
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా లాభపడుతూ పాయింట్లు పెరుగుతూ పోయింది. ట్రేడింగ్ మొదలైన గంటకే దాదాపు 400కు పైగా పాయింట్లు లాభపడి 60 వేలు క్రాస్ చేసి ఈ రోజు గరిష్టం 60,130 పాయింట్లను టచ్ చేసింది. దీంతో వెంటనే ఇన్వెస్టర్లు తక్షణ లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో వేగంగా పాయింట్లూ కోల్పోవడం ప్రారంభించింది. ఆ తర్వాత సూచీలు ఊగిసలాట దొరణి కనబరిచాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలు నమోదుచేశాయి.
చివరకు, సెన్సెక్స్ 142.81 పాయింట్లు (0.24%) లాభపడి 59,744.65 వద్ద ఉంటే, నిఫ్టీ 66.80 పాయింట్లు (0.38%) పెరిగి 17,812.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద ఉంది. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు రాణిస్తే.. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ షేర్లు డీలాపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్లో బ్యాంక్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు 0.5-1 శాతం పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
(చదవండి: ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్ మస్క్ అంటే కథ వేరుంటది)
Comments
Please login to add a commentAdd a comment