
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కొద్దిగా తడబడిన ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి. గత వారం రోజులుగా కొనసాగుతున్న నష్టాలతో చాలా షేర్ల ధరలు కనిష్టాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు భారీ ఎత్తున ఆసక్తి చూపించారు. అలాగే, ఐటీ & ఆర్థిక రంగాల షేర్లు పుంజుకోవడంతో సూచీలు లాభాల వైపు పయనించాయి. ముగింపులో, సెన్సెక్స్ 657.39 పాయింట్లు (1.14%) పెరిగి 58,465.97 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 197 పాయింట్లు (1.14%) లాభపడి 17,463.80 వద్ద సెషన్ను ముగించింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.76 వద్ద ఉంది. కోల్ ఇండియా, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, హిందాల్కో షేర్లు రాణిస్తే.. ఓఎన్జీసీ, సన్ఫార్మా, ఐటీసీ, ఐఓసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ డీలాపడ్డాయి. చమురు & గ్యాస్, పీఎస్యూ బ్యాంక్లు మినహా అన్ని ఇతర సెక్టార్ సూచీలు క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఐటి, మెటల్ బ్యాంక్ 1-2 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6-1.2 శాతం లాభపడ్డాయి.
(చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!)
Comments
Please login to add a commentAdd a comment