
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత కూడా బెంచ్ మార్క్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత స్వల్ప ఒడుదొడుకులకు లోనైంది. అయితే, మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానూకూల పవనాలుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించటమూ విశేషం. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గచూపడమూ సానుకూలంగా మారింది.
ముగింపులో, సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు(1.84%) పెరిగి 57,863.93 వద్ద ఉంటే, నిఫ్టీ 311.70 పాయింట్లు(1.84%) పెరిగి 17,287.00 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.89 వద్ద ఉంది. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ బీమా, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, టాటా స్టీల్, మారుతీ షేర్లు రాణిస్తే.. ఇన్ఫోసిస్, సిప్లా, కోల్ ఇండియా, ఐఓసీ, హెచ్సీఎల్ టెక్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. ఆటో ఇండెక్స్ 2 శాతం, రియాల్టీ ఇండెక్స్ ఒక్కొక్కటి 3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment