భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sensex ends 778 pts lower at 55468, Nifty holds just above 16600 | Sakshi

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Wed, Mar 2 2022 4:04 PM | Last Updated on Wed, Mar 2 2022 4:05 PM

Sensex ends 778 pts lower at 55468, Nifty holds just above 16600 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాట దొరణి కనబరిచాయి. చివరిలో కొద్ది పుంజుకోవడంతో అతి భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, చమురు ధరల మంట, నిత్యావసర ధరల పేరుగుతాయని అనే భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు కుదేలయ్యాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది.

ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయని ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 689.78 పాయింట్లు(1.23%) క్షీణించడంతో 55557.50 పాయింట్ల వద్ద స్థిర పడితే, నిఫ్టీ 165.10 పాయింట్లు(0.98%) నష్టపోయి 16628.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 75.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటాస్టీల్స్, టైటాన్స్​, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు రాణిస్తే.. మారుతీ సుజుకీ, ఏషియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాలలో ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతం పడిపోయాయి. 

(చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement