రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sensex Slips For 2nd Day Drop 105 pts, Nifty holds 17300 on Feb 17th | Sakshi
Sakshi News home page

రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Thu, Feb 17 2022 4:08 PM | Last Updated on Thu, Feb 17 2022 4:08 PM

Sensex Slips For 2nd Day Drop 105 pts, Nifty holds 17300 on Feb 17th - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు తిరగి కోలుకున్న కూడా రష్యా-ఉక్రెయిన్​ వివాదంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నేడు కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్​ షేర్లు దారుణంగా 1 శాతం మేర పడిపోయాయి. విద్యుత్తు రంగం షేర్లు రాణించాయి. ముగింపులో, సెన్సెక్స్ 104.67 పాయింట్లు(0.18%) క్షీణించి 57,892.01 వద్ద ఉంటే, నిఫ్టీ 17.60 పాయింట్లు(0.10%) నష్టపోయి 17,304.60 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ షేర్లు రాణిస్తే.. యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, యూపీఎల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు భారీగా పతనమయ్యాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోతే, పవర్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడింది. ఇక బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ప్రతికూలంగా ట్రేడయ్యాయి. 

(చదవండి: అంతరిక్షయానం టికెట్ ధరెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement