
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం 3 తర్వాత ఒక్కసారిగా కుప్పకులాయి. గత కొద్ది రోజుల నుంచి నష్టాల్లో కొనసాగడంతో కనిష్ట ధరల వద్ద షేర్లను కొనుగోలు చేయాలని చూసిన రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం వల్ల చివరలో కొద్దిగా వెనక్కి తగ్గారు. దీంతో రోజంతా లాభాల్లోనే ఉన్నా.. మార్కెట్ మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది.
ముగింపులో, సెన్సెక్స్ 68.62 పాయింట్లు(0.12%) క్షీణించి 57,232.06 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 28.95 పాయింట్లు(0.17%) క్షీణించి 17,063.25 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద ఉంది. కోటక్ మహీంద్రా, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు రాణిస్తే.. ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు డీలాపడ్డాయి. రియాల్టీ ఇండెక్స్ 3 శాతం మేర పుంజుకుంది. ఆటో, ఐటీ రంగం షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. చాలా వరకు నష్టాలు నమోదుచేశాయి.
(చదవండి: హైటెక్స్లో 26, 27 తేదీల్లో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో..!)