
ముంబై: గత కొద్ది రోజుల నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల ఫలితాలు, ఆటో, పవర్ & బ్యాంకింగ్ షేర్లు బలపడటం మార్కెట్లకు కలిసి వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి స్టాక్ కంపెనీల ధరలు భారీగా పడిపోవడంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ముగింపులో, సెన్సెక్స్ 366.64 పాయింట్లు (0.64%) పెరిగి 57,858.15 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 128.90 పాయింట్లు (0.75%) లాభపడి 17,278.00 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద ఉంది. అత్యధికంగా యాక్సిస్ బ్యాంకు షేర్లు 7 శాతానికిపైగా లాభపడ్డాయి. మారుతి 6.5శాతం వృద్ధి చెందింది. ఎస్బీఐఎన్, ఇండస్ఇండ్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాలను ఆర్జించాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీ మినహా ఇతర అన్ని సెక్టోరల్ సూచీలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, విద్యుత్, ఆటో బ్యాంకు 2-4 శాతం పెరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు 0.8-1 శాతం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment