Stock Market News Today Telugu: Sensex Falls 1400 Points, Nifty Ends Below 15900 On March 07 - Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న యుద్ధ భయాలు.. కుప్పకూలిన దేశీయ మార్కెట్లు..!

Published Mon, Mar 7 2022 4:03 PM | Last Updated on Mon, Mar 7 2022 4:34 PM

 Sensex Falls 1400 Points, Nifty Ends Below 15900 on March 07 - Sakshi

ముంబై: ఉక్రెయిన్​ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొలుకొన్నట్లు కనిపించిన మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్​లో​ చమురు ధరలు భారీగా భగ్గుమంటున్నాయి. సోమవారం బ్యారెల్​ చమురు ధర 9 డాలర్లకు పైగా పెరిగింది. ముగింపులో, బీఎస్ఈ సెన్సెక్స్ 1491 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 52,842.75 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 382.20 పాయింట్లు(-2.35 శాతం) క్షీణించి 15,863.15 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.99 వద్ద ఉంది.      

ఇక ఉక్రెయిన్​ సంక్షోభం తీవ్రతరంకావడం సహా రష్యాపై మరిన్ని ఆంక్షలకు పశ్చిమదేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బెంచ్​మార్క్​ యూఎస్​ క్రూడ్​ ఆయిల్​ బ్యారెల్​పై 9 డాలర్లు పెరిగి 124 డాలర్లకు ఎగబాకింది. లిబియాలోని రెండు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్​ను సాయుధులు మూసివేశారని ఆ దేశ జాతీయ ఆయిల్​ కంపెనీ ప్రకటన కూడా చమురు ధరలపై మరింత ఒత్తిడి పడింది. మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్‌ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​ టెక్​, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​ షేర్లు మాత్రమే తక్కువ లాభాలను అర్జీస్తే.. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండ్​ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 7.48శాతం క్షీణించాయి.

(చదవండి: మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement