఒఎన్జిసిలు నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, పిఎస్యు బ్యాంక్, ఐటి & ఎఫ్ఎంసీజీ నేతృత్వంలోని అన్ని సెక్టోరల్ సూచీలు 2-3 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగాయి. (చదవండి: 10 నిమిషాల్లో రూ.186 కోట్లు సంపాదించిన బిగ్ బుల్!) -
కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై : భారీ నష్టాల నుంచి స్టాక్మార్కెట్ కోలుకుంది. క్రితం రోజు చోటు చేసుకున్న నష్టాల నుంచి దేశీ సూచీలు కోలుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా షేర్ల ధరలు పడిపోతూ వచ్చాయి. దీంతో తక్కువ ధరలో షేర్లు లభిస్తుండంతో ఇన్వెస్టర్లకు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐతో జరిగిన సమావేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్కి బూస్ట్ ఇచ్చాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,731 పాయింట్లతో మొదలైంది. క్రితం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. ఉదయం 9:23 గంటలకు 473 పాయింట్లు లాభపడి 56, 879 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 16,963 దగ్గర ట్రేడవుతోంది. ఓఎన్జీసీ, కోలిండియా, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభపడగా సిప్లా, ఐషర్ మోటార్స్, ఐసీఐసీబ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
దారుణంగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. పతనమైన సెన్సెక్స్, నిఫ్టీలు
ముంబై : ఆకాశాన్ని తాకుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు తోడు ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటోల మధ్య తలెత్తిన ఉద్రిక్తలు.. ఏ క్షణమైనా యుద్ధం తప్పదనే వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కుదైలవుతున్నాయి. ఈ క్రమంలో దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంగా కరిగిపోతుంది. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 58,152 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈ వారం కూడా లాభాలతో మార్కెట్లు మొదలవుతాయనే ఇన్వెస్టర్ల అంచనాలు తారుమారు అయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కావడమే నష్టాలతో మొదలైంది. దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయి 56,720 దగ్గర మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకునే అవకాశం కనిపించలేదు. సాయంత్రం 4 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1747 నష్టంతో 56,405 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 531 పాయింట్ల నష్టంతో 16,842 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 3.07 శాతం క్షీణత నమోదు చేసింది. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి. గతేడాది నవంబర్ నుంచి మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతుండగా తాజాగా వచ్చి పడ్డ ఉక్రెయిన్ ఉద్రిక్తతతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ భారీ నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది. -
వెల్లువెత్తిన అమ్మకాల షేర్లు, భారీగా నష్టపోయిన ఐటీ, ప్రభుత్వ రంగ షేర్లు!
ముంబై: అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ అంచనాల కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో ఈక్విటీ మార్కెట్లు వారాంతాన కుప్పకూలాయి. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి 7 వారాల కనిష్ట స్థాయి 75.36కు పతనమైంది. ఆయా పరిస్థితుల్లో శుక్రవారం సెన్సెక్స్ 773 పాయింట్లు క్షీణించి 58,153 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 17,375 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడురోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో కేవలం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ప్రభుత్వరంగ షేర్లు అధిక నష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను విక్రయాల ఒత్తిడికి లోనుకావడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు రెండుశాతం క్షీణించాయి. ఈ జనవరి 12 తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.108 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.697 కోట్ల షేర్లను అమ్మేశారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి. ఆసియాలో హాంగ్కాంగ్, కొరియా, చైనా దేశాల స్టాక్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడికిలోనై అరశాతం మేర క్షీణించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ప్రథమార్ధంలో సెన్సెక్స్ 1012 పాయింట్లు పతనమై 57,914 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,303 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్సెషన్లో కనిష్టస్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో అమ్మకాల ఉధృతి తగ్గింది. -
వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు పడుతూ లేస్తూ చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో వడ్డీరేట్ల పెంపును ఫెడ్ మరింత వేగంగా పెంచనుందన్న భయాలు, వృద్ధిరేటుని ఆర్బీఐ తగ్గించడం వంటి కారణాలతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 773.11 పాయింట్లు(1.31%) క్షీణించి 58,152.92 వద్ద ఉంటే, నిఫ్టీ 231 పాయింట్లు (1.31%) నష్టపోయి 17,374.80 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.41 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఐఓసీ షేర్లు రాణిస్తే.. గ్రాసీమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యుపీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం నష్ట పోవడంతో నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి దాదాపు 2 శాతం పడిపోయాయి. (చదవండి: 111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్ సంచలన నిర్ణయం..!) -
మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతదంగా ఉంచడం, అంతర్జాతీయంగా మార్కెట్లు లాభాల్లో కొనసాగడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 460.06 పాయింట్లు (0.79%) లాభపడి 58926.03 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 142 పాయింట్లు 0.81% పెరిగి 17605.80 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.95 వద్ద ఉంది. నిఫ్టీలో ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసీస్, ఎస్బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. మారుతి సుజుకి, బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, ఐఓసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. అన్ని సెక్టోరల్ సూచీలు ఐటీ, బ్యాంక్, పవర్, మెటల్ ఒక్కొక్కటి 1 శాతం వరకు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. (చదవండి: కొత్త ఇంటిని కొనుగోలు చేసే వారికి శుభవార్త..! ఇదే సరైన సమయం..!) -
బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కొద్దిగా తడబడిన ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న నష్టాలతో చాలా షేర్ల ధరలు కనిష్టాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపించారు. అలాగే, ఐటీ & ఆర్థిక రంగాల షేర్లు పుంజుకోవడంతో సూచీలు లాభాల వైపు పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 657.39 పాయింట్లు (1.14%) పెరిగి 58,465.97 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 197 పాయింట్లు (1.14%) లాభపడి 17,463.80 వద్ద సెషన్ను ముగించింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.76 వద్ద ఉంది. కోల్ ఇండియా, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, హిందాల్కో షేర్లు రాణిస్తే.. ఓఎన్జీసీ, సన్ఫార్మా, ఐటీసీ, ఐఓసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ డీలాపడ్డాయి. చమురు & గ్యాస్, పీఎస్యూ బ్యాంక్లు మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఐటి, మెటల్ బ్యాంక్ 1-2 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6-1.2 శాతం లాభపడ్డాయి. (చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!) -
జోరుమీదున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సూచీలు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూలంగా ఉండటంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు జోరుమీదున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న నష్టాలతో చాలా షేర్ల ధరలు కనిష్టాలకు చేరుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బుధవారం మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు లాభాల బాటలో ఉన్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,163 పాయింట్ల దగ్గర ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటల సమయానికి 527 పాయింట్లు లాభపడి 58,335 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 17,434 పాయింట్ల దగ్గర కొసాగుతోంది. ఐటీ షేర్లు పుంజుకోవడంతో మరోసారి బీఎస్ఈ సెన్సెక్స్ 58 వేల పాయింట్ల మార్క్ను దాటింది. ఈ రోజు ఉదయం మార్కెట్లో టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, విప్రో, మారుతి సుజూకి, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు నిఫ్టీ 1 శాతం వృద్ధి నమోదు చేయగా నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ షేర్లు 1.50 శాతం వృద్ధి నమోదు చేశాయి. -
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష సమావేశంలో రేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు, అంతర్జాతీయ కారణాలతో 11 గంటల సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం పలు రంగాల షేర్లు కోలుకోవడం వల్ల.. మార్కెట్లు పుంజుకున్నాయి. చివరకు, సెన్సెక్స్ 187.39 పాయింట్లు (0.33%) పెరిగి 57,808.58 వద్ద నిలిస్తే, నిఫ్టీ 53.20 పాయింట్లు(0.31%) లాభపడి 17,266.80 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.73 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్ అత్యధికంగా 3 శాతానికి పైగా వృద్ధి సాధించింది. బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి షేర్లు రాణిస్తే.. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మెటల్, ఫార్మా, పిఎస్యు బ్యాంక్ మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 0.45-1.4 శాతం పడిపోయాయి. (చదవండి: స్మార్ట్ ప్రోటీన్ రంగంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెట్టుబడులు..!) -
కొంచెం లాభం.. కొంచెం నష్టం..
ముంబై: చుట్టుముట్టిన ఆందోళనల నడుమ అంతర్జాతీయ సూచీలు పాజిటివ్గా కదలాడుతుండటంతో దేశీ స్టాక్మార్కెట్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వరుసగా నష్టపోతూ వస్తున్న బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఈరోజు కొంత కుదురుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తుండటంతో ఈ తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10:15 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 57,614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 17,216 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మారుతి సుజూకి, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ఉండగా ఎస్బీఐ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
బేర్ దెబ్బకు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు గంట గంటకు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమరు ధరలు భారీగా పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ఎఫ్ఐఐ అమ్మకాల వెల్లువ వంటి కారణాల చేత సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజులుగా వెలువడుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో దేశీ సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ముగింపులో, సెన్సెక్స్ 1,023.63 పాయింట్లు లేదా 1.75% క్షీణించి 57,621.19 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 302.70 పాయింట్లు లేదా 1.73% క్షీణించి 17,213.60 వద్ద ముగిసింది. నేడు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.71 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ & టీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోతే.. పవర్ గ్రిడ్ కార్ప్, ఒఎన్జిసీ, ఎన్టిపీసీ, శ్రీ సిమెంట్స్, టాటా స్టీల్ షేర్లు అధిక లాభాలను పొందాయి. పిఎస్యు బ్యాంకు, మెటల్ & పవర్ మినహా ఇతర అన్ని సెక్టార్ సూచీలు ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంక్, హెల్త్ కేర్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ 1-2 శాతంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75-1.25 శాతం పడిపోయాయి. (చదవండి: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!) -
వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: గత మూడు రోజుల నుంచి లాభాల్లో దూసుకెళ్తున్న సూచిలకు నేడు బ్రేక్స్ పడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలు కొనలేదు. గత కొద్ది రోజుల నుంచి వచ్చిన లాభాలను మదుపర్లు వెనక్కి తీసుకోవడం, ఆసియా & యూరోప్ మార్కెట్లు కొనసాగడం, క్రిసిల్ సర్వే ఈ వృద్ధిరేటుని 7.8 శాతానికే పరిమితం చేయడం వంటి కారణాల చేత సూచీలు భారీగా నష్టపోయాయి. ముగింపులో, సెన్సెక్స్ 770.31 పాయింట్లు (1.29%) క్షీణించి 58,788.02 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 219.80 పాయింట్లు(1.24%) క్షీణించి 17,560.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.90 వద్ద ఉంది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్, మారుతి సుజుకి, ఐటీసీ షేర్లు ఎక్కువగా నష్టపోతే.. హెచ్డిఎఫ్సి, ఎన్టిపిసి, ఎస్బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా లాభ పడ్డాయి. ఆటో ఇండెక్స్ మినహా చమురు & గ్యాస్, ఐటీ, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1-2 శాతం నష్టాలతో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం పడిపోగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. (చదవండి: భారత్లో లైసెన్స్ కోసం నిరీక్షణ తప్పదా?) -
కొనసాగిన బడ్జెట్ జోష్
ముంబై: బడ్జెట్ మరుసటి రోజూ మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్–2022పై పలువురు విశ్లేషకులు సానుకూలంగా స్పందించడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆర్థిక రికవరీ వేగం మరింత పుంజుకునేందుకు మౌలికరంగానికి పెద్దపీట వేయడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారీ మూలధన వ్యయాన్ని కేటాయించడాన్ని స్టాక్ మార్కెట్ స్వాగతించిందని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 696 పాయింట్లు పెరిగి 59,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 17,780 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించింది. బడ్జెట్ రోజున స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు.., తర్వాత కోలుకొని మార్కెట్ ముగిసే దాకా ర్యాలీని కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 757 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మధ్య, చిన్న తరహా షేర్లకు భారీగా డిమాండ్ లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం చొప్పున లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభ లాభాలను కోల్పోయి ఒక పైసా స్వల్ప లాభంతో 74.83 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.184 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.426 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్లు మెరుగైన ఆదాయాలను ప్రకటన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా లునార్ కొత్త ఏడాది సందర్భంగా ఈ దేశ మార్కెట్తో పాటు హాంగ్కాంగ్, కొరియా స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ స్టాక్ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడింది. యూరప్ మార్కెట్లూ రాణించాయి. ‘‘కేంద్రం బడ్జెట్పై ఆశావాదంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. రానున్న రోజుల్లో మార్కెట్కు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి. ఒపెక్ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. సానుకూలతలు ఎన్ని నెలకొన్నప్పటికీ.., నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతోంది. సాంకేతికంగా 18,000–18,300 శ్రేణిలో కీలక ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణించే అవకాశం ఉంది’’ జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. మూడు రోజుల్లో రూ.9.57 లక్షల కోట్ల సంపద గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 2,358 పాయింట్లు ర్యాలీ చేయడంతో రూ.9.57 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సూచీల ఒకశాతం లాభంతో బుధవారం ఒక్కరోజే రూ.2.67 కోట్లు ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రుణాన్ని ఈక్విటీ రూపంలో మార్చే ప్రణాళికను ఉపసంహరించుకోవడంతో టాటా టెటిసర్వీసెస్ షేరు 5 శాతం లాభపడి రూ.149 వద్ద స్థిరపడింది. ► కేర్ రేటింగ్ సంస్థ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడంతో వోడాఫోన్ ఐడియా షేరు ఏడు శాతం లాభపడి రూ.11 వద్ద స్థిరపడింది. ► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏడు శాతం దిగివచ్చి 18.65 వద్ద స్థిరపడింది. -
Stock Market: వరుసగా మూడోరోజూ లాభాల జోరు..!
ముంబై: కేంద్ర బడ్జెట్ ఇచ్చిన బూస్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఉద్యోగాల సృష్టికి మద్దతుగా బడ్జెట్లో మౌలిక రంగ వ్యయాలను భారీగా పెంచడం, కొత్తగా పన్నులు విధించకపోవడంతో మదుపర్లపై కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో భారీ లాభాల్లో మార్కెట్లు ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 695.76 పాయింట్లు (1.18%) లాభపడి 59,558.33 వద్ద ఉంటే, నిఫ్టీ 203.20 పాయింట్లు(1.16%) పెరిగి 17,780 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.82 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఎక్కువ లాభ పడితే.. టెక్ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా షేర్లు అధికంగా నష్ట పోయాయి. బ్యాంకు, రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పిఎస్యు బ్యాంకు సూచీలు 1-3 శాతం లాభంతో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-1.5 శాతం పెరిగాయి. (చదవండి: అటు బడ్జెట్ అయిపోగానే.. ఇటు 342 కోట్లు వచ్చిపడ్డాయ్!) -
బడ్జెట్ బూస్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దలాల్స్ట్రేట్లో వరుసగా రెండో రోజు బుల్ జోరు కొనసాగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సర్వేలో ఫలితాలు ఆశజనకంగా ఉండటంతో ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైయ్యాయి. మధ్యాహ్నం సమయంలో కొద్దిగా నిరుత్సాహపరిచిన అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, బడ్జెట్, అర్థిక సర్వే నివేదిక మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేయడంతో సూచీలు తిరిగి భారీ లాభాలను అందుకున్నాయి. బడ్జెట్ రోజు ప్రధానంగా మెటల్, ఫార్మా & క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ మద్దతుతో సెన్సెక్స్ 848.40 పాయింట్లు(1.46%) పెరిగి 58862.57 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 237.00 పాయింట్లు (1.37%) పెరిగి 17576.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.80 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, శ్రీ సిమెంట్స్ & హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా లాభపడితే.. బిపీసీఎల్, ఐఓసీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ షేర్లు అధికంగా నష్ట పోయాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపు రంగులో ముగియగా.. బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఐటి, రియాల్టీ, మెటల్ సూచీలు 1-5 శాతం పెరిగాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. (చదవండి: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!) -
ఆర్థిక సర్వే అండతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్..!
ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఆర్థిక సర్వే అండతో భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. మధ్యాహ్నం సమయంలో 1000 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూసుకెళ్లింది. అంతర్జాతీయ సానుకూల సాంకేతలకు తోడు కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి 9.2శాతంగా ఉంటుందనే అంచనాలు, ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయని తెలపడం వంటి అంశాలు మదుపర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు పొందాయి. చివరకు, సెన్సెక్స్ 813.94 పాయింట్లు(1.42%) లాభపడి 58,014.17 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 237.80 పాయింట్లు(1.39%) పెరిగి 17,339.80 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, బిపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అధిక లాభాలను పొందగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యుపీఎల్, కోల్ ఇండియా & హెచ్యుఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, ఫార్మా, ఐటి, ఆయిల్ & గ్యాస్, పీఎస్యు బ్యాంక్ & రియాల్టీ 1-3 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-1.7 శాతం మాత్రమే పెరిగాయి. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..!) -
ఇన్వెస్టర్లకు షాక్ ! చివరి గంటలో నష్టాలు.. ఆవిరైన ఆరంభ లాభాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని అస్థిర వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు పీడకలగా వెంటాడిన నష్టాలు ఈ రోజు ఉదయం మటుమాయం అయ్యాయి. నిపుణుల అంచనాలున తలకిందులు చూస్తూ మార్కెట్ మంచి లాభాలతో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఆకాశమే హద్దుగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు చెలరేగాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ముఖ్యంగా బ్యాకింక్, ఆటోమొబైల్ సెక్టార్కి చెందిన షేర్లు కుదుపులకు లోనయ్యాయి. దీంతో క్రమంగా ఆరంభ లాభాలు ఆవిరికి కావడం మొదలైంది. చివరి గంటలో అమ్మకాలు మరింత ఉదృతంగా సాగడంతో దేశీ సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 500లకు పైగా పాయింట్ల లాభంతో 57,795 పాయింట్లతో మొదలైంది. ఒక దశలో 58,084 పాయింట్ల గరిష్టాన్ని టచ్ చేసింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో క్రమంగా పాయింట్లు కోల్పోతూ మార్కెట్ ముగిసే సమయానికి 77 పాయింట్ల నష్టంతో 57,200 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 17,101 పాయింట్ల దగ్గర ముగిసింది. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీ నష్టాలకు లోనవకపోవడం ఈ రోజు ఇన్వెస్టర్లకు ఊరట కలిగించే అంశం. మారుతి, పవర్గ్రిడ్, టెక్మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు షేర్లు నష్టాలు చవి చూశాయి. సగటున ఈ కంపెనీల షేర్లు 2.99 శాతం క్షీణించాయి. ఎన్టీపీసీ, సన్ఫార్మా, ఇండస్ఇండ్బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. -
హుర్రే..! లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై : గత పది రోజులుగా నష్టాల్లో కూరుకుపోయి స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. ఈ వారం చివరి సెషన్లో జోరు చూపిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభమైన గంట తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 740 పాయింట్లు లాభపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 209 పాయింట్లు లాభపడింది. ఫెడ్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా గత వారం రోజులుగా నష్టాల పాలవుతున్న ఏషియన్ మార్కెట్లు అన్నీ కోలుకుంటున్నాయి. ఉదయం 10:10 గంటల సమయంలో 755 పాయింట్ల లాభంతో బీఎస్ఈ సెన్సెక్స్ 58 వేల మార్క్ను క్రాస్ చేసింది. నిఫ్టీ 238 పాయింట్లు లాభపడి 17,348 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించడంతో రెండు సూచీలు క్షణక్షణానికి పైపైకి ఎగబాకుతున్నాయి. సెన్సెక్స్లో ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు పొందాయి. హెచ్డీఎఫ్సీ, భారతీఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో రియల్టీ, బ్యాంకు, ఎఫ్ఎంసీజీలు లాభాల బాటలో ఉన్నాయి. -
ఐదు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
ముంబై: నేడు బేర్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశమున్నట్లు సంకేతాలు రావడంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో, ఆ ప్రభావం మన దేశీయ మార్కెట్లపై మీద కూడా పడింది. దీంతో ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీల పతనం మొదలైంది. ఉదయం మార్కెట్ ప్రారంభమైన తొలి 5 నిమిషాల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాల చేత సూచీలు నేటి ట్రేడింగ్ను భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 11.30 గంటల సమయంలో సెన్సెక్స్ పాయింట్లు 1,181.85(2.04%) నష్టపోయి 56,643.21 వద్ద నిలిస్తే, నిఫ్టీ 343.30 పాయింట్లు(1.98%) పతనమై 16,934.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 80 సూచీలు 27 షేర్లు, నిఫ్టీ 50 సూచీలో 47 షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. (చదవండి: Budget 2022: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..!) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: గత కొద్ది రోజుల నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల ఫలితాలు, ఆటో, పవర్ & బ్యాంకింగ్ షేర్లు బలపడటం మార్కెట్లకు కలిసి వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి స్టాక్ కంపెనీల ధరలు భారీగా పడిపోవడంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ముగింపులో, సెన్సెక్స్ 366.64 పాయింట్లు (0.64%) పెరిగి 57,858.15 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 128.90 పాయింట్లు (0.75%) లాభపడి 17,278.00 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద ఉంది. అత్యధికంగా యాక్సిస్ బ్యాంకు షేర్లు 7 శాతానికిపైగా లాభపడ్డాయి. మారుతి 6.5శాతం వృద్ధి చెందింది. ఎస్బీఐఎన్, ఇండస్ఇండ్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాలను ఆర్జించాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీ మినహా ఇతర అన్ని సెక్టోరల్ సూచీలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, విద్యుత్, ఆటో బ్యాంకు 2-4 శాతం పెరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు 0.8-1 శాతం లాభపడ్డాయి. (చదవండి: కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!) -
మార్కెట్పై బేర్ పట్టు.. 17 వేలకు దిగువన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు దేశీ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. యూక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల ప్రభావం అమెరికన్ స్టాక్మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభం కావడంతోనే అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా మొదటి గంట గడవక ముందే మార్కెట్లో నష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 56,972 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈ రోజు తొలి గంటలోనే సెన్సెక్స్ షేర్ల ధరలను 0.90 శాతం క్షీణించాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 201 పాయింట్లు నష్టపోయి 16,948 పాయింట్ల దగ్గర కొనసాగుతూ 1.17 శాతం క్షీణత నమోదు చేసింది. రెండు మార్కెట్లలో స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అనే తేడా లేకుండా నష్టాలు నమోదు అవుతున్నాయి. -
Reliance : రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్ హాంఫట్!
గత 5 రోజుల్లో సెన్సెక్స్ 3,817 పాయింట్లు, నిఫ్టీ 1,159 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు 6% కుదేలవడంతో రూ.19.50 లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.9.31 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు చేరింది. ముంబై: స్టాక్ మార్కెట్పై సోమవారం బేర్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలను ఆసరా చేసుకొని వరుసగా ఐదో పంజా విసిరింది. బేర్ ఉగ్రరూపం దాల్చడంతో స్టాక్ సూచీలు రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 1,546 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,492 వద్ద స్థిరపడింది. నిప్టీ 468 పాయింట్లు క్షీణించి 17,149 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల ఇండెక్సులు ఆరుశాతం వరకు క్షీణించాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు ఏకంగా నాలుగు శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లూ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్లో సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,751 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ. 75 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడేలో 9 నెలల కనిష్టానికి... సెన్సెక్స్ ఉదయం 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,023 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 17,575 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి గంటగంటకూ అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు అంతకంతా నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2053 పాయింట్లు నష్టపోయి 56,984 వద్ద, నిఫ్టీ 620 పాయింట్లు కోల్పోయి 16,997 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ ఎక్సేంజీలో 872 షేర్లు షార్ట్ సర్క్యూట్ను తాకాయి. మూడువేలకు పైగా స్టాకులు నష్టాలపాలయ్యాయి. అయితే చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు 57 వేలు, నిఫ్టీ 17 వేలు స్థాయిలని నిలుపుకోలిగాయి. పతనానికి కారణాలు ► అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన మార్కెట్ ప్రతికూల సంకేతాలను అందుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం ప్రారంభానికి(నేటి నుంచి) ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రష్యా–ఉక్రెయిన్ దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం, క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడం, కోవిడ్ తాజా విజృంభణ ప్రపంచ మార్కెట్లలోని సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ► జొమాటో, పేటీఎం పేలవం.. గతేడాది చివర్లో ఎక్సే్చంజీల్లో లిస్టయిన స్టార్టప్, టెక్ తరహా కంపెనీల భారీ పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. బుల్ మార్కెట్ జోరులో లిస్టింగ్లో అదరగొట్టడంతో పాటు కొత్త తరం ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు చేయడంతో ఈ షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరిగాయి. అయితే సంబంధిత కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఆల్టైమ్హై నుంచి కొంతకాలంగా పేటీఎం 60 శాతం, జొమాటో 50 శాతం, నైకా 30 శాతం, పాలసీ బజార్ 40 శాతం చొప్పున క్షీణించాయి. ► దేశీయ పరిణామాలు దేశవ్యాప్తంగా రోజుకు సగటున మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రా ష్ట్రాల ఆంక్షల కొనసాగింపు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. భారీగా నష్టపోయిన రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించినప్పటికీ.., దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4% నష్టపోయి రూ. 2,377 వద్ద స్థిరపడింది. మార్కెట్ నష్టాల ట్రెండ్ అనుగుణంగా షేరులో లాభాల స్వీకరణ జరిగినట్లు నిపుణులు తెలిపారు. షేరు 4% పతనంతో ఆర్ఐఎల్ ఒక్కరోజే రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. ► మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో వొడాఫోన్ ఐడియా ఎనిమిది శాతం నష్టపోయి రూ.11 వద్ద స్థిరపడింది. ఒక దశలో పది శాతం పతనమై రూ.10.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ► న్యూ ఏజ్(కొత్త తరం) జొమాటో, నైనా షేర్లు 20 శాతం చొప్పున క్షీణించాయి. ► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 20.84 శాతం ఎగసి 22.83 స్థాయికి చేరుకుంది. ఐపీవోకు మాన్యవర్ రెడీ సంప్రదాయ దుస్తుల బ్రాండ్ మాన్యవర్ మాతృ సంస్థ వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా కంపెనీ దాదాపు 3.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ ఐపీవోకు అనుమతించమంటూ గతేడాది సెప్టెంబర్లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ రవీ మోడీ ఫ్యామిలీ ట్రస్ట్ 1.81 కోట్ల షేర్లు. అదే బాటలో డ్రీమ్ఫోక్స్ ఎయిర్పోర్ట్ సర్వీసుల ప్లాట్ఫామ్ డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 2.18 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ దేశీయంగా గ్లోబల్ నెట్వర్క్ల క్రెడిట్, డెబిట్ కార్డులుగల వినియోగదారులకు విమానాశ్రయ సంబంధ లాంజ్లు, ఆహారం, పానీయాలు, హోటళ్లు, బదిలీ తదితర పలు సేవలను అందిస్తోంది. రూపాయి 3 వారాల కనిష్టం డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం ముగింపుతో పోల్చితే 17పైసలు బలహీనపడి 74.60 వద్ద ముగిసింది. అధిక క్రూడ్ ధరలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి, ఫారిన్స్ ఫండ్స్ వెనక్కు మళ్లడం, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల వంటి అంశాలు దీనికి నేపథ్యం. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). నేటి బోర్డు మీటింగ్స్ మారుతీ సుజుకీ, సిప్లా, ఫెడరల్ బ్యాంక్, ఇక్రా, యూనిటెడ్ స్పిరిట్స్, మాక్స్ ఇండియా, పిడిలైడ్ ఇండస్ట్రీస్, రేమాండ్, సింఫనీ, స్టార్ సిమెంట్ -
బేర్ దెబ్బకు కుదేలైన దలాల్ స్ట్రీట్.. ఒక్కరోజులో రూ.10లక్షల కోట్లు ఆవిరి
నేడు దలాల్ స్ట్రీట్ కుదేలైంది. భల్లూకం పట్టు నుంచి బయటపడలేక మార్కెట్ విలవిల్లాడింది. దీంతో, స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంత అదే దొరణిలో కొనసాగాయి. స్మాల్, మీడియం, లార్జ్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్లు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా & అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, ఒమిక్రాన్ విజృంభణ, ఫెడ్వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు దేశీయ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతిశాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో ''బ్లాక్ మండే''గా నిలిచింది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. చివరకు, సెన్సెక్స్ 1545 పాయింట్లు కోల్పోయి 57,491కి పడిపోయింది. నిఫ్టీ 468 పాయింట్లు(2.66 శాతం) నష్టపోయి 17,149 వద్ద స్థిర పడింది. ఒక్కరోజులోనే సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 3శాతం మేర క్షీణించాయి. దీంతో మదపర్ల సంపద రూ.10లక్షల కోట్లు ఆవిరైంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.62 వద్ద ఉంది. నిఫ్టీలో జెఎస్ డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా నష్టపోతే.. సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. అన్ని ఆటో, మెటల్, ఐటీ, పవర్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2-6 శాతం పడిపోయి భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం పడిపోయాయి. (చదవండి: ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డులు!) -
నష్టాల పరంపర.. ఇన్వెస్టర్లలో గుబులు.. 59 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
ముంబై: మార్కెట్ నిపుణుల అంచనాలను నిజం చేస్తూ ఈ వారం నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు గురువారంతో ఈ నెలకు సంబంధించిన ఎఫ్ అండ్ ఓ డెరివేటివ్స్ గడువు ముగిసిపోతుంది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్ ఆరంభం కావడంతోనే రెండు దేశీ సూచీలు నష్టాలపాలయ్యాయి. గత రెండు వారాలుగా మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సోమవారం ఉదయం 59,039 పాయింట్లతో బీఎస్ఈ సెన్సెక్స్ మొదలైంది. మార్కెట్ ఆరంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో 578 పాయింట్లు నష్టపోయి 58,459 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయి 17,472 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫిన్ కార్ప్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్సీఎల్ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. -
ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగా లక్షకు రూ.2.4 కోట్లు లాభం!
SEL Manufacturing Company: కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెడుతున్న సమయంలో ఈ ఏడాదిలో బ్రేక్ పడింది. ఈ కొత్త ఏడాదిలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీల షేర్లు పడిపోతన్న సమయంలో చిన్న కంపెనీల స్టాక్ ధరలు మాత్రం భారీగా దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తున్నాయి. ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం కళ్లు చెదిరే లాభాలను మదుపరులకు తెచ్చి పెడుతుంది. గత 3 నెలల కాలంలోనే ఈ ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ధర ఊహించని స్థాయికి దూసుకెళ్లింది. ఈ కంపెనీ స్టాక్స్ కొన్న వారి పంట పడుతుంది. గత 3 నెలల్లో ఈ పెన్నీ స్టాక్ రూ.0.35 (ఎన్ఎస్ఈ 27 అక్టోబర్ 2021న) నుంచి రూ.87.45 (ఎన్ఎస్ఈ 21 జనవరి 2022న) వరకు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో కంపెనీ షేర్ ధర దాదాపు 24,900 శాతం లాభం అందించింది. అంటే, ఒక పెట్టుబడిదారుడు 3 నెలల క్రితం అక్టోబర్ 27న ఈ పెన్నీ స్టాక్లో రూ.1 లక్షను ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు ఆ స్టాక్ విలువ రూ. 2.50 కోట్లుగా ఉండేది. ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీ. అయితే, చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలతో ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేసి పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఎవరైతే, మార్కెట్ ని నిత్యం గమనిస్తూ పెట్టుబడులు పెడతారో వారికి మాత్రమే అధిక లాభాలు వస్తాయని పేర్కొంటున్నారు. (చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!) -
నాలుగో రోజూ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగో రోజూ కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కాస్త కొలుకున్నట్లు కనిపించి ఆ తర్వాత మళ్లీ పడిపోయాయి. పెరిగిన కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సూచీలు దిద్దుబాటుకు గురి అవుతుండటం, దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. దీంతో సెన్సెక్స్ 427 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 139 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. చివరకు, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ 427 పాయింట్లు కోల్పోయి 59,037 వద్ద నిలిస్తే, సూచీ నిఫ్టీ 139 పాయింట్లు క్షీణించి 17,617 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.39 వద్ద ఉంది. నేడు నిఫ్టీలో హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. (చదవండి: వచ్చే 12 నెలల్లో రూ.1,50,000కు చేరుకొనున్న బంగారం ధర..!) -
Stock Market :అయ్య.. బాబోయ్..! నష్టం విలువ 7 లక్షల కోట్లపై మాటే
ముంబై : నవరంబర్ చివరి వారంలో చోటు చేసుకున్న పరిస్థితులే మరోసారి స్టాక్ మార్కెట్లో పునరావృతం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సూచీలతో పోటీ పడుతూ దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చేస్తున్నాయి. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 461 పాయింట్లు నష్టపోయి 59,002 దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 17,639 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఉద్రిక్తతలు ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలు, ఒమిక్రాన్ వ్యాప్తి, క్రూడ్ ఆయిల్ రేట్ల పెంపు తదితర కారణాలతో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలపాలయ్యింది. మొన్నటి వరకు ఫెడ్ రిజర్వ్ రేట్ల పెంపు సానుకూల ఫలితాలు మార్కెట్లో ఇవ్వగా తాజాగా అమెరికాలో నిరుద్యోగ రేటు పెరగడం ద్రవ్యోల్బం అందుకు తోడవటం ప్రతికూల ప్రభావం చూపింది. భారీ నష్టం బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు 59,039 పాయింట్ల దగ్గర మొదలవగా ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. కేవలం గంట వ్యవధిలోనే 650 పాయింట్లకు పైగా నష్టపోంది. దీంతో లక్షల కోట్ల రూపాయల మార్కెట్ సంపద ఆవిరైంది. నిఫ్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అనంతం ఉదయం 10 గంటల తర్వాత మరోసారి ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించినా... అది క్షణకాలమే అనే పరిస్థితి నెలకొంది. సాయంత్రం మార్కెట్ ముగిసే సరికి ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పవనే అంచనాలు నెలకొన్నాయి. బుధ, గురువారాల్లో దేశీ సూచీలు భారీగా నష్టపోవడంతో సుమారు 7 లక్షల కోట్లకు పైగానే ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఈ వారం మార్కెట్కి చివరి రోజు కూడా భారీ నష్టాలు చోటు చేసుకుంటే మరింత నష్టం తప్పదు. -
బేర్ ఉడుము పట్టు.. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై: బేర్ ఉడుము పట్టు పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ కూడా 18వేల దిగువన ట్రేడ్ అవుతోంది. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 501.12 పాయింట్లు నష్టపోయి 59,597.70 వద్ద.. నిఫ్టీ 130.15 పాయింట్ల క్షీణించి 17,808.25 వద్ద కొనసాగుతున్నాయి. నిప్టీలో టాటా కన్ఫ్యూమర్ ప్రొడక్ట్స్ పవర్గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్యూ స్టీల్, అల్బాటెక్ సిమెంట్ షేర్లు రాణిస్తుండగా.. ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, నెస్తే, సిష్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. (చదవండి: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు?) -
బేర్ దెబ్బకు భారీగా కిందకు పడిపోయిన సెన్సెక్స్.. కారణాలివే!
ముంబై: జాతీయ అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. ఆర్థిక, కన్జూమర్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ బుధవారం 656 పాయింట్ల నష్టంతో 60,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్లు పతనమైన 18,000 స్థాయి దిగువన 17,938 వద్ద ముగిసింది. మెటల్, ఇంధన, ఆటో, మీడియా షేర్లు రాణించాయి. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ 28 షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అమ్మకాల ఒత్తిడికి లోనైన సెన్సెక్స్ ఒక దశలో 806 పాయింట్లు క్షీణించి 59,949 వద్ద, నిఫ్టీ 228 పాయింట్ల మేర నష్టపోయి 17,885 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలపడి 74.44 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,705 కోట్ల షేర్లను దేశీయ ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల షేర్లను అమ్మేశారు. రెండు రోజుల్లో రూ.5.24 లక్షల కోట్లు ఆవిరి రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,210 పాయింట్లు పతనమవడంతో రూ.5.24 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైంది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.276.24 లక్షల కోట్లకు పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపద సోమవారం జీవితకాల గరిష్టస్థాయి రూ.280 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. మార్కెట్లో మరిన్ని సంగతులు పేటీఎం షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.997 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నాలుగున్నర శాతం క్షీణించి రూ.997 వద్ద జీవితకాల కనిష్టాన్ని తాకింది. మూడో త్రైమాసికంలో రూ.137 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో స్టెరిలైట్ టెక్ షేరు ఎనిమిది శాతం క్షీణించి రూ.249 వద్ద నిలిచింది. జస్ట్ డయల్ షేరు 3% క్షీణించి రూ.812 వద్ద ముగిసింది. డిసెంబర్ క్వార్టర్లో లాభం 61.1% క్షీణించడం షేరు పతనానికి కారణమైంది. నష్టాలకు 4 కారణాలు 1) బాండ్ల రాబడి భయాలు ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు అనివార్యమని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ పావెల్ స్పష్టతనివ్వడంతో యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్లపై రాబడులు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. భవిష్యత్తులోనూ ఫెడ్ ద్రవ్య పాలసీపై కఠిన వైఖరిని ప్రదర్శించవచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను అమ్మేసి బాండ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మంగళవారం రాత్రి యూఎస్ మార్కెట్లు రెండున్నర శాతం క్షీణించాయి. ఆసియాలో బుధవారం జపాన్, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు 3–1% చొప్పున నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు సైతం 1% నష్టంతో మొదలయ్యాయి. 2) ముడిచమురు మంటలు పాశ్చత్య దేశాల్లో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలతో సరఫరా ఆందోళనలు తెరపైకి వచ్చి అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిని చేరడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. 3) దేశ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరిలో ఇప్పటికి వరకు రూ.7,735 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో దేశీయ ఇన్వెస్టర్లూ రూ.530 కోట్ల షేర్లను అమ్మేశారు. 4) బడ్జెట్ ముందు అప్రమత్తత కేంద్ర బడ్జెట్ ప్రకటన ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరపు ద్రవ్యోలోటు కట్టడి లక్ష్యాన్ని 6.3–6.5% స్థాయిలోనే నిర్ణయించుకోవచ్చనే అంచనాలున్నాయి. (చదవండి: దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు!) -
చమురు దెబ్బకు రెండు రోజుల్లో రూ.5.15 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
దేశీయ మార్కెట్లు కేవలం రెండు రోజుల్లోనే 1200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత కొద్ది రోజులుగా జోరు మీద ఉన్న బుల్ నిన్నటి నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతుంది. నేడు, సెన్సెక్స్ 656.04 పాయింట్లు (1.08%) క్షీణించి 60,098.82 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 174.60 పాయింట్లు(0.96%) క్షీణించి 17,938.40 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో భారీగా మార్కెట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.5.15 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో, బిఎస్ఈ స్టాక్స్ మొత్తం మార్కెట్ విలువ రూ.2,80,02,438 కోట్ల నుంచి రూ.2,74,85,912 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలే ప్రధాన కారణం. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు అలుముకోవడంతో విదేశీ సంస్థాగత మదుపర్లతో పాటు దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా అమ్మకాలకు దిగడం సూచీలపై ప్రభావం చూపింది. యుఏఈ చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత చమురు ధరలు ఏడు సంవత్సరాల గరిష్టానికి పెరిగాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్తో ప్రపంచ వ్యాప్తంగా చమురు వినియోగం తగ్గిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలను మరోసారి ఆయిల్ కంపెనీలు పెంచాయి. క్రూడ్ ఆయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని 87 డాలర్ల దగ్గర నమోదు అవుతోంది. దీంతో మార్కెట్లో ఆందోళన నెలకొంది. ఇంకా, అమెరికాలో 5జీ సేవల ప్రారంభంపై విమానయాన సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేయడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇప్పటికే అనేక దేశాలు విమానాలను రీషెడ్యూల్ చేశాయి. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు కొనసాగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రతికూల పరిణామాలే నేడు దేశీయ సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. (చదవండి: దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది!) -
బేర్ దెబ్బకు 18 వేల పాయింట్స్ కిందకు పడిపోయిన నిఫ్టీ..!
ముంబై: గత కొద్ది రోజుల క్రితం వరకు మంచి జోరు మీద ఉన్న బుల్.. బేర్ కొట్టిన ఒకే దెబ్బకు కిందకు పడిపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే తీరును కొనసాగించింది. అంతర్జాతీయ పరిణామాలు స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. అరబ్ దేశాల్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు, క్రూడ్ఆయిల్ ధర పెంపు, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు దేశీయ ఇన్వెస్టర్ల నడ్డి విరిచాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. చివరకు, సెన్సెక్స్ 656.04 పాయింట్లు (1.08%) క్షీణించి 60,098.82 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 174.60 పాయింట్లు(0.96%) క్షీణించి 17,938.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.43 వద్ద ఉంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో షేర్లు ఎక్కువగా నష్టపోతే.. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, హిండాల్కో, యుపీఎల్ షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. ఆటో, మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్ రంగాలలో సూచీలు లాభాల్లో ముగిస్తే.. బ్యాంకు, ఎఫ్ఎంసిజి, ఐటీ, ఫార్మా, రియాల్టీ రంగాలలో అమ్మకాలు కనిపించాయి. నేడు, బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పడిపోయింది. (చదవండి: 5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..!) -
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరగడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ఐటీ, మెటల్, ఫార్మా రంగాల్లో అమ్మకాల జోరు కొనసాగడం వల్ల సూచీలు భారీగా నష్టపోయాయి. ముగింపులో, సెన్సెక్స్ 554.05 పాయింట్లు (0.90%) క్షీణించి 60,754.86 వద్ద ముగిస్తే, నిఫ్టీ 195.10 పాయింట్లు(1.07%) నష్టపోయి 18,113 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.58 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువగా నష్టపోతే.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసిజి 1-2 శాతంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-2 శాతం తగ్గాయి. (చదవండి: టెస్లా కంపెనీకి 19 ఏళ్ల కుర్రాడు సవాల్..!) -
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఊగిసలాట దొరణి కనబరిచి చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మదపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. బాండ్లపై రాబడి పెరగడం వంటి కారణాల వల్ల మార్కెట్లు మధ్యాహ్నం సెషన్ వరకు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత ఆటో, రియాల్టీ, పవర్ పేర్ల మద్దతుతో చివరకు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 85 పాయింట్ల(0.14%) లాభంతో 61,308వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు (0.29%) వృద్ధి చెంది 18,308 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద ఉంది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లుగా నిలిస్తే.. హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, పవర్, రియాల్టీ సూచీలు 1-2 శాతంతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఎక్కువగా ముగిశాయి. (చదవండి: Republic Day Sale: ఈ ఆఫర్లు అస్సలు మిస్ చేసుకోవద్దు!) -
ఫ్లాట్గా కొనసాగుతున్న సూచీలు
ముంబై: పండుగ తెల్లారి స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు స్వల్ప నష్టాలతో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నెమ్మదిగా లాభాలవైపు అడుగులు వేస్తున్నాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఐటీతో పాటు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ఆశజనకంగా ఉండటం మార్కెట్కి కలిసి వస్తుంది. ఉదయం 9:50 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 61,197 వద్ద కొనసాగుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఒక పాయింటు లాభపడి 18,257 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇప్పటి వరకు థర్డ్ వేవ్ భయాలు కొనసాగినా కేవలం రెండు వారాల్లోనే పెద్దగా ప్రాణనష్టం లేకుండా ముంబైలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గుతుండంతో మార్కెట్కు బూస్ట్ ఇవ్వవచ్చని నిపుణుల అంచనా. -
మార్కెట్లో అస్థిరత.. భారీగా నష్టపోయిన సూచీలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు స్వల్ప కాలిక లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెటల్, ఐటీ కంపెనీల షేర్ల దన్నుతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్ ఈ రోజు వెంటనే భారీగా పాయింట్లను కోల్పోతూ నష్టాలను చవి చూసింది. ఆ వెంటనే కనిష్ట ధరల దగ్గర మరోసారి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సన్సెక్స్ 61,040 పాయింట్లతో ప్రారంభంమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,757 పాయింట్లకు పడిపోయి 400లకు పైగా పాయింట్లు కోల్పోయింది. అక్కడ కొనుగోలు దారుల మద్దతు లభించడంతో క్రమంగా పాయింట్లు పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 166 పాయింట్ల నష్టంతో 61,069 పాయింట్ల దగ్గర ఉంది. ఇక నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 41 పాయింట్ల నష్టంతో 18,216 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. -
ఒడిదుడుకుల్లో మార్కెట్.. చివరకు లాభాలతో ముగింపు
ముంబై : అనుక్షణం ఉత్కంఠ కలిగించిన మార్కెట్ చివరకు లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లాభానష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాడింది. గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 61,259 పాయింట్ల దగ్గర మొదలైంది. ఓ దశలో 61,348 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. వెంటనే పాయింట్లు కోల్పోతూ 60,949 పాయింట్లకు పడిపోయింది. చివరకు 85 పాయింట్ల లాభంతో 61,235 పాయింట్ల దగ్గర మార్కెట్ సెన్సెక్స్ క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 18,257 పాయింట్ల దగ్గర ముగిసింది. గురువారం మార్కెట్లో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు సత్తా చాటాయి. నిఫ్టీ మిడ్క్యాప్ కంపెనీల విలువల 0.65 శాతం పెరగగా స్మాల్క్యాప్ కంపెనీల షేర్ల విలువల 0.61 శాతం పెరిగింది. లార్జ్క్యాప్ విభాగంలో జెఎస్డబ్ల్యూ స్టీల్, సన్ఫార్మా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవి చూశాయి. -
స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు, వెంటాడుతున్న కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం పదిన్నర గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 13.43 పాయింట్ల నష్టపోయి 61,136.61 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ మాత్రం 3.85 పాయింట్ల లాభంతో 18,216.20 వద్ద కొనసాగుతోంది. లాభనష్టాల్లోనివి.. సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (చదవండి: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!) -
నాలుగు రోజుల్లో రూ.6.08 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..!
ముంబై: కార్పొరేట్ల మూడో క్వార్టర్ ఆర్థిక గణాంకాలు మెప్పించవచ్చనే ఆశలతో స్టాక్ సూచీల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం సెంటిమెంట్ను మరింత మెరుగుపరిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందగా., ఇన్వెస్టర్లు కోవిడ్ కేసుల భయాలను విస్మరిస్తూ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 533 పాయింట్లు పెరిగి 61,150 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 18,212 వద్ద నిలిచింది. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, రియల్టీ, ఆటో షేర్లు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 601 పాయింట్లు పెరిగి 60,616 వద్ద, నిఫ్టీ 172 పాయింట్లు ఎగసి 18,228 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,002 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1132 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఒకపైసా బలపడి 73.93 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల సంపద పైపైకి.. గడచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,548 పాయింట్లు లాభపడటంతో బీఎస్ఈ ఎక్స్చేంజిలో రూ.6.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.277.22 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు వోడాఫోన్ ఐడియా షేరు బుధవారం రికవరీ అయ్యింది. బీఎస్ఈలో కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 13 శాతం పెరిగి రూ.13.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి తొమ్మిది శాతం లాభంతో రూ.13 వద్ద స్థిరపడింది. ఏజీఆర్ బకాయిలకు బదులుగా కేంద్రానికి ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు సిద్ధమవడంతో మంగళవారం 21 శాతం నష్టపోయింది. టాటా టెలీ సర్వీసెస్ షేరు పతనం కొనసాగింది. బీఎస్ఈలో 5 శాతం నష్టపోయి రూ.276.50 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకింది. జేపీ మోర్గాన్ బ్రోకింగ్ సంస్థ రేటింగ్ అప్గ్రేడ్ చేయడంతో ఎన్ఎండీసీ షేరు మూడున్నర శాతం పెరిగి రూ.141 వద్ద స్థిరపడింది. (చదవండి: భారత్ ఆర్థిక వృద్ధి రేటులో ఎలాంటి మార్పు లేదు: ప్రపంచ బ్యాంక్) -
బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: కొత్త ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నేడు కూడా సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఈరోజు మొత్తం అదే జోరును కొనసాగించాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు రాణించడంతో సూచీలు జోరు తగ్గలేదు. అలాగే, నేడు టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఫలితాలు వెలువడనుండడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఆటో, రియాల్టీ, మెటల్, పవర్ స్టాక్స్ రాణించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 533.15 పాయింట్లు (0.88%) పెరిగి 61,150.04 వద్ద ఉంటే, నిఫ్టీ 156.50 పాయింట్లు (0.87%) లాభపడి 18,212.30 వద్ద ఉన్నాయి. నేడు నిఫ్టీలో ఎం అండ్ ఎం, భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీల షేర్లు రాణిస్తే.. టైటాన్ కంపెనీ, టీసీఎస్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సీప్లా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మెటల్, పవర్, ఆటో, ఆయిల్ & గ్యాస్, రియాల్టీ రంగాలు 1-2 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1 శాతం పెరిగాయి. (చదవండి: శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ) -
స్టాక్ మార్కెట్లో పండగ హుషారు.. లాభాల జోరు
ముంబై: స్టాక్ మార్కెట్ జోరు కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ సానుకూల వాతావరణంలో ప్రారంభమైంది. సింగపూర్ స్టాక్మార్కెట్ సూచీలు సానుకూలంగా కదలాడుతుండటం దేశీ మార్కెట్పై ప్రభావం చూపించింది. దీంతో మార్కెట్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే రెండు సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 60,616 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 18,055 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈ రోజు మార్కెట్ దృష్టి అంతా టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ప్రకటించే మూడో త్రైమాసికం ఫలితాలపై ఉంది. ఈ కంపెనీలు సానుకూల ప్రకటన చేస్తే మార్కెట్ సూచీలు మరింతపైకి ఎగబాకే అవకాశం ఉంది. -
Market Close: లాభాల్లో ముగిసిన మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత పుంజుకొని లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావం మన మార్కెట్ల మీద పడటంతో ఉదయం కొద్ది సేపు నష్టాల్లో కొనసాగాయి. కంపెనీలోని మేజర్ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు అధికారికంగా వొడాఫోన్ ఐడియా ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఆ ప్రభావం కూడా మన మార్కెట్ల మీద పడింది. చివరకు ఐటీ, పవర్, రియాల్టీ స్టాక్స్ అండతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 221.26 పాయింట్లు (0.37%) లాభపడి 60616.89 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 52.50 పాయింట్లు (0.29%) లాభపడి 18055.80 వద్ద ఉంది. హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, టెక్మహీంద్ర, టీసీఎస్, రిలయన్స్, సన్ఫార్మా షేర్లు ప్రధానంగా లాభపడితే.. టాటా స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఫినాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, పవర్, ఆయిల్ & గ్యాస్, రియాల్టీ స్టాక్లలో కొనుగోలు కనిపించింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. (చదవండి: భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..!) -
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్! 18 వేల మార్క్ కోల్పోయిన నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు దేశీ స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావం ఇక్కడా పడింది. దీంతో ఈ రోజు మార్కెట్లో నష్టాలతో మొదలైంది. అయితే గత రెండు రోజులుగా కనిపించిన జోరు మరోసారి కొనసాగుతుందని మధ్యాహ్నం సమయాని కల్లా తిరిగి సూచీలు పుంజకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9:15 గంటలకు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఆరు పాయింట్లు నష్టపోయి 17,997 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 60,342 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
Stock market: బుల్ జోరు.. 18000 పాయింట్లు దాటిన నిఫ్టీ!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ఆరంభించాయి. ఈ రోజు మొత్తం బుల్ జోరు కొనసాగడంతో నిఫ్టీ జీవనకాల గరిష్ట స్థాయి 18,000కి చేరుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నా దేశీ మార్కెట్ సూచీలు జోరు కొనసాగిస్తున్నాయి. కార్పోరేట్ కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్న మూడో త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్లకు మార్కెట్పై నమ్మకం పెరిగింది. పిఎస్యు బ్యాంక్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్ స్టాక్స్ అండతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 650.98 పాయింట్లు(1.09%) పెరిగి 60,395.63 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 190.60 పాయింట్లు(1.07%) లాభపడి 18,003.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.04 వద్ద ఉంది. యుపీఎల్, హీరో మోటోకార్ప్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, మారుతి సుజుకి టాప్ నిఫ్టీ గెయినర్లలో ఉన్నాయి. విప్రో, నెస్లే, దివిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అన్ని సెక్టోరల్ సూచీలు పిఎస్యు బ్యాంక్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, బ్యాంక్, రియాల్టీ సూచీలు 1-3 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 0.7-1 శాతం పెరిగాయి. (చదవండి: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్..!) -
లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!
స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. కలలో కూడా ఊహించని లాభాలని నిజజీవితంలో తెచ్చిపెడతాయి. ఓపిక, తెలివి ఉండాలగానే కొద్ది కాలంలోనే కరోడ్ పతి కావచ్చు. అయితే, ఇలాంటి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కొన్ని స్టాక్స్ సమ్థింగ్ స్పెషల్గా నిలుస్తున్నాయి. ఊహించని రీతిలో రిటర్నులను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ మూలాలు బలంగా ఉంటుండటం వీటికి ప్లస్గా నిలుస్తున్నాయి. అలాంటి పెన్నీ స్టాక్స్లో ఒకటి ఏకే స్పింటెక్స్. ఏకే స్పింటెక్స్ టెక్స్టైల్ రంగానికి చెందినది. గత వారం 30 డిసెంబర్ 2021న బిఎస్ఈలో ఏకే స్పింటెక్స్ టెక్స్ టైల్ మల్టీ బ్యాగర్ స్టాక్ ప్రతి షేర్ ధర ₹24.50 వద్ద ముగిసింది. నేడు(జనవరి 7) ఆ షేర్ ధర ₹52.35 వద్ద ఉంది. కేవలం ఈ వారంలో కేవలం ఐదు సెషన్లోనే వాటాదారుల 100 శాతం రిటర్నులను అందించింది. ఈ కాలంలో సుమారు 136 శాతం పెరిగింది. అంటే గత వారం ఈ కంపెనీకి చెందిన లక్ష రూపాయలు విలువ చేసే వారికి నేడు వాటి విలువ రూ.2,13,000లుగా ఉండేది. ఈ స్టాక్ బీఎస్ఈ సెన్సెక్స్లో జూలై 10 2017న రూ.84.35 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. అయితే ఈ గరిష్ట స్థాయిల నుంచి ఈ స్టాక్ పడిపోయింది. ఏప్రిల్ 10, 2020న ఈ స్టాక్ రూ.10 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. మళ్లీ ఇప్పుడు తిరిగి పుంజుకుంటుంది. (చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. రాకెట్ కంటే వేగంగా పడిపోతున్న ధర!) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా లాభపడుతూ పాయింట్లు పెరుగుతూ పోయింది. ట్రేడింగ్ మొదలైన గంటకే దాదాపు 400కు పైగా పాయింట్లు లాభపడి 60 వేలు క్రాస్ చేసి ఈ రోజు గరిష్టం 60,130 పాయింట్లను టచ్ చేసింది. దీంతో వెంటనే ఇన్వెస్టర్లు తక్షణ లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో వేగంగా పాయింట్లూ కోల్పోవడం ప్రారంభించింది. ఆ తర్వాత సూచీలు ఊగిసలాట దొరణి కనబరిచాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలు నమోదుచేశాయి. చివరకు, సెన్సెక్స్ 142.81 పాయింట్లు (0.24%) లాభపడి 59,744.65 వద్ద ఉంటే, నిఫ్టీ 66.80 పాయింట్లు (0.38%) పెరిగి 17,812.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద ఉంది. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు రాణిస్తే.. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ షేర్లు డీలాపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్లో బ్యాంక్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు 0.5-1 శాతం పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి. (చదవండి: ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్ మస్క్ అంటే కథ వేరుంటది) -
Stock Market : ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇన్వెస్టర్లు ! ప్రతీ గంటకో ట్విస్ట్
తొలి ఏడాది మొదటి వారం చివరి రోజు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది స్టాక్మార్కెట్ ! క్షణ క్షణానికి లాభ నష్టాల మధ్య అటు ఇటు మారుతూ పల్స్ రేటు పెంచుతోంది. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్లో ఉన్న వారైతే బీపీ మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. డిసెంబరులో డిసెంబరులో బేర్ పట్టులో చిక్కుకుంది స్టాక్ మార్కెట్. దీంతో జీవిత కాల గరిష్టాలను క్రమంగా కోల్పోతూ వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 62,245 పాయింట్ల నుంచి క్రమంగా పాయింట్లూ కోల్పోతూ డిసెంబరు 20 ఏకంగా 55,822 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 18,604 పాయింట్ల గరిష్టాన్ని అందుకుంది కానీ క్రమంగా పాయింట్లు కోల్పోతూ 16,614కి పడిపోయింది. ఇలా డిసెంబరు అంతా నష్టాలతో ముగిసిన మార్కెట్ జనవరి 3న లాభాలతో ప్రారంభమై... అదే ఊపు కొనసాగించలేక 6న నష్టాలలతో ముగిసింది. ప్రతీ క్షణం ఉత్కంఠ జనవరి 7న మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ క్రమంగా లాభపడుతూ పాయింట్లూ పెరుగుతూ పోయింది. ట్రేడింగ్ మొదలైన గంటకే గంటకే దాదాపు 400కు పైగా పాయింట్లు లాభపడి 60 వేలు క్రాస్ చేసి ఈ రోజు గరిష్టం 60,130 పాయింట్లను టచ్ చేసింది. దీంతో వెంటనే ఇన్వెస్టర్లు తక్షణ లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో వేగంగా పాయింట్లూ కోల్పోవడం ప్రారంభించింది. మధ్యాహ్నం సమయంలో ఆరంభ లాభాలు మొత్తం ఆవిరి చేస్తూ దాదాపు 500లకు పైగా పాయింట్లు కోల్పోయి 59,401 పాయింట్లకు పడిపోయింది. ఇంచు మించు ఇదే ట్రెండ్ నిఫ్టీలోనూ కనిపించింది. నిఫ్టీ 17,905 గరిష్టం నుంచి 17,704 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ లాభాలు మధ్యాహ్నం 1 గంట తర్వాత మార్కెట్ మరోసారి పుంజుకోవడం ప్రారంభించింది. స్టాక్స్ ధర అందుబాటులో ఉండటంతో ఇన్వెస్టర్లు మరోసారి మార్కెట్పై నమ్మకం చూపించారు. దీంతో క్రమంగా సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకుని నష్టాల నుంచి బయటపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 17,791 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 67 పాయింట్లు 59,668 దగ్గర కొనసాగుతోంది. క్షణక్షణానికి ఆధిపత్యం మారుతుండటంతో ఇంట్రాడే ట్రేడింగ్లో ఉన్న ఇన్వెస్టర్లు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. -
ఇన్వెస్టర్లకు ఉపశమనం. లాభాలతో మొదలైన మార్కెట్
ముంబై : మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితితో లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న ఇన్వెస్టర్లకు శుక్రవారం ఉదయం కొంత ఉపశమనం కలిగింది. తక్కువ ధరల వద్ద షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఇన్వెస్టర్లకు లాభాలు పంచిన షేర్లు.. గురువారం ఒక్క సారిగా పతనం అయ్యాయి. నాలుగు రోజుల పాటు వచ్చిన లాభాల్లో సింహభాగం ఆవిరైపోయాయి. దీంతో శుక్రవారం మార్కెట్ ఎలా ప్రారంభం అవుతుందనే టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది. శుక్రవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలతో ప్రారంభం అయ్యింది. ఉదయం 9:10 గంటల సమయానికి 174 పాయింట్లు లాభపడి 59,776ల పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 17,797 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నవంబరు చివరి వారం నుంచి మార్కెట్లో బుల్, బేర్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండటంతో ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.