నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sensex Drops 458 pts From Days high, Nifty at 17207 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Mon, Feb 21 2022 3:56 PM | Last Updated on Mon, Feb 21 2022 3:56 PM

Sensex Drops 458 pts From Days high, Nifty at 17207 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ఆరంభించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కొలుకున్నట్లు కనిపించిన ఆ తర్వాత తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 149.38 పాయింట్లు (0.26%) క్షీణించి 57,683.59 వద్ద ఉంటే, నిఫ్టీ 69.60 పాయింట్లు లేదా 0.40% నష్టపోయి 17,206.70 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద ఉంది. పవర్​ గ్రిడ్​, శ్రీ సిమెంట్​, ఇన్ఫోసిస్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు రాణిస్తే.. కోల్​ ఇండియా, హిందాల్కోలు 3 శాతానికిపైగా.. యూపీఎల్​, ఓఎన్​జీసీ, సన్​ఫార్మాలు 2.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకు సెక్టార్​ మినహా.. క్యాపిటల్​ గూడ్స్​, ఎఫ్​ఎంసీజీ, మెటల్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ఫార్మా రంగాలు 1-2 శాతం మేర నష్టపోయాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి.

(చదవండి: రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్‌‌ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement