
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమ నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్లో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. ఆఖరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఓ దశలో 350 పాయింట్లకుపైగా కోల్పోయింది. చివర్లో మళ్లీ పుంజుకుంది. చివరలో, సెన్సెక్స్ 145.37 పాయింట్లు(0.25%) క్షీణించి 57,996.68 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 30.30 పాయింట్లు (0.17%) నష్ట పోయి 17,322.20 వద్ద ముగిసింది.
ఉక్రెయిన్- రష్యా సంఘర్షణ ప్రభావం మార్కెట్లపై పడింది. తమ బలగాలను డ్రిల్స్ అనంతరం వెనక్కి పిలిపించినట్లు రష్యా ప్రకటించినా.. అమెరికా, నాటో సహా పలు దేశాధినేతలు దీనిని నమ్మడం లేదు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే అవకాశాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దీంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొనడంతో ఆ ప్రభావం దేశీయ సూచీల మీద పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద ఉంది. నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభ పడితే.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ డీలాపడ్డాయి. ఆటో, ఐటీ, పవర్, మెటల్, పిఎస్యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ రంగాలలో అమ్మకాలు కనిపించాయి. ఆరోగ్య సంరక్షణ, చమురు & గ్యాస్, రియాల్టీ సూచీలు లాభాల్లో ముగిశాయి.
(చదవండి: బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!)
Comments
Please login to add a commentAdd a comment